My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, June 16, 2017

2155~ దేహమును ప్రేమించుమన్న


Labels: , , , ,

Thursday, January 12, 2017

2142~ ప్రేమఅసలైన ప్రేమ


Labels: ,

Saturday, January 07, 2017

2137~ Motivating lined from Mahakavi Sri Sri

కుదిరితే పరిగెత్తు.. ,
లేకపోతే నడువు...
అదీ చేతకాకపోతే...
పాకుతూ పో.... ,
అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు...

ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
 'స్నేహితుడొకడు మోసం చేశాడని,'
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని...
అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప,
దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే
ఎగిసి ఎగిసి పడుతుంటే...  

తలుచుకుంటే...
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా...
నీ ముందు తలదించుకునేలా
 చేయగల సత్తా నీది,
 అలాంటిది ఇప్పుడొచ్చిన
 ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?

సృష్టిలో చలనం ఉన్నది
ఏదీ ఆగిపోకూడదు...,
పారే నది..,
వీచే గాలి...,
ఊగే చెట్టు...,
ఉదయించే సూర్యుడు....

అనుకున్నది సాధించాలని
నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా....,,
ఏదీ ఏది ఆగిపోడానికి
వీల్లేదు..,

లే...
బయలుదేరు...
నిన్ను కదలనివ్వకుండా చేసిన
 ఆ మానసిక భాదల
 సంకెళ్ళను తెంచేసుకో... ,

పడ్డ చోటు నుండే పరుగు
 మొదలుపెట్టు...
నువ్వు పడుకునే పరుపు...
నిన్ను చీదరించుకోకముందే
 బద్దకాన్ని వదిలేయ్... ,
నీ అద్దం....
నిన్ను ప్రశ్నించకముందే
 సమాదానం వెతుక్కో... ,
నీ నీడ నిన్ను
వదిలేయకముందే వెలుగులోకి
 వచ్చేయ్..,


మళ్ళీ చెప్తున్నా...
కన్నీళ్ళు కారిస్తే కాదు...,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని
 తెలుసుకో..

*చదివితే ఇవి పదాలు
 మాత్రమే,
 ఆచరిస్తే...
 అస్త్రాలు.
-SriSri

Labels: , , ,

Monday, January 02, 2017

2126~ ఈ మెసేజ్ Save చేసుకోండి..

దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!

•దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.
అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు?
జీవితమూ ఇంతే అన్నారు.

•సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది.  ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు

•ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

•తూటా కంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు.

•మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు.
సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే,
అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.
కత్తెర లాగా విడదీస్తూ కాదు..

•నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

•నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమష్యల్లేవని కాదు,
వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని…

•స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను,
యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.

•చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు.
ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.

• కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

•ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

•ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే,
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.అదే తేడా…
గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.
ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.
నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

•స్వయంకృషితో పైకొచ్చినవారికి
ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.

Labels: , ,

Tuesday, December 09, 2014

1687- కసి & కృషి


Labels: , ,

Thursday, November 27, 2014

1668- It is not the raw material but it is the value addition that counts!


( 'చివరి కోరిక '  మల్లాది వెంకట కృష్ణమూర్తి)

Labels: ,

Thursday, September 04, 2014

1636- దటీజ్ బాపు !


Labels: , , , , ,

Sunday, July 06, 2014

1549- సర్వ ధర్మ పరాయణం (సువర్ణ , రజత , ప్లాటినం సూత్రాలు)

- మల్లాది హనుమంతరావు 
పరాయణం అంటే సర్వోత్తమమైన ఆశ్రయం, గమ్యం అని అర్థం. అయనం అంటే ఆధారం, ఆశ్రయం, నివాసం, ద్వారం అని అర్థాలున్నాయి. పర-అయనం అంటే ఉత్కృష్టమైన గమ్యం, ఆశ్రయం! సర్వ ధర్మాలకు పరాయణమై, సర్వ ధర్మ మార్గాల్లో అత్యుత్తమమైన మార్గం అని చెప్పే ధర్మం ఒకటి ఉంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ఇది మహాభారతం శాంతిపర్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది.

మహా భారత యుద్ధం పూర్తయిన తరవాత, భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన వసిష్ఠ శిష్యుడు, ధర్మశాస్త్ర విశారదుడు. సర్వ విద్యలకూ ఆయన ఆశ్రయం. రేపు ఉత్తరాయణం రాగానే ప్రాణత్యాగం చేయాలని ఎదురుచూస్తున్నాడు. ధర్మరాజు బంధుమిత్ర పరివార సమేతంగా తాతగారి దగ్గరకు వెళ్ళి సుదీర్ఘమైన, అత్యద్భుతమైన ధర్మచర్చలు చేస్తాడు. ఈ చర్చల సారాంశంగా భీష్ముడు ధర్మరాజుకు ఒక్క ధర్మం బోధిస్తాడు. అది బాగా లోక ప్రసిద్ధమే అయినా తరచుగా మననం చేసుకోదగిన ధర్మం.'ధర్మ సర్వస్వ నైజ స్వరూపం' కరతలామలకంగా ఒక్క మాటలో చెబుతాను, విను' అని భీష్ముడు ఈ అతి ముఖ్యమైన ధర్మాన్ని బోధిస్తాడు. ఇతరులు ఏమేమి చేస్తే తన మనసుకు కష్టంగా ఉంటుందో, తాను ఇతరులకు అవి చేయకుండా ఉండటం గొప్ప ధర్మమార్గాల్లో అన్నిటికన్నా విశిష్టమైంది. ఇది సర్వధర్మాల సంగ్రహ రూపం.

ఒక విచిత్రమేమిటంటే ఈ ధర్మం ప్రపంచంలో ఉన్న ప్రధాన మత సంప్రదాయాలు అన్నింటిలోనూ కనిపిస్తుంది. బౌద్ధ, జైన, యూదు, పార్సీ, క్రైస్తవ, మహమ్మదీయ మతాల మత గ్రంథాలన్నింటిలోనూ ఈ సూత్రం కనిపిస్తుంది. అన్ని మత సంప్రదాయాల్లో దాదాపు ఒకే రూపంలో కనిపించే ఒకే ఒక్క ధర్మసూత్రమూ ఇదే.

 'ఏ వ్యవస్థలోనూ ఇతరులను నొప్పించటమనేది న్యాయమూ ధర్మమూ కాజాలదు' అన్నాడు సోక్రటీస్‌. అది సత్యమే కదా?
'నువ్వు ఇతరులకు ఏం చేశావో, వాళ్లు నీకు అదే చేస్తారు, సిద్ధపడు!' అని హెచ్చరిస్తాడు సెనెకా అనే వేదాంతి.
 'నీకు అప్రియంగా నువ్వు భావించేదాన్ని, ఇతరుల మీద రుద్దకు' అంటాడు కన్‌ఫ్యూషియస్‌ అనే చైనా దేశపు విజ్ఞాని.
 'నేను ఎలాంటివాడినో ఇతరులూ సరిగా అలాంటివారే. వాళ్లు ఎలాంటివారో నేనూ సరిగ్గా అలాంటివాడినే' అనే సూత్రం గౌతమ బుద్ధుడి బోధల్లో కనిపిస్తుంది.  'అవతలివాళ్లను నీతో పోల్చుకొని వారూ నీ వంటివారే అని గమనించు. చంపవద్దు, హింసించవద్దు' అంటుంది 'ధమ్మపద' అనే బౌద్ధ మత గ్రంథం.

'ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకొంటావో వాళ్లకు నువ్వూ అదే చెయ్యి' అనేది బైబిల్‌ బోధించే ముఖ్యమైన ధర్మ సూత్రాల్లో ఒకటి. 'నీతోటివాడిని నీలాగే ప్రేమించు!' అని బోధిస్తుంది పాత నిబంధనల పుస్తకం.

'స్వర్గానికి వెళ్లేందుకు తేలిక మార్గం ఏదైనా తనకు బోధించ'మని ఒక శిష్యుడు మహమ్మద్‌ ప్రవక్తను అడిగితే, 'ఇతరులు నీకు ఏం చేస్తే బాగుంటుందో, అది నువ్వు ఇతరులకు చెయ్యి, వాళ్లు నీకు చేసేవాటిలో నీకు నచ్చనివి నువ్వు వాళ్లకు చెయ్యకు!' అన్నాడట.

ఇలా అన్నీ మతాల బోధనల్లోనూ కనిపించే ధర్మసూత్రం కనుక దీన్ని 'సువర్ణ సూత్రం'(గోల్డెన్‌ రూల్‌) అన్నారు. 'ఇతరులు నీకేది చేస్తే నీకు బాగుంటుందో, అది వాళ్లకు నువ్వు చేయి' అనేది ఈ సూత్రం సకారాత్మక రూపం.
చెయ్యవలసిన విధిని చెబుతున్నది. ఇది సువర్ణ సూత్రం. భారతంలో చెప్పినట్టు, 'ఇతరులు ఏం చేస్తే నీకు అప్రియంగా ఉంటుందో, అది వాళ్లపట్ల నువ్వు చెయ్యకు' అనేది నకారాత్మక రూపం. చేయకూడని పనిని నిషేధరూపంలో చెబుతుంది. దీన్ని 'రజత సూత్రం'(సిల్వర్‌ రూల్‌) అనటం కద్దు.

ఈ సువర్ణ సూత్రంతో విభేదించే ప్రముఖులూ ఉన్నారు. జార్జి బెర్నార్డ్‌ షా ఇలా చమత్కరిస్తాడు- 'ఇతరులు నీకేం చేస్తే నీకు బాగుంటుందో, అది నువ్వు వాళ్లకు చెయ్యటం ఎప్పుడూ వివేకవంతమైన మార్గం కాదు సుమా! నీకు నచ్చింది వాళ్లకు నచ్చాలని ఎక్కడుంది?'

'నిరాశావాదులు, పిడివాదులు తమకున్న విలువలు, నమ్మకాలతో ఈ సూత్రాన్ని పాటించకపోతేనే ఇతరులకు మేలు. అందుకే ఈ సువర్ణ, రజత సూత్రాలకు తోడుగా 'ప్లాటినం సూత్రం' అన్న పేరుతో ఒక కొనసాగింపు ఉంది. 'నీకేది బాగుంటుదో అది ఇతరులకు చేయడం కాదు. వాళ్లకేది బాగుంటుందో చక్కగా ఆలోచించి, అది వాళ్లకు చేయి!'
(అంతర్యామి , ఈనాడు , ఆదివారం జూలై, 2014)
________________________________

Labels: , , ,

Friday, July 04, 2014

1542- మంచి & చెడు


Labels: , ,

Saturday, March 22, 2014

1380- '-మాతరం'

_

_____________________
(1)అలనాటి స్వాతంత్ర యోధుల నినాదం- 'వందేమాతరం'
(2)ఈనాటి రాజకీయ నేతల నినాదం- 'బందే'మాతరం
(3)తాగుబోతు, రౌడీముఠాల నినాదం- 'మందే'మాతరం
(4)హోటల్ యజమానుల నినాదం- 'విందే'మాతరం
(5)ఈనాటితారల నినాదం- 'నందే'మాతరం
(6)కుఱ్ఱకారు/ఫాస్ట్ కల్చర్/
ఆడుతూపాడుతూ చేసే నినాదం- 'చిందే'మాతరం
(7)ప్రతిపక్షాల నేతల నినాదం- 'నిందే'మాతరం
(8)గుక్కెడు నీళ్ళకోసం ఆడవారి నినాదం- 'బిందే'మాతరం

(ఆంధ్రభూమి, 27:06:2002)

____________________________________

Labels: , , , ,

Tuesday, March 18, 2014

1373- లాభం, నష్టం & స్వార్థం:


______________
"అసలు మనిషికి నష్టం ఎందుకు కలుగుతుంది?
లాభం ఆశించటం వలన!
నువ్వు ఏదైతే నీదనుకొన్నావో, అది నీదికాకపోవటమే నష్టం. ఎక్కడైతే "స్వార్థం" లేదో అక్కడ "నష్టం" లేదు.
ఈ ప్రపంచంలో 'నిస్వార్థం' అనేది ఏదీ లేదు. సహేతుక స్వార్థం, సాధారణ స్వార్థం, నిర్హేతుక స్వార్థం అని మూడు ఉన్నాయి.
ఇద్దరికీ లాభం వచ్చే స్వార్థం సహేతుకం. కేవలం తన లాభం చూసుకోవటం సాధారణ స్వార్థం. తన లాభం కోసం అవతలివారికి అన్యాయం చేయడం నిర్హేతుక స్వార్థం."
 

(విజయానికి ఆరో మెట్టు- యండమూరి వీరేంద్రనాథ్)
____________________________________

Labels: , , , , ,

Wednesday, March 05, 2014

1358- ఇళ్లలో ఇంద్రచాపాలు!

వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా, హుందాతనానికి నిదర్శనంగా భాసించే చీరకట్టుతోనే లలనల అందచందాలకు ఇనుమడింపు. ప్రకృతి సౌందర్యాన్నీ ఆకృతి ప్రత్యేకతనీ మేళవించిన ముదితల అలంకరణ 'అరవిచ్చిన విరజాజుల/ చిరునవ్వుల కలికి సిగ్గు సింగారమ్ముల్‌/ సరికొత్త చీర మడతల/ మరుగున చెరలాడ' ప్రతి చూపరి హృదినీ రాగరంజితం చేస్తుంది. వేల వత్సరాల చరితను తనలో ఇముడ్చుకొన్న రెండక్షరాల 'చీర' భారతీయ విలక్షణతకే కాక సంప్రదాయ వస్త్రవిశిష్టతకూ సిసలైన ఉదాహరణ. కవి భావన ఉప్పొంగినట్లు 'భారత అంగనామణి శభాషని మెచ్చెడు సంప్రదాయ మొ/ప్పారగ కుంకుమాంకిత శుభావహమౌ వదనారవిందమై/ చీరను గట్టి లక్ష్మీకళ జిల్కుచు' నయనానందకరంగా ఆకట్టుకుంటాయి కట్టూబొట్టూ! సింధు నాగరికతలో, గ్రీకు-రోమనులనాటి వేషధారణలో, అజంతాది శిల్పకళాకృతుల్లో ప్రతిఫలించిన చీరల వన్నెచిన్నెలు వూహకైనా అందేవి కావు. పురాణయుగాల నార చీర నుంచి అత్యాధునిక కాల వస్త్రప్రపంచందాకా మార్పుచేర్పులు అనేకం చోటు చేసుకున్నాయి. ఇంటా బైటా, నిలయాలూ ఆలయాలూ, పండుగలూ వేడుకలూ, విందులూ విహారాలూ, సంస్థలూ సంఘాల కార్యక్రమాల్లో చీర సొగసు చూడతరమా? ధరించినవారినీ దర్శించినవారినీ ఒకేరకంగా మెరిపించి మురిపించే చీరకట్టు వాస్తవానికో కళ, శాస్త్రం. 'పాద పంకజములకు పారాణి అద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనం/ నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి'- ఆ సోయగాలకు అదనపు ఆకర్షణలు. కాంత పైట జిలుగు, కుచ్చిళ్ల కులుకు సొబగు అంతగా మైమరపిస్తుంటే ప్రియకాంతుడికి ఆ భామ అయస్కాంతం కావడంలో వింతేముంది? 'సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీరగట్టి' సఖుని ఎదుట సరాగాలు ఆలపించిందో సుందరాంగి. 'కొప్పున మల్లెపూలు, జడ కుప్పెలు, బంగరు పట్టుచీర'తో విభుని అలరించిందో భార్యామణి. అమందానంద కందళిత హృదయారవిందుడైన పతిదేవుడు ఆ కులుకు మిటారి తళుకులొలుకు పయ్యెద నీడన సేదతీరకుండా ఉంటాడా? 'అందెనైతే గదా అరవింద ముఖి! నిన్ను చేరి నీ పదసేవ చేయుచుందు/ కోకనైతే గదా కోమలి! నీ ఘన జఘనోరు సౌందర్య సరణి గందు' అని ముద్దుపళని కావ్యపురుషుడు పడిన తపనే ఇక్కడా పునరావృతమవుతుంది. విభిన్న సందర్భంలో- నాయిక చిలిపి కయ్యానికి దిగేసరికి, తటాలున ఆ చీర అంచుల్ని చేతపట్టి తన వైపు తిప్పుకోబోయాడు నాయకుడు. 'అబ్బ ఉండండీ' అంటూ తప్పించుకొనే యత్నంచేసిన ఆ కోమలాంగి విసురుపాటు వేళలోనే ఒంటిమీది అద్దాలచీర మరీ మిలమిలలాడింది. 'పోతన చరిత్రము' నాయకురాలు కట్టిన తెలి పట్టు పట్టపు ఉడుపు విజయకేతనంలా రెపరెపలాడిందట. ఆ మనోహరి చీర చెంగావి అంచులు అతిలోక రసవంతాలైన వసంతాలనే చిత్రించాయి. వలపుల రేరాణి పువ్వులాంటి తెల్లచీర కట్టుకుని, పాదాలకు పారాణి అలంకరించుకొని కదిలొస్తుంటే 'కలహంస చలన విలాస లాస్యమా' అనిపించింది ఒకానొక నాయకాగ్రణికి! మనసూ మమతా కలబోసిన ఏ కల(ల)నేత అయినా రసాధిదేవతకు సిరిజోతే అవుతుంది మరి. వధువుకు ఒడికట్టు బియ్యమిచ్చేది, వరుడితో కొంగుముడి బిగించేదీ చీరతోనే. ఆడపిల్లను అత్తవారింటికి పంపుతూ 'రస ప్రసార రుచిర ప్రసరంబుగ' కన్నవారు అందించే చీరసారెలు ఆ ఇంతి మనోబలాన్ని ఇంతింతలు చేస్తాయి. చీర అంచు కుచ్చిళ్లు తళతళలాడటమే వనితలకు కళకళ. ముంగాళ్లమీదుగా జీరాడే పరికిణీలతో గలగల తిరగటం అమ్మాయిల పర్వదినోత్సాహానికి సూచిక. పానుగంటి పుటల్లో వినిపించే గాజుల గలగల, అందెల ఝుణఝుణలే కావు; కనిపించే బనారసు కోకలు, బరంపురం పీతాంబరాలూ బహు రమ్యాలు. గద్వాల చీరలు కట్టుకున్నవారంతా కదలాడే తారలంటోంది సాంస్కృతిక గీతిక. వర్ణవైవిధ్యాల వలువలతో ఒంటికి సొంపు, కంటికి ఇంపు ఉంటుందంటుంది హృదయభావ వీచిక. క్లుప్తంగా చెప్పాలంటే- చీర నారీభూషణం!
'చెంగావి చీరలు కొంగులు చెంగున/ జారంగ రంగైన నవమోహనాంగీ' అని వినవస్తుంటే పులకించని మది ఉండదు. నిండైన చీరకట్టు గొప్పతనమైనా, జిలుగు పైట నీడలోని పరవశమైనా, ఓణీ పరికిణీల పరవళ్లయినా... వేటికవే ప్రత్యేకం. 'వీరాంగనలైనచో నడుములన్‌ బిగచుట్టి పరాక్రమంబు లెస్సం కురిపించు చీరలు' మహిళామణుల సహజ వనరులు. పల్లె పొలాల గట్లమీద పడుచుల కట్టు వేరు. పరిణయ తరుణాన పట్టుచీరల రెపరెపలది మరో తీరు. సింగారం దారంగా, అందాల రంగులే అద్దకంగా వెలసే నేత చీరలది ఇంకొక రీతి. మగ్గాలమీద నేసే వస్త్రాల్లో రంగు హంగులతో పాటు పనిమంతుల కళాచాతుర్యమూ కలబోసి ఉంటుంది. ఆ గ్రామీణ నైపుణ్యాన్ని గమనించటమంటే, అనల్ప శిల్పసౌందర్యాన్ని సాంతం సొంతం చేసుకున్నట్లే. ఉక్కపోతలో వింజామర అయ్యేదీ, చలీ వానా ఎండల్లో తల రక్షణ ఇచ్చేదీ చీరకొంగే. చీరనే మెత్తటి బొంతగా చేసి, బుజ్జితల్లినో చిన్నితండ్రినో బజ్జోపెడుతుంది తల్లి. 'చీర ఉయ్యాలలోని చిన్ని శిశువు... తల్లిజోలకు హాయిగా ఉల్లమలర' విశ్రమించడమూ సహజమే. ఆ పసిపాపే కాస్తంత పెద్దయ్యాక 'తనకంటె పొడుగు చీరను/ తన మేనికి చుట్టుకొనుచు, తన చేతులకున్‌/ కొనలందక కలతపడేటి' సన్నివేశం నేత్రపర్వం. పుత్తడిబొమ్మ పట్టుచీర కడితే 'నీ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ' అన్న చలనచిత్ర కవి వర్ణనా అత్యంత ఉల్లాసభరితం. సప్తవర్ణ తోరణాలుగా వెల్లివిరిసే చీరలతోనే అందాలూ ఆనందాలూ. కనువిందుచేసే ఆ ఇంద్రధనువులు ఎక్కడో గగనంలో కాదు, ఇక్కడే గృహసీమల్లోనే ప్రభవించటం సదా రమణీయం, బహుధా మననీయం.
(ఈనాడు, 26:01:2014)
________________________

Labels: , , ,

1357- అన్నప్రసాదం!

కుబేరుడికైనా కుచేలుడికైనా క్షుద్బాధ ఒక్కటే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్దలన్నదీ అందుకే. లోకంలో బాధలు అనేకమున్నా, కవిహృదయం ఏనాడో తేటతెల్లం చేసినట్లు 'దురంత దుఃఖకర ఆకలిబాధ భరింప అశక్య'మన్నది ప్రత్యక్షర సత్యం. మనిషికే కాదు, సృష్టిలో ప్రతిప్రాణికీ ఆకలిదప్పులూ తిండితిప్పలూ తప్పవు. 'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి చెప్పినా, 'ఆకొన్న కూడె అమృతము' అంటూ సుమతీ శతకకర్త చాటినా- సారాంశమొకటే, అన్నం ప్రాధాన్యం లెక్కకట్టలేనిది. 'అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడు మేతబెట్టె/వన చరాదులకు భోజనమెవ్వడిప్పించె?' అని కవిగళం గుప్పించే ప్రశ్నలకొచ్చే జవాబుల్లో ఆస్తిక నాస్తిక తేడాలుండొచ్చు. మనిషి ఆకలి తీర్చే నాథుడెవరన్నప్పుడు వచ్చే సమాధానం- సాటి మనిషే! 'తల్లి పెట్టు తియ్య తాయిలములన్నియు తోటి బాలకులకు పంచిపెట్టిన' ఆర్ద్రహృదయుడు బాల గౌతముడు. 'ఉపకారము తలచని కఠినాత్ముడు ఉండి వ్యర్థము, మదిలో/ చపలత వీడక వ్రతములు తపములు జేయుట వ్యర్థము' అన్న హితోక్తి అర్థపరమార్థాలు గ్రహించి వ్యవహరించే మానవుడే మాధవుడన్నది సర్వజన సమ్మతం. అరణ్యవాసకాలంలో ధర్మజుడు తనవెంట ఉన్నవారి భోజనార్థం సూర్యభగవానుణ్ని ప్రార్థించి అక్షయపాత్ర సంపాదించాడు. ఎంత వడ్డించినా ఇంకా నిండుకుండలా ఉన్నందునే, అది ఎందరెందరి ఆకలినో రోజూ తీర్చగలిగేది. అక్షయగుణ సంపన్నత ఆ పాత్రలో ఉందా, లేక ధర్మరాజు ధర్మబుద్ధిలోనే అది ఉందా అన్నదొక్కటే కీలకం. 'ఖ్యాతి చేకూరు, దీనులకు అన్నదానమిడు పుణ్యప్రాణికిన్‌' అని పలికిన ప్రౌఢకవి మల్లన మాటనే బాటగా మలచుకుంటే, మానవజన్మకు అంతకుమించిన సార్థకత వేరొకటి ఉండదు! ఉపకారబుద్ధికి ప్రకృతే ప్రతీక. 'తరువులతి రస భార గురుత గాంచు/ నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు/ డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము' అన్నట్లు ప్రకృతిమాతే సమర్పణశీలతకు నిదర్శనం. పండ్ల బరువుతో వంగే చెట్ల కొమ్మలకు చేతికి అందుబాటులో ఉండటం తెలుసు. గగనసీమలో షికారుచేసే మేఘాలకు వర్షించటమే తెలుసు. తోటివారికి ఇవ్వటంలోని సంతృప్తి, సంతోషం మనసునిండా ఉన్నప్పుడు మానవుడూ అంతే. పోషక సమృద్ధమైన గంజిని దారిపక్క కాలువపాలు చేయటంలో మానవత లేదు. ఆ వృథాను అరికట్టడంతో పాటు, అన్నమూ జతచేర్చి ఆర్తులకింత అందించటంలోని ధన్యతా అంతా ఇంతా కాదు. జాషువా కవినేత్రం తిలకించిన భారతంలో 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు' వారెందరో ఉన్నారు. 'దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్పని'వారి తత్వమే భాగ్యవిహీనత్వమన్న ఆయన వాదం సంపూర్ణ హేతుబద్ధం. కాస్తంత తిండి దొరక్క అల్లాడిపోయిన దుర్భర అనుభవం నాడు గుణనిధికి ఎదురైంది. చేతికందిన ఆహారం నోటిదాకా చేరని వైనాన్ని తలచుకుని కుమిలిపోయిన దీనదశ అతడిది. 'అన్నం అమృత రూప'మని శ్రుతులు, 'పరమాత్మ స్వరూప'మని స్మృతులు చాటాయి. అన్నపూర్ణగా ఆరాధించి, 'సుఖీభవ'గా ఆశీర్వదించి భారతీయతను వేనోళ్ల కీర్తించిన ఘనచరితా మనకుంది. 'దానమునకు అధికమైన ధర్మము కలదే' అని హరిభట్టు, 'కరమున నిత్యాన్నదానము సురుచిర భూషణము' అంటూ భర్తృహరి ప్రస్తుతించిందీ దానగుణశీలతనే. దానమివ్వనివాడు ధన్యుడు కాడని, కాలేడని స్పష్టీకరించిన సుద్దులూ చాలా ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నా ఎన్నో తెలిసినా, ఎక్కడో ఏ మూలనో- ఇవ్వటానికి చేతులురాని వైనం, ఉన్నదాన్ని తెలిసో తెలియకో వృథాచేసే నైజం దాపురించింది. స్థానికమో ప్రాంతీయమో జాతీయమో కాదు... ఈ పెనుజాడ్యం ప్రపంచవ్యాప్తం!
'వృథా చేయబోకు, జన్మము సదా రాదు నీకు' అని తెలిసినవారున్నా అన్నార్తులకు లభిస్తున్న ఉపశమనం కొంతే. మాటలూ చేతలకు అంతరాలున్నచోట 'కాగితమ్ము లిచట కరిపించువారు శి/క్షింపబడుదు' రని లిఖించి పెద్ద/కాగితమ్ము గోడకంటించె దొరగారు' తరహా వ్యవహార సరళీ ప్రమాదమే. చెప్పింది చేయటం, చేసిందే చెప్పటం సమర్థ శక్తివనరుగా ఉత్తమ ఫలితాలనిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న భావన, బాధ్యతాయుత వర్తన ఇళ్లు, భోజనశాలలు, విందులు, ఉత్సవాల్లో వెల్లివిరియాల్సి ఉంది. 'ఎంత తింటావో అంతే వడ్డించుకో... తిన్నంత తిని, మిగిలిందంతా పారేసే అలవాటు మానుకో' అంటూ అవ్వలూ తాతయ్యలూ, అమ్మానాన్నలు చెప్పే మాట ఇప్పుడు ఎంతమందికి చెవికెక్కుతుంది? భోజనవేళ విధివిధానాలు, నియమనిబంధనలు ఉన్నట్టే వృథాను పరిహరించాలన్నదీ ఓ విధానం, నిబంధన. 'కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు/ బహువిధారిష్టముల భస్మీపటలమొనర్చు' జీవితమే జీవితం. అది సకల వృథాల నివారణ, సర్వవనరుల సద్వినియోగంతోనే పరిపూర్ణమవుతుంది. విశ్వమంతటా అనునిత్యమూ లక్షల టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దేశదేశానా ఒకవంక ఆకలికేకలు మిన్నంటుతుంటే, మరోవైపున వ్యధార్తుల కంట రక్తాశ్రువులు చిందిస్తూ అన్నపానీయాల వృథా విచ్చలవిడిగా సాగుతోంది. తగినన్ని రవాణావసతులు లేక కొంత, గోదాముల్లో అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా మరికొంత- దాపురించిన దుస్థితి ఇది. ఎక్కువగా వడ్డించుకొని చివరికి కుప్పతొట్లలో పారేసే పంచభక్ష్య పరమాన్నాల తీరు మరింత బాధాకరం. పొలం నుంచి పళ్లెంలోకి, అక్కడినుంచి నోటికి చేరేలోగా ఎంతెంత వృథా! వీటన్నింటితో కోట్లమంది నిరుపేదల కడుపు నింపవచ్చని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఐరోపా సంఘం ప్రకటించిన 'ఆహార వృథా వ్యతిరేక సంవత్సరం' ముగింపు దశకు చేరుకుంది. నేటికీ దురవస్థ మారటం లేదంటే- 'నరుడి నెత్తిమీద రుద్దిన దరిద్రం/ అది ఎప్పుడో కట్ట తెగే సముద్రం' అన్న కవి హెచ్చరికకు రూపం వస్తున్నట్లేగా!
(ఈనాడు, 15:12:2013)

___________________ 

Labels: , , , ,

Sunday, February 23, 2014

1350- సంబురాల తెలంగాణ!

https://lh5.googleusercontent.com/-tnHtRxNdCPY/Ufd5nNddHsI/AAAAAAAAjM4/Fn2CaSV2rr8/s288/Telangan-state.jpg

సుమారు నాలుగు కోట్ల స్వరతంత్రులతో కోటి రతనాల వీణ సంబురాల సరిగమలు పలుకుతున్న వేళ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో తెలంగాణవాదుల దశాబ్దాల కల ఫలించబోతోంది. రాష్ట్రపతి మొహరు పడటమే తరువాయి, దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ తళుకులీననుంది. లక్షా 14వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 3.52కోట్ల(2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభాతో తెలంగాణ దేశంలో పదకొండో అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తోంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా నాలుగో స్థానంనుంచి ఆరోస్థానానికి, జనసంఖ్య పరంగా అయిదునుంచి పదోస్థానానికి పరిమితం కానుంది. 'అయిదున్నర దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండు చరిత్రను, తాము సాగించిన విస్తృతస్థాయి సంప్రతింపులను పరిగణనలోకి తీసుకొని ముందడుగేశా'మని నిరుడు జులై చివరివారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించినప్పటినుంచి, నేటిదాకా విభజన ప్రక్రియ అంతా- ఉద్విగ్నత, ఆవేశోద్రేకాల సమ్మిళితంగానే సాగింది. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా యాభై ఏడేళ్లక్రితం ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ విభజన అంశం ఎంత సున్నితమైనదో 2009 డిసెంబరులోనే కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలిసివచ్చింది. పార్టీలు సైతం ప్రాంతాలవారీగా చీలిపోయిన విపత్కర వాతావరణంలోని భావోద్విగ్న తీవ్రతలను గుర్తించి- ఈ ఆరున్నర నెలల కాలావధిలో సర్వామోద పరిష్కారానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండాల్సింది. ఆ పని చెయ్యని హస్తం పార్టీ అధిష్ఠానం- 2006లోనే ప్రత్యేక తెలంగాణకు 'సై' అన్న భాజపానూ విశ్వాసంలోకి తీసుకోలేకపోయింది. పర్యవసానమే, పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టడం నుంచి రాజ్యసభలో ఆమోదం పొందేదాకా అనుక్షణం ఎడతెగని ఉత్కంఠ; అయిదు కోట్లమంది ప్రయోజనాల్ని అసలేమాత్రం పట్టించుకోలేదంటూ సీమాంధ్రుల్లో తీవ్ర భయాందోళన. 'తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి' అన్నట్లు కేంద్ర సర్కారు అడుగడుగునా అప్రజాస్వామికంగా వ్యవహరించిందనడంలో మరోమాట లేదు. విపక్షాల అభ్యంతరాలన్నీ ఎగువ సభలో వీగిపోయిన నేపథ్యంలో, నవతెలంగాణ శిశూదయాన్ని స్వాగతించాలిప్పుడు!

వేర్వేరు పరగణాల్లో ఉన్న తెలుగువారంతా ఒక్కతాటిమీదకు వచ్చితీరాలన్న సమైక్య భావకాంక్షకు ఫలశ్రుతి- ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం. ఇప్పుడు తెలంగాణ వేర్పాటుకూ అలుపెరుగని ప్రజాందోళనే కారణం. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదిక అయింది. కాకతీయుల కాలంలో కలిసి ఉన్న ఆంధ్రులు మళ్ళీ భారత రిపబ్లిక్‌లో ఏకమయ్యారన్న ఆనందానుభూతుల్ని అంతలోనే ఆవిరి చేసేలా ఒప్పందాల ఉల్లంఘనలు తెలంగాణవాదుల్లో అపనమ్మకాన్ని పెంచాయి. సమైక్య రాష్ట్రం ఏర్పడిన పదమూడేళ్లకే వేర్పాటువాదం రాజుకోవడానికి పాలకుల తప్పిదాలే పుణ్యం కట్టుకొన్నాయి. 1973లో ప్రధానిగా ఇందిర ప్రతిపాదించిన ఆరుసూత్రాల పథకం అమలు సైతం వివాదగ్రస్తమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కూర్పు బేషరతు కాదని, విద్యా ఉద్యోగాలు పారిశ్రామిక ప్రగతి సేద్యరంగం వంటివాటన్నింటా తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందన్న ఆక్రోశం తెలంగాణ వేర్పాటు కాంక్షలకు ఎరువవుతూ వచ్చిందని తెరాస సిద్ధాంతకర్తగా జయశంకర్ లోగడే స్పష్టీకరించారు. పదమూడేళ్ల క్రితం తెలంగాణ సాధనే లక్ష్యంగా తెరాస స్థాపించిన బక్కమనిషి కేసీఆర్ ఉక్కు సంకల్ప దీక్షా దక్షతలతో ప్రజాకాంక్షకు ఉద్యమ రూపమిచ్చి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో శ్రేణుల్ని కదం తొక్కించారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినప్పుడు కూడా సమైక్యవాదం వినిపించిన సీనియర్ రాజకీయవేత్త చెన్నమనేని రాజేశ్వరరావు ప్రత్యేక తెలంగాణ అవసరం ఎందుకొచ్చిందో తెలుగుదేశం తరఫున సాగించిన అధ్యయనంలో వివరించారు. వైఎస్ పాలన, అర్ధశతాబ్ది ప్రత్యేక తెలంగాణ వాదనను రెట్టింపు చేసిందని, భూముల్ని తెగనమ్మడం, 'సెజ్'ల దోపిడి, నదీజలాల తరలింపు తదితర ఏకపక్ష నిర్ణయాలు తెలంగాణ ప్రజల్ని ప్రత్యేకబాట పట్టిస్తున్నాయని ఆరేళ్లక్రితమే వాస్తవాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మనసుల్లో తాము విచక్షణకు, దాష్టీకానికి గురి అవుతున్నామన్న భావన తీవ్రమైన ఆవేశకావేషాల దశకు చేరుకుందని, ప్రత్యేక తెలంగాణ డిమాండు పూర్తిగా అన్యాయమైనదేమీ కాదని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ స్పష్టీకరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించిన పక్షంలో భిన్న ప్రాంతాలవారి భయాలు ఆందోళనల్ని పరిగణనలోకి తీసుకొని వారికి భరోసా కల్పించాలనీ సూచించింది. ఆ భరోసాల అంశంలోనే కేంద్రప్రభుత్వం దాగుడుమూతలు, లేనిపోని వైమనస్యాలను పెంచాయని చెప్పక తప్పదు!

ఒక జాతి కట్టుబాటును మతంకన్నా ఎక్కువగా భాష శాసిస్తుందని, అందుకు తానే ఉదాహరణ అనీ ఉపఖండంలో భాషాప్రయుక్త దేశంగా బంగ్లాదేశ్ చాటింది. బంగ్లాదేశ్ విజ్ఞప్తి మేరకు ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని 'యునెస్కో' నిర్వహిస్తోంది. ఈసారి మాతృభాషా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్ విభజన మరో గుణపాఠం నేర్పుతోంది. ఓ జాతి కట్టుబాటుకు భాషా ప్రాతిపదిక ఒక్కటే సరిపోదని, అంతకుమించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంక్షలకు గొడుగుపట్టే సుపరిపాలన మరెంతో అవసరమనీ పాలకులు తెలుసుకోవాలి. 'సంబంధిత అన్ని వర్గాలతోనూ తగిన చర్చలు, ఏకాభిప్రాయ సాధన, సరైన సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పరిశీలన' అన్నవి 2004లో తొలి యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలోని ముఖ్యాంశాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలహరణం తరవాత, పదహారో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళే 'సరైన సమయం' అంటూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు హడావుడి చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం- రెండుపక్కలా కడ నిమిషందాకా ఉద్విగ్న వాతావరణాన్ని పెంచి పోషించింది. రాష్ట్రంలో, దేశంలో ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక దశలో తెలంగాణకు అనుకూలత చాటాయి. వాటి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగేస్తే అసలు గొడవన్నదే లేకపోయేది. మూడు ప్రాంతాల మధ్య సామరస్యంగా సయోధ్య సాధించగలిగితే విభజన చేయవచ్చని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీయే సూచించింది. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండే సుహృద్భావానికి ప్రోది చెయ్యాల్సిన కేంద్రప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించింది. పాలకుల రాజకీయ పాచికలు పెంచిన మనస్పర్ధల్ని పక్కన పెట్టి, ఇరువైపులా తెలుగువారి ఔన్నత్యం మరింతగా పరిమళించాల్సిన తరుణమిది. నీటి వనరుల పంపిణీ, విద్యుత్, ఉద్యోగులు, ఉమ్మడి రాజధానిలో కలసి పదేళ్లు పనిచేయడం వంటి అనేకాంశాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాల మధ్య సౌహార్దపూర్వక సంప్రతింపులు తప్పనిసరి. విభజన క్రమంలో భేదాభిప్రాయాల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొంటూ సముజ్జ్వల భవిత నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెట్టపట్టాలు కట్టి సాగాలి!
(సంపాదకీయం, ఈనాడు, 21:02:2014)
__________________________________

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Labels: , , , , , , , ,

Friday, February 21, 2014

1348- Telangana, the 29th State, is real at last

If Jawaharlal Nehru described the integration of Telangana with Andhra in 1956 as the marriage of a reluctant bride, its bifurcation from Andhra Pradesh in 2014 is marred by huge political drama
_______________________________

Hyderabad: The State of Telangana has finally turned real, as the Bill for formation of a separate state was passed by the Rajya Sabha on Thursday evening (the20th of 2014) . The aspirations of the people of the region for a separate State, voiced through endless agitations, suicides and political struggles spread over five decades were fulfilled on Tuesday by the Lok Sabha, which passed the AP Reorganisation Bill.

The demerger of Telangana from Andhra Pradesh, itself the first State to be formed in 1956 on linguistic basis, will lead to the creation of the 29th State with 10 districts, and Hyderabad as the joint capital for 10 years.

The residuary Seemandhra region will have 13 districts.

If Jawaharlal Nehru described the integration of Telangana with Andhra in 1956 as the marriage of a reluctant bride, its bifurcation from Andhra Pradesh in 2014 is marred by huge political drama, enacted by the Congress and the BJP that culminated with an unprecedented passage of the Bill through a voice vote and short discussion behind closed doors in the Lok Sabha.
The acrimonious division of Andhra Pradesh by the Congress-led UPA Government — especially the manner in which it pushed through the Bill since the CWC resolution of July 30, 2013, chaired by Sonia Gandhi — lent a political colour to the whole saga.

The Telangana struggle: A timeline in pictures
The 1969 Separate Telangana movement, championed by the Telangana Praja Samithi (TPS) under Marri Chenna Reddy, who went on to become the CM of AP twice, came closest to realising the dream.

After a lull that lasted two decades, the movement was revived in 2001 by the Telangana Rastra Samithi (TRS), floated by K Chandrasekhara Rao, who quit the TDP after being denied a ministry by Chandrababu Naidu. His political manoeuvring, steadfast approach, including the fast unto death in September 2009, precipitated matters in favour of a separate State.

In the past decade, most political parties — Congress, TDP, CPI and YSR Congress — have tried their best to derive political mileage in successive elections through open alliances with the TRS.
The ‘dithering and delaying’ tactics of the Congress and the dual strategy of the TDP (seeking justice for both regions over the years) have pushed the State into political chaos and affected its economic growth.

The ‘fast track’ decision of the Congress resulted in a counter agitation in the Seemandhra region, reasonably spontaneous and led by local leaders.
The sporadic protests demanding a united AP threatened to rise into a strong movement over 65 days, before it started losing steam with political parties jumping into the bandwagon and trying to hijack it for political gains.
Dissents started brewing and baits of discussions addressing their concerns by the Congress started weakening it.
This led to the constitution of a Group of Ministers to focus on contentious issues such as Hyderabad, river waters, education and power.

Parliament approves Telangana; a new state is born
At another level, TDP chief Chandrababu Naidu launched himself into an all-out effort, lobbying with all national parties, including getting close to the BJP for an alliance. AP Chief Minister Kiran Kumar Reddy projected himself as an integrationist, rallied Congress legislators, threatening to float a separate party, sat on dharna in Delhi, loudly articulating that the party would bite the dust in the State.
YSR Congress chief, YS Jaganmohan Reddy competed with Naidu in trying to gather support for a united Andhra cause and opposed the Centre.
Ultimately, their political scheming and efforts seem to have not yielded fruit. In the end, analysts feel the division has been hastily thrust on a progressive State, instead of amicably settling issues and laying the ground for both States to grow rapidly.

Telangana erupts in joy after passage of Bill in Rajya Sabha
The whole of Telangana erupted in joy as the Bill for formation of a separate state was passed by the Rajya Sabha Thursday evening.
Telangana supporters danced in the streets, burst crackers, splashed gulal (colours), and distributed sweets in Hyderabad, Warangal, Karimnagar and other towns.
Throngs of people visited the Telangana martyrs memorial in Hyderabad.
TRS, which was in the forefront of separate statehood agitations, had made arrangements at its office in Hyderabad for celebrations as activists gathered.
Telangana is set to become the 29th state of the Union with Parliament approving the historic bill to carve the new state out of Andhra Pradesh amid vociferous protests by members from Seemandhra region as also from Trinamool Congress and Shiv Sena.
The suspense over the passage of the Andhra Pradesh Reorganisation Bill 2014 came to an end with BJP eventually backing the government.


Labels: , , , , ,

Friday, February 07, 2014

1337- జననం,మరణం:



జననం- నేలమీద నడక!
మరణం- నేలకింద పడక!!

(జి.ఎస్.ఎస్.ఆర్, స్వాతి వార పత్రిక)
_________________

Labels: ,

Sunday, October 20, 2013

1276-ఎలుగెత్తి పిలిచే వెలుగు


ఆశించటం, అది సాధించేందుకు తపించిపోవటం, పోటీపడీ పోరు సాగించీ విజయానందం అందుకోవటం... జీవితం! ఆ ఆరాటంలో, పోరాటంలో ఉన్న సాధనాలన్నీ వినియోగించి, అన్ని సాయుధబలగాల్నీ మోహరించి వడివడిగా ముందుకు సాగే మనిషికి నాళం కృష్ణారావు కవి దర్శించిన 'పట్టుదల బూని చేయుమా పనులనెల్ల/ కాలమే సమకూర్పగలదు ఫలము' అన్నదే అనుభవానికొస్తుంది. పరిశీలన, అనుశీలన కలగలిసిన వ్యూహరచనతో ఇతర గుణగణాలూ జతకడితే, విజయాలు పరంపరగా సిద్ధించి మానవుణ్ని మాననీయుణ్ని చేస్తాయి. ఏనుగు లక్ష్మణకవి విపులీకరించిన 'ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందు దాల్మియున్/ భూ సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ, మాజి బా/హా పటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధి' ప్రకృతిసిద్ధ లక్షణాలే కాక మానవాళి పాలిట ఆయుధాలూ సాధనాలూ. రాజనందనుడైన సిద్ధార్థుడు నాడు శ్రుతులు, స్మృతులు, సంహితలతో పాటు నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని గడించాడు. అఖిల అస్త్రశస్త్ర రహస్యాలు, తంత్రవాదనల సారాంశాలు, యంత్రవాదాల లోలోని మర్మాలూ గ్రహించి సర్వజ్ఞుడయ్యాడు. 'ఉపాయపూర్వకమగు విపులయత్నము సర్వార్థ సాధకము' అన్నట్లు బాణ ప్రయోగ కళాదక్షుడిగా, ఖడ్గచాలనాది విద్యాపారీణుడిగా వీరాధివీరత్వాన్నీ సొంతంచేసుకున్నాడు. అటుతరవాత భోగభాగ్యాల్ని వదిలి, భార్యాబిడ్డల్నీ వీడి శాశ్వత జ్ఞానసాధన దిశగా తరలివెళ్లిన అతడి మేధోసంబంధ ఆయుధం- తత్వచింతనే!
పూర్వాపరాల ఆలోచన, ప్రత్యేకమైన అభిరుచి, అవిశ్రాంత కృషి కారణంగానే ఫలితం ప్రాప్తిస్తుంది. 'ధనమునకు దానమును, తప/మున కాచారమును, రాజ్యమున కాజ్ఞయు, జీ/వనమునకు యశము, విద్యకు/వినయంబును, నీతులకు వివేకము ఫలముల్' అని పలికిన సుభాషితకర్త అంతరార్థమూ సాధనాల ప్రాధాన్యమే. దానవులతో కలిసి క్షీరసాగర మథనం చేసిన దేవతలు భయాలకు లొంగలేదు, ప్రలోభాలకు దాసులు కాలేదు. అమృతభాండం లభించేవరకూ ప్రయత్నం మానలేదు. కనుకనే కృతనిశ్చయం వదలని నిపుణమతులయ్యారు. నగములు కంపించేలా గగనానికెగసి ప్రత్యర్థుల్ని భయకంపితుల్ని చేసిన గరుత్మంతుడిది రెక్కల బలం. యమధర్మరాజును వెంటాడి, పతి ప్రాణాల్ని తిరిగి దక్కించుకొన్న సావిత్రిది అపార ధైర్యం. 'ధర్మదేవతా, సూర్యచంద్రాదులార/ పంచభూతమ్ములార, దిక్పాలులార/ నన్ను రక్షింపరే నాథునకు వచించి' అంటూ నిండుసభలో సత్యపోరాటం సాగించి గెలిచిన శకుంతలది నిరుపమాన సాహసం. తనయుడు అర్జునుణ్ని ద్వాపరంలో ఆయుధంగా, సాధనంగా మలచింది తల్లి కుంతీదేవి. 'పరమశివుణ్ని ఆరాధించి పాశుపతం సంపాదించు, కదనభూమిలో విజృంభించి విరోధుల్ని నిరోధించు' అని ఆశీర్వదించి పంపింది. 'వెలుగు నిన్ను ఎలుగెత్తి పిలుస్తుంది, చీకటి నీకు దూరంగా నిలుస్తుంది' అంటూ త్రేతాయుగంలో కుమారుడు హనుమను దీవించి జాగృతపరచింది అంజన. 'నీ మాతను వీరమాతను చేయి, నీ జాతికి నవజీవం పోయి' అని కృతయుగంలో ప్రబోధించి బిడ్డను కార్యనిర్వహణ దీక్షాదక్షుణ్ని చేసింది వినత. కర్తవ్యాన్ని విస్మరించి కురుక్షేత్రంలో చేష్టలుడిగి కూర్చున్న ప్రియతముణ్ని 'లెమ్ము ధనుంజయా! విధి బలీయము, న్యాయము గెల్చు, నిల్చు స/త్యమ్ము, నశించు స్వార్థము, సదా యుగధర్మమిదే గదోయి' అని తట్టిలేపిన కృష్ణపరమాత్ముడిదీ కార్యసాధన తత్వమే. 'అంగత్రాణ కృపాణ బాణధరులై యంగమ్ము లుప్పొంగ, దు/స్సంగ స్వార్థ మదేభ కుంభములపై సంగ్రామ రంగమ్మునన్/ సింగమ్ముల్ వలె దూకి' పాండవవీరులు విజృంభించటానికి ఆ చైతన్య సమరభేరే కారణం. సకల శుభాలు, విజయ పరంపరలు ప్రసాదించే దుర్గమ్మ హస్తాలనిండా ఆయుధాలే కనిపిస్తాయి. సదాశయానికి వినియోగించే ప్రతి సాధనమూ ఆయుధమే. అక్షరం, ఆత్మవిశ్వాసం, గుండెబలం, విద్య, వినమ్రత, సమయస్ఫూర్తి... అన్నీ ఆయుధాలే, సాధనాలే. అందుకే 'బలిమి జేయరాని పని యెట్టిదైన/ ఉపాయబలము చేత జేయవచ్చు' అన్నారు 'చిత్రభారతం' కర్త.

సాహసం పథమైనప్పుడు, పట్టుదల ప్రధానమై పౌరుషమే ఆయుధంగా మారుతుంది. 'పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు/ పట్టెనేని బిగియ పట్టవలయు' అని హితవుచెప్పిన వేమన 'పట్టరాని పట్టు పట్టియుండినవాడు/ పుడమిలోన కీర్తి పొందలేడు' అంటూ హెచ్చరికా చేశాడు. ఆయుధ ప్రయోగానికైనా, సాధనాల వినియోగానికైనా పట్టువిడుపులు ఉండాలన్నది మానవ జీవన మంతటా నిండాల్సిన అంతస్సూత్రం. జ్ఞానసాధనమైన మెదడుతో పురోగమిస్తున్న విశ్వం 'శ్రమయేవ జయతే' సిద్ధాంతాన్నీ విశ్వసిస్తోంది. విశ్లేషించి చూస్తే, సంజీవదేవ్ అన్నట్లు 'తెలివిలేని శ్రమ కానీ శ్రమలేని తెలివికానీ అంతగా ఉపయోగపడవు. తెలివి, శ్రమ... రెండూ కలిసినప్పుడే ఏ పనిలోనైనా సఫలత'. కార్యసాఫల్యానికి కావాల్సింది సమాచరణ. వెనుక కాచుకుంటూ, ముందు చూసుకుంటూ సజావుగా పని సాగించటంలోనే జీవిత పరమార్థముంది. జగజ్జనని దుర్గను విజయదశమి అరుణోదయ వేళలో ఆరాధించిన జిజియా- బాలశివాజీకి చేసిన ఉద్బోధా అదే. మహాకాళి మృగేంద్ర వాహనమెక్కి కదిలి దనుజ మర్దన జరిపిన మహత్తర దినమే దశమి. 'పంచతంత్రం' కర్త తేల్చిచెప్పినట్లు 'లోకంలో సమర్థులకు అసాధ్యమన్నదే ఉండదు'. పనినే ఆయుధం, సాధనం చేసుకొని ప్రతివ్యక్తీ కదిలినప్పుడు ఆశాజ్యోతి జ్వలిస్తుంది, సాధన నిలుస్తుంది, తపస్సు ఫలిస్తుంది !

(ఈనాడు ,13:10:2013)
____________________

Labels: , , ,

1275- తెలుగు జాతిరత్నం




శోకం- శ్లోకం పలికితే రామాయణం. ఆకలి- అక్షరాభ్యాసం చేస్తే తెలుగువారికొక జ్ఞానపీఠం! పనసపండు తన రహస్యాన్ని పరిమళం రూపంలో చెప్పినట్లుగా, రచయితలు తమ ఆకలిని అక్షరాల రూపంలో ఈ లోకానికి వివరిస్తారు. అక్షరాలతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్షరాలతోనే ఆత్మారాముడు తృప్తిచెందినట్లు భావిస్తారు. అక్షరాలకు అంజలి ఘటిస్తారు. తమ నుంచి అక్షరాలను వెలువరిస్తోంది కనుక ఆకలినీ గౌరవిస్తారు. 'ఆకలి నా రచనలకు ప్రేరణ' అని సగౌరవంగా ప్రకటించడంలో రావూరి భరద్వాజ స్ఫురద్రూపిగా కనిపిస్తారు. ఆకలి ఆయనను జ్ఞానిని చేసి పై మెట్టుపై కూర్చోబెట్టింది. జ్ఞానపీఠాన్ని కట్టబెట్టింది. ఆకలిని గౌరవించడమంటే అట్టడుగు వర్గాన్ని గౌరవించడమే! అత్యున్నత జ్ఞానపీఠాన్ని అందుకున్నప్పుడు భరద్వాజ అదే చెప్పారు. 'నేను సామాన్యుణ్ని... గట్టిగా చెప్పాలంటే అంతకన్నా తక్కువవాణ్ని' అన్నారాయన. పిడికెడు మెతుకులకోసం ఆయన వ్యవసాయకూలీగా పనిచేశారు. పశువులు కాశారు. బొగ్గుపనిలో మాశారు. పేపర్లు వేశారు. కలప అడితిలో, కమ్మరి కొలిమిలో, పొగాకు కొట్టులో పనిచేశారు. ఆకలి అన్ని పనులూ నేర్పింది! ఏడో తరగతి మానేసిన కుర్రాణ్ని జీవితం చదువుకున్న గొప్ప విద్యావంతుణ్ని చేసింది. పదిహేడేళ్లకే రచయితను చేసింది. సాహిత్య అధ్యయనాన్నే విద్యాభ్యాసంగా మార్చింది. బతుకు పుస్తకాలను చదివించింది. రాయించింది. 'నాకు సంబంధించి నా జీవితానికి, రచనకు వైరుధ్యం లే'దని చెప్పిన రావూరి భరద్వాజ- సహస్ర వృత్తుల శ్రమజీవుల జీవన సమరాన్ని గుండెలకు హత్తుకొనేలా అక్షరీకరించిన ధన్యజీవి!

చూసినవారి గురించే రాశాడాయన. 'జీవనసమరం' దానికి గట్టి సాక్ష్యం. అందులో పాత్రలు అందరికీ పరిచయమైనవేగాని, వాటిని చిత్రించడం మాత్రం భరద్వాజకే సాధ్యం. అట్టడుగు వర్గమంటే సాంఘిక అసమానతలకు గుర్తు. అణచివేతకు, అవమానాలకు ఆలవాలం. ఆకలి దహిస్తుంటే... ఆక్రోశం, అణిచివేస్తుంటే- ఆందోళన సహజం. ఆ రెండూ అక్షరరూపం దాల్చినప్పుడు ఆ అక్షరాల్లోంచి మాడుతున్న పేగు వాసన ఉబికివస్తుంది. రావూరి రచనల్లోని జీవలక్షణం ఆ ఘాటువాసనే! సమాజంలోని అట్టడుగు జీవుల్ని సాహిత్యలోకపు అందలాలెక్కించిన భరద్వాజ రచనల్లో- రాగిణి, కొత్తచిగుళ్లు, కాదంబరి, నాలోని నీవు, అంతరంగిణి, ఐతరేయం, ఒకింత వేకువకోసం, పదహారు నెలలపాటు 'ఈనాడు' దినపత్రికలో ధారావాహికగా ఆకట్టుకున్న 'జీవనసమరం'... వంటివన్నీ ఒక ఎత్తు. ఆయనకు జ్ఞానపీఠాన్ని అందించిన 'పాకుడురాళ్లు' మరో ఎత్తు. అందులో రంగస్థల సహజ జీవి 'మంగమ్మ'- తళుకుబెళుకుల సినీతార 'మంజరి'గా తర్జుమా అయిన తీరు విషాద రమణీయం. అందులోని అక్షరాలు అంతరంగ లోతట్టు పొరల గవాక్షాలు. గుండెపొరల్లోంచి విచ్చుకున్నవి కాబట్టి, వాటి తడి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ రచనకారచన ప్రత్యేక శైలితో, విభిన్న ధ్వనులతో, కాకువు విశేషంతో మనలను పలకరిస్తుంది. రచయితగా భరద్వాజ స్థాయిని నిరూపిస్తుంది. రావూరి జీవితానికి గట్టి ఓదార్పు అక్షరం. ఆయన జీవితానికి తీర్పు అక్షరం. అక్షరం ఆసరాతో మనసు తేలికపడ్డ ప్రతి రచయితలాగే- భరద్వాజ సైతం అక్షరానికి నివాళి అర్పించారు. అక్షరానికి జీవితాన్ని ముడుపుకట్టి దాని నీడన ఆశ్రయం పొందారు.

రావూరి జీవితానికి మరో చల్లని నీడ- ఆయన భార్య కాంతం! కాంతాన్ని- కాంతమ్మా అని పిలవడం భార్యగా ఆమె సాధించిన గొప్ప గౌరవం. 'భగవంతుడు కూడా నీ రూపంలో కనబడితే తప్ప నేనిప్పుడు గుర్తించలేను కాంతం' అన్న భరద్వాజ- 'నేనిప్పుడు నిరీహస్థితిలో ఉన్నా'నంటూ చేసిన అక్షరార్చన అజరామరం! ఆమె మరణం ఆయన చేత స్మృతికావ్యాలు రాయించింది. అక్షర నీరాజనాలు పలికించింది. మాడుతున్న పేగు వాసనలాగే మట్టి వాసన కూడా ఆయన సాహిత్య జీవలక్షణం. 'పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం నడిచివచ్చిన పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం దారిచూపిన పాదాలకు కృతజ్ఞతలు... నన్ను అనుసరించిన పాదాలకు కృతజ్ఞతలు' అన్నాడొక కవి. రావూరి చితికట్టెల చిటపటలు కూడా బహుశా అవే మాటలను వినిపించి ఉంటాయి. మరింత నిశితంగా వినిఉంటే, ఆ చితిమంటల సవ్వడి నుంచి 'మంగమ్మ'కు కృతజ్ఞతలు...' అనీ తప్పక వినపడే ఉంటుంది. ఆమె 'మంజరి'గా మారకుంటే 'పాకుడురాళ్లు' నవలా లేదు, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠమూ లేదు. జీవితంలో మేలుచేసిన ప్రతి సందర్భానికీ, ప్రతి వ్యక్తికీ, పదేపదే ధన్యవాదాలు చెప్పుకొన్న భరద్వాజ- తన చరమదశలో విశ్వనాథ, సినారెల సరసన చోటుకల్పించిన ఆ స్త్రీమూర్తికి తప్పక కృతజ్ఞతలు చెప్పినతరవాతే అనంతవాయువుల్లోకి ప్రయాణం సాగించి ఉంటారు. పల్చని దేహంతో, నెరిసిన గెడ్డంతో అచ్చతెనుగు రూపురేఖలతో ఆంధ్రదేశాన్ని అలరించిన రావూరి భరద్వాజ తన ఆరోప్రాణం దగ్గరికి పరుగెత్తిన పతి... మనకిక తీయని స్మృతి. తెలుగుజాతికి మరో జ్ఞానపీఠం దక్కడానికి అవసరమైన స్ఫూర్తి! 'ఆవిరి ఓడలో జలధియానమొనర్చు బాటసారులు'గా వర్ణించాడు- మనుషుల్ని మహాకవి జాషువా. ఎవరి రేవు రాగానే వారు దిగి వెళ్ళిపోతుంటారు. రావూరి భరద్వాజ దిగవలసిన రేవు వచ్చింది. ఆయన దిగి వెళ్ళిపోయాడు- నిశ్శబ్దంగా!

(ఈనాడు, 20:10:2013)
__________________________

Labels: , , ,

Wednesday, October 09, 2013

1273-హైదరాబాద్‌పై పోటాపోటీగా కావూరి-జైపాల్ వాదనలు




 (ఈనాడు,04:10:2013)

హౖదరాబాద్‌ను చారిత్రక కోణంలో చూడాలి:
జైపాల్‌రెడ్డి, సీమాంధ్ర ప్రాంత మంత్రులు వ్యక్తంచేసిన అభిప్రాయంతో విభేదిస్తున్నందుకు బాధ పడుతున్నట్లు చెబుతూ... ''తెలంగాణను చారిత్రక కోణంలో చూడాలి. ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేపథ్యాన్ని, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన గతులను చూడాలి. ఫజల్అలీ కమిషన్ కూడా ఉమ్మడి రాష్ట్రాన్ని వ్యతిరేకించింది. సమైక్య రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు, పెద్దమనుషుల ఒప్పందాలు, జోనల్ వ్యవస్థ వచ్చాయి. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు 300 మంది చనిపోయారు. 1971లో మళ్లీ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఇచ్చిన గరిబీ హటావో నినాదం ఉన్నప్పటికీ తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. అప్పట్లో తెలంగాణ ప్రజా సమితికి 11 సీట్లు వచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రహ్మానందరెడ్డిని, ఆంధ్ర ఉద్యమ సమయంలో పీవీ నరసింహరావును (పదవుల పరంగా) త్యాగం చేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి విభజన ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 2004లో కనీస ఉమ్మడి కార్యక్రమంలో కూడా తెలంగాణను పెట్టాం. రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పాం. శ్రీకృష్ణకమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. మహారాష్ట్రకు బాంబే ఎలాగో తెలంగాణకు హైదరాబాద్ అలా అయిపోయింది. దీన్ని చారిత్రక కోణంలో చూడాలి. దేన్నయినా మార్చొచ్చుకానీ భౌగోళిక పరిస్థితులు మార్చలేం. 1956లో హైదరాబాద్ దేశంలో 5వ పెద్దనగరం. ఈరోజున కూడా అదే స్థానంలో ఉంది. హైదరాబాద్ నగరాభివృద్ధిలో తెలుగేతరుల శ్రమే ఎక్కువగా ఉంది'' అని పేర్కొన్నారు.

