My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, October 30, 2006

ఎగనామాలకు విరుగుడు

ఒకప్పుడు ఆడపిల్లలకు పెద్ద చదువులు అక్కరలేదనీ, కాస్త అక్షరజ్ఞానం ఉంటే చాలనీ భావించేవారు. కాలంతోపాటు అభిప్రాయాలూ మారిపోయాయి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరికీ విద్య అవసరమే అన్న అవగాహన అందరికీ కలిగింది. అందుకే తల్లిదండ్రులు పిల్లలందరికీ మంచి చదువులు చెప్పించాలనే ప్రయత్నిస్తున్నారు. ''విద్య అనేది సముద్రం లాంటిది... తరిచినకొద్దీ లోతులు స్ఫురిస్తుంటాయి... అంతు మాత్రం దొరకదు'' అన్నారు రాహుల్ సాంకృత్యాయన్. మిగతా హంగులెన్ని ఉన్నా, ఎంత సంపద ఉన్నా- విద్య లేకపోతే అవేమీ రాణించవు. ''విద్య లేనట్టి విభవమ్ము రోత...'' అన్నారు. (చదువుకున్నవారికి లభించేటంత గౌరవం సమాజంలో మిగతావారికి లభించదు. ఎంత చదువుకున్నా ఎన్ని విద్యలు నేర్చినా వినయ వివేకాలు తోడుంటేనే ఏ విద్య అయినా రాణిస్తుంది. ''విద్యయొసగును వినయంబు వినయమునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము...'' అంటూ ప్రారంభించిన కవి- ''ధనమువలనను ధర్మంబు దానివలన నైహికాముష్మిక సుఖములందు నరుడు...'' అంటూ పద్యాన్ని ముగించారు. సరైన చదువువలన ఇన్ని లాభాలున్నాయని ఇటువంటి హితోక్తుల వల్ల అర్థమవుతుంది. ఆరోజే అబ్బాయిని స్కూల్లో చేర్పించారు. సాయంకాలానికి స్కూలునుంచి ఇంటికొచ్చిన కొడుకును- ''ఎలా ఉంది బుజ్జీ స్కూలు? టీచరు పాఠాలు బాగా చెబుతోందా?'' అని అడిగింