Friday, March 06, 2015
Wednesday, November 12, 2014
1638- 1000 MARBLES
___________________________________
The older I get, the more I enjoy Saturday mornings. Perhaps it's the quiet solitude that comes with being the first to rise, or maybe it's the unbounded joy of not having to be at work. Either way, the first few hours of a Saturday morning are most enjoyable.
A few weeks ago, I was shuffling toward the backyard patio with a steaming cup of coffee in one hand and the morning paper in the other. What began as a typical Saturday morning, turned into one of those lessons that life seems to hand you from time to time. Let me tell you about it.
I turned the dial up to listen to a Saturday morning talk show I heard an older sounding gentleman, with a golden voice. You know the kind, he sounded like he should be in the broadcasting business. He was telling whoever he was talking with something about "a thousand marbles".
I was intrigued and stopped to listen to what he had to say...
"Well, Tom, it sure sounds like you're busy with your job. I'm sure they pay you well but it's a shame you have to be away from home and your family so much. Hard to believe a young fellow should have to work sixty or seventy hours a week to make ends meet. Too bad you missed your daughter's dance recital."
He continued, “Let me tell you something Tom, something that has helped me keep a good perspective on my own priorities."
And that's when he began to explain his theory of a "thousand marbles." "You see, I sat down one day and did a little arithmetic. The average person lives about seventy-five years. I know, some live more and some live less, but on average, folks live about seventy-five years."
"Now then, I multiplied 75 times 52 and I came up with 3900 which is the number of Saturdays that the average person has in their entire lifetime.
Now stick with me Tom, I'm getting to the important part."
"It took me until I was fifty-five years old to think about all this in any detail", he went on, "and by that time I had lived through over twenty-eight hundred Saturdays. I got to thinking that if I lived to be seventy-five, I only had about a thousand of them left to enjoy."
"So I went to a toy store and bought every single marble they had. I ended up having to visit three toy stores to round-up 1000 marbles. I took them home and put them inside of a large, clear plastic container right here in the shack next to my gear. Every Saturday since then, I have taken one marble out and thrown it away."
"I found that by watching the marbles diminish, I focused more on the really important things in life. There is nothing like watching your time here on this earth run out to help get your priorities straight."
"Now let me tell you one last thing before I sign-off with you and take my lovely wife out for breakfast. This morning, I took the very last marble out of the container. I figure if I make it until next Saturday then I have been given a little extra time. And the one thing we can all use is a little more time."
"It was nice to meet you Tom, I hope you spend more time with your family, and I hope to meet you again.
You could have heard a pin drop on the radio when this fellow signed off. I guess he gave us all a lot to think about.
I had planned to work that morning. Instead, I went upstairs and woke my wife up with a kiss. "C'mon honey, I'm taking you and the kids to breakfast."
"What brought this on?" she asked with a smile. "Oh, nothing special, it's just been a while since we spent a Saturday together with the kids. Hey, can we stop at a toy store while we're out? I need to buy some marbles."
(Source: Anonymous – email of mid 90’s.)
Labels: anecdote, Cinima/ Telugu, Family, Life, Self development
Thursday, September 04, 2014
1635- Renowned Telugu filmmaker Bapu, also an acclaimed artist, painter, cartoonist and illustrator, passed away in Chennai On 31st August following a brief illness.
He was 80.
Bapu had begun his career as a director in 1967 with Sakshi, which was then screened in international film festivals. He went on to direct about 50 films in his career.
He received several coveted honours, including Padma Sri from the Union government in 2013 and the prestigious Nandi Award of the Andhra Pradesh government.
Bapu, in combination with his friend and writer Mullapudi Venkata Ramana, made critically-acclaimed and successful films like Muthyala Muggu, Tyagayya, Bhakta Kannapa, Pelli Pustakam and Mr Pellam.
Bapu made a few films in Tamil and Hindi as well. His Hindi films include Ham Paanch and Seeta Swayamvar.
Bapu's Vamsa Vriksham in Telugu was one of the earliest films in the career of veteran Bollywood actor Anil Kapoor.
Bapu was also an artist, painter, cartoonist and illustrator par excellence, whose works signified the benchmark for Teluguness.
In casual conversations, a traditional-looking Telugu girl is often described as "a girl in Bapu's picture"
_________________________________
Labels: art, Cinima/ Telugu, Personality, Telugu/ culture
Sunday, July 20, 2014
1552- Some Telugu Movies Dubbed in to Telangana
Some Telugu Movies Dubbed in to Telangana.
1. Narasimha Naidu = Nursing Yadav
2. Parugu = Uruku
3. Akkada Ammai Ikkada Abbai = Gaada Pori Geeda Poradu
4. Siddhu from Srikakulam = Mallesh from Malkajgiri
5. Village Lo Vinayakudu = Galli Lo Ganeshudu
6. Ammailu Abbailu = Porilu Poragalu
7. Sankranthi = Bonalu
8. Anveshana = Devulaata
9. Bava Garu Bagunnara = Em Bava Manchigunnave
10. Palnati Brahma naidu = Karimnagar KCR
11. Nari Nari Naduma Murari = Pori Pori Nadimitla ND Tiwari
12. Aavida Ma Aaviday = Gadee Na Pendlame..
Labels: Cinima/ Telugu, Humour, Humour/ Telugu
Sunday, March 30, 2014
1396- Now hot, then cute!
[1] Tapsi [13] Ram
[2] junior NTR [14] Kajal
[3] allari Naresh [15] Nitin
[4] Allu Arjun [16] Sidhdharth
[5] Samanta [17] Anushka
[6] Trisha [18] Nani
[7] RaaNaa [19] Karti
[8] Nitya Menon [20] Deepika Padukone
[9] Sruti Hasan [21] Mahesh Babu
[10]Naga Chatanya [22] Prabhas
[11]Ram Charan [23] Surya
[12]Ktrina Khife
(ఈనాడు, 30.03.2014)
____________________________
Labels: children, Cinima/ Telugu, Life/ children / telugu, Personality
Thursday, January 23, 2014
1332- AKKINENI NAGESWARA RAO on 'CHANCE' and 'DESTINY':
He, being an atheist, doesn't take god's name, but the word 'chance'.
On this topic of chance & God there was an article in the OPEN PAGE of The Hindu of January 12,2014, by Suyash Suxena, Center for Philosophy, Jawaharlal Nehru University, New Delhi. Here is an excerpt from the same:-
"...The element of Chance is vital in life. Tolstoy wrote in War and Peace:'If we admit that human life can be ruled by reason, the possibility of life is destroyed.'
Because there is uncertainty in life and no amount of rational knowledge can preempt the twists and turns life is going to take in the future, we inevitably have to resort to the idea of Chance. Had life been completely defined by rationality and reason, we would not have needed ideas of Chance and God. But then the 'possibility of life would have been destroyed.' Life is possible only because the next moment is decided by Chance.
Chance and God then become the central idea around which life revolves. But perhaps that is a rash conclusion drawn from an incomplete story. While it is true that life is determined only by the existence of Chance, it is equally true that the idea of Chance and God is determined only in the context of life. It is only because human life is possible that God and Chance have a meaning. Had there been no life, God and Chance would have been superfluous concepts. It is the human life that is central, and around it revolves the ideas of God and religion. It is thus the human being who has created the idea of God to harmonize the contradictions of life and it may not be the other way round..."
(The above cited article answers the big question- why at all that supernatural element 'GOD' is required! The answer is in the song - "ninaithadellam nadandhuvittaal deyvam aedumillai" from the Tamil movie 'nenjil Or aalayam'l (in Telugu the same is"thalachinadhE jariginadaa dhaivam endhulaku" from the movie 'manasE mandiram'). If we can predict the twists and turns the life takes in future, then we don't require GOD! Because there is UNCERTAINTY in life, and no rational knowledge or reason can predict the future, it leads to the idea of CHANCE & GOD (like the 'insurance' business exists as there is uncertainty of risk) . Once the supernatural element 'GOD' is accepted, then millions of thoughts, philosophies, religions, ideologies etc are placed together in the name of God)
. ------------------------------
Labels: Cinima/ Telugu, Knowledge, Life, Personality, Religion
1331- ధన్యజీవి అక్కినేని!
సినీ కళామతల్లి గర్భశోకంతో తల్లడిల్లుతున్న వేళ ఇది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ వందేళ్ల ఉత్సవాల్నీ చూసే అదృష్టం దక్కిందంటూ నాలుగు నెలలనాడు మురిసిపోయిన తొంభయ్యేళ్ల పసివాడు అక్కినేని మరి లేరన్న దుర్వార్త తెలుగువారి గుండెల్ని పిండేస్తోంది. 1931లో మాటలు నేర్చిన తెలుగు వెండితెరను స్వర్ణయుగానికి తోడ్కొని వెళ్ళిన నవరస నటనా ధురీణులు ఎన్టీఆర్, అక్కినేని. పద్దెనిమిదేళ్ల క్రితం నటసార్వభౌముడి హఠాన్మరణం దరిమిలా తెలుగు చిత్రసీమకు ఏకైక పెద్దదిక్కుగా ఉన్న అక్కినేని ఇప్పుడు క్యాన్సర్ సోకి పరమపదించడంతో వెండితెర విలపిస్తోంది. ప్రతి తెలుగు లోగిలీ నిశ్శబ్దంగా రోదిస్తోంది. ఆంధ్రులు ఆరంభ శూరులన్న అపప్రథను తుడిచిపెట్టిన సమున్నత వ్యక్తిత్వం అక్కినేనిది. 'స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య' అంటూ తన బలాబలాల్ని అంచనా వేసుకొని కూడా ఏటికి ఎదురీది ఆయన సాధించిన రికార్డులు, రివార్డులు లెక్కలేనన్ని! '1974లో, 1988లో గుండెజబ్బుతో పోరాడి విజయం సాధించాను... ఇప్పుడు క్యాన్సర్ను జయించి మూడో రికార్డు కొట్టబోతున్నా... అందుకు అభిమానుల ఆశీర్వాద బలం కావా'లని విలేకరుల సమావేశం పెట్టిమరీ అక్కినేని స్వీయ అనారోగ్యాన్ని వెల్లడించారు. ఇటీవల యువరాజ్ సింగ్, మనీషా కొయిరాలా వంటివారు క్యాన్సర్ను జయించిన నేపథ్యంలో అక్కినేనీ తప్పక కోలుకొంటారనే అభిమానులంతా విశ్వసించారు. క్యాన్సర్ను తాను మనోబలంతో జయిస్తానని, ప్రజల ఆశీర్వాద బలంతో సెంచరీ కొట్టి మళ్ళీ ఇలా విలేకరుల భేటీ ఏర్పాటు చేస్తానని ధీమాగా చెప్పిన అక్కినేని గళం అర్ధాంతరంగా మూగవోయింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని అక్కినేనిలా పూర్ణారోగ్యంతో నలభై ఏళ్లు జీవించినవాళ్లు ప్రపంచంలోనే లేరు. తొంభయ్యేళ్ల ముదిమిలోనూ మొహానికి, మనసుకు ముడతలు పడని సతత హరిత(ఎవర్ గ్రీన్) కథానాయకుడిగా అక్కినేని రికార్డుకు తిరుగులేదు. క్యాన్సర్తో చనిపోయే పాత్రల్లో జీవించి కంటతడి పెట్టించిన ఏఎన్నార్, అభిమానులకు ధైర్యం నూరిపోస్తూ చెప్పిన మాట- 'సినిమాల్లో మాదిరిగా జరుగుతుందనుకోవడం అపోహే'! అవును... నిజం. అమరజీవి అక్కినేనికి మరణమా- అపోహే!