అంతకుముందు కావూరి సాంబశివరావు సీమాంధ్ర ప్రాంతంలో రెండు నెలలుగా జరుగుతున్న ఉద్యమం గురించి వివరించారు. ''60 రోజుల నుంచి తీవ్రంగా నడుస్తున్న ఉద్యమాన్ని దురదృష్టవశాత్తు జాతీయ మీడియా చూపెట్టడం లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ జరగడం లేదని మీరు భావిస్తున్నట్లున్నార''ని ఆక్షేపించారు. తాము నియోజకవర్గాలక్కూడా పోలేక పోతున్నట్లు వాపోయారు. ఆ వాదనలను జైపాల్‌రెడ్డి తోసిపుచ్చారు. ''అలాగైతే మేం కూడా నాలుగేళ్ల నుంచి ఇక్కడే ఇరుక్కుపోయాం, డిసెంబర్ 9 ప్రకటన నాటి నుంచి మేం కూడా నియోజకవర్గాలకు వెళ్లలేని సంకటస్థితిని ఎదుర్కొంటున్నా''మని వాపోయారు. ''కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో ఎప్పుడూ ఎక్కడా తెలంగాణా ఇస్తామని చెప్పలేదు. ఎందుకు తెలంగాణా ఇవ్వడానికి తొందరపడుతున్నారు. వైకాపా, తెలుగు దేశం పార్టీలు విభజన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గే సమయంలో కాంగ్రెస్ ఎందుకు వేగంగా ముందుకెళ్లాలి? శ్రీకృష్ణకమిటీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని పేర్కొంది'' అని కావూరి గుర్తు చేయగా... అదే శ్రీకృష్ణకమిటీ అయిదో అంశం కింద రాష్ట్రాన్ని విభజించాలని కూడా చెప్పింది కదా అని జైపాల్ పేర్కొన్నారు.

ఏకాభిప్రాయం అసాధ్యం-వినోభా కాలంలో లేం:
ఏకాభిప్రాయం అంశం గురించి వచ్చినప్పుడు జైపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ''ఏ అంశంపైనా 100 శాతం ఏకాభిప్రాయం సాధ్యం కాదు. మొరార్జీదేశాయ్ ముంబాయి రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి రామ్‌కిషన్‌కూడా! 66లో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో పెట్టి పంజాబ్ రాష్ట్రాన్ని విభజించారు. అక్కడ ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. వినోభాభావే కాలంలో 100 శాతం అభిప్రాయం ఉంటేనే ఏకాభిప్రాయం కింద లెక్క. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. మనం ఆ కాలంలో లేం. కాబట్టి పూర్తి ఏకాభిప్రాయం అసాధ్యం. దాదాపు ఏకాభిప్రాయం తీసుకుంటే చాలు. తెలంగాణ కూడా 60 ఏళ్ల నుంచి మండుతోంది. నేను ఒకప్పుడు సమైక్య వాదిని అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యవాదిని'' అని పేర్కొన్నారు. అంతకుముందు పళ్లంరాజు 10 ఏళ్లకు మించి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరారు. కావూరి మాట్లాడుతూ తాను పార్టీని ధిక్కరించే వాణ్ణి కానని, కానీ ఇప్పుడు వ్యవహరించిన తీరు మాత్రం తనను తీవ్ర వేదనకు గురి చేసిందని స్పష్టం చేశారు.

అంతా తెలంగాణకే జై
ఇద్దరు సీమాంధ్ర మంత్రులు తప్ప మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన వారంతా తెలంగాణకే జై కొట్టార

Labels: , , , , ,

1272-మహా మేతగాళ్లు మరెందరో?

... 'ఇండియాలో అధికారం నీచులు, ధూర్తులు, దోపిడిదారులకు చేరుతుంది. నోట్లో చక్కెర, కడుపులో కత్తెర లాంటి నేతలు దాపురిస్తారు. అధికారం కోసం వాళ్లలో వాళ్లు కొట్లాడుకొంటే, ఈ సంకుచిత రాజకీయ ఘర్షణల్లో ఇండియా పరాజిత అవుతుంది'- భారత్ స్వాతంత్య్రానికి ముందు బ్రిటన్ యుద్ధసమయ ప్రధానిగా చర్చిల్ చేసిన భవిష్యద్దర్శనం అది. దాన్ని అక్షరసత్యంగా నిరూపించే క్రమంలో అన్నిస్థాయుల్లో విక్రమించిన శీలహీన రాజకీయాలు ఇండియాను అత్యంత అవినీతి పూరిత దేశాల జాబితాలో ఇప్పటికే చేర్చేశాయి. 2004 సార్వత్రిక ఎన్నికల దరిమిలా కేంద్రంలో యూపీఏ భాగస్వామిగా లాలూ కుదురుకొన్న పదిరోజుల్లోనే ఆయనపై గల ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఆదాయ పన్నుశాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ నీరుగార్చేసింది! నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారిని మంత్రులుగా తీసుకోరాదన్న రాజ్యాంగ నిబంధనలేవీ లేవని సుప్రీంకోర్టులోనే అనైతిక వాదనలు వినిపించిన ఘనత మన్మోహన్ సర్కారుది. అర్నాల్డో అలెమాన్ (నికరగువా), పావ్లో లాజరెంకో(ఉక్రెయిన్), అల్‌బెర్టో ఫుజిమొరి (పెరు), జీన్‌క్లాడ్ డువాలియర్(హైతీ) స్లొబొదాన్ మిలోసెవిక్ (సెర్బియా) లాంటి దేశాధినేతలంతా జనం డబ్బు దోచిన నేరాలకు శిక్షలకు గురైతే, ఇండియాలో ఏ స్థాయి అవినీతి మోతుబరినైనా శిక్షించడం బ్రహ్మ ప్రళయంగా మారింది! కాంగ్రెస్ ప్రతినిధే విలేకర్ల సమావేశంలో చెప్పినట్లు, నేరచరితులకు అండగా నిలిచే ఆర్డినెన్స్ నిర్ణయం- సోనియా, మన్మోహన్, రాహుల్‌గాంధీల 'ఉమ్మడి వివేచన' ప్రకారమే జరిగింది. సద్వివేచన శీలిగా రాష్ట్రపతి దానికి మోకాలడ్డుతారని తేటపడ్డాక- రాహుల్‌డ్రామాకు తెరలేచింది. కళంకిత నేతలు లేకుంటే తన కూటమి అస్తిత్వమే ఉండదన్న భయంతో- సీబీఐ లెక్కల ప్రకారమే రూ.43వేల కోట్ల అక్రమ పెట్టుబడులతో అవినీతి జగతిని సృష్టించిన జగన్‌ను కాపాడటానికి హస్తంపార్టీ తాపత్రయపడుతోంది. ఈ అవినీతి చెదను తుదముట్టించడమే లక్ష్యంగా జాతిజనులు సాగించాల్సిన మరో స్వాతంత్య్ర పోరాటానికి వచ్చే సార్వత్రిక సమరమే నాంది.
(ఈనాడు, సంపాదకీయం, 04:10:2013)
_______________________________________
(Loosely translated)
So many mega scamsters?
“Power will go to the hands of rascals, rogues and freebooters. All Indian leaders will be of low caliber and men of straw. They will have sweet tongues and silly heart
s. They will fight amongst themselves for power and India will be lost in political squabbles!”- This was the prediction of Winston Churchill, the wartime Premier of the UK, even before India attained independence.Proving his prediction come true, the characterless politicians/ politics spread in all spheres, made India the topper in the list of the most corrupt countries.
Rulers of various countries, like Arnaldo Ale-man (Nicaragua), Pavlov Lazerenko (Ukraine), Alberto Fujimori (Peru), Jean Claude Duvalier (Haiti), Slobodan Milosevic (Serbia) et al were properly punished for indulging in corruption, but in India- punishing a corrupt politician is a Herculean task! On account of 2004 general elections, within 10days of Lalu joining the NDA in centre as a partner, his case of amassing assets beyond known means of income was diluted by the Income Tax Appellate Tribunal.
As revealed by the congress representative in a meeting with the media persons, the ordinance to protect the corrupt/ criminals among politicians had the joint approval of Sonia, Manmohan and Rahul. Since it was evident that the astute President would not approve the ordinance, the curtain was raised for Rahul’s drama. With the fear that, the Alliance will not exist without the support of the tainted leaders, the ‘hand’ party is struggling in protecting the corrupts like Jaganmohan Reddy –who created a corrupt domain of his own, with Rs.46,000 Crores (as estimated by the CBI, but may be more) of illegal investments.
People have to start a fresh struggle for independence, to eradicate these white ants of corruption eating into the vitals of our country, by using the vote as a weapon in the coming elections! 
_______________________________________________

Labels: ,