My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, March 13, 2010

తరంతరం నిరంతరం...

రెండు దశాబ్దాల రెండేళ్ళ కిందటి మాట...
అప్పటి ప్రధాని ఎర్రకోటపై మూడు రంగుల బావుటా ఎగురవేసిన జండాపండుగపూట- దూరదర్శన్బుల్లితెరపై తేనెలూరే పాట! భీమ్సేన్జోషి మొదలుగానగాంధర్వుడు బాలమురళి దాకా రవిశంకర్సితార్తో జకీర్హుస్సేన్తబలాతోతలపడి నరేంద్ర హీర్వాణీ ప్రకాష్పదుకొణె వంటివారితో కలిసి ఆడుకుంటున్నట్లుఅమితాబ్బచన్‌, హేమమాలిని వంటి హేమాహేమీలతో జతకలిసి చేసినశ్రుతిలయల మాయ అది. ఇన్నేళ్ళు గడిచినా నవ్యమై భవ్యమై ఉండటానికికారణం- సమైక్యతారాగతోరణం మట్టి నుంచి పుట్టింది కావటమే! పీయూష్పాండే పద్దెనిమిది సార్లు రాసి చించిన పల్లవిని సురేశ్మల్లిక్‌, ఆర్తి, కైలాస్సురేంద్రనాథ్ఎంతో ఆర్తిగా సృజించారు గనకనే- ఆనాటి రాగేంద్రజాలం మనజాతిపాడుకునే మరో వందేమాతరంలాగా అనధికార జాతీయహోదాను అందుకోగలిగింది. ఆసేతుహిమాచల పర్యంతం
‌‌ ‌‌ ‌ ‌ ‌ 'మిలే సుర్‌ మేరా తుమ్హారా' గీతం అంత మన్ననలందుకోవడానికి రాగం తానం పల్లవులకన్నా అంతర్లీనంగాఅందులో మిళితమై సాగిన మన జాతీయతనమే ప్రధాన కారణమంటే కాదనేవారెవరూ ఉండరు. 'నా స్వరమూ నీ స్వరమూ సంగమమై మనస్వరంగా అవతరించె'నంటూ- దేశ నదీనదాలలోని వేదనాదాన్ని సాగర గంభీరతతోజతపరచి మేఘమాలికలవంటి రాగాలను కూర్చి సుతిమెత్తని భావుకతను అత్యంత హృద్యంగా ఆలపించి నేలనలుచెరగులా జాతి మత కుల వయో లింగ భేదాలకు అతీతంగా స్వరగాంధర్వులు చిరుజల్లులుగా కురిపించడమేఅపురూపం. రాగాల వర్షంలో తడిసి ముద్దగా మారని భారతీయుడెవడూ ఆనాడు లేడు, ఈనాడూ ఉండడు. గీతానికి కాలానుగుణమైన గుణాత్మకమైన మార్పులు చేసి 'ఫిర్మిలే సుర్‌' అంటూ గణతంత్ర వజ్రోత్సవ వేళ మరోమారునగారా' మోగించటం హర్షదాయకమే కాదు- దేశ కాల పరిస్థితుల దృష్ట్యా తక్షణావసరం కూడా!

ఆధునికతే నాగరికతగా భ్రమించే నేటి యువతకు వేల సంవత్సరాల ఘనచరిత గలభారతీయతలోని విశిష్టతపైన శీతకన్ను ఉండటం కలత కలిగించే విషయం. దాదాపు ఆరు వందల జిల్లాల్లో పదిహేడు రకాల భాషలు, రికార్డులకెక్కని మరెన్నోవందల యాసలు, రకరకాల మతాలు, మూడుకోట్ల ముప్ఫై లక్షల చదరపుకిలోమీటర్ల పర్యంతం పరచుకుని ఉన్న సువిశాల భారతంలో వృత్తుల వారీగాలెక్కకు అందని ఎన్నో కులాలు- ప్రవృత్తి రీత్యా చూసినా అత్యంత వైవిధ్యంగా నిత్యచైతన్యంతో సాగే జనజీవనానికి విభిన్నత్వమే బలం. ఏకత్వ భావలేమి బలహీనత. బౌద్ధం పుట్టిన హిందూదేశం ఇది. థెరెసాను మదర్గా గౌరవించిన వేదభూమి మనది. మైనారిటీల నుంచి నలుగురిని రాష్ట్రపతులుగా ఎంచుకున్నలౌకికరాజ్యం ఇది. రాష్ట్రపతి నుంచి సభాపతుల వరకు మహిళలు పాలన సాగిస్తున్న నేల కూడా మనదే. యోగులుబాలలైనా సాగిలపడే ఆధ్యాత్మిక విశాలత భారతీయులది. బడుగుల నుంచి ఎదిగిన మహానుభావుడు దేశానికిరాజ్యాంగ కల్పన చేశాడు! 'భారతదేశం నా మాతృభూమి... సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదనాకు గర్వకారణం...' అని చదువుకొనే ప్రతిజ్ఞ పాఠాన్ని వాచకాల మొదటి పుటల వరకే పరిమితం చేసే ప్రజ్ఞావంతులుపెరిగిపోతున్నారిప్పుడు. వరస మార్చి అయినా సరే, మన సంగీత్మహాన్ఏఆర్రెహమాన్‌ 'వందేమాతరం' గీతానికి కొత్తరాగాలను కూర్చి నవతరానికి ఉత్తేజం కలిగించిన తీరులో- 'ఫిర్మిలే సుర్మేరా తుమ్హారా'కు సైతం అదే సురేంద్రకైలాస్నాథ్నూతన స్వరాలను సమకూర్చడం తప్పేమీ కాదుకదా- తప్పనిసరిగా మిగతా సామాజిక హితుల తక్షణ విధి!

దేవులపల్లి వారు గీతించిన విధంగా కవి గాయక వైతాళికుడైనా భావ తాదాత్మ్యతకు దివ్య గీతామృతాన్నేనమ్ముకుంటాడు. 'అర్థమతులహంకృతులు అంధమతులు రాని/ నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని/ కొత్తజగం కొత్త యుగం కోరుకునే వారెవరికైనా, కులందాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి/ సమభాగం సమభాగ్యంసమసంస్కృతి నాటి/ కొత్త శాంతి, కొత్త కాంతి జగతి నిండాలని, భావించేవారికైనా పాటను మించిన వజ్రాయుధం లేదు. పల్లవిని మించిన దేవదత్తం లేదు. ఆకులందున అణగిమణిగిన కోయిల వలె పలికితే పలుకులకు పులకలెత్తిదేశాభిమానాలు మొలకెత్తుతాయని మహాకవి గురజాడ ఏనాడో పలికిన మాట. తెల్లవాడి పాలన తెల్లారి నేటికి భారతానఆరుపదులు దాటినా- ఉగ్రవాదం అగ్రవాదం ధాటికి మన ఇంట చీకటి తెరలింకా విడిపోనేలేదు. చీటికి మాటికిభాషాద్వేషాలు, కులం కుమ్ములాటలు, మతం మాత్సర్యాలు, ప్రాంతాల వారీగా పెరిగిపోతున్న పంతాలూ పట్టింపులతోవేడెక్కిపోతున్న వాతావరణం- 'ఫిర్మిలే సుర్‌' వంటి సుస్వరాలు కడుసొంపుగ కడలికి చేరి... మబ్బులై పైపైకి లేచిచల్లగా మెల్లగా మళ్ళీ మళ్ళీ చిరుజల్లులుగా కురిస్తేనన్నా చల్లబడుతుందేమో! ఇరవై రెండేళ్ళ కిందటి రాగమాలికనుమంది నవతారలతో కలిసి ఆరుపదుల కళాకారులు అరవై ఏళ్ళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అతి నవ్య రాగాలతోవారి వారి భాషల్లో గొంతెత్తి పాడటం దివ్యంగా ఉంది. ఇలాంటి జాతీయ సమైక్యతా గీతాలు మరిన్ని వచ్చి జాతి గుండెలమధ్య అడ్డుగోడలను కూలగొడతాయేమో చూడాలి!
(ఈనాడు, సంపాదకీయం, ౦౭:౦౨:౨౦౦౧౦)
____________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home