ఏకలవ్యు డెవరో తెలుసా?

ఏకలవ్యుడు, కృష్ణుడికి సాక్షాత్తు మేనత్త కుమారుడు.
వసుదేవునికి ఐదుగురు చెల్లెళ్ళున్నారు. వారిలో పెద్దది కుంతి. పెద్ద మేనత్త కిచ్చిన వాగ్దానం కోసం కృష్ణుడు మిగతా నలుగురు మేనత్తల కొడుకులనూ పని కట్టుకుని చంపాడు.
శృతదేవ అనే మేనత్త కొడుకు దంతవక్తృడు.
శృతకీర్తి కుమారులు కేకయరాజపుత్రులు.
శృతశ్రవన కుమారుడే శిశుపాలుడు.
రాజాధిదేవి కుమారుడు ఏకలవ్యుడు........ ...........................
సంస్కృత భారత, హరివంశాలలో, పై చెప్పిన ప్రతి అంశం దొరుకుతుంది.
(తెలుగులో ఎర్రాప్రగడగారు అనువదించిన హరివంశంలో కొన్ని కొన్ని వివరాలే ఉన్నాయి.)
[పుట:52, "ఆరుద్ర సినీ మిని కబుర్లు", క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్44]
__________________________________________
Labels: Personality, Religion, Religion/personality/telugu
0 Comments:
Post a Comment
<< Home