'దీక్ష, సంఘర్షణ, సాధన- నటనకు సానపడతాయి. శక్తిని, పటిమను పదునెక్కిస్తాయి' అన్న అక్కినేని మాటల్లో ఆయన అసమాన నటనా వైదుష్యానికి మూల ధాతువులు బోధపడతాయి. నాలుగో తరగతితో చదువు ఆపేసి, రంగస్థలంపై కమల, చంద్రమతి, తార వంటి స్త్రీ పాత్రలతో పేరుమోసి, అర్ధరూపాయి పారితోషికంతో ప్రారంభమైన అక్కినేని నటప్రస్థానం- 'నాగ్గాడు' అంటూ తెలుగువారంతా ఆత్మీయంగా గుండెలకు హత్తుకొనేలా అప్రతిహతంగా సాగిపోయింది. సురేంద్రనాథ్, దేవదాస్ వంటి శరత్చంద్ర పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఏఎన్నార్ ఒక్కరేనని భిన్న భాషల్లోని సాటి నటులచేత జేజేలందుకొనేలా ఆయన నట తపోదీక్ష దుర్నిరీక్ష్యమై తేజరిల్లింది. ఆటుపోట్లకు రాటుతేలుతూ, భిన్న పాత్రల్లోకి పరకాయ ప్రవేశం ద్వారా సొంత వ్యక్తిత్వానికి చిత్రిక పట్టుకొంటూ, సవాళ్లను పట్టుదలతో స్వీకరిస్తూ నటరాజుకే మణిమకుటమై నిలచిన అక్కినేని కారణ జన్ముడు కాదు- రణజన్ముడు! అయిదున్నర దశాబ్దాలక్రితం శ్రీనగర్లో ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా మశూచి సోకినప్పుడు, దుర్భరమైన బాధను భరించి యాసిడ్ చికిత్స చేయించుకొన్న ఏఎన్నార్- తన జీవితాన్ని నెమరువేసుకొంటే ఎంతో గర్వంగా, తృప్తిగా ఉంటుందన్నారు. అదృష్టాన్ని కాక, మార్గదర్శిగా ఎదిగి తీరాలన్న సంకల్పబలాన్నే నమ్ముకొని చిత్రసీమలో ఆరోగ్యకర విలువలకు గొడుగు పట్టిన అక్కినేని- నటుడిగా అధిరోహించని శిఖరాల్లేవు. 'ఒక్కమాటు కెమెరా రన్ అయ్యి, వెయ్యింతలుగా మొహంలోని భావాన్ని మాగ్నిఫై చేస్తూ ఫోకస్ అవుతుంటే, నటుడైన వాడిలో పట్టుదల ఒక్కమాటుగా వెయ్యింతలై నిలబడి భావపరిధిని ఆవర్తిస్తుంది' అన్న అక్కినేని- సరిసాటి లేని నటదిగ్గజం. అమేయ నటకళావైదుష్యంతో తరతరాల్ని అలరించడం అక్కినేని అదృష్టమా, ఆ అభినయ రసఝరిలో తన్మయత్వం పొందడం తెలుగుజాతి సుకృతమా అన్నది తేల్చి చెప్పడం కష్టం!
కృషితో ఆత్మవిమర్శతో జీవితాన్ని పండించుకొన్న అక్కినేని సమున్నత వ్యక్తిత్వాన్ని 24 ఫ్రేముల వెండితెర చట్రంలో బంధించి చూడటం దుస్సాహసమే అవుతుంది. విశ్లేషకులు అన్నట్లు బడికి వెళ్లని ఆచార్యుడిగా, గుడికెళ్లని తాత్వికుడిగా స్వయం క్రమశిక్షణ, కట్టుబాట్లతో అక్కినేని తన తొంభయ్యేళ్ల జీవితాన్నే పాఠ్యగ్రంథంగా మార్చి బోధించిన ఆరోగ్యకర అలవాట్లు లెక్కలేనన్ని! పరిశ్రమకు వెళ్ళిన కొత్తలో పెద్దలకు నమస్కారం చేయడమే తెలియని కుర్రాడు కాలక్రమంలో రంగుల ప్రపంచాన్ని కాచి వడపోసి తీర్చిదిద్దుకొన్న సమున్నత వ్యక్తిత్వానికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. నటశ్రేష్ఠుడికి నీరాజనాలు పలుకుతూ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం కోరి వరించింది. తెలుగు గడ్డకు చిత్రసీమ తరలివచ్చేలా ముందడుగు వేసిందీ ఆ 'బాటసారే'. 1988లో తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్న గుండె, శస్త్రచికిత్సకు అనువుగా లేదన్న డాక్టర్లు- అక్కినేని జీవితకాలం మరో నాలుగేళ్లని ఆనాడు నిర్ధారించినా ఇంకో పాతికేళ్లు నటప్రస్థానం సాగేలా చేసింది ఆయన మనోబలమే! 'వృత్తిపరంగానే కాదు, జీవితంలో కూడా నాకెంతో తృప్తి ఉంది' అని చెప్పిన అక్కినేనికి ఆ 'తృప్తి' కష్టించి సాధించిన విజయాలతో, సవాళ్లకు ఎదురొడ్డి గెలిచిన ఆత్మస్త్థెర్యంతో వచ్చింది. వూపిరి ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటానన్న మాటకు కట్టుబాటు చాటి తన వంశాంకురాలతో సినిమా పూర్తిచేసిన అక్కినేని- ఒక్కమాటలో చెప్పాలంటే, ధన్యజీవి. నాటకరంగంలో పొందిన ఆరణాల కప్పునుంచి ఫాల్కే అవార్డుదాకా అవే తన అసలైన సంపద అంటూ భావితరాలకోసం భద్రపరచిన అక్కినేనే- తెలుగువారి తరగని చెదరని ఆస్తి!
Labels: Cinima/ Telugu, Liesure/Telugu, nostalgia, Personality, Self development
Tuesday, September 03, 2013
1264- అందుకే అతను ప్రిన్స్
మహేష్బాబు... అభిమానులకు ప్రిన్స్, అమ్మాయిలకు రాజకుమారుడు, బాక్సాఫీసును మురిపించిన 'పోకిరి'. వసూళ్ల వర్షం కురిపించిన 'బిజినెస్మేన్'. దర్శకులకూ మహేష్ కావాలి, కథానాయికలకూ, వ్యాపార ప్రకటనలకూ అతనే కావాలి. ట్విట్టర్లో పలకరిస్తే అభిమానులు పొంగిపోతారు. ఇరవై సెకన్ల టీజర్లో కనిపిస్తే 'వన్'మోర్ అంటారు. 'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు..' అని ఎప్పుడైతే అన్నాడో తెలుగు సినిమా తెరపైన హీరోయిజం అనే పదానికి కొత్త అర్థం రాసేసుకొన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మల్టీస్టారర్ చిత్రాలకు కొత్త రూపు ఇచ్చారు మహేష్. ఇప్పుడు '1' కోసం ముస్తాబవుతున్నాడు. శుక్రవారం 'కథానాయకుల్లో మీరే నెంబర్ వన్' అంటే మహేష్ ఎలాగూ ఒప్పుకోవడం లేదు. అందుకే శుక్రవారం మహేష్బాబు జన్మదినం సందర్భంగా ఆయన సినిమా పేరు '1'కి తగినట్టు.. మహేష్ కెరీర్లో తొలి అనుభూతులేమిటో ఒక్కసారి రివైండ్ చేసుకొందాం. మహేష్ గురించి సహ నటులు, దర్శకులు, కథానామహేష్బాబు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం 'నీడ'. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్బాబు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో మహేష్బాబు కూడా కొన్ని ఫ్రేముల్లో కనిపిస్తారంతే. ఆయనకు కనీసం డైలాగులు కూడా లేవు. తొలిసారి నాన్నతో తెర పంచుకొన్న చిత్రం 'పోరాటం'. ఈ సినిమాలో కృష్ణకు తమ్ముడిగా కనిపించారు. 'శంఖారావం', 'కొడుకు దిద్దిన కాపురం', 'ముగ్గురు కొడుకులు', 'గుఢచారి 116', 'రాజకుమారుడు', 'వంశీ' తదితర సినిమాల్లో తండ్రీకొడుకులిద్దరూ కనిపించారు. వివిధ సందర్భాల్లో చెప్పిన కబుర్లు నెమరువేసుకొందాం.

* మహేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'కొడుకు దిద్దిన కాపురం'. ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ నటించిన 'బాలచంద్రుడు' దర్శకుడు కూడా కృష్ణనే.
*మహేష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'కొడుకు దిద్దిన కాపురం'. ఈ
చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. మహేష్ నటించిన 'బాలచంద్రుడు'
దర్శకుడు కూడా కృష్ణనే.*మహేష్ కథానాయకుడిగా రంగప్రవేశం చేసిన చిత్రం 'రాజకుమారుడు'. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. తొలి నంది అవార్డు అందించిన చిత్రం ఇదే. ఈ సినిమాతోనే ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా నంది పురస్కారం దక్కించుకొన్నారు.
*'ఒక్కడు' చిత్రానికిగానూ తొలిసారి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకొన్నారు మహేష్. ఉత్తమ నటుడిగా తొలి నంది అందించిన చిత్రం మాత్రం 'నిజం'. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్ని ఓ కొత్త కోణంలో చూపించింది.
* నమ్రత తొలి తెలుగు చిత్రం 'వంశీ'. ఈ సినిమా చిత్రీకరణలో ఏర్పడిన స్నేహం.. వీరిద్దరి పెళ్లికి దారితీసింది. లిసారే, బిపాసాబసు (టక్కరి దొంగ), సోనాలీ బింద్రే (మురారి), అమృతారావు (అతిథి)ల తొలి తెలుగు హీరో మహేష్బాబు. ఇప్పుడు కృతిసనన్ (వన్) కూడా మహేష్తోనే టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది
* కౌబోయ్ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణ. ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన
మహేష్బాబు కూడా కౌబోయ్గా అలరించారు. ఆయన పూర్తిస్థాయి కౌబోయ్ పాత్ర
పోషించిన చిత్రం 'టక్కరి దొంగ'. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించారు.
*మహేష్ తన కెరీర్లో ఒకే ఒక్క కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఆయనే శోభన్. వీరిద్దరి కలయికలో 'బాబి' వచ్చింది.
* „ాణిజ్య ప్రకటనల్లోనూ మహేష్బాబు దుమ్ము రేపుతున్నారు. చాలా సంస్థలకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే తొలిసారి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది థమ్స్ అప్కే.
*'జల్సా' సినిమాకి తొలిసారి గొంతు అరువిచ్చారు మహేష్బాబు. త్రివిక్రమ్తో ఉన్న స్నేహం వల్ల ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పారు. ఆ తరవాత 'బాద్షా' సినిమాకీ మాటసాయం అందించారు. సామాజిక సంస్థ 'మర్ద్' కోసం తొలిసారి ఓ పద్యం పాడారు.
* మహేష్ ట్విట్టర్లో కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ ట్విట్ చేసినా ఆయన ఫాలోయర్స్
మాత్రం లక్షల్లో ఉన్నారు. గురువారం నాటికి ఆరులక్షల మూడు వేల మూడువందలు
దాటేశారు. ఏ దక్షిణాది నటుడికీ ఈ స్థాయిలో ఫాలోయర్స్ లేరు.* కథానాయికల్ని లిప్లాక్ చేయడంలోనూ మహేష్ ముందుంటారు. 'బాబి' (ఆర్తి అగర్వాల్), 'నాని' (అమీషాపటేల్), 'అతడు' (త్రిష), 'దూకుడు' (సమంత), 'బిజినెస్మేన్' (కాజల్) సినిమాల్లో కథానాయికల పెదవిని అందుకొన్నారు.
*మహేష్ నటిస్తున్న తాజా చిత్రం 'వన్' ప్రచార చిత్రాన్ని ఇటీవల విడుదల
చేశారు. ఈ టీజర్ మహేష్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకొంది. పది లక్షల మంది
యూట్యూబ్లో ఈ ప్రచార చిత్రాన్ని తిలకించారు. ఈ సంఖ్యలో ఓ ప్రచార
చిత్రాన్ని తిలకించడం తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ అరుదైన విషయమే. |
|
* ''మహేష్బాబు ఓ ప్రత్యేకమైన నటుడు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో
ఇద్దరం కలసి నటించాం. సెట్లో నిజంగా నాకు తమ్ముడుగానే కనిపించేవాడు.
పాత్రలోకి చాలా తొందరగా వెళ్లిపోతాడు. పనిమీద అతని నిబద్ధత నాకు బాగా
నచ్చింది'' - వెంకటేష్ | |
*
''మహేష్ అందమైన కథానాయకుడు. మహేష్ నుంచి నేను కోరుకొనేది ఏమైనా ఉంటే.. అతని అందమే. చాలా సహజంగా నటిస్తాడు''.- రామ్చరణ్ |
|
*''మహేష్ నాకెప్పుడూ నటిస్తున్నట్టు అనిపించలేదు. సహజంగా నటిస్తాడు. అతని
వల్ల పాత్రకు సరికొత్త శక్తి వస్తుంది. తనతో రెండు సినిమాలు చేశా. 'అతడు'లో
చాలా తక్కువ మాట్లాడతాడు. అన్నీ పోగేస్తే అతని కోసం రాసిన డైలాగులు మూడు
పేజీలు మించవు. డబ్బింగ్ కూడా రెండు మూడు గంటల్లో ముగిసిపోయింది. 'ఖలేజా'
అలా కాదు. సినిమా అంతా మాట్లాడుతూనే ఉంటాడు. పాత్రల్లో వైవిధ్యం బాగా
చూపిస్తాడు''- త్రివిక్రమ్ |
|
*''రజనీకాంత్కి తమిళంలో ఎంత మార్కెట్ ఉందో, తెలుగులో మహేష్కి అంత మార్కెట్
ఉంది. ఆయనతో నాకూ ఓ సినిమా చేయాలని వుంది. 'గుఢచారి 116', 'అల్లూరి
సీతారామరాజు', 'జేమ్స్బాండ్' వీటిలో ఎలాంటి కథ చేస్తే బాగుంటుందో మహేష్
అభిమానులే చెప్పాలి. దాన్ని బట్టి మహేష్ కోసం ఓ కథ రాసుకొంటా''- రాజమౌళి |
|
* ''నేను రాసిన సంభాషణలకు మరింత బలం తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్బాబు. పది
పైసల డైలాగ్ని రూపాయిగా మారుస్తారు. నటిస్తున్నట్టు నాకెప్పుడూ
అనిపించలేదు. కట్ చెప్పడం మర్చిపోయిన సందర్భాలూ ఉన్నాయి''- పూరి జగన్నాథ్ |
|
* ''మహేష్ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా. 'ప్రతి సినిమానీ నీ మొదటి
సినిమాగా భావించు' అనే సలహా ఇచ్చారు. అది ఇప్పటికీ పాటిస్తున్నా. ఆయనతో
కలసి నటించాలని ప్రతీ కథానాయిక కోరుకొంటుంది. ఆ అవకాశం కెరీర్
ప్రారంభదశలోనే రెండుసార్లు నాకు దక్కడం నా అదృష్టం''.- సమంత |
|
*''సినిమా అంతా తన భుజాలపై వేసుకొని నడిపించగల నటుడు. సన్నివేశాన్ని చాలా
తొందరగా అర్థం చేసుకొంటారు. రీటేక్లూ తక్కువే. అందుకే ఆయన పక్కన
నటించేవారు ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. డైరెక్టర్ కట్ చెప్పగానే
మామూలైపోతారు''-కాజల్
|
Labels: Cinima/ Telugu, Liesure/Telugu, Personality, Telugu/ culture
Monday, April 29, 2013
1127- వందేళ్ళ సినిమా.. వెయ్యేళ్ళు వర్ధిల్లాలి!
మూకీయుగం...
తొలి వందనం...
రఘుపతి వెంకయ్య
వందేళ్ల క్రితం...మే 3, 1913న దాదా సాహెబ్ ఫాల్కే రూపొందించిన 'రాజా హరిశ్చంద్ర' బొంబాయిలోని 'కోరొనేషన్ సినిమాటోగ్రాఫ్ హాలు'లో విడుదల కావడంతో భారతీయ సినిమా చరిత్ర మొదలైంది. ఆ చిత్రంతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, మూకీ యుగకర్తల్లో తెలుగువారైన రఘుపతి వెంకయ్య కూడా ఒకరు. ఆయన చాలా మూకీలే తీశారు. వెంకయ్య తనయుడు ప్రకాశ్ కూడా సినిమా స్వాప్నికుడే. తండ్రి నేతృత్వంలో 'భీష్మ ప్రతిజ్ఞ' (1922) చేశారు. ఇదే తొలి తెలుగు మూకీ చిత్రం. అంతకుముందే ఆయన 'మీనాక్షి కల్యాణం' అనే చిత్రాన్ని తీసినా కెమెరా లోపం కారణంగా శ్రమంతా వృథా అయిపోయింది.
టాకీ యుగం...
మలి వందనం...
హెచ్.ఎం.రెడ్డి, ఎల్వీ ప్రసాద్
మార్చి 14, 1931న ... తొలి భారతీయ టాకీ చిత్రం 'ఆలం ఆరా' విడుదలైంది. అదో ప్రేమ కథ. సంపన్న నాయకుడూ నిరుపేద నాయిక చుట్టూ తిరుగుతుంది. చిత్ర దర్శకుడు, నిర్మాత అర్దేశిర్ ఇరానీ. హనుమంతప్ప మునియప్పరెడ్డి (హెచ్.ఎం.రెడ్డి) ఆయన సహాయకుడు. బెంగుళూరులో పుట్టిపెరిగినా హైదరాబాద్లో కొంతకాలం ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు హెచ్.ఎం.రెడ్డి. సినిమా మీద ప్రేమతో బొంబాయి వెళ్లారు. 'ఆలం ఆరా' నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. ఎల్వీ ప్రసాద్ అనే తెలుగు యువకుడు కూడా ఈ చిత్రంలో ఐదారు చిన్నచిన్న వేషాలు వేశారు. అన్ని పాత్రలకూ కలిపి ఆయనకు ఉన్నన్ని డైలాగులు హీరోయిన్కు కూడా లేవు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇరానీ తన దృష్టిని తెలుగు, తమిళ భాషల వైపు మళ్లించారు. 'ఆలం ఆరా' బృందంలో పనిచేసిన ఎల్వీప్రసాద్, హెచ్.ఎం.రెడ్డి ... తర్వాతి కాలంలో, తెలుగు చిత్రాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు.చిత్ర పరిశ్రమకు ఆద్యులుగా నిలిచారు.
తొలి తెలుగు టాకీ...
ఎందరో మహానుభావులు
''భారత మూవీటోన్ అనబడుతున్న శ్రీ కృష్ణా ఫిల్ము కంపెనీ వారిచే అధిక వ్యయప్రయాసలకోర్చి తయారు చేయబడిన...
'భక్త ప్రహ్లాద'
ఆంధ్రనాటక రంగస్థలమందు వన్నెకెక్కిన సుప్రసిద్ధ నటీనటులు, శ్రవణానందకరమగు పాటలు, పద్యములు, నయనరంజకమగు దృశ్యములు, ఆంధ్రదేశము కొరకు ప్రత్యేకంగా తయారుచేయబడిన తెలుగు భాషలో మాట్లాడు దృశ్యములు''
...అంటూ వీధుల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు.
బాలీవుడ్లో టాలీవుడ్
బాలీవుడ్ బంగారు కిరీటంలో టాలీవుడ్ కలికితురాయిలా తళుక్కుమన్న సందర్భాలూ అనేకం. బాలీవుడ్ వందేళ్ల పుస్తకంలో రెండు అందమైన రంగుల పేజీలు - శ్రీదేవి, జయప్రద. జానీలీవర్, , వహీదా రెహ్మాన్ల మూలాలు మన దగ్గరే ఉన్నాయి. నగేశ్ కుకునూర్, శ్యామ్ బెనెగల్లకు హైద్రాబాద్తో ప్రత్యేక అనుబంధం ఉంది. బాలీవుడ్కు వేగాన్ని నేర్పిన బాపయ్య, సరికొత్త ధోరణులు పరిచయం చేసిన రామ్గోపాల్వర్మ - ముంబయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకులు. మూడువందల హిందీ చిత్రాల్లో నటించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ తెలుగువారే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, సుశీల, జానకి ... హిందీ చిత్రాల కోసం ఎన్నో సూపర్హిట్ పాటలు పాడారు. రమేష్నాయుడు, ఎం.ఎం.క్రీమ్ పేరుతో కీరవాణి చక్కని బాణీలు కూర్చారు. ప్రఖ్యాత దర్శకులు గౌతమ్ఘోష్ (మా భూమి), శ్యామ్బెనెగల్ (అనుగ్రహం), మృణాళ్సేన్ (ఒక వూరి కథ), మహేష్భట్ (క్రిమినల్) తెలుగు చిత్రాలకు నిర్దేశకత్వం వహించారు. అమ్జాద్ఖాన్, అమ్రిష్పురి వంటి బాలీవుడ్ నటులు తెలుగు తెరమీదా కనిపించారు. లతామంగేష్కర్, మహ్మద్రఫీ, ఆశాభోంస్లే, శ్రేయాఘోషాల్ వంటి సుప్రసిద్ధ బాలీవుడ్ గాయకులు తెలుగు పాటలు పాడారు.టాలీవుడ్ అగ్రహీరోలంతా ఏదో ఒక రూపంలో హిందీ సినిమా అభిమానులకు సుపరిచితులే. ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఎన్నో హిందీ చిత్రాలు తెలుగు తీర్థం పుచ్చుకున్నాయి. టాలీవుడ్-బాలీవుడ్లది అన్నదమ్ముల అనుబంధం!
గిన్నిస్ రికార్డు
అప్పుడెప్పుడో శ్రీనాథ కవిసార్వభౌముడు గౌడడింఢిమభట్టు కంచుఢక్కాను పగులగొట్టాడని ఘనంగా చదువుకుంటాం. ఆ మాటకొస్తే, ఒకటేమిటి నాలుగైదు ఇంటర్నేషనల్ రికార్డుల్ని తుక్కుతుక్కు చేశారు తెలుగు దిగ్గజాలు. అత్యధిక సినిమాల నిర్మాతగా రామానాయుడు రికార్డు సృష్టించారు. నలభై ఏళ్లనాటి 'తాత మనవడు' నుంచి నిన్నమొన్నటి 'పరమవీర చక్ర' దాకా దాదాపు నూటయాభై చిత్రాలకు దర్శకత్వం వహించి... అత్యధిక చిత్రాల డైరెక్టరుగా గిన్నిస్ ఎక్కారు దాసరి నారాయణరావు. అత్యధిక చిత్రాల మహిళా దర్శకురాలిగా విజయనిర్మల, ఒకే భాషలో అత్యధిక చిత్రాల నటుడిగా బ్రహ్మానందం... గిన్నిస్లో స్థానం సంపాదించారు. ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియో సముదాయంగా హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీ గిన్నిస్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒక ప్రాంతీయ సినిమా పరిశ్రమ... అంతర్జాతీయ గౌరవాన్ని అందుకోవడం అంటే మాటలు కాదు!
తెర రాజకీయాలు
తెలుగు సినిమా... జాతీయ రాజకీయాల్ని శాసించిన సందర్భాలెన్నో. అటు ఢిల్లీలో నేషనల్ ఫ్రంట్ సర్కారు, ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం. ఫ్రంట్ ఛైర్మన్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సెట్స్ మీంచే ఎన్టీఆర్ బాధ్యతలు నిర్వర్తించిన సంఘటనలున్నాయి. మేకప్తోనే అగ్ర నేతలతో సమాలోచనలు జరిపిన దాఖలాలున్నాయి. తెలుగు సినిమా- జాతీయ రాజకీయాల అనుబంధం ఇప్పటిది కాదు. స్వాతంత్య్రానికి పూర్వమే అనేక చిత్రాలు తీసిన నిర్మాత, నటుడు కోన ప్రభాకరరావు ఆతర్వాత రాజకీయాల్లోకి వచ్చి పీసీసీ అధ్యక్షుడిగా, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. 1966లో కొంగర జగ్గయ్య కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. సత్యజిత్రే మెచ్చిన అందాలతార జయప్రద ఉత్తరాదికి వెళ్లి, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అయ్యారు. రెబల్స్టార్ కృష్ణంరాజు భారతీయ జనతాపార్టీ తరపున గెలిచి, కేంద్రమంత్రిగా వ్యవహరించారు. దాసరి నారాయణరావు కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. లేడీ అమితాబ్ విజయశాంతి తెరాస ఎంపీగా ఉన్నారు. శారద, కృష్ణ, జమున, రామానాయుడు, మోహన్బాబు, రావుగోపాలరావు - పార్లమెంటులోని ఉభయసభల్లో తెలుగు వారికీ తెలుగు సినిమాకూ ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర పర్యాటక మంత్రిగా చిరంజీవి 'భారత సాంస్కృతిక రాయబారి' పాత్ర పోషిస్తున్నారు. మన తారలు రెండున్నర గంటల సినిమాల్లోనే కాదు, ఐదేళ్ల నిడివి రాజకీయాల్లోనూ ప్రాధాన్యమున్న పాత్రలే పోషించారు, పోషిస్తున్నారు.
'తొలి' అడుగులు
'భక్త ప్రహ్లాద' కోసం ప్రత్యేకంగా గీతాలు రాసిన చందాల కేశవదాసు తొలి గీత రచయిత. ఆ చిత్రంలో నటించిన 'సురభి' కమలాబాయి తొలి తెలుగు కథానాయిక. స్వరాలు కూర్చిన హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి తొలి తెలుగు సంగీత దర్శకుడు.
తెలుగులో రూపుదిద్దుకున్న పూర్తిస్థాయి రంగుల చిత్రం 'లవకుశ'. 1963లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది.
'ప్రేమ విజయం' (1936) తొలి సాంఘిక చిత్రంగా ఘనత సాధించినా... సినిమాగా మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.
తొలి తెలుగు సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు'(1965). కృష్ణ సహా దాదాపుగా అంతా కొత్తవారే. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. నిజానికి చాలా 'తొలి...' చిత్రాలు సూపర్స్టార్ కృష్ణతోనే ముడిపడ్డాయి. తొలి తెలుగు కౌబాయ్ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'. తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు'. తొలి తెలుగు 70 ఎమ్ఎమ్ 'సింహాసనం'.
అంజలీ పిక్చర్స్ 'పరదేశి'లో అంజలి, అక్కినేని నాగేశ్వరరావులపై తీసిన ఓ పాటలో 'స్లోమోషన్' టెక్నిక్ను తొలిసారిగా ఉపయోగించారు.
తొలి ద్విపాత్రాభినయ చిత్రం 'అపూర్వ సహోదరులు' (రంజన్), తొలి త్రిపాత్రాభినయ చిత్రం 'కుల గౌరవం' (ఎన్టీఆర్), తొలి పంచపాత్రాభినయ చిత్రం 'శ్రీమద్విరాట పర్వం' (ఎన్టీఆర్), తొలి నవపాత్రాభినయ చిత్రం 'నవరాత్రి' (ఏఎన్ఆర్).
మనదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైన మొట్టమొదటి దక్షిణాది చిత్రం 'పాతాళభైరవి'. విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం 'మల్లీశ్వరి'
తొలి సోషియోఫాంటసీ చిత్రం 'దేవాంతకుడు'. తొలి త్రీడీ చిత్రం 'జై బేతాళ'. వినోదపు పన్ను మినహాయింపు పొందిన తొలి చిత్రం 'తీర్పు'. తొలి తెలుగు అపరాధ పరిశోధన చిత్రం 'దొరికితే దొంగలు'
పరభాషలోకి అనువాదమైన తొలి చిత్రం 'కీలుగుర్రం' (తమిళంలో -మాయ కుదిరై). శతదినోత్సవ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం 'బాలరాజు' (1948).
ప్రజల్లో భూస్వామ్య వ్యవస్థ పట్ల వ్యతిరేకతను పెంచుతోందనే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో జమీందార్లు 'రైతుబిడ్డ' (1939) చిత్ర ప్రదర్శనల్ని నిలిపేశారు. అలా, తొలి నిషేధిత చిత్రం కూడా ఇదే.
తొలి నవలా, హాస్యచిత్రం 'బారిస్టరు పార్వతీశం'. తొలి మహిళా దర్శకురాలు సావిత్రి.
'విజయా సంస్థ' నిర్మించిన 'షావుకారు' చిత్రం టైటిలు కింద 'ఇరుగు పొరుగుల కథ' అని వేశారు. టాగ్లైన్ సంస్కృతికి ఇదే మూలం కావచ్చు.
తెలుగు పిక్చర్ ప్యాలెస్
పుల్లయ్యగారికి టూరింగ్ టాకీసుల వ్యాపారం ఉండేది. ఏదో ఓ చోట టాకీసు ప్రారంభించడం, కొంతకాలం విజయవంతంగా నడిపించి...పరిసర ప్రాంతాల్లోని సంపన్నులకు గిట్టుబాటు బేరానికి అమ్మేయడం...ఇంకో చోట, మరో టూరింగ్ గుడారం పాతేయడం. వ్యాపారం బాగానే నడిచేది. 1921లో విజయవాడలో ప్రారంభమైన తొలి శాశ్వత సినిమా థియేటర్...మారుతీ సినిమా. దీని యజమాని పోతిన శ్రీనివాసరావు. డూండీ పిక్చర్స్ అధినేత డూండీశ్వరరావు, మారుతీ సినిమా అధినేత బెనర్జీ ఆయన కుమారులే. తొలి టాకీచిత్రం 'ఆలం ఆరా' బొంబాయిలో విడుదలైన రోజే మారుతీలోనూ విడుదలైంది. అప్పటి పరిస్థితులతో పోలిస్తే...థియేటర్లో మంచి సౌకర్యాలే ఉండేవి. పుల్లయ్యగారి ప్రోత్సాహంతో పూర్ణా మంగరాజు థియేటర్ల నిర్మాణానికి పూనుకున్నారు. కలకత్తా-మద్రాసుల మధ్య తొలిసారిగా టాకీ ఎక్విప్మెంట్ను అమర్చిన ఘనత ఆయనదే. విజయవాడలో మారుతి, కాకినాడలో మినర్వా (యజమాని సి.పుల్లయ్య), రాజమండ్రిలో మినర్వా (యజమాని నిడమర్తి సూరయ్య), విశాఖలో పూర్ణా (మంగరాజు)... అప్పట్లో పేరున్న థియేటర్లు. రానురాను సంఖ్య పెరిగింది. థియేటర్లు సరికొత్త సౌకర్యాల్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకున్నాయి. రెండుమూడు ప్రింట్లతో మొదలైన తెలుగు సినిమా 'మాలపిల్ల' (1938) నాటికి ఎనిమిది ప్రింట్లకు చేరింది. ఇప్పుడైతే... వేయి థియేటర్లకైనా సై!
తొలి ఏసీ థియేటరుగా సికింద్రాబాద్లోని ప్యారడైజ్, తొలి 70 ఎమ్ఎమ్ థియేటరుగా హైదరాబాద్లోని రామకృష్ణ రికార్డుకెక్కాయి. ప్రసాద్స్ ...తెలుగు ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ అనుభూతిని తొలిసారిగా రుచి చూపించింది. ఆస్కార్లు సాధించిన ఆంగ్లచిత్రం 'అవతార్'... ప్రపంచంలోనే అతి ఎక్కువ రోజులు అడింది ఏ అమెరికాలోనో కాదు ... హైదరాబాద్లోని ప్రసాద్స్లో!
మన స్టూడియోలు
తొలిరోజుల్లో మనవాళ్లు ఏ కలకత్తాకో షోలాపూర్కో వెళ్లి సినిమాలు చిత్రించుకుని వచ్చేవారు. తొలిసారిగా...ఉమ్మడి రాజధాని మద్రాసులో పినపాల వెంకటదాసు వేల్ పిక్చర్స్ స్టూడియోను నిర్మించారు. 'సీతాకల్యాణం' షూటింగ్ జరుపుకొన్నది ఇక్కడే. ఆతర్వాత తెలుగువారి యాజమాన్యం కింద మద్రాసులో చాలా స్టూడియోలే వెలిశాయి. 1936లో నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో దుర్గా సినీటోన్ స్టూడియోను ప్రారంభించారు. ఇక్కడే 'సంపూర్ణ రామాయణం' పేరుతో ఓ సినిమా తీశారు. పరిపూర్ణంగా తెలుగు నేలమీదే తీసిన చిత్రమిది. ఆతర్వాత విశాఖపట్నంలో ఆంధ్రా సినీటోన్ నిర్మితమైంది. సి.పుల్లయ్య కలలపంట ఈ స్టూడియో. 1959లో హైదరాబాద్లో సారథి స్టూడియో ఆరంభమైంది. ఆతర్వాత 'అన్నపూర్ణ', 'రామకృష్ణా', 'పద్మాలయ', 'రామానాయుడు' స్టూడియోలు వచ్చాయి. రామోజీ ఫిల్మ్సిటీతో తెలుగు సినీ స్టూడియోల ఘనత విశ్వవ్యాప్తమైంది. హాలీవుడ్ చిత్రాల నిర్మాణానికీ ఫిల్మ్సిటీ వేదికవుతోంది.
ఒకటోసారి...రెండోసారి...
దాదాపుగా ఒకే కథను...రెండుసార్లు, మూడుసార్లు సినిమాగా తీసిన సందర్భాలున్నాయి. అలాంటి చిత్రాల్లో ముందుగా 'లవకుశ' గురించి చెప్పుకోవాలి. మొట్టమొదటి 'లవకుశ' 1934లో వచ్చింది. రెండోది 1963లో వచ్చింది. మొదటి చిత్రంలోని వారంతా దాదాపుగా నాటకరంగంలోనివారే. రెండు చిత్రాలకూ ఒకరే దర్శకులు...పుల్లయ్యగారు. బాపూరమణల 'శ్రీరామరాజ్యం'తో లవకుశుల కథ ముచ్చటగా మూడోసారి తెరకెక్కింది. భక్తరామదాసు చరిత్ర కూడా మూడు చిత్రాలుగా వచ్చింది. మొదటి 'రామదాసు' 1933లో విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ భద్రాచలం మొదలు హిమాలయాల దాకా చాలా ప్రాంతాల్లో జరిగింది. అప్పట్లోనే పాతికవేల బడ్జెట్తో భారీగా తీశారు. అప్పటికే ప్రాచుర్యం పొందిన రామదాసు నాటకబృందం వారే ఈ చిత్రంలో నటించారు. ఘంటసాల రాధాకృష్ణయ్య ఆ బృందానికి నాయకుడు, చిత్రానికి దర్శకుడు. రెండో 'రామదాసు' 1964లో వచ్చింది. చిత్తూరు నాగయ్య దర్శకనిర్మాత. నైజాం ప్రాంతంలో హిందూముస్లింల మధ్య ఐక్యత పెంపొందించడానికి నిజాం నవాబు కోరికమేరకు తీశారు. నిజానికి, ఖర్చంతా నైజాం సర్కారే భరించాల్సి ఉంది. అంతలోనే ... సర్దార్ పటేల్ నేతృత్వంలోని భారత సైన్యం నిజాం సంస్థానంపై మువ్వన్నెల జెండా ఎగురవేసింది. చిత్రాన్ని పూర్తి చేయడానికి నాగయ్య నానా కష్టాలూ పడ్డారు. మూడోది...నాగార్జున హీరోగా వచ్చిన 'శ్రీరామదాసు'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని హృద్యంగా మలిచారు. తెలుగువారి దృశ్యకావ్యం 'మాయాబజార్' రెండుసార్లు పౌరాణిక చిత్రంగా, ఒకసారి సాంఘిక చిత్రంగా, ఒకసారి సాంకేతిక అద్భుతంగా...మొత్తం నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిసారి 1936లో విడుదలైంది. చిత్ర దర్శకుడు పి.వి.దాసు. ట్రిక్షాట్స్ అద్భుతంగా పేలాయి. సినిమా విజయవంతమైంది. రెండో 'మాయాబజార్' (1957) మహామహులు ...ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం తదితరులు నటించిన చిత్రరాజం. మూడో 'మాయాబజార్' (1995) దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సాంఘిక చిత్రం. అక్కినేని కథానాయకుడు. నాలుగో 'మాయాబజార్' ఓ సాంకేతిక అద్భుతం. పాత చిత్రమే పూర్తిరంగులతో రెండేళ్లక్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'గ్లోబల్' సినిమా
అజంతాల తెలుగే కాదు, అందమైన తెలుగు సినిమా కూడా దిగంతాలకు వ్యాపించింది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో...మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కొత్త సినిమా విడుదలైందంటే చాలు, ప్రవాసులకు కొత్తావకాయ జాడీ దొరికినట్టే. మహేష్బాబు, పవన్ కల్యాణ్, జూ.ఎన్టీఆర్...చిత్రాలకు తిరుగులేని ఆదరణ ఉంది. రాజమౌళి, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రవాసుల అభిమాన దర్శకులు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఈగ', 'బొమ్మరిల్లు', 'హ్యాపీడేస్' తదితర చిత్రాలు ఆదరణ పొందాయి. అమెరికా లాంటి చోట్ల అయితే, తెలుగు సినిమాల కోసమే ప్రత్యేకంగా కొన్ని థియేటర్లున్నాయి. ఓవర్సీస్ హక్కుల కోసమూ పోటీ పెరుగుతోంది.
సాహితీ చిత్రాలు
ఉత్తమ సాహిత్యానికి సమాజంలో మూలాలు ఉంటాయి. సమకాలీన వ్యవస్థలోని వ్యక్తులే పాత్రలు, సంఘటనలే ఇతివృత్తాలు. ఏ సినిమా అయినా ఘన విజయం సాధించాలంటే సమాజం ఆమోదించాలి, ప్రేక్షకులు మెచ్చాలి, మళ్లీమళ్లీ చూడాలి. మంచి సినిమాకు అవసరమైన ముడిసరుకు సాహిత్యంలో పుష్కలంగా ఉంటుంది. భారత భాగవతాల వంటి పురాణాల నుంచి నవలలూ నాటకాల దాకా... చక్కని సినిమా కథలుగా ఉపయోగపడుతున్నాయి. అందులోనూ తెలుగువారికి 'వన్సుమోర్లు' కొట్టించుకోగల పద్యసంపద ఉంది. సినిమా పరిశ్రమ ఆ అక్షర అక్షయపాత్రను అద్భుతంగా ఉపయోగించుకుంది. చింతామణి, బారిస్టరు పార్వతీశం, వరవిక్రయం, కన్యాశుల్కం, మాలపిల్ల్ల, రక్తకన్నీరు, ఏకవీర, చక్రభ్రమణం, బలిపీఠం, సెక్రటరీ...తదితర రచనలు సినిమాలుగా తెరకెక్కాయి. పాండవోద్యోగ విజయాలు, సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం వంటి పద్యనాటకాలు వెండితెర ద్వారా మరింత ఆదరణ పొందాయి. శ్రీరమణ కథ 'మిథునం' కూడా ఈమధ్యే తెరకెక్కింది. మనవాళ్లు బెంగాలీ సాహిత్యాన్నీ వదల్లేదు. నాటకాలూ నవలలూ సినిమాలుగా రావడంతో ప్రారంభమైన ధోరణి...అంతటితో ఆగిపోలేదు. విజయవంతమైన వెండితెర సినిమాలు స్టేజీ నాటకాలుగా కొత్త అవతారం ఎత్తాయి. ఇప్పటికీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల సినిమాల ఆధారంగా తయారైన నాటకాలు చాలా ప్రాంతాల్లో ప్రదర్శితం అవుతున్నాయి. అంతేకాదు, పాపులర్ సినిమాల స్క్రిప్టులూ రూపకల్పన అనుభవాలూ పుస్తకాల రూపంలో వస్తున్నాయి. సినీ-సాహిత్యాల ఇచ్చిపుచ్చుకునే ధోరణి అటు సినిమాలకూ ఇటు సాహిత్యానికీ ఎంతోకొంత మేలు చేస్తూనే ఉంది.
'మనిషినైతే వందేళ్లు నిండుగా జీవించమని ఆశీర్వదిస్తాం. సినిమా సంగతేమిటి? వెయ్యేళ్లు బతకమన్నా...తక్కువే అవుతుంది? పదివేల ఏళ్లంటే సరిపోతుందా?'...ముహూర్తం షాట్లకు వెళ్లే పురోహితుడు తనకు వేదం నేర్పిన గురువుగార్ని అడిగాడు.
'ఒరే అబ్బాయ్! భారతీయ సంప్రదాయంలో వేయి అనంతానికి ప్రతీక. విష్ణుసహస్రనామాలంటే, విష్ణుమూర్తికి వేయిపేర్లు మాత్రమే ఉన్నాయని అనుకోకూడదు. వేయి నామాలవాడు అనంతమైన పేర్లవాడని అర్థం. సినిమా ఇండస్ట్రీ వెయ్యేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తే... వెయ్యిన్నీ ఒకటో ఏడు టపా కట్టెయ్యాలని కాదు. చిరకాలం కళకళలాడాలని భావం. అయినా, సినిమా చిరంజీవి. మనిషి ఉన్నంతకాలం, మనిషికి వినోదం అవసరమైనంత కాలం...నిక్షేపంగా ఉంటుంది. కాకపోతే, ప్రేక్షకుడు థియేటర్కు వెళ్తాడా, థియేటరే ప్రేక్షకుడి దగ్గరికి వస్తుందా అన్నది ఎప్పటికప్పుడు మారే టెక్నాలజీని బట్టి ఉంటుంది' స్పష్టతనిచ్చారు గురువుగారు.
(ఈనాడు , సండే స్పెషల్ , 28:04:2013)
_______________________________________
Labels: Cinima/ Telugu, Personality, Telugu/ culture
Friday, April 19, 2013
1101- శ్రీరామ నామాలు శతకోటి
' రామ' రెండే అక్షరాలు... కానీ ఎంత సాహిత్యం! 'రామ' అనే శబ్దాన్ని తిరగేసి పలికినా అక్షర జ్ఞానం లేని ఆటవికుడు ఆదికవిగా మారాడు! విశ్వానికి తొలి కావ్యాన్ని ప్రసాదించాడు. అది మొదలు ఎన్నో భాషల్లో ఎన్నో కావ్యాలు. పద్యాలుగా, పదాలుగా, పాటలుగా పల్లవించాయి. రామనామ గానామృతభాండాన్ని తరతరాలకూ తరగని సంపదగా అందిస్తున్నాయి. తెలుగు చలన చిత్రాల్లో సైతం రాముడి పాటలకు రత్నాల సింహాసనం మీద పట్టాభిషేకం జరిగింది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా 'పాలు మీగడల కన్న పంచదార చిలకల కన్న' ఎంతో రుచికరమైన కొన్ని పాటల్ని తీర్థప్రసాదాల్లా కళ్లకద్దుకొందాం...
రాముడి పాటలు అనగానే ఒక తరంవారికి వెంటనే గుర్తుకొచ్చే కవి సీనియర్ సముద్రాల. వాహిని వారి 'దేవత'లో 'రామ భజనే మోదజనకమురా' అని శ్రీరాముడిపై తొలిసారిగా రాసిన సముద్రాల... ఆ తరవాత 'భక్త పోతన'లో 'సర్వమంగళ నామా రామా...' లాంటి పాటలతో భజన గీతాల సంప్రదాయానికి సరికొత్త ఒరవడిని సృష్టించారు. 'భూకైలాస్'లో శ్రీరామచంద్రుడి అవతార భవిష్యద్దర్శనం చేస్తూ ఆయన రాసిన 'రాముని అవతారం...' పాట చిరస్థాయిగా నిలిచిపోయింది. 'లవకుశ', 'వాల్మీకి' చిత్రాల్లో సముద్రాల వారి రామకథా గీతాలు ఆపాత మధురాలు. వారి చిట్టచివరి సినిమా పాట సైతం రామాయణ గీతమే కావడం విశేషం. అది... 'శ్రీరామకథ'లోని 'రామకథా... శ్రీరామ కథా...' గీతం.
సీనియర్ సముద్రాల కలం వారసుడు జూనియర్ సముద్రాల కూడా తన రామభక్తిని అక్షరాల్లో చూపించారు. ఆయన 'శాంతినివాసం' చిత్రం కోసం 'శ్రీరఘురాం జయ రఘురాం...', 'జయసింహ'లో 'జయ జయ శ్రీరామా రఘువరా...' గీతాలు రాశారు.
పదములే చాలు:
నీలమేఘ శ్యాముడిపై రాయడంలో దేవులపల్లి కృష్ణశాస్త్రిది మరో శైలి. భక్తీ, కరుణ, పరిపూర్ణ శరణాగతి, భావుకత రంగరించి దేవులపల్లి హృదయాల్ని తాకేలా రాశారు. 'ఏమి రామ కథ శబరీ...' (భక్త శబరి), 'వూరికే కొలను నీరు...' (సంపూర్ణ రామాయణం), 'పదములే చాలు రామా' (బంగారు పంజరం), 'ఈ గంగకెంత గుబులో' (శ్రీరామ పట్టాభిషేకం) లాంటి ఆణిముత్యాలతో ఆయన గీతార్చన చేశారు. రాముడి పాటల అల్లికలో ఆరుద్రది విశిష్ట ముద్ర అని చెప్పాలి. తిలక్, బాపు-రమణల చిత్రాల్లో ఆయన కలం నుంచి జాలువారిన రాముడి పాటలు సాహితీ విలువలతో వాసికెక్కాయి. 'అశోక వనమున సీతా...' (అత్తా ఒకింటి కోడలే), 'అందాలా రాముడు... ఇందీవర శ్యాముడు' (ఉయ్యాల జంపాల), 'పలుకే బంగారమాయెరా..' (అందాల రాముడు), 'శ్రీరామ జయరామ సీతారామ' (ముత్యాల ముగ్గు), 'రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా' (గోరంత దీపం), 'శ్రీకరమౌ శ్రీరామ నామం' (శ్రీరామాంజనేయ యుద్ధం) లాంటి పాటలు ఆయనవే. ఇక ఆరుద్ర రాసిన మరో ఆణిముత్యంలాంటి రామ గీతం 'మీనా' చిత్రంలో ఉంది. అదే... 'శ్రీరామ నామాలు శతకోటి'. ఈ గీతం నేటికీ జనాదరణ పొందుతూనే ఉంది.
మా వూరి దేవుడు:
మన దేశంలో రాములవారి గుడి లేని వూరు ఉండదంటారు. కాబట్టే మన దర్శకులు అవకాశం వచ్చినప్పుడల్లా రామాలయాన్నీ, స్వామి విగ్రహాల్నీ తమ కథలో భాగం చేసుకొంటారు. అందుకు తగ్గ విధంగానే సాహిత్య విలువలున్న గీతాలూ రాయించుకొంటారు. ఆ పాట రాసే అవకాశం వచ్చినప్పుడల్లా మన కవులు భక్తి పారవశ్యంతో కలాన్ని పరుగులు తీయించారు. దాశరథి - 'రాముని రూపమే' (పెళ్లికూతురు), 'జగదభిరామా రఘుకులసోమా' (రామాలయం); సి.నారాయణరెడ్డి - 'మముబ్రోవమని చెప్పవే..' (అందాల రాముడు), శ్రీశ్రీ - 'శ్రీనగజాతనయం' (వాగ్ధానంలో హరికథ), కొసరాజు - 'శ్రీరామ నీ నామమెంతో రుచిరా' (ఇద్దరుమిత్రులు), 'రామయ తండ్రి...' (సంపూర్ణ రామాయణం); వేటూరి - 'మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు' (పంతులమ్మ), 'మా వూరి దేవుడు అందాల రాముడు' (అల్లుడా మజాకా); కులశేఖర్ - 'కోదండ రాముణ్ని చూడు...' (శీను వాసంతి లక్ష్మి) ఆ భక్తి గీతాల జాబితాలోనివే. ఇటీవల వచ్చిన 'శ్రీరామరాజ్యం'లో జొన్నవిత్తుల రాసిన గీతాలు, 'శ్రీరామదాసు'లో కీరవాణి స్వరపరచిన రామదాసు గీతాలను నవతరం శ్రోతలు విని తన్మయులయ్యారు.
- ఓలేటి శోభ
(ఈనాడు , సినిమా ,19:04:2013)
______________________________________
Labels: Cinima/ Telugu, Religion/telugu, Telugu literature, Telugu/ culture
Thursday, November 17, 2011
సినీ సెలబ్రిటీల పుట్టినరోజులు
Labels: Cinima/ Telugu
Friday, April 30, 2010
సినిమా పాట మీద శ్రీశ్రీ సంతకం
ఆయన - ఆకలి వాకిట కేకలు వేసిన సిరిసిరి పాపడు. శబ్దాన్ని శాసించి, శతాబ్దం తనదేనని ఘోషించిన యుగపురుషుడు. ఆయన అరిస్తే పద్యమైంది... స్మరిస్తే వాద్యమైంది. ఆ కలం ఖడ్డసృష్టిలో అక్షరాక్షరం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యమైంది. 'సినిమాల చిట్టడవిలో చిక్కుకొన్న మహాకవి' అని కొందరు వాపోయినా ఆ చిట్టడవిలో దట్టమైన గీత వసంతాల్ని పూయించడం శ్రీశ్రీకి హక్కుభుక్తమైంది. మహాకవి శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలో ఓ విహంగ వీక్షణ...
________________________________
దృశ్య కావ్యాల మీద శ్రీశ్రీకి ఉన్న మక్కువ సినీ రంగంలో స్థిరపడేలా చేసింది. అంత వరకూ జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేస్తూ వచ్చిన శ్రీశ్రీ చివరి వరకూ సినిమాల్లోనే కొనసాగడానికి ఇదే కారణం. 1950లో 'నీర్ ఔర్ నందా' చిత్రాన్ని 'ఆహుతి' పేరుతో అనువదించిన శ్రీశ్రీ డబ్బింగ్ ప్రక్రియకు అంకురార్పణ చేశారు. అందులో 'ప్రేమయే జనన మరణ లీల' పాట శ్రీశ్రీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం టాకీపులి హెచ్.ఎమ్.రెడ్డి, మునాఫ్ లాంటి వారి దగ్గర శ్రీశ్రీ నెల జీతానికి కుదురుకున్నారు. అనువాద చిత్రాల ద్వారా స్థిరపడ్డ తనకు డబ్బింగ్ రైటరు అనే ముద్రపడినా పట్టించుకోలేదు. అవకాశం వస్తే విజృంభించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అన్నపూర్ణా వారి 'తోడికోడళ్లు', 'మాంగల్యబలం', 'వెలుగునీడలు', 'ఇద్దరు మిత్రులు', 'డాక్టర్ చక్రవర్తి' లాంటి చిత్రాలు - శ్రీశ్రీలోని విశ్వరూపాన్ని చూపెట్టాయి.పి.ఎ.పి.వారి 'భార్యాభర్తలు', 'కులగోత్రాలు', 'పునర్జన్మ', ఆత్రేయ 'వాగ్దానం', రాజ్యంవారి 'నర్తనశాల', రేఖా అండ్ మురళీ 'దేవత', జగపతివారి 'ఆరాధన', సురేష్ ప్రొడక్షన్స్ 'రాముడుభీముడు' చిత్రాల్లో శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన గీతాలు ఆల్టైమ్ హిట్స్గా నిలిచాయి.
