శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

నేను మాటి మాటికీ చదివే తెలుగు పుస్తకాలలో ఒకటి,విశ్వనాథవారి వ్యాఖ్యాన సహిత పద్య సంకలనం- "సాహిత్య సురభి" [1986, S.A.S & Co, Hyderabad].
దీనిని గురించి విశ్వనాథవారి మాటలలోనే:
".....................ఇవి సుమారు 300 పద్యములు. యిందులో నెక్కువ పద్యములు పూర్వము దేశములో వేలమందికి కంఠగతములై యుండెడివి. నా చిన్నప్పుడు నే నెరుగుదును.
కొన్ని పద్యములు ధర్మమును చెప్పును. కొన్ని సామాన్యార్థమును చెప్పును. కొన్నింటిలో లోతైన వేదాంతార్థములుండును. కొన్నింటిలో శాస్త్రార్థమూండును. కొన్నిటిలో సాహిత్యపు లోతులుండును. ఇవి రకరకాలైన పద్యములు.
ఈ మూడువందల పద్యములు మాటి మాటికి చదువుచున్నచో వ్రాసిన వ్యాఖ్యానములు తెలిసికొన్నచో ప్రతివాడును సామాన్యమైన ఆంధ్రభాషావేత్తయగును......అతడు కవుల కవిత్వమును విని కావ్యములు చదివి తనకు తెలియలేదన్న దుస్స్థితిలో నుండడు......................"
_______________________________________
Labels: Books, Telugu literature/ books
0 Comments:
Post a Comment
<< Home