My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, July 27, 2007

రామానంద తీర్థ స్వామి(1903-1972)

స్వామి రామానంద తీర్థ, హైదరాబాదు స్వాతంత్ర సమర నాయకుడు; ప్రముఖ కాంగ్రసు వాది; కార్మిక నాయకుడు; విద్యావేత్త.

అసలు పేరు వెంకటరావు ఖేడ్గీకర్. తండ్రి భావూ రావు, తల్లి యసు బాయి.1903 అక్టోబరు 3వ తేదీన అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో ఆయన జన్మించారు.

ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉండగానే 1920 జూలై 31 వ తేదీ రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలధర్మం చెందారన్న వార్త విని "బ్రహ్మచారిగా నాజీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేయగలను" అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే ఉండిపోయిన ధీరోధాత్తుడు ఆయన.

కళాశాల చదువుకు స్వస్తి చెప్పి, పూనాలోని తిలక్ విద్యాపఠ్ లో మూడేళ్ళు అధ్యయనం చేసి, "ప్రజాస్వామ్యము, దాని క్రమాభివృద్ధి" అనే అంశముపై సిద్ధాంత వ్యాసం రాసి పూనా విశ్వవిద్యాలయానికి సమర్పించి ఎం.ఏ పట్టం పొందారు.

తొలుత కార్మిక రంగంలో పనిచేసి, కారాగార శిక్ష అనుభవించి ఆరోగ్యం అనుకూలించక, మరాఠ్వాడాలో ఉస్మానాబాదు జిల్లాలోని హిప్పర్గిలో నెలకొల్పబడిన జాతీయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులై, ఆరు సంవత్సరాలపాటు ఆ విద్యా సంస్థను గురుకుల పద్ధతిపై చక్కగా ఆయన నిర్వహించారు.

1932 లో స్వామి నారాయణ అనే గురువు వీరికి 'విద్వత్ సన్న్యాసం ' అనే పద్ధతి ప్రకారం సన్న్యాస దీక్ష ఇచ్చి, ఈయనకు 'స్వామీ రామానంద తీర్థ ' అని నామకరణం చేశారు.

1938 లో రాజకీయరంగంలోకి ప్రవేశించి ఆయన మహారాష్త్ర పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసి, ఆ సంవత్సరమే తన నివాసాన్ని మోమినాబాదు నుంచి హైదరాబాదు ఆయన మార్చారు. స్టేట్ కాంగ్రెస్ అనే సంస్థను నెలకొల్పడానికి స్వామీజి ప్రయత్నం చేస్తుండగా, స్టేట్ కాంగ్రెస్ సంస్థను నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్లో నిషేధించింది. ఆ నిషేధాజ్ఞలకు నిరశనగా స్వామి రామానంద తీర్థ హైదరాబాదులో 1938 అక్టోబరు 27 వ తేదేఏన సత్యాగ్రహం చేయగా ప్రభుత్వం ఆయన్ను బంధించి, 18 నెలలు కఠిన శిక్షనమలుచేశారు. స్టేట్ కాంగ్రెస్ సంస్థపై నిషేధం తొలగించని కారణంగా, తాను వ్యక్తిగత సత్యాగ్రహం చేస్తానని స్వామీజి నిజాము ప్రభుత్వానికి తెలియచేయగా, 1940 సెప్టెంబర్ 11 వ తేదీన ఆయనను బంధించి, ప్రజారక్షణ నిభందనల క్రింద నిజామాబాదు కారాగారంలో నిర్భందంలో ఉంచారు.1942-1950 సంవత్సరాల మధ్య హైదరాబాదు
స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు.దేశీయ సంస్థానాల మహాసభ కార్యనిర్వాహక వర్గ సభులుగా ఉన్నారు. 1942 ఆగస్ట్ లో క్విట్టిండియా ఉద్యమ తీర్మానం ఆమోదింపబడ్డ బొంబాయి కాంగ్రెస్ సభలో పాల్గొని షోలాపూర్ నుంచి వీరు తిరిగిరాగానే ఆయనను నిజాం ప్రభుత్వం బంధించి1943 డిసెంబరు లో విడుదల చేసింది.1947 ఆగష్టు 15 వ తేదీన భారత స్వాతంత్ర దినోత్సవం జరపడానికై ప్రభుత్వాజ్ఞలను ఉల్లంఘించి భారత యూనియన్ పతాకాన్ని ఎగరవేసినందుకు ఆయనను మళ్ళీ బంధించి, హైదరాబాదు సెంట్రల్ జైలులో నిర్భందించారు.హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావాలని ఉధ్యమాన్ని ప్రారంభించినందుకు ఆయనను 1948 జనవరిలో బంధించి, అనేక జైళ్ళల్లో ఉంచారు. నిజాం సైన్యం భారత ప్రభుత్వ సైన్యానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్ 17 వ తేదీన రామానంద తీర్థ స్వామి నిర్భంధం నుండి విడుదల పొందారు.

స్వామి రామానంద తీర్థ నాందేడ్ లోని పీపుల్స్ కాలేజి వ్యవస్థాపకులు;హైదరాబాదు ఖాదీసమితి వ్యవస్థాపక అధ్యక్షు
లు. హైదరాబాదు హిందీ ప్రచార సంఘానికి అధ్యక్షులుగాను, 1952 లో హైదరాబాదు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగాను ఆయన పనిచేశారు. 1952 నుండి 1962 వరకు లోకసభ సభ్యులుగా ఉన్నారు.1953 లో హైదరాబాదు నగరం లొ ప్రప్రథమంగా జరిగిన అఖిల భారత కాంగ్రస్ మహాసభకు స్వామీజి ఆహ్వానసంఘాధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాదు సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని 1953 లోనె గట్టిగా కోరిన స్వామీజీ ఎనిమిది తెలంగాణా జిల్లాలను మద్రాసు రాష్ట్రం నుండి విడిపడ్డ ఆంధ్ర ప్రాంతం లో కలిపేసి తెలుగు ప్రజల చిరకాల వాంఛయైన విశాలాంధ్రను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటన చేశారు.అంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన అంధ్రప్రదేశ్ పౌరుడుగానే హైదరాబాదులో నివాసమేర్పరుచుకొన్నారు.1957 నుండి ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ సెనేట్ లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు.వినోభాజి ప్రారంభించిన భూదాన్, గ్రామదాన్, గ్రామ స్వరాజ్య ఉద్యమాలకు ఆయన చేయూతనిచ్చారు.భూసంస్కరణల విషయం లొ స్వామీజీ మొదటినుంచి ప్రగతిశీల దృక్పధం కలవారు.

1962 లో క్రియాశీల రాజకీయాలనుండి ఆయన స్వచ్ఛందంగా విరమించుకొన్నారు.అప్పటి తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గిర తోటపల్లి కొండలలో శాంతి ఆశ్రమం నెలకొల్పి అక్కడ ఆధ్యాత్మిక, విజ్ఞాన శాస్త్ర విషయాలను గూర్చిన అధ్యయానలను జరిపించారు. శిక్షణ తరగతులను నిర్వహించారు.

స్వామీజి 1972 జనవరి 22 వ తేదీన హైదరాబాదులో నిర్యాణం చెందారు.

(pages538 & 539 Vijnana Sarwasvamu, Telugu Samskriti, II Volume,Vijnaana sarvasva Kendram, Telugu University, March-1988)
------------------------------------------------------

Labels: , ,

0 Comments:

Post a Comment

<< Home