గేట్స్ను మించిన మేనేజ్మెంట్ మేధావి సీకే ప్రహ్లాద్


కోయంబత్తూరులో ఓ న్యాయమూర్తి, సంస్కృత పండితుడి ఇంట జన్మించిన ప్రహ్లాద్కు మరో ఎనిమిది మంది తోబుట్టువులు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో భౌతిక శాస్త్రం చదివారు. పంతొమ్మిదో ఏటనే చెన్నైలోని యూనియన్ కార్బైడ్ బ్యాటరీ కర్మాగారంలో ప్రహ్లాద్ను మేనేజర్గా తీసుకున్నారు. నాలుగేళ్లు పనిచేసిన తరువాత అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం-ఏ)కు వెళ్లారు. పొరుగున ఉన్న విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినితో ప్రేమలో పడ్డారు. ఐదేళ్లు ప్రయాసపడ్డాక ఆమె పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. ఎమ్మెన్సీల యాజమాన్యంపై పీహెచ్డీ పట్టా పుచ్చుకొన్నారు స్వదేశానికి తిరిగి వచ్చి ఐఐఎంఏలో పాఠాలు చెప్పారు. తరువాత మళ్లీ అమెరికాకు వెళ్లిపోయారు. గత పదేళ్లుగా అగ్రగామి పది మేనేజ్మెంట్ మేధావుల్లో ఒకరుగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడం ప్రహ్లాద్ ప్రతిభకు నిదర్శనం. ద ఫ్యూచర్ ఆఫ్ కాంపిటీషన్, ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ సహా పలు పుస్తకాలు రాశారు. లాల్ బహదూర్ శాస్త్రి పురస్కారం, అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు గెల్చారు.
(Eenadu, 09:11:2007)
____________________________________________
Labels: Management
0 Comments:
Post a Comment
<< Home