My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, May 10, 2014

1440- Sign post

----------------
Believe in work not luck.
Trust in God but don't be dependent on him.
The Best"om" is home!!
The best"age" is courage!!
The best"mile" is smile!!
The best"stand" is understand!!
The best"end" is friend!!
The best"day" is today!!
So enjoy to its fullest....have a wonderful day...
-----------------------------

Labels: , , ,

Sunday, February 23, 2014

1350- సంబురాల తెలంగాణ!

https://lh5.googleusercontent.com/-tnHtRxNdCPY/Ufd5nNddHsI/AAAAAAAAjM4/Fn2CaSV2rr8/s288/Telangan-state.jpg

సుమారు నాలుగు కోట్ల స్వరతంత్రులతో కోటి రతనాల వీణ సంబురాల సరిగమలు పలుకుతున్న వేళ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల దశాబ్దాల కల ఫలించబోతోంది. రాష్ట్రపతి మొహరు పడటమే తరువాయి, దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ తళుకులీననుంది. లక్షా 14వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 3.52కోట్ల(2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభాతో తెలంగాణ దేశంలో పదకొండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తోంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా నాలుగో స్థానంనుంచి ఆరోస్థానానికి, జనసంఖ్య పరంగా అయిదునుంచి పదోస్థానానికి పరిమితం కానుంది. 'అయిదున్నర దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండు చరిత్రను, తాము సాగించిన విస్తృతస్థాయి సంప్రతింపులను పరిగణనలోకి తీసుకొని ముందడుగేశా'మని నిరుడు జులై చివరివారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించినప్పటినుంచి, నేటిదాకా విభజన ప్రక్రియ అంతా- ఉద్విగ్నత, ఆవేశోద్రేకాల సమ్మిళితంగానే సాగింది. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా యాభై ఏడేళ్లక్రితం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ఎంత సున్నితమైనదో 2009 డిసెంబరులోనే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసివచ్చింది. పార్టీలు సైతం ప్రాంతాలవారీగా చీలిపోయిన విపత్కర వాతావరణంలోని భావోద్విగ్న తీవ్రతలను గుర్తించి- ఈ ఆరున్నర నెలల కాలావధిలో సర్వామోద పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండాల్సింది. ఆ పని చెయ్యని హస్తం పార్టీ అధిష్ఠానం- 2006లోనే ప్రత్యేక తెలంగాణకు 'సై' అన్న భాజపానూ విశ్వాసంలోకి తీసుకోలేకపోయింది. పర్యవసానమే, పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టడం నుంచి రాజ్యసభలో ఆమోదం పొందేదాకా అనుక్షణం ఎడతెగని ఉత్కంఠ; అయిదు కోట్లమంది ప్రయోజనాల్ని అసలేమాత్రం పట్టించుకోలేదంటూ సీమాంధ్రుల్లో తీవ్ర భయాందోళన. 'తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి' అన్నట్లు కేంద్ర సర్కారు అడుగడుగునా అప్రజాస్వామికంగా వ్యవహరించిందనడంలో మరోమాట లేదు. విపక్షాల అభ్యంతరాలన్నీ ఎగువ సభలో వీగిపోయిన నేపథ్యంలో, నవతెలంగాణ శిశూదయాన్ని స్వాగతించాలిప్పుడు!

వేర్వేరు పరగణాల్లో ఉన్న తెలుగువారంతా ఒక్కతాటిమీదకు వచ్చితీరాలన్న సమైక్య భావకాంక్షకు ఫలశ్రుతి- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఇప్పుడు తెలంగాణ వేర్పాటుకూ అలుపెరుగని ప్రజాందోళనే కారణం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదిక అయింది. కాకతీయుల కాలంలో కలిసి ఉన్న ఆంధ్రులు మళ్ళీ భారత రిపబ్లిక్‌లో ఏకమయ్యారన్న ఆనందానుభూతుల్ని అంతలోనే ఆవిరి చేసేలా ఒప్పందాల ఉల్లంఘనలు తెలంగాణవాదుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. సమైక్య రాష్ట్రం ఏర్పడిన పదమూడేళ్లకే వేర్పాటువాదం రాజుకోవడానికి పాలకుల తప్పిదాలే పుణ్యం కట్టుకొన్నాయి. 1973లో ప్రధానిగా ఇందిర ప్రతిపాదించిన ఆరుసూత్రాల పథకం అమలు సైతం వివాదగ్రస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కూర్పు బేషరతు కాదని, విద్యా ఉద్యోగాలు పారిశ్రామిక ప్రగతి సేద్యరంగం వంటివాటన్నింటా తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశం తెలంగాణ వేర్పాటు కాంక్షలకు ఎరువవుతూ వచ్చిందని తెరాస సిద్ధాంతకర్తగా జయశంకర్ లోగడే స్పష్టీకరించారు. పదమూడేళ్ల క్రితం తెలంగాణ సాధనే లక్ష్యంగా తెరాస స్థాపించిన బక్కమనిషి కేసీఆర్ ఉక్కు సంకల్ప దీక్షా దక్షతలతో ప్రజాకాంక్షకు ఉద్యమ రూపమిచ్చి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో శ్రేణుల్ని కదం తొక్కించారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా సమైక్యవాదం వినిపించిన సీనియర్ రాజకీయవేత్త చెన్నమనేని రాజేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ అవసరం ఎందుకొచ్చిందో తెలుగుదేశం తరఫున సాగించిన అధ్యయనంలో వివరించారు. వైఎస్ పాలన, అర్ధశతాబ్ది ప్రత్యేక తెలంగాణ వాదనను రెట్టింపు చేసిందని, భూముల్ని తెగనమ్మడం, 'సెజ్'ల దోపిడి, నదీజలాల తరలింపు తదితర ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకబాట పట్టిస్తున్నాయని ఆరేళ్లక్రితమే వాస్తవాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనసుల్లో తాము విచక్షణకు, దాష్టీకానికి గురి అవుతున్నామన్న భావన తీవ్రమైన ఆవేశకావేషాల దశకు చేరుకుందని, ప్రత్యేక తెలంగాణ డిమాండు పూర్తిగా అన్యాయమైనదేమీ కాదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టీకరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించిన పక్షంలో భిన్న ప్రాంతాలవారి భయాలు ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకొని వారికి భరోసా కల్పించాలనీ సూచించింది. ఆ భరోసాల అంశంలోనే కేంద్రప్రభుత్వం దాగుడుమూతలు, లేనిపోని వైమనస్యాలను పెంచాయని చెప్పక తప్పదు!

ఒక జాతి కట్టుబాటును మతంకన్నా ఎక్కువగా భాష శాసిస్తుందని, అందుకు తానే ఉదాహరణ అనీ ఉపఖండంలో భాషాప్రయుక్త దేశంగా బంగ్లాదేశ్ చాటింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 'యునెస్కో' నిర్వహిస్తోంది. ఈసారి మాతృభాషా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన మరో గుణపాఠం నేర్పుతోంది. ఓ జాతి కట్టుబాటుకు భాషా ప్రాతిపదిక ఒక్కటే సరిపోదని, అంతకుమించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంక్షలకు గొడుగుపట్టే సుపరిపాలన మరెంతో అవసరమనీ పాలకులు తెలుసుకోవాలి. 'సంబంధిత అన్ని వర్గాలతోనూ తగిన చర్చలు, ఏకాభిప్రాయ సాధన, సరైన సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పరిశీలన' అన్నవి 2004లో తొలి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలోని ముఖ్యాంశాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలహరణం తరవాత, పదహారో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళే 'సరైన సమయం' అంటూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు హడావుడి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం- రెండుపక్కలా కడ నిమిషందాకా ఉద్విగ్న వాతావరణాన్ని పెంచి పోషించింది. రాష్ట్రంలో, దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక దశలో తెలంగాణకు అనుకూలత చాటాయి. వాటి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగేస్తే అసలు గొడవన్నదే లేకపోయేది. మూడు ప్రాంతాల మధ్య సామరస్యంగా సయోధ్య సాధించగలిగితే విభజన చేయవచ్చని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీయే సూచించింది. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండే సుహృద్భావానికి ప్రోది చెయ్యాల్సిన కేంద్రప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించింది. పాలకుల రాజకీయ పాచికలు పెంచిన మనస్పర్ధల్ని పక్కన పెట్టి, ఇరువైపులా తెలుగువారి ఔన్నత్యం మరింతగా పరిమళించాల్సిన తరుణమిది. నీటి వనరుల పంపిణీ, విద్యుత్, ఉద్యోగులు, ఉమ్మడి రాజధానిలో కలసి పదేళ్లు పనిచేయడం వంటి అనేకాంశాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాల మధ్య సౌహార్దపూర్వక సంప్రతింపులు తప్పనిసరి. విభజన క్రమంలో భేదాభిప్రాయాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొంటూ సముజ్జ్వల భవిత నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెట్టపట్టాలు కట్టి సాగాలి!
(సంపాదకీయం, ఈనాడు, 21:02:2014)
__________________________________

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Labels: , , , , , , , ,

Friday, February 21, 2014

1349- Telangana, Demerger:A long journey

Here are some events, some going back to 1948, that have preceded the formation of Telangana state.
______________________________________

Hyderabad: With the Lok Sabha passing the bill for bifurcation of Andhra Pradesh Tuesday, decks have been cleared for formation of Telangana as the 29th state in India. Following are the major events in the history of Telangana since 1948:
1948: Indian Army annexes princely state of Hyderabad, which comprised different regions, including Telangana.
1950: Telangana became Hyderabad State.
1952: First elections held in Hyderabad State.
Nov 1, 1956: Telangana merged with Andhra State, which was carved out of Madras State, to form Andhra Pradesh, a united state for Telugu-speaking people.
1969: 'Jai Telangana' movement for separate statehood to Telangana began. Over 300 people killed in police firing.
1972: 'Jai Andhra' movement began in coastal Andhra for separate Andhra State.
1975: Presidential order issued to implement six-point Formula, providing some safeguards to Telangana.
1997: BJP supported demand for Telangana state; in 1998 election, it promised 'one vote two states'.
2001: K Chandrasekhara Rao floated Telangana Rashtra Samithi (TRS) to revive Telangana movement.
2004: TRS fought elections in alliance with Congress, wins five Lok Sabha and 26 assembly seats. UPA includes Telangana issue in common minimum programme.
2008: TDP announced support for Telangana demand.
2009: TRS contested elections in alliance with TDP but its tally came down to two Lok Sabha and 10 assembly seats.
Sep 2: Chief minister Y S Rajasekhara Reddy died in helicopter crash, triggering political uncertainty.
Oct 2009: Chandrasekhara Rao began fast-unto-death for Telangana state.
Dec 9: Centre announced decision to initiate the process for formation of Telangana state.
Dec 23: Following protests in Rayalaseema and Andhra regions (Seemandhra) and en mass resignations of MPs and state legislators, centre put the process on hold citing need for consensus.
Feb 3, 2010: Centre set up five-member Srikrishna committee to look into Telangana issue.
Dec 2010: Srikrishna committee submitted its report, suggested six options
July 30, 2013: UPA coordination panel and Congress Working Committee decided to carve out Telangana state. Protests in Seemandhra.
Oct 3, 2013: Union cabinet approved the proposal to divide Andhra Pradesh. A Group of Ministers (GoM) was constituted to prepare the roadmap after consultations with all stakeholders.
Oct 25, 2013: Chief minister N Kiran Kumar Reddy raised banner of revolt against Congress leadership. He wrote letters to president and prime minister urging them to stop bifurcation process.
Dec 5, 2013: Union cabinet approved draft Andhra Pradesh Reorganisation Bill 2013 prepared on the basis of recommendations by the GoM. Bill sent to President Pranab Mukherjee with a request to make a reference to Andhra Pradesh legislature to obtain its views under Article 3 of the Constitution.
Dec 9: The President gave time till Jan 23 to the state legislature to give its views.
Dec 12, 2013: Bill brought to Hyderabad in a special aircraft and amid tight security.
Dec 16, 2013: Bill introduced in both houses of state legislature amid clashes between Seemandhra and Telangana lawmakers.
Jan 8, 2014: After disruptions for several days, debate finally began on the bill in assembly and council.
Jan 21, 2014: State government sought four more weeks to debate the bill. The President gave one week.
Jan 27, 2014: Chief Minister Kiran Kumar Reddy gave notice to assembly speaker for a resolution to reject the bill.
Jan 30, 2014: Amid ruckus, both houses of state legislature passed by a voice vote official resolutions, rejecting the bill and appealing to the President not to send the bill to parliament.
Feb 5, 2014: Chief minister staged sit-in in Delhi to oppose bifurcation.
Feb 7, 2014: Union cabinet cleared the bill and rejected Seemandhra leaders' demand to make Hyderabad a union territory. Bill sent to the President for his approval to table it in parliament.
Feb 11, 2014: Congress expelled six MPs from Seemandhra for moving no-confidence motion against government.
Feb 13, 2014: Bill introduced in Lok Sabha amid clashes between MPs from Seemandhra and Telangana. L. Rajagopal, a MP from Seemandhra, used pepper spray in the house. Speaker suspended 16 MPs, including Rajagopal, for rest of the session.
Feb 18, 2014: Lok Sabha passes Telangana bill
______________________________________

Labels: , , , , ,

Thursday, December 12, 2013

1315-వంటా ఓర్పూ!


మనమూ మనదీ... అనుకోవడమే దాంపత్యం. మల్లాదివారన్నట్లు, తాంబూలంలా దాంపత్యమూ ఆద్యంతం రసవంతం. 'దంపతి తాంబూలంబులు/ చెంపలు దువ్వుటలు, పూలచెండ్లాటలు, క/వ్వింపులు, వదినల ముక్తా/యింపులు, నెచ్చెలుల హెచ్చరింపులు' వంటివెన్నో వధువుకూ వరుడికీ మొదట్లో అనుభవాలవుతాయి. వివాహానంతర జీవనయానంలో అలకలు, కలతలు, ఆటుపోట్లు, సర్దుబాట్లు అన్నీ అలవాటుగా మారి భిన్నత్వాన్నీ రుచిచూపిస్తాయి. ఎన్ని స్థితిగతులు ఎదురైనా 'ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము/ ఇదిగాక వైభవమ్ము ఇలనొకటి కలదా?' అనే ఐక్యభావనే ఇద్దరినీ ఎప్పుడూ ఒక్కటిగా ఉంచుతుంది. కొత్తగా వచ్చినభార్య చేతివంట జిహ్వను తీర్చినా, చిన్నప్పుడు తల్లిపెట్టిన గోరుముద్దే అతని జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అమ్మ చేతిముద్ద, నాన్న వాత్సల్యాన్ని మించిన ఆనందానుభూతి పిల్లలకు ఇంకేముంటుంది? తల్లి మరపించి మురిపించి నోటికందించిన గోరుముద్దలతో పొంగి పులకించాడు బాలరాముడు. యశోదమ్మ కొసరి కొసరి తినిపించిన వెన్నముద్దలతో మహదానంద భరితుడయ్యాడు చిన్నికృష్ణుడు. 'పనస తొనలకన్న పంచదారకన్న/ జుంటి తేనెకన్న జున్నుకన్న/ చెరకురసముకన్న మిన్న' అమ్మ ముద్ద. ఆ మాధుర్యధార వల్ల కాబోలు- శ్రీరామకథ సుధా రసార్ణవమైతే, శ్రీకృష్ణ చరిత అనంత లీలా తరంగితంగా వెల్లివిరిసింది. ఉగ్గుగిన్నెలు మొదలు ముద్దకుడుములు, చక్కెర చిలుకలు, బొబ్బట్లు, అరిసెలు వరకు బాల్యమంతా విందులూ పసందులూ. త్రిమూర్తులనే వంటింట పసికందులుగా చేసుకొన్న అనసూ యమాత చేతి తాలింపు కమ్మదనం లోకాలన్నింటా ఘుమాయించింది. ఒక్క బాల్యమనే ఏమిటి... జీవితచక్రంలోని వివాహ కుటుంబాది సంబంధ బాంధవ్యాల్లో, ఆచార సంప్రదాయాలు మిళితమైన సమాజ స్వరూప స్వభావాల్లో వంట ఓ విద్య, కళ, శాస్త్రం. నాడు పసిపాపడి కోసం తపించిన గ్రామీణ వనిత సుజాత 'తియ్యగా వండిన పాయసమ్ము గొనివచ్చితి, చవులుపుట్ట భుజించి అనుగ్రహింపవే' అంటూ బుద్ధదర్శనం చేసుకొంది. సుగంధపూర్ణమైన ఆ మధురాన్నం అమృత తుల్యంగా తోచిందా బుద్ధదేవుడికి!

అరవైనాలుగు కళల్లో పాకశాస్త్రం, అరవైనాలుగు విద్యల్లో పాక చమత్కారం సుస్థిరస్థానం సంపాదించాయి. చతుర్విధ అగ్నుల్లో జఠరాగ్ని ఒకటి; పంచామృతాలుగా నెయ్యి, తేనె, చక్కెర, పెరుగు, పాలు మధురాతిమధుర ద్రవ్యాలు. పంచశుద్ధుల్లో ఒకటి భాండశుద్ధి. సందర్భాన్నిబట్టి 'ఇంటి పరిశుద్ధి ఎల్లప్పుడు ఇంతి వలన నిలబడును గాని, మగవాని వలన గాదు' అన్న పానుగంటివారి మాట ఇక్కడ తలంపుకొస్తుంది. 'పురుషుల భాగ్యమున్ చిగురుబోణుల చిత్తములెట్లు మారునొ' అని రుద్రకవి ఓ సందర్భంలో కాస్తంత సందేహించారు. తిరుపతి వేంకటకవులు భావించినట్లు 'పడతులు చేయింపలేని పనులుం గలవె' అన్నది బహుశా బహుజనామోదమే. ఇంటిల్లపాదికీ వండి వడ్డించటంలోనే కాదు- అతిథిజనులకు ఆతిథ్యమివ్వటంలోనూ ఇల్లాలిది కీలకపాత్ర. 'నేనూ నీ వెంటనే ఉన్నా'నంటూ ఇంటాయనా ఆ బాధ్యతలు పంచుకుంటే ఆ సంతృప్తి, ఆ సంతోషం షడ్రుచులూ నవకాయ పిండివంటలంత విశేషానుభూతి. సప్తవిధ రసాల్లోని తీపి, పులుపు, ఉప్పు, కారం, ఘాటు, చేదు, వగరులే కుటుంబ జీవితానికీ ప్రతీకలు. స్త్రీ పురుషుల రుచులూ అభిరుచులూ కలగలసినచోట 'భోజనస్వామ్యం' వర్ధిల్లడం తథ్యం. 'వంటచేయలేనివాడు మగడా?' అనే ప్రశ్న తలెత్తినప్పుడు నలభీములు ప్రత్యక్షంకావడం అంతకన్నా సహజం. బాహుకుడుగా నలమహారాజు, వలలుడుగా భీమసేనుడు వండి వడ్డించిన వంటకాలు వారి అనుపమాన పాక పటిమకు ప్రత్యక్ష తార్కాణాలు. 'కలిగె మార్పులెన్నొ కాల ప్రభావాన/ఇంట సతికి సాయమీయవలెను' అన్నప్పుడే పురుషుల బాధ్యతలు ముందు వరసలో నిలుస్తాయి!

'వంట చేయడం బ్రహ్మవిద్యా?' అని తూలనాడే పురుషులు సైతం కమ్మనైన రుచులకు దాసోహమంటూ 'అది అమ్మ విద్యే' అని తలూపక మానరు. 'పదునుగ మంచి కూర నలపాకము చేసినయైన/ అందు ఇంపొసగెడు ఉప్పులేక రుచి చేకూరునటయ్య' అని భాస్కరశతక కర్త పలికిన హితవులో అర్థపరమార్థాలు వేరు. ఇంట్లో తప్పొప్పులు/ ఉప్పొప్పులు తెలిసిన పురుషుడే ఘనుడన్నది అంతస్సారం. 'భార్య సుతుల మిత్ర బంధుల నితరుల/ ఉప్పు తీపు పులుపు రుచులు సమమై/ వండి వైశిష్ట్య భక్ష్యాల వంటచేయువాడె ఉత్తముండు' అన్నది భర్తకు ఆధునిక కవి ఇచ్చిన నిర్వచనం. ఇంట ఉత్తమపతిగా సత్తాచాటుకొనే పురుషోత్తముడికి అదేమంత బరువు కాదు- అదో ఆటవిడుపు! ఓ కవి వర్ణించినట్లు- 'ప్రాణనాథుడు భార్యపక్షమై యుంటేను/ మిన్ను విరిగిన గాని మీద పడదు' మరి. అంతేకానీ భానుమతీ రామకృష్ణ 'అత్తగారి'లా 'అన్నీ తెలుసనుకునే ఏమీ తెలియని మనిషి'లా ఉంటే తంటా తప్పదంతే. ఈకాలం అమ్మాయిలూ వంటింటి మొనగాళ్లనే భర్తలుగా కోరుకుంటున్నారు. ఉన్నత చదువుల్లోని యువతుల్లో సగంమందికి పైగా 'వంటచేయడం వచ్చిన అబ్బాయిలనే మనువాడుతా'మంటున్నారు. 'సమయానికి తగు మాటలాడి' అన్నట్లు సందర్భానికి తగిన వంటలు చేసే శ్రీవారితోనే జీవితానందం ఉందని వనితలెందరో గట్టిగా నమ్ముతున్నారు. ఒక వివాహవేదిక సంస్థ అంతర్జాలంలో నిర్వహించిన అభిప్రాయ సమీకరణ సారాంశమిది. వంటింటి సామ్రాజ్యానికి ఆమె మహారాణిగా, అతను మహారాజుగా వ్యవహరించడమే- దాంపత్య మధురిమ!
ఈనాడు .18:11:2013
________________________

Labels: , , ,

Wednesday, August 28, 2013

1263-The Telugu navala

My recent item on the early Tamil novel (Miscellany, August 12) had reader Saraswathi Rao wondering whether or not Sri Ranga Raja Charitra by Narahari Gopala Krishnamma Chetty was the first Telugu novel. No authority on the subject, I did some checking around and discovered that it had been written in 1872, was dedicated to Lord Mayo, and had been described by the Fort St. George Gazette as being “ apparently the first attempt ever made… at novel writing in Telugu prose.” The author was at the time the Deputy Collector of Kurnool District and undertook the work in response to a notice by Lord Mayo, the then Governor-General, that had appeared in the Bengal Gazette .
The notice had stated that a work of fiction featuring the customs and rituals of the Bengalis would be rewarded. Lord Mayo saw this as a means of getting the British administrators, who till then had only to learn the language, better acquainted with the customs of the people. Krishnamma Chetty decided to do this on behalf of the Telugu people of Madras Province. He called it a “navina prabandham”, emphasising that it was an original story — not a translation — and re-emphasising that it was ‘new’. Set in the 15th Century, it tells the story of Sri Ranga Raju of the Vijayanagar dynasty and describes the customs and rituals prevalent at the time. These customs have not changed at all, Chetty points out in criticism. Was this then an attempt to urge society to change as well as break caste taboos, wonders a later commentator.

What intrigued me in this commentary, however, was the use of the term navala , the word used in Telugu today, I’m told, for ‘novel’. Kasibhatta Brahmayya Sastry, a scholar, is quoted as saying, “In English, the word ‘novel’ has come out of ‘nav’ which means ‘new’. It is not clear that this ‘nav’ is related to ‘nava’ of Sanskrit. Therefore, ‘navala’ means that (literary form) which has new features — navan visesan lati grihnati iti navala. In English too the word bears the same meaning. Therefore, I am using here the word ‘navala’ for this (literary form) instead of attempting to coin another Sanskrit word.”
Sastry’s use of ‘navala’ came in a commentary he wrote c.1900 on the second Telugu novel, Raja Sekhara Charitra by Kandukuri Veeresha Lingam, which was serialised in 1878 in the author’s own journal, Viveka Vardhani . The word has apparently stuck since then.
No doubt, there’ll be more on this, one of these days, from readers.

(S.Muthiah, Madras Miscellany, Metroplus, Chennai, The Hindu, 26:08:2013)
_____________ __________________

Labels: , , , , , ,

Saturday, January 12, 2013

వంశవృక్షం


నిరంతర జీవధారగా కొనసాగే కాలం ఏనాడూ ఆగదు, మారదు. ఆ వేగ గమనంలో ఆగేదీ సాగేదీ మారేదీ దారి మళ్లేదీ మనిషే! నిత్యకృత్యాల పెను ఒత్తిళ్ల మధ్య అతనెంతగా పరిభ్రమిస్తున్నా, ఎర్రన కవి తలచినట్టు- జననీ జనకులకు సుగతి కలిగించేవాడే ధర్మాత్ముడు. ఎంతటి ఘన చరితుడికైనా చిరునామా... అమ్మా నాన్నా. జన్మనిచ్చిన వారినీ వంశానికి మూలంగా నిలచిన పురుషులనీ ప్రాతః స్మరణీయులుగా సంభావించడమే మనిషితనం. సృష్టికర్త బ్రహ్మదేవుడికే తన మూలాలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిందని పురాణం చెబుతోంది. అది అత్యంత సర్వసహజమైన ఉత్సుకత. 'తన్ను దానెరుగలేని తలపేటి తలపు' అన్న అన్నమయ్య భాషితాన్నీ ఇక్కడ స్మరించుకోవాల్సిందే. పుట్టుకకీ పెరుగుదలకీ మూలకారకులైన తాత ముత్తాతలు, సంబంధీకుల్ని పేరుపేరునా తలచుకోవడంలో జీవితకాలానికి సరిపడేంత ఆనందముంది. పుట్టి పెరిగిన ప్రదేశాన్ని చూడాలన్న తాపత్రయం ఎంతో, పూర్వీకుల వివరాలు తెలుసుకుని నమస్కరించుకోవాలన్న కాంక్షా అంతే. మనుషుల్నీ మనసుల్నీ నిత్యమూ కలిపి ఉంచేంత జీవన సూత్రం ఇక్ష్వాకుల వంశ చరితలో ప్రతిఫలిస్తుంది. ఆ కుల తిలకుడు శ్రీరామచంద్రుడైతే, కుమారుడు కుశుడి ద్వారా కొనసాగిందంతా రఘువంశ కీర్తి విస్తరణే. తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించేలా మహా తపమాచరించిన భగీరథుడిదీ సఫల మనోరథమే.

'వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే' అనడంతోనే అత్రి, అగస్త్య, ఆంగీరస, వసిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, భృగు, జమదగ్నాది మహర్షుల దర్శనమవుతుంది. పుత్రపౌత్రాది పరంపర వర్ణన సాగిన ప్రతిసారీ 'జన్మవృక్షమునకు చవి గలయట్టి పటుతర కమనీయ ఫలములు రెండు కెరలు/ భోగములొండు కీర్తి రెండవది' అని చాటిన అలనాటి పల్నాటి చరితా జ్ఞప్తికి రాక తప్పదు. కదనరంగానికి కదిలే ముందు భార్యామణిని చూడబోయిన బాలచంద్రుడు అక్కడే సౌందర్యారాధన బంధితుడవుతాడు. ఆ పరిష్వంగ వలయం నుంచి తప్పించి కూతురు ముఖతః అల్లుణ్ని కర్తవ్యోన్ముఖం చేసేందుకు రేఖాంబ సాగించిన బోధ వారి వంశకీర్తిని విశదపరచేదే! తరాలూ వారసత్వాలూ అనేకానేక రంగాల్లో ఉన్నా, వంశ మూలాల ఆలోచనే మనోమందిరాన్ని పరమానందభరితం చేస్తుంది. జీవన సంస్కార వారసత్వమే ఎప్పుడైనా ఎవ్వరికైనా గర్వకారణం. 'వరమున బుట్టితిన్, భరత వంశమున జొచ్చితి, నందు పాండు భూ/ వరునకు గోడలైతి, జనవంద్యుల బొందితి, నీతి విక్రమ/ స్థిరులగు పుత్రులం బడసితిన్, సహ జన్ముల ప్రాపు గాంచితిన్' అంటూ అన్నింటా ఉన్న తన ప్రశస్తిని చాటిన ద్రౌపదిదీ మూలాచార పరాయణత్వమే. సత్యం, ధర్మం, శమం, దమం, విక్రమం, ప్రియవాక్యం తదితరాలూ గుణసంపత్తికి తార్కాణాలు. వారసత్వాన్ని పదిలపరచి విస్తరించాలన్న భావన వెనక వంశాభిమానముంది. వూరూ పేరూ ప్రస్తావించి 'నచట పుట్టిన చివురు కొమ్మైన చేవ' అంటూ ప్రవర కథాసంబంధ అభివర్ణన సాగించారు మనుచరిత్రకారులైన పెద్దనామాత్యులు. 'వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె/ నందు పెక్కండ్రు నృపులుదయంబు నొంది/ నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్ర కీర్తి/నధికులైరి తదీయాన్వయమున బుట్టి' అన్న వేరొక సందర్భమూ మూల చరితుల సంబంధమే. అంతటి ముఖ్యులు సహా విశిష్టులైన మహా రుషుల పేర్లను కలిపి చూసుకుని, తామూ అదే కుటుంబానికి చెందినవారమన్న ప్రవరాన్విత భావం పొందడం ఎవరికి వారికే అబ్బురమనిపించే అనుభవం.

ఎన్నడూ చెదరని, ఎప్పటికీ చెరగని, ఏనాటికీ తెగని అనుభవాన్నిచ్చేవి కళలు, సాహిత్యం, చరిత్రలు. ఆకట్టుకునే త్రివేణీ సంగమంలా, అంటిపెట్టుకునే పుట్టుమచ్చలా అవి శాశ్వతాలు. నాడు నేడు రేపు అన్నవి ఎవరికి వారు గీసుకునే కొండగుర్తులనుకుంటే, కలసి మెలసి జీవించడంలో ప్రతి ఒక్కరూ అందుకునే ఉల్లాస స్థాయి శిఖరంతో సమానం. ఆదికవి నన్నయ 'కీర్తి నిలుపుటయు కాదె/ జనులకు జన్మఫలంబు' అనడంలో వెల్లివిరిసేది మూలధర్మాల సంరక్షణ సంకల్పమే. కంటిముందే కాగితాల మడతల్లోకి జారిపోతుంది గతం. చూస్తుండగానే గుమ్మంలోకొచ్చి నిలుస్తుంది వర్తమానం. ఆశగా వూరించి వూహల ఉయ్యాలలూగిస్తుంది భవితవ్యం. అయినా 'మా పూర్వీకులు...' అని ప్రారంభించడంలోనే మనిషిలోని ప్రేమాభిమానాలూ అచ్చట్లూ ముచ్చట్లూ పెల్లుబికి, శుభకామనలై నిలవడంతో పాటు దివ్య దీవెనల్నీ కోరుకుంటాయి. పండుగలూ పబ్బాలప్పుడు ఉమ్మడిగా చేసుకునే వేడుకల్లో అందరికీ అనుభవానికొచ్చేది- ఆ ఉల్లాసమే, ఆ ఉత్సాహమే! సొంత వూళ్లో 'అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్, మావయ్య, తాతయ్య, బామ్మ'ల వంటి బంధుత్వ పిలుపులూ జనజీవన భాగ్యాలే. ఆయా సత్సంప్రదాయ పరంపరలే భువిలోని తదుపరి తరాలకు సదా ఆరాధ్యాలు, ఆదర్శప్రాయాలు. 'విశ్వంభర' కర్త గళం పలికినట్టు 'మట్టిలో మొలిచిన ఏ మొక్కయినా/ నేలపైన అలాగే ఉండాలనుకోదు/ తాను చెట్టంత ఎదిగిపోయే గడియ/ ఎప్పుడా అని ఎదురుచూస్తుంది'. మతం, భాష, ప్రాంతం, ఆచారం, సంప్రదాయం... అన్నింట్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నా, వాటిని ఏకోన్ముఖం చేసే ప్రగాఢ శక్తి మూలాల అన్వేషణ, ఆరాధన, పరిరక్షణల్లోనే దాగుంది. అదే మన సంస్కృతి, అదే మనందరిలోని భారతీయత.

(సంపాదకీయం, ఈనాడు , 23:12:2012)
--------------------------------------------

Labels: ,

Wednesday, August 15, 2007

ఆరుపదుల జ్ఞాపకాలు...

'సంకెళ్లకు తలవంచి, బానిసలా యాచించి అందుకునే జీవితం అంత విలువైనదా? అహింస అంత మధురమైనదా? అదే నిజమైతే, భగవంతుడా, ఆ జీవితం నాకు అవసరమే లేదు. నాకు స్వేచ్ఛకావాలి లేదా చావు కావాలి'... ఉరిశిక్షకు ముందు విప్లవవీరుడు భగత్‌సింగ్‌ తన డైరీలో రాసుకున్న ప్యాట్రిక్‌ హెన్రీ వాక్యం. తనను ఉరికంబాన్నుంచి తప్పించాలని ఆరాటపడుతున్న కన్నతండ్రికి ఉటంకించిన స్వరాజ్య మంత్రం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లను మినహాయిస్తే మనమెవ్వరమూ పరాధీన భారతంలో అస్వతంత్ర జీవితాన్ని అనుభవించలేదు. ఎంత అదృష్టవంతులం! ఆ స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? కొన్ని రంగాల్లో అద్వితీయంగా పురోగమిస్తూ కొన్ని సందర్భాల్లో మనుషులుగా తిరోగమిస్తున్న విచిత్ర పరిస్థితి. ఈ షష్టిపూర్తి వత్సరంలో భారతావని పరిణామాలను అవలోకనం చేసుకుంటే...

1947: దేశ విభజన
స్వాతంత్య్రం ఓ ఉదయాన్నీ ఓ చికటినీ వోసుకొచ్చింది. అఖండ భారతావని భారత్‌, పాకిస్థాన్‌గా విడిపోయిన చేదు ఘట్టంలో 7 నుంచి 20 లక్షల మంది హతమయ్యారు, లక్షమంది స్త్రీలు అత్యాచారానికి గురయ్యారు. ఇళ్లు, ఆస్తులను వదిలి వలస పోవడం వల్ల సుమారు కోటిమంది నిరాశ్రయులయ్యారు.

1947: కాశ్మీర్‌ విలీనం
పాకిస్థాన్‌ ప్రోద్బలంతో తమపైకి ఆటవికమూకలు దండెత్తిన నేపథ్యంలో అక్టోబర్‌ 27న కాశ్మీర్‌ రాజు హరిసింగ్‌, గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌ భారత్‌లో కాశ్మీర్‌ విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. ద్విజాతి సిద్ధాంతం ప్రకారం ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్‌ తమదేనని పాక్‌ వాదిస్తోంది. ఇది నాలుగు యుద్ధాలకు దారి తీసింది.

1948: గాంధీజీ అస్తమయం
ప్రపంచానికి అహింసా పాఠాన్ని బోధించిన మహాత్ముడు జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నేలకొరిగాడు. తన చర్య ఎలా హేతుబద్ధమైందో, ఎందుకు కాల్చాల్సి వచ్చిందో నాథూరామ్‌ వినాయక్‌ గాడ్సే కోర్టులో ఎంతగా సమర్థించుకున్నా భారతీయులెవరూ జీర్ణించుకోలేని దారుణం అది.