హీనంగా చూడకుదేన్నీ:
నిజానికి డబ్బింగ్ గీతాల్లో సైతం శ్రీశ్రీ ప్రయోగాలు చేశారు. 'హీనంగా చూడకు దేన్నీ... కవితామయమేనోయి అన్నీ' అని పరోక్షంగా స్పష్టం చేశారు. తొలి చిత్రం 'ఆహుతి'లో సంగీత దర్శకులు ఎస్.రాజేశ్వరరావు సందర్భోచితంగా తాళం బిట్లు తీసుకొని, వేరే ట్యూన్స్ సమకూరిస్తే వాటికి తగ్గట్టుగా శ్రీశ్రీ రాసిన పాటల్ని ప్రయోగంగానే భావించాలి.
అలాగే 'గాంధారి గర్వభంగం' (డబ్బింగ్) చిత్రంలోని 'పదునాలుగు లోకముల ఎదురేలేదు' అనే పాట నేపథ్యగీతం కావడంతో, లిప్సింక్ ఇబ్బంది లేకపోవడంతో దాన్ని శ్రీశ్రీ స్వతంత్ర రచనలాగే రూపొందించారు. ఈ పాట తాలూకు స్ఫూర్తి 'బాలభారతం' చిత్రంలో ఆరుద్ర రాసిన 'మానవుడే మహనీయుడు' మీద స్పష్టంగా కనిపిస్తుంది.అనువాద ప్రక్రియకు మెలకువలు చెప్పిన ఘనత కూడా ఈయనదే. పరాయి పలుకులు తెలుగు మాటలుగా వినిపించాలంటే ఏం చెయ్యాలీ, ఎలా చెయ్యాలనే విషయానికో మార్గం వేశారాయన. ప, ఫ, బ, భ, మ అనే ఓష్ట్యాల విషయంలో జాగ్రత్త పాటించాలని సూచించింది శ్రీశ్రీయే.
వైవిధ్యం ఆయన సొంతం:
రాశిలో తక్కువే అయినా వాసిగల సినిమా పాటల్ని శ్రీశ్రీ రాశారు. నిప్పులురిమే ఉద్యమ గీతాలకో, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలకో, జాతిని జాగృతపరచే ప్రబోధాత్మక రచనలకో ఆయన పేటెంట్ కావచ్చుగాక. స్వేచ్ఛ లభించిన సందర్భాల్లో ఆయన్నించి చిలిపి సినీగీతాలు వెలువడ్డాయి. గిలిగింతలు పెట్టే సాహిత్యం శ్రీశ్రీ కలం నుంచి వెలువడింది.
మీసాల మీద సీసం రాయడం శ్రీశ్రీకే చెల్లింది. 'సదమల మదగజ గమనము'తో తెలుగు సినిమాలో హరికథను చెప్పించడం ఆయన హక్కుభుక్తమైంది. వీణపాటలకు ప్రాచుర్యం శ్రీశ్రీతోనే మొదలైంది. పాడవోయి భారతీయుడా అని ప్రతి పౌరుడితోనూ పాడించినా, బతుకును కన్నీటిధారలకు బలిచేయవద్దని ప్రబోధించినా, బొమ్మను చేసి ప్రాణము పోసిన వాడిలోని ఆడుకొనే వేడుకను ప్రశ్నించినా, మనసున మనసైన తోడు కోసం సితార మీటినా, తెలుగువాడి పౌరుషాగ్నితో మన్యంలో మంటలు పుట్టించి తెలుగు సినిమా పాటను తొలిసారిగా జాతీయ పురస్కారంతో అలంకరించినా అది మహాకవి శ్రీశ్రీకే సాధ్యమైంది.
ఆశావహ దృక్పథం:
'చెవిలో రహస్యం' పేరుతో ఓ డబ్బింగ్ చిత్రాన్ని తీసి ఆర్థికంగా దెబ్బతిన్న శ్రీశ్రీ తన వ్యక్తిగత సమస్యల్ని సినిమా రచనపై ప్రసరించకుండా 'ప్రొఫెషనల్' స్థాయిని కనబరిచారు. ముందున్న మంచి కాలాన్ని తన గీతాల్లో ఉజ్వలంగా ప్రదర్శించారు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురుచూడకుండా నిజం తెలుసుకొని నడుంబిగించమని ఉద్బోధించారు.
శ్రీశ్రీ పాటలకే పరిమితం కాలేదు. ఎన్నో చిత్రాలకు చిత్ర సంవిధానాన్ని సమకూర్చి పదునైన సంభాషణలు కూడా రాశారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో తెలుగు సినిమాలు రావాలని, సొంతంగా తీయాలని శ్రీశ్రీ కన్న కలలు అలాగే మిగిలిపోయాయి. అలాంటి చిత్రాలు మనవాళ్లు తీయాలి.. అదే శ్రీశ్రీకి అసలైన నివాళి.
(ఈనాడు, సినిమా, ౩౦:౦౪:౨౦౧౦)
____________________________
Tuesday, March 24, 2009
కాంతారావు కన్నుమూత
హైదరాబాద్, న్యూస్టుడే: కత్తి యుద్ధమనగానే తెలుగు ప్రేక్షకుల మదిలోకదలాడే జానపద కళాబ్రహ్మ, కత్తుల కాంతారావు(86) ఆదివారం రాత్రికన్నుమూశారు. ఆయన అసలు పేరు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. కొంతకాలంగా ఆయన వూపిరితిత్తుల కేన్సర్తో బాధపడుతున్నారు. నాలుగురోజుల క్రితం ఉన్నట్టుండి బీపీ తగ్గడంతో కింద పడిపోయారు. దీంతోఆయన్ను హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆదివారంరాత్రి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకునలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాంతారావు మృతికిముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, తెరాసఅధ్యక్షుడు కేసీఆర్, ప్రరాపా అధినేత చిరంజీవి తదితరులు సంతాపంప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్నిసందర్శించి నివాళులర్పించారు. జానపద కళాబ్రహ్మగా పేరుగాంచినకాంతారావు 1923, నవంబరు 16న నల్గొండ జిల్లా కోదాడ మండలంగుడిబండలో జన్మించారు. పాఠశాలలో చదువుతున్న సమయంలోనేనాటక రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలోనినిర్దోషి' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్రపోషించిన కాంతారావు 'ప్రతిజ్ఞ' చిత్రంలో కథానాయకుడిగా ప్రేక్షకులమన్నన పొందారు. విఠలాచార్య, కాంతారావు కలయికలో వచ్చిన జానపదచిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 'లవకుశ' చిత్రంలోని పాత్రకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్రసర్కారు ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది. నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ' కాంతారావు చివరి దశలో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు.
కత్తి తిప్పడంలో ధాటి
నారద పాత్ర పోషణలో మేటి
జానపద కథానాయకుడిగా ఖ్యాతి
కష్టసుఖాల కలబోత కాంతారావు జీవితం


హీరో దొరికాడు: నాలుగు వందలకు పైగా చిత్రాల్లో నటించిన కత్తుల కాంతారావు స్వగ్రామం నల్గొండ జిల్లా కోదాడమండలం గుడిబండ. 1923 నవంబరు 16న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సీతారావమ్మ, తాడేపల్లి కోటేశ్వరరావు. చిన్నప్పటి నుంచీ నాటకాలంటే ఇష్టం. స్కూలు ఎగ్గొట్టి మరీ పౌరాణిక నాటకాలు చూసేవారు. దీన్ని అదుపు చేయాలనిఇంట్లోవాళ్లు తమకు వారసత్వంగా వచ్చే మాలీ పటేల్(గ్రామ మునసుబు) పదవిలో కాంతారావును కూర్చోబెట్టారు. ఆతర్వాత సురభి నాటక సమాజంతో పరిచయం పెంచుకొని కొన్నాళ్లపాటు వారి బృందంతో కలిసి ప్రదర్శనలిచ్చారు. 1950లో మద్రాసు వెళ్లారు. తొలి తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన హెచ్.ఎమ్.రెడ్డి ఆశీస్సులు కాంతారావుకిలభించాయి. ఆయన దర్శకత్వం వహించిన 'నిర్దోషి'లో చిన్న పాత్ర పోషించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనేకాంతారావు నటన చూసి ''నా తర్వాతి చిత్రానికి హీరో దొరికాడు'' అని హెచ్.ఎం.రెడ్డి ప్రకటించారట. వెంటనే ఒప్పందంరాయించుకొని నెలకు రూ.250 జీతం ఇచ్చేలా తమ సంస్థలో నటుడిగా కాంతారావుని తీసుకున్నారాయన. మహానటిసావిత్రి సరసన నటింపజేస్తూ 1953లో 'ప్రతిజ్ఞ' చిత్రం తీశారు. 1950లో వివాహం చేసుకున్న కాంతారావు 'ప్రతిజ్ఞ' చిత్రంలోని తన పాత్ర పేరు ప్రతాప్నే.. తన పెద్ద కుమారుడికి పెట్టుకున్నారు.

విఠలాచార్యతో కలిసి: 1955లో బి.విఠలాచార్య 'కన్యాదానం' చిత్రం తీశారు. ఇందులో హీరో కాంతారావు. ఈ సినిమాద్వారా ఆయనకు నటుడిగా పూర్తిస్థాయి గుర్తింపు లభించింది. అప్పట్నుంచి వీరి కలయికలో వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల్లోమంచి ఆదరణ ఉండేది. విఠలాచార్య తీసిన 'జయ విజయ'తో జానపద కథానాయకుడిగా, కత్తుల కాంతారావుగాగుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఎన్టీఆర్తో ఉన్న స్నేహం కూడా ఆయనకు లాభించింది. నాటకానుభవం, పద్యాలుపాడటంలోని నైపుణ్యం ఎన్టీఆర్ను ఆకర్షించాయి. 'శ్రీగౌరీమహత్యం'లో శివుడిగా నటించిన తీరు యావత్ దక్షిణ భారతచిత్ర వర్గాల్ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత 'భక్త మార్కండేయ', 'శ్రీరామాంజనేయ యుద్ధం' చిత్రాల్లో శివుడిగాకనిపించారు. కాంతారావు అనేసరికి నారదుడి పాత్రలు గుర్తుకు రావడం సహజం. 1958లో వచ్చిన 'గంగాగౌరీ సంవాదం' చిత్రంలో ఆయన తొలిసారి నారద పాత్రను పోషించారు. 'సీతారామ కళ్యాణం' చిత్రంలో నారదుడిగా నటించి, ఎన్టీఆర్ మెప్పుపొందారు. 'దీపావళి' చిత్ర షూటింగ్ సమయంలో కాంతారావు నటన చూసి ''నేను రాముడు, కృష్ణుడు, శివుడు పాత్రలుధరిస్తాను. నారద పాత్ర మాత్రం మీ కోసమే ఎప్పటికీ రిజర్వు చేసి ఉంచుతాను'' అన్నారట రామారావు. ఆ మాటప్రకారమే పలు చిత్రాల్లో నారద పాత్రకు ఆయన పేరు సూచించారు.


(ఈనాడు,౨౩:౦౩:౨౦౦౯)
_______________________________
Labels: Cinima/ Telugu, Personality
Friday, February 20, 2009
భారత్కీ మా.. నిర్మలమ్మ!
కొంగులాగి బిగించి 'ఒరేయ్.. ' అని కొడుకునో, మనవడినో ఉద్దేశించి తిట్లదండకాన్ని అందుకునే నిర్మలమ్మని అంత తేలిగ్గా తెలుగువారు మర్చిపోలేరు. రంగస్థల, రేడియో నాటకాల కళాకారిణిగా, వెండితెర నటిగా ఆదరాభిమానాలను పంచిన ఆమె ఇకలేరు. 'ఇప్పటికీ సినిమాల్లో నటిస్తానంటే నాకు వేషాలిచ్చేవారున్నారు. అయితే నాకు ఓపిక లేదు. తెలుగువారి గుండెల్లో ఇంత నీడనిచ్చారు. ఆ తృప్తే చాలు' అనుకుని కన్నుమూశారు. పలు భాషల్లో 900కి పైగా సినిమాల్లో నటించిన నిర్మలమ్మ జీవితాన్ని తరచిచూస్తే..* బందరు బంధం:
బందరులో పుట్టిపెరిగిన నిర్మలమ్మకు చిన్నప్పటి నుంచి చదువులు అబ్బలేదుగానీ నాటకాలంటే పిచ్చి. బందరుకు పగటివేషగాళ్లొచ్చినా, భోగం మేళం వచ్చినా అందరికన్నా ముందుగా పరుగులు తీసేది. చిన్నతనంలో తోటివారిని కూడబెట్టుకుని తనే చిన్న నాటకాలను రచించి అందరి చేతా వేయించి ప్రధాన పాత్రధారిగా మిగిలేది. 19వ ఏట జి.వి.కృష్ణారావుతో పెళ్లి ఖాయమైనా నాటకాలు వేయనిస్తేనే పెళ్లి అని వాగ్దానం తీసుకుని మరీ మూడుముళ్లు వేయించుకుంది.
* పృథ్విరాజ్ మాట:
కాకినాడలో 'కరవురోజులు' నాటకంలో ఈమె పాత్రను చూసిన పృథ్విరాజ్కపూర్ 'గొప్ప నటివవుతావు' అని చెప్పారట. ఆ సంఘటనని చాలా సందర్భాల్లో గుర్తుచేసుకునేది నిర్మలమ్మ. అప్పట్లో 'ఏకవీర' నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసి విశ్వనాథ సత్యనారాయణగారు 'పిచ్చి మొద్దూ నీలో ఇంత నటన ఉందనుకోలేదు' అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
* రేడియో నిర్మలమ్మ:
నాటకాలతో మెప్పుపొందాలని ప్రయత్నించిన నిర్మలమ్మకు విజయవాడ రేడియో స్టేషన్ ప్రోగ్రామ్స్ వూరటనిచ్చాయి. ఆ రోజుల్లో రేడియో కార్యక్రమాల గురించి ముందుగానే ప్రకటనలిచ్చేవారట. నిర్మలమ్మ కార్యక్రమాల కోసం ప్రత్యేక శ్రోతలు ఉండేవారు. ముఖ్యంగా 'చిత్రాంగి' ఏకపాత్రాభినయం కోసం!
* హిందీ రాదే:
నిర్మలమ్మ 'ఆడపెత్తనం'లో హీరోయిన్గా చేయాల్సింది. కానీ మిస్సయింది. తరవాత ఆమె 'గరుడ గర్వభంగం'లో చేసింది. కానీ నటిగా పేరు తెచ్చింది మాత్రం 'మనుషులు మారాలి'. ఆ సినిమా శతదినోత్సవ వేడుకకు వెళ్లిన నటుడు ప్రాణ్ నిర్మలమ్మ కాళ్లకు నమస్కారం చేసి 'నువ్వు శోభన్బాబుకు మాత్రం కాదు. భారత్కీ మా' అని అన్నారట. అప్పుడు అతనితో నాలుగు మాటలు హిందీలో మాట్లాడలేకపోయానని అంటుండేది నిర్మలమ్మ.
* బాధపడ్డ క్షణాలు:
జీవితంలో హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి. దగ్గర పనిచేయలేకపోయామేనన్న బాధ నిర్మలమ్మకు బాగా ఉండేది. రఘుపతి వెంకయ్య అవార్డులు వంటివి తమలాంటి వారికి అందట్లేదని ఆమె అవసాన దశలో చాలా బాధపడేవారు.
ప్రముఖుల నివాళి* షూటింగ్ గ్యాప్లో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందుకే అందరం నిర్మలమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-అక్కినేని నాగేశ్వరరావు, సినీ నటుడు
* నటనకు నూతన భాష్యం చెప్పిన నిర్మలమ్మ కన్నుమూత దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రతి పాత్రలోనూ ఆమె పరకాయ ప్రవేశం చేసేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి
-చిరంజీవి, ప్రరాప అధినేత
* అందరినీ ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా పలుకరించే నిర్మలమ్మ ఇకలేరన్న విషయం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాం.
-మూవీ ఆర్ట్సిస్ట్ ఆసోసియేషన్
* తెలుగు పరిశ్రమకు పెద్దదిక్కు. పదహారణాల తెలుగు బామ్మ ఇకలేరు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం.
- తమ్మారెడ్డి భరద్వాజ, టీవీడీ ప్రసాద్
-చలనచిత్ర నిర్మాతల మండలి.
తెలుగు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, కృష్ణ, విజయనిర్మల, జమున, రాజేంద్రప్రసాద్, రామ్చరణ్, గీతాంజలి, రేలంగి నరసింహారావు, అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు

(ఈనాడు, ౨౦:౦౨:౨౦౦౯)
_____________________________________
Labels: Cinima/ Telugu, Personality
Wednesday, February 11, 2009
హాస్య నటుడు నగేష్ కన్నుమూత

చెన్నై, న్యూస్టుడే:
ప్రముఖ హాస్యనటుడు నగేష్ ప్రేక్షకులకు విషాదాన్ని పంచి కనిపించని లోకానికి వెళ్లిపోయారు. అస్వస్థత కారణంగా చెన్నైలోని స్వగృహంలో శనివారం[31:01:2009] ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు వెయ్యి చిత్రాల్లో నటించిన ఘనతనుఆయన సొంతం చేసుకున్నారు. ఆయన భార్య 2006లో చనిపోయారు. 1933 సెప్టెంబరు 27న కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు సమీపంలోని చెయ్యూరులో కృష్ణారావు, రుక్మిణమ్మ దంపతులకు జన్మించిన నగేష్ అసలు పేరు గుండురావు.
తెలుగు ప్రేక్షకులకు నగేష్గా పరిచయం ఉన్న ఆయనను చిత్ర పరిశ్రమలో నాగేష్గా పిలుస్తారు. నాటకాలపై మక్కువతో తొలుత రంగస్థల నటుడిగా అవతారమెత్తారు. కొంతకాలం రైల్వేశాఖలో ఉద్యోగం చేశారు. అనంతరం దానికి స్వస్తి చెప్పి సినిమాల్లో నటించేందుకు చెన్నై చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్కుమిళి చిత్రం ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యారు. నగేష్ నటించిన చివరి చిత్రం కమల్హాసన్ పదిపాత్రలు పోషించిన దశావతారం. 75 ఏళ్ల నగేష్కు ఆనంద్బాబు, రమేష్బాబు, రాజేష్బాబు అనే కుమారులున్నారు. వీరిలో ఆనంద్బాబు నటుడు.
నగేష్ మరణవార్త తెలియగానే తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, కమల్హాసన్, మనోరమ, వైజీ మహేంద్రన్, పాండిరాజన్, కుమరిముత్తు, నాంజిల్ మనోహర్, జీవా, దర్శకులు ఎస్ఏ చంద్రశేఖర్, ముక్తా శ్రీనివాసన్ తదితరులు నగేష్కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం చెన్నై బెసెంట్నగర్ శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆయన మహానటుడు... రజనీకాంత్:
నగేష్ దక్షిణాది చిత్రపరిశ్రమలో మహానటుడు. హాస్యమే కాక నవరసాలనూ పండించారు. సినీ పరిశ్రమలో బాగా కష్టాలు పడ్డారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు.
నాకు తీరని లోటు... కమల్హాసన్: నగేష్ మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. బాలీవుడ్ నటుడు మహ్మద్చేత గురువు అనిపించుకున్న గొప్ప నటుడు. నేను కథానాయకుడిగా నటించిన మగలిల్ మట్రుం చిత్రంలో ఆయన చనిపోయే పాత్రలో నటించారు. ఇప్పుడు ఆయన్ను నేను ఆ పాత్రలో వ్యక్తిగానే చూస్తున్నాను.

చిత్రసీమకు తీరని లోటు:
వైఎస్, బాబు, చిరు
హైదరాబాద్, న్యూస్టుడే: ప్రముఖ హాస్యనటుడు నగేష్ మృతి చిత్రసీమకు తీరని లోటని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో తనదైన నటనతో ఆయన చెరగని ముద్ర వేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాస్యనటుడు నగేశ్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారమిక్కడ వేర్వేరు ప్రకటనల్లో వారు నగేశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మృతి తెలుగు, తమిళ చిత్రరంగాలకు తీరని లోటని పేర్కొన్నారు.
(ఈనాడు, ౦౧:౦౨:౨౦౦౯)
_______________________________________
Labels: Cinema, Cinima/ Telugu, Personality








