1948: హైదరాబాద్‌ వివోచన
నేటి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న హైదరాబాద్‌ సంస్థానం సెప్టెంబరు 17న భారత్‌లో అంతర్భాగమైంది. కోటిన్నర జనాభాకు రాజు, అత్యంత ధనవంతుడు నిజాం ఐదురోజుల సైనికచర్య తర్వాత తలొగ్గాడు. ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణా సాయుధ పోరాటం దీనికి పూర్వరంగం.

1949: రాజ్యాంగ సమర్పణ
సుమారు మూడేళ్ల మేధోమథనంతో ఆవిర్భవించిన రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సమర్పించారు. ప్రపంచంలోనే సుదీర్ఘ లిఖిత రాజ్యాంగమైన దీన్లో 1,17,369 పదాలున్నాయి(ఆంగ్లంలో). ఇది నవంబరు 26న ఆవోదం పొందింది.

1950: జాతీయగీతం
రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసి, స్వరపరిచిన 'జనగణమన' జనవరి 24న జాతీయగీతంగా ఆవోదం పొందింది. తర్వాత రెండు రోజులకు సారనాథ్‌లోని అశోకుడి నాలుగు సింహాలను జాతీయచిహ్నంగా స్వీకరించాం.

1950: గణతంత్ర రాజ్యం
రాజ్యాంగం జనవరి 26న అమల్లోకి వచ్చింది. అదే రోజు భారత్‌ సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.

1951: పంచవర్ష ప్రణాళికలు
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించే లక్ష్యంతో తొలి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ప్రస్తుతం పదో ప్రణాళిక ముగుస్తున్నా మన ఆశయాలు నెరవేరలేదు. వైఫల్యాలే పాఠ్యాంశాలుగా చదువుతున్నాం.

1952: తొలి సాధారణ ఎన్నికలు
నభై ఐదు శాతం నిరక్షరాస్యులున్న భారతదేశం తొలి సాధారణ ఎన్నికలకు సిద్ధపడింది. 1951 అక్టోబరులో ప్రారంభమై 1952 ఫిబ్రవరిలో ముగిసిన ఈ ఎన్నికల్లో 14 జాతీయపార్టీలతో సహా 74 పార్టీలు 4,500 స్థానాలకు పోటీచేశాయి.

1952: కుటుంబ నియంత్రణ
నాభా 37 కోట్లను చేరుతున్న దశలో 'కుటుంబ నియంత్రణ' ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఈ తరహా కార్యక్రమం వెుదటిది. తిరగేసిన ఎర్ర త్రికోణం గుర్తు బాగా ప్రాచుర్యం పొందింది.

1952: శ్రీరాములు త్యాగం
ఆంధ్రరాష్ట్రావతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు 58 రోజుల తర్వాత డిసెంబరు 16న మరణించారు. మరుసటి ఏడాది అక్టోబరు 1న ప్రకాశంపంతులు ముఖ్యమంత్రిగా, కర్నూలు రాజధానిగా మద్రాసు నుంచి విడిపోయి, ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

1954: భారతరత్న
దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రారంభమైంది. తొలుత అందుకున్నవారు సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజగోపాలాచారి, సీవీ రామన్‌.

1955: ఆధునిక దేవాలయం
డిసెంబరు 10న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ 'ఆధునిక దేవాలయం' అని అభివర్ణించారు ప్రధాని నెహ్రూ. ప్రపంచంలోనే పొడవైన ఈ ఆనకట్ట పదమూడేళ్లకు నిర్మాణం పూర్తిచేసుకుని 1967 ఆగస్టు 4న ప్రారంభమైంది.

1956: భాషాప్రయుక్త రాష్ట్రాలు
భాషల ప్రాతిపదికన జరిగిన పునర్వ్యవస్థీకరణలో నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాలు అవతరించాయి. కుల, మతాలకంటే భాష ప్రజలను ఐక్యంగా ఉంచుతుందని నిరూపించిన ఈ విధానం మన్ననలందుకుంది.

1959: దూరదర్శన్‌
టీవీ ప్రవేశం. వారానికి రెండు రోజులు, గంట చొప్పున సాయంత్రాలు కార్యక్రమాలు ప్రసారమైనాయి.

1961: గోవా విముక్తి
అందరికంటే ముందు దేశంలో ప్రవేశించిన పోర్చుగీసువారు 450 ఏళ్ల తర్వాత భారత్‌(గోవా) విడిచిపెట్టి వెళ్లారు. శాంతిచర్చలతో ఫలితం లేకపోవడంతో యుద్ధానికి దిగిన మన సైన్యానికి పోర్చుగీసు సేనలు లొంగిపోయాయి. అదే రాత్రి డయ్యూ, డామన్‌ మన వశమైనాయి.

1962: చైనాతో యుద్ధం
'హిందీ-చినీ భాయ్‌ భాయ్‌' అనుకున్న భావావేశాన్నీ పంచశీల సూత్రాలనూ అపహాస్యం చేస్తూ చైనా మన సరిహద్దుల్లోకి చొరబడేందుకు తెగించింది. నెహ్రూను తీవ్రంగా చలింపజేసిన ఆ ఓటమి మన రక్షణబడ్జెట్‌ పెరగడానికీ ఆయుధశక్తి పెంచుకునేందుకూ కారణమైంది.

1966: క్షీరవిప్లవం
'ఆపరేషన్‌ ఫ్లడ్‌'కు బీజం. గుజరాత్‌లో ఆరంభమైన 'అమూల్‌' విజయం 23 రాష్ట్రాల్లో తొంభై వేల గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పడేందుకు బలమిచ్చింది. అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్‌ నిలబడింది.

1967: హరితవిప్లవం
తిండికోసం ఆహారధాన్యాలను దిగుమతి చేసుకున్న గడ్డుకాలంలో హరితవిప్లవానికి శ్రీకారం. మేలుజాతి వంగడాలు, రెండు పంటలు, సులభ రుణాలు... దిగుబడులను ఇబ్బడిముబ్బడిగా పెంచాయి. దశాబ్దంలో దేశాన్ని స్వయంసమృద్ధి గావించాయి.
1967: నక్సల్‌బరీ
శ్చిమబెంగాల్‌లోని నక్సల్‌బరీ గ్రామంలో పుట్టిన నక్సలైట్‌ ఉద్యమం 'ఇంతింతై..', శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించింది.

1969: బ్యాంకుల జాతీయీకరణ
సామాన్యులకు రుణాలు అందించే లక్ష్యంతో యాభై కోట్ల రూపాయల డిపాజిట్లుగల 14 బ్యాంకులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, జాతీయం చేసింది.

1971: మట్టికరిచిన పాక్‌
బంగ్లాదేశ్‌ విముక్తికోసం పాకిస్థాన్‌తో జరిపిన యుద్ధంలో అపూర్వమైన విజయం లభించింది. బందీలుగా చిక్కిన 91,401 మంది పాక్‌ సైన్యాన్ని సిమ్లా ఒప్పందం ప్రకారం విడిచిపెట్టాం. కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవడంలో మాత్రం విఫలమైనాం.

1972: రాజభరణాల రద్దు
ఉపప్రధాని వల్లభాయ్‌పటేల్‌ చొరవతో విలీనమైన 565 సంస్థానాలను రద్దు చేసినప్పుడు, ఆయా పాలకులకు ఇచ్చిన ప్రత్యేకమైన గుర్తింపునూ వారి రాజ్యాల ఆదాయాల నిష్పత్తికి అనుగుణంగా చెల్లిస్తూ వచ్చిన రాజభరణాలనూ జనవరి నుంచి నిలిపేశారు. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధాని ఇందిర ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.

1974: పోఖ్రాన్‌ అణుపరీక్ష
రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఎడారి ప్రాంతంలో మే 18న జరిపిన మహావిస్ఫోటనం భారత్‌ను అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాల సరసన నిలబెట్టింది. తిరిగి రెండు దశాబ్దాల అనంతరం 1998 మేలో జరిపిన ఇదే ప్రయోగంతో అణ్వాయుధాలు కలిగిన దేశంగా సత్తా చాటుకున్నాం.

1975: చికటి అధ్యాయం
అంతర్గత కల్లోలాలు ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగించేట్టున్నాయన్న సాకుతో ప్రధాని ఇందిరాగాంధీ సలహా మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ జూన్‌ 25న విధించిన అత్యవసర పరిస్థితి రెండేళ్లపాటు కొనసాగింది. జయప్రకాశ్‌ నారాయణ్‌తో సహా ఎందరో నాయకులు జైళ్లపాలయ్యారు.

1977: జనతా సర్కార్‌
వెురార్జీదేశాయ్‌ ప్రధానిగా కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణాలకు నాందీ కూడా అదే. అదే ఏడాది అక్టోబరు 4న విదేశాంగ మంత్రిగా అటల్‌బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితి సాధారణసభలో మన జాతీయభాష హిందీలో ప్రసంగించారు.

1980: ప్రయోగం సక్సెస్‌
జులై 18 శాస్త్రీయవిజ్ఞాన పరంగా గుర్తుంచుకోదగ్గది. ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎల్‌వి-3 ముప్ఫై కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 300కి.మీ. దూరం అంతరిక్షంలోకి వోసుకెళ్లింది. ఇప్పుడు 200 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 36000 కిలోమీటర్ల దూరాన ప్రవేశపెట్టే సామర్థ్యం సాధించాం.

1982: రంగులబొమ్మ
దేశమంతటికీ కలర్‌ టీవీ విస్తరించింది. అప్పట్నుంచి సామాన్యజనానికి కాలక్షేపం అదే. పూర్తిస్థాయిలో రంగుల్లో ప్రసారమైనవి ఆ యేటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.

1982: ఎన్టీఆర్‌ ప్రభంజనం
మార్చి 21న తెలుగునాట ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మరుసటి ఏడాది జనవరి 9న అధికారంలోకి వచ్చింది. నటుడిగా ఎన్టీఆర్‌కున్న అమితమైన జనాదరణవల్లే తొమ్మిది నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగారు.

1983: క్రికెట్‌ ప్రపంచకప్‌
పిల్‌ నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌ను ఓడించి, ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది. క్రికెట్‌ 'పిచ్చి'ని వీధివీధికీ పాకించిన మహత్తర విజయమది. ముందే టీవీ, అందులో క్రికెట్‌...

1984: ఆపరేషన్‌ విషాదం
స్వర్ణదేవాలయంలో తిష్ఠవేసిన సిక్కు తీవ్రవాదులను ఏరివేయడానికి తలపెట్టిన 'ఆపరేషన్‌ బ్లూస్టార్‌'(జూన్‌) చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. సైన్యం అప్పటికి విజయం సాధించినా తర్వాత అది ప్రధాని ఇందిరాగాంధీ హత్య(అక్టోబర్‌ 31)కూ తదనంతరం ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో వేలాది అమాయక సిక్కుల ఊచకోతకూ కారణమైంది.

1984: నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
డిసెంబరు మూడో తేదీ రాత్రి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ కర్మాగారం నుంచి వెలువడిన విషవాయువులు రెండువేల మందిని బలిగొన్నాయి. మూడు లక్షల మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. తర్వాత జన్మించిన శిశువుల్లోనూ జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తాయి. భద్రతా నిబంధనలను ఆ బహుళజాతి సంస్థ పూర్తిగా గాలికి వదిలేసిందనేది తర్వాత దర్యాప్తులో తేలిన విషయం.

1986: అందరూ వాటాదారులే
నదేశంలో ఈక్విటీ సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత రిలయన్స్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీకే దక్కుతుంది. కోటీ ఇరవై లక్షలమంది వాటాదారులను ఆయన సమీకరించారు. ఇక ఫిబ్రవరి 11న ఈ విధానం తారస్థాయికి చేరుకుంది. ఆరోజు 110 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాయి.

1990: రిజర్వేషన్‌ చిచ్చు
ండల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు, సామాజిక న్యాయం పేరిట మరిన్ని కులాలను రిజర్వేషన్ల పరిధిలోకి తెస్తూ ప్రధాని వి.పి.సింగ్‌ తీసుకున్న నిర్ణయం హింసాత్మక ఘటనలకు దారితీసింది. ప్రతిభకు మన్నన దక్కాలంటూ ఆందోళనలు జరిగాయి.

1990: అయోధ్య రథయాత్ర
యోధ్యలో రామాలయానికి మద్దతు కూడగడుతూ బీజేపీ అధ్యక్షుడు ఎల్‌.కె.అద్వానీ సోమనాథ్‌ నుంచి రథయాత్ర ప్రారంభించి పదివేల కిలోమీటర్లు చుట్టివచ్చారు. ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఇది తోడ్పడింది.

1991: రాజీవ్‌ హత్య
శ్రీలంక 'పులులను' నిరోధించడానికి శాంతి పరిరక్షక దళాన్ని పంపిన ప్రధాని రాజీవ్‌గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. మే 21న చెన్నై సమీపాన గల శ్రీపెరంబుదూరులో పేలిన మానవబాంబు రాజీవ్‌తో సహా ఇరవై మందిని బలిగొంది.

1991: ఛానళ్ల దశాబ్దం
భారత్‌లో ప్రవేశించిన తొలి ఉపగ్రహ ఛానల్‌ సీఎన్‌ఎన్‌. తర్వాత నాలుగు ఛానళ్లతో స్టార్‌ టీవీ ప్రవేశించింది. 1992లో జీ ప్రారంభమైంది. 1995లో కేబుల్‌ టీవీ నెట్‌వర్క్స్‌ (నియంత్రణ) చట్టం ఆవోదం పొందింది.

1991: సరళ మంత్రం
ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించిన సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని మార్చేశాయి. కేంద్ర పన్నులు తగ్గాయి. కంపెనీల మీద ప్రభుత్వ గుత్తాధిపత్యం పోయింది. అయితే ఈ విధాన మంచిచెడ్డల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

1992: బాబ్రీ విధ్వంసం
డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు నేలకూల్చారు. పదో తారీఖున ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌లను నిషేధించింది. తర్వాత ముంబయి, గుజరాతుల్లో చెలరేగిన అల్లర్లలో 250 మంది మరణించారు. వెయ్యిమందికిపైగా గాయపడ్డారు.

1994: అందాలపోటీలు
తొలిసారి విశ్వసుందరి కిరీటాన్ని సుస్మితాసేన్‌ దక్కించుకుంది. ప్రపంచసుందరిగా ఐశ్వర్యారాయ్‌ గెలుపొందింది. ఈ ఇరువురి విజయం సౌందర్య సాధనాల వ్యాపారాన్ని అనూహ్యంగా పెంచింది. ఈ పోటీలను మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

1998: సెల్‌ఫోన్‌ విప్లవం
దశకంలోనే టెలికాం రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం అనుమతించింది. 1998లో భారతి టెలీనెట్‌ మధ్యప్రదేశ్‌లో తన సేవలు ప్రారంభించింది. మరుసటి ఏడాది ప్రభుత్వానికీ టెలికాం ఆపరేటర్లకూ ఆదాయ పంపిణీ ఒప్పందం కుదరడంతో సెల్‌ఫోన్‌ ఛార్జీలు తగ్గాయి. సెల్‌ఫోన్ల సంఖ్య పదమూడు కోట్లకు చేరింది. సామాన్యులకు అతి వేగంగా చేరువైన సాంకేతిక పరిజ్ఞానం ఇదేనేవో!

1999: ఆపరేషన్‌ విజయ్‌
వాస్తవాధీన రేఖలోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్‌ సైనికులను మన సైన్యం తిప్పికొట్టింది. మూడు నెలలు కొనసాగిన ఈ యుద్ధంలో 413 మంది భారత సైనికులు అమరులైనారు, 584 మంది గాయపడ్డారు.

2000: వందకోట్ల జనాభా
కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా జనవిస్ఫోటనం జరుగుతూనే ఉంది. మే నెలలో మన జనసంఖ్య మ్యాజిక్‌ మార్కు బిలియన్‌కు చేరింది.

2002: గుజరాత్‌ అల్లర్లు
గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు తగలబడడంతో వెుదలైన మతఘర్షణలు గుజరాత్‌ను అట్టుడికించాయి. వందల మంది మాన, ప్రాణాలను హరించాయి.

2004: సునామీ బీభత్సం
డిసెంబరు 26న హిందూమహాసముద్రంలో సంభవించిన భూకంపం పదివేల మంది భారతీయులను పొట్టనపెట్టుకుంది.

2005: సామాన్యుడి అస్త్రం
ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) వేయగలిగే అవకాశం 1986లో వచ్చింది. అంతటి శస్త్రం ఆర్‌టీఐఏ. ప్రభుత్వాన్ని ఏ సమాచారం కోసమైనా నిలదీయగలిగే సమాచారహక్కు చట్టం అక్టోబరు 13 నుంచి అమల్లోకి వచ్చింది.

2007: రాష్ట్రపతిగా మహిళ
రవై ఏళ్ల స్వతంత్ర భారతంలో రాష్ట్రపతి పీఠం మీద ఓ మహిళ కూర్చోగలిగే అవకాశాన్ని ప్రతిభాపాటిల్‌ దక్కించుకున్నారు.

(Eenadu, 12:08:2007)

__________________________

Labels:

Sunday, February 11, 2007

దేశమంటే మనుషులోయ్‌...

'దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌-' అన్నారు మహాకవి గురజాడ. ఏ దేశప్రగతి అయినా ఆ దేశపు జనాభాపైనే ఆధారపడి ఉంటుంది. కర్షకులు నాగళ్లుపట్టి ఏరువాక సాగిస్తేనే పంటలు పుష్కలంగా పండుతాయి. దేశంలో కరవు ఏర్పడకుండా ఉంటుంది. కార్మికులు తమ స్వేదం చిందిస్తూ యంత్రభూతాల కోరలు తోమి వాటిని నడిపిస్తేనే పారిశ్రామికాభివృద్ధి జరిగి సిరులు మూటలు కడతాయి. ఉపాధ్యాయులు చక్కగా బోధిస్తేనే చదువు, లోకజ్ఞానం అబ్బి బాలలు బాధ్యతగల పౌరులుగా పెరిగి దేశాభ్యుదయానికి తమవంతు కృషిచేస్తారు. ఈ విధంగా ఏ దేశ భవిష్యత్తయినా ఆ దేశ ప్రజల శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ''సంఘమందు పుట్టి సంఘమందు పెరుగు సంఘజీవి కాడె సభ్య నరుడు, సంఘవృద్ధి లేక స్వాభివృద్ధియు లేదు-'' అన్నారు నార్లవారు. అయితే మితం తప్పితే హితం తప్పుతుంది అన్న సూక్తి జనాభా విషయంలోను వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అధిక జనాభాతో సమస్యలనెదుర్కొంటోందంటున్నారు. ఈ విషయంలో అన్ని దేశాల పరిస్థితీ ఒక్కలాగ లేదు. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతుంటే, మరికొన్ని దేశాలు జనాభా తక్కువై బాధపడుతున్నాయి. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలవారు కుటుంబ నియంత్రణ పద్ధతులు పెంపు చేయాలని చూస్తుంటే జనాభా తక్కువగా ఉన్న జపాన్‌, జర్మనీవంటి కొన్ని పాశ్చాత్య దేశాలు జననాల రేటు ఎలా వృద్ధి చేయటమా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి.

జనాభా ఎక్కువయినా తక్కువయినా ఏ దేశపు ప్రత్యేకత దానికే ఉంటుంది. మన దేశంలో పెళ్లికాని అమ్మాయిలను ''శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు'' అనీ, పెళ్ళయిన పడతులను ''పుత్రపౌత్రాభివృద్ధిరస్తు'' అని దీవించటం పరిపాటి. సంతానం కలగనివారు గుళ్ళూ గోపురాలనేకాక మంత్రాలను, మంత్రాల స్వాములనూ ఆశ్రయించటమూ తరచుగా జరుగుతున్నదే. పిల్లలున్న ఇంటి కళే వేరు. పిల్లలు తమ అల్లరితో, హఠంలతో ప్రాణాలను విసిగిస్తున్నా సంతానాపేక్ష మాత్రం తగ్గదు ఎవరికైనా. ''అమ్మా నువ్వు ఎగ్జిబిషన్‌లో ఆరు కప్పుల పింగీణీ టీ సెట్టు కొనుక్కున్నావు కదా-'' అని అడిగింది ఆరేళ్ళ సుపుత్రిక. ''అవును. ఆ సంగతెందుకిప్పుడు?-'' అంది తల్లి. ''మరేం లేదు, ఆ ఆరు కప్పుల టీ సెట్టును పది కప్పుల టీ సెట్టు చేశాడు తమ్ముడు!-'' అంటూ చల్లగా చెప్పింది సుపుత్రి. తిని కూర్చునేవారు ఎక్కువై పనిచేసేవారు తక్కువైపోతున్న వింత సమస్యతో కొట్టుమిట్టాడుతోంది జపాన్‌ దేశం. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ జననాల రేటు తగ్గిపోతూ ఉండటంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. పెన్షన్‌తో కాలం వెళ్ళబుచ్చే వయోవృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోతుండగా పిల్లల కేరింతలు మాత్రం వినపడడంలేదు. ప్రపంచంలోని మిగతా దేశాలు అధిక జనాభాతో సతమతమై పోతుండగా జపాన్‌, జర్మనీవంటి దేశాలు మాత్రం జనాభాలేమి సమస్యతో బాధపడుతున్నాయి. జపాన్‌లో జననాల రేటు బాగా పడిపోవటానికి ఆలస్యంగా చేసుకుంటున్న పెళ్ళిళ్ళు ఒక కారణం కాగా అక్కడి యువతులు పిల్లలను కనటానికి అంతగా సుముఖంగా లేకపోవటం మరో కారణం. అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖవారు విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 1988 సంవత్సరంలో జపాన్‌ యువతులు 25 లేక 26 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వివాహానికి సిద్ధపడుతుండగా 2004 సంవత్సరం వచ్చేసరికి 27 లేక 28 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిమాటే తలపెట్టటంలేదని తేలింది. వివాహితులైన యువతులూ సంతానవతులు కావటానికి ఇష్టపడటంలేదు. దానికి కారణం పిల్లలను పెంచటం భారీ ఖర్చుతో కూడిన కార్యక్రమం అనే ఉద్దేశం అక్కడి ప్రజలలో పెరిగిపోవటం. శిశు సంరక్షణను చేపట్టే సంస్థల కొరతవల్ల ఉద్యోగినులకు తమ పిల్లల ఆలనాపాలనా చూసుకోవటం కష్టసాధ్యంగా పరిణమిస్తోంది.

జపాన్‌ యువతులు మాతృత్వంపట్ల మోజు చూపటంలేదు. దాంతో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితులలో జనాభా మరీ పల్చబడితే రాబోయే ముప్పును గ్రహించిన జపాన్‌ ప్రభుత్వం- ప్రజలలో వివాహం పట్ల ఆసక్తిని సంతానాపేక్షను వృద్ధి చేయాలనే సదుద్దేశంతో కొన్ని చర్యలను తీసుకోవటం మొదలుపెట్టింది. అందులో భాగంగానే వివాహాలు కుదిర్చే సంస్థలవారు తమ సంస్థల కార్యకలాపాలను గురించి టెలివిజన్‌లో ప్రకటనలు ఇచ్చుకోవచ్చన్నారు. లోగడ మ్యారేజి బ్యూరోలు పత్రికలలో ప్రకటనలిచ్చుకోవచ్చు కాని టెలివిజన్‌లో ప్రచారం చేసుకోకూడదనే నిబంధన ఉండేది. టి.వి. ప్రభావమే ప్రజలలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడా నిబంధనను సడలించి టి.విలోను మ్యారేజిబ్యూరోల వారు ప్రకటనలు ఇచ్చుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఈ వెసులుబాటువల్ల వివాహం చేసుకొనేవారి సంఖ్య పెరిగి, జననాల రేటూ వృద్ధి పొంది కొత్త మొహాల కేరింతలతో జపాన్‌ దేశం కళకళలాడిపోగలదని ప్రభుత్వం వారు భావిస్తున్నారు. జర్మనీవారూ తమ దేశ జనాభాను అభివృద్ధిపరుచుకోవాలనే ఉద్దేశంతో మహిళా ఉద్యోగినులకు ఏకంగా ఒక సంవత్సరంపాటు ప్రసూతి సెలవును మంజూరు చేస్తున్నారు. లోగడ ఆరువారాలు మాత్రమే ప్రసూతి సెలవు ఉండేది. ఇప్పుడా సెలవును ఒక్కసారే సంవత్సరానికి పెంచేశారు. అంతేకాక తల్లులయిన ఉద్యోగినుల భర్తలకూ రెండు నెలలపాటు పితృత్వ సెలవునూ మంజూరు చేస్తున్నారు. పన్ను రాయితీ వగైరాలు ఉండనే ఉన్నాయి. ఈ ప్రోత్సాహకాలన్నిటివల్లా జర్మనీ, జపాన్‌ దేశాలు జనాభా కరవు అన్నమాట లేకుండా పుష్కలంగా మానవవదనాలతో వెలిగిపోగలవని ఆ దేశాలవారు భావిస్తున్నారు. వారి ఆశయాలు ఫలిస్తాయనే ఆశిద్దాం!
(Eenadu,11:02:2007)
------------------------------------------------------

Labels:

Sunday, November 19, 2006

మనకీర్తి మంచుకొండరా...

( - జి.వి.డి.కృష్ణమోహన్ )
''బ్లడీ ఇండియన్స్!''
-ఈ మాటలు వందేళ్ళ క్రితం గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించిన దక్షిణాఫ్రికాలో అప్పటి జాత్యహంకారులన్నవి కావు...
ఇది అరవయ్యేళ్ళ క్రితంవరకు మనల్ని పాలించిన బ్రిటిషర్ల దుర్భాషకాదు...
బతుకు తెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన మన జనాన్ని అక్కడి 'ప్రథమశ్రేణి పౌరులు' పిలిచే పిలుపూ కాదిది...
ఘనత వహించిన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'కు చెందిన ఓ కుర్ర నటిచుట్టూ దడికట్టి ఆమె మడిబట్టకు తగిలినవారిని తన్ని తగలేసేందుకు అరుదైన ఆ స్త్రీతోపాటు ఇండియా వేంచేసిన అంగరక్షక పంచకంలో మన ఘన చరిత్రా చేతగాని చవటాయిత్వాలను ఔపోసన పట్టిన అమెరికా జాతి దేహరక్షకుడి నోట జాలువారిన ముత్యాల సరాలు- ''బ్లడీ ఇండియన్స్!''
మనదేశంలో, మనజనం మధ్య మనవాళ్ళని అంత చీదరించుకునే, దూషించే, చివరికి చేయిచేసుకునే ధైర్యం ఓ విదేశీ నటి దేహరక్షకులకు ఎక్కడినుంచి వచ్చింది? నోరుపారేసుకున్న దేహవీరులు స్థాయిలేని అమెరికన్లనో, మన పోలీసులు కేసులు పెట్టారుకాబట్టి కథను కంచికి నడిపించేద్దామనో మనకుమనమే సర్దిచెప్పుకోవటానికి ఏమాత్రం వీలులేని ప్రశ్న ఇది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది... సుదీర్ఘ నాగరికత ఉన్న దేశం మనది... జనాభాలో చైనాను మించుతున్న రాజ్యం మనది... ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆయుధాలు కొంటున్నదీ మనమే... ఐ.టి.లో మనమే మేటి... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడగల స్థాయికి ఎదిగిపోయిన దేశం కూడా మనదే... మనల్ని మనం(మాత్రమే) పొగడుకోవడానికి కావాల్సిన ఈ తరహా పనికిమాలిన సరంజామాను పోగేస్తే హిమాలయాల ఎత్తుకు మించిపోతుంది. విదేశాల్లో ఇండియన్లకు దక్కుతున్న 'మర్యాదల' గత, సమకాలీన చరిత్రల్ని తిరగేస్తే... ఓ జాతిగా మనకి లభిస్తున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది.
మొదటి తరగతి రైలుపెట్టెలో ఎక్కిన నల్లబాబును బోగీనుంచి లాగి బయటపడేస్తే... మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనే (అప్పటికి) అర్భకుడు దాన్ని మన హోం కమ్ ఉపప్రధాని పదవి వెలగబెట్టిన అద్వానీ మాదిరి సర్దుకుపోయి ఉంటే, ఆగ్రహమూ లేదు... సత్యాగ్రహమనే భావనే పుట్టేది కాదు. ఉపప్రధానిగా ఉన్నరోజుల్లో అధికారిక హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించడానికి వెళ్ళిన అద్వానీ మహాశయుడిని అమెరికా ఉద్యోగులు బూట్లూ సాక్సు విప్పించి చూడటం మన జాతికి అవమానమని ఇక్కడి ప్రసార సాధనాల్లో అభిప్రాయాలు, వ్యాసాలు, వాదనలూ హోరెత్తుతున్న సమయంలో సదరు విప్పిన నేత సమాధానమేమిటంటే... ''దీన్ని గుడ్డలిప్పడంగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కాలేద''ని. అర్థమైతే మహాత్ముడు- అర్థం కాకపోతే అద్వాని!
మనం అవతలిదేశంతో ఎలా వ్యవహరిస్తున్నాం, అవతలి దేశం మనతో ఎలా ఉంటోందన్నది దౌత్యంలో ప్రాథమికం, ప్రధానం. ఏకపక్ష గౌరవాలు, మర్యాదలు ఇచ్చేది సామంత రాజ్యమవుతుందే తప్ప సార్వభౌమ రాజ్యం కాలేదు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో రెండుమార్లు తన గుడ్డలూడదీసిన వైనాన్ని ఫెర్నాండెజ్ ఏనాడో పూసగుచ్చారు. విప్రో నిర్మాత అజీమ్ ప్రేమ్‌జీ, నటుడు కమల్‌హాసన్ సైతం ఇలా ఏదోరకంగా అవమానాలకు గురైనవారే. కాబట్టి ముంబాయిలో సినిమా షూటింగ్‌కోసం వచ్చిన ఏంజెలినా జోలి దేహరక్షకులే మనల్ని, మన జాతీయతను అవమానించారని బాధపడటం వ్యర్థం! ఉప ప్రధాని, రక్షణమంత్రి పదవుల్లోని వ్యక్తులనే పట్టించుకోని దేశంలోని వ్యక్తులు... ఆఫ్టరాల్, ముంబాయిలో ఓ స్కూలు పిల్లల్ని, వాళ్ళ అమ్మాబాబుల్ని సహేతుకంగా, సవినయంగా గౌరవిస్తారన్నదే వేరూ మొదలూ లేని ఆలోచన. అగ్రరాజ్యం నాయకత్వం తన పౌరులకు శాంతిసౌభ్రాత్రాలు, మానవతా విలువలు, సమానత్వ సూత్రాల స్ఫూర్తిని ఉగ్గుపాలలోనో సీసాపాలలోనో కలిపి పట్టిందనే వెర్రి నమ్మకాలెవరికీ లేవు. మిగతా ప్రపంచంలో అర్భకులు, అంగుష్ఠమాత్రులు మాత్రమే ఉంటారన్న భావన అక్కడి మనుషుల్ని కనిపించనివ్వనంత ఎత్తున అమెరికా నాయకత్వంలో మేటవేసి ఉన్నప్పుడు... ఆ దేశంలోని పౌరులందరిలో ప్రజాస్వామిక, మానవతా విలువలు హిమనదాల్లా ప్రవహించాలన్నదే దుస్వప్నం. ఇరాక్‌లో ఇరాకీలు, ఆఫ్ఘనిస్థాన్‌లో ఆఫ్ఘనీలు మాదిరే ఇండియాలో ఇండియన్లూ తమకన్నా తక్కువ జాతివారనే భావం కలగబట్టే మనదేశంలోనే మనం 'బ్లడీ ఇండియన్స్!'
'మీ దేశంలో భద్రత, రక్షణ వ్యవస్థలమీద మాకు నమ్మకం లేదు ఫొ'మ్మంటే క్లింటన్, బుష్‌ల పర్యటన సమయాల్లో మన సర్కార్లు తలూపాయి. వారి అధ్యక్షుడు పర్యటించే మన కార్యాలయాలు, ప్రదేశాలు అమెరికన్ల అధీనంలోకి వెళ్ళిపోయాయి. మన ప్రధాని, రాష్ట్రపతి ఎవరైనా, ఎప్పుడన్నా న్యూయార్కో వాషింగ్టనో సందర్శిస్తున్నప్పుడు... అదేతరహాలో వారి కార్యాలయాల్ని 'భద్రతా కారణాల దృష్ట్యా' మన దేశం అధీనంలో ఉంచాలని అడిగే సాహసమైనా మన నాయకత్వానికి ఉందా? ఇక్కడైనా అక్కడైనా మన భద్రతకన్నా వారి భద్రతే మెరుగని ఒప్పేసుకోగల చవటాయిత్వం మాత్రమే ఉంది. 'క్లింటన్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన చేతిని' నెలరోజులపాటు కడుక్కోనని చెప్పగల బులపాటమే మన ఎంపీల్లో సైతం బయటపడింది. పౌరుడి ప్రాణానికి విలువలేని ఇండియాలో పుట్టినా మనం ఎలా బతగ్గలుగుతున్నామన్నదే వారికి అర్థంకాని ప్రశ్న. అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించారంటే సరే... ఓ నటికి కూడా అక్కడి దేహరక్షకులతోనే భద్రత కల్పించేందుకు మన ప్రభుత్వాలు ఎలా అనుమతించాయన్నది మనకు అర్థంకాని ప్రశ్న. ఈ దేశంలో కూడా సర్కారున్నది అమెరికన్ల రక్షణపట్ల శ్రద్ధ చూపడానికి మాత్రమేనా అన్నది సమాధానం లభిస్తున్న సందేహం.
ఏంజెలినా జోలి దేహరక్షకుల్లో ముగ్గురిమీద మన పోలీసులు కేసులు పెట్టేసినమీదట... ఇండియాలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని విదేశాల్లో ఎవరైనా భ్రమపడితే వాళ్ళ ఖర్మ. ఏకంగా ఓ విమానం వేసుకొచ్చి మన దేశంలో ఆయుధాల బోషాణాలు జారవిడిచి అదృష్టం బాగోక దొరికిపోయిన విదేశీయుల్ని మన ఘన జన సర్కారు ఏం చేసింది? మొహమాటపడి వదిలేసింది. ఏదో రష్యా, లాత్వియా, బ్రిటన్ లాంటి దేశాల నాయకులు మాటవరసకు అడగ్గానే శత్రువుల్ని, కుట్రదారుల్ని కూడా వదిలేసిన మన ప్రభుత్వాలు... అందచందాల అమెరికన్ తార దేహరక్షకుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టిస్తారా? ఉపప్రధాని, రక్షణమంత్రి వస్త్రాపహరణకు గురైతేనే పొడుచుకురాని రోషం... మన బడిపిల్లల్ని, వాళ్ళమ్మానాన్నల్ని అన్నంతనే ఎగదన్నుకు వస్తుందా? ఆ ముగ్గుర్నీ వదిలేయండని అగ్రరాజ్యం అధ్యక్షులవారు అడక్కపోయినా బేఫరవా! అమెరికానుంచి ఎవరు ఫోన్ చేసినా క్షణమాలస్యం చేయకుండా ఆపని కానివ్వాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకోలేదని ఎవరు చెప్పగలరు? గాంధీపుట్టిన దేశంలో మహోన్నత జాతిని నిర్మించలేని మన నాయకుల్ని ఈ దేశంలో ప్రజలు అనగలిగిందేమిటి..?

(Eenadu,19:11:2006
http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2)
________________________________________________________

Labels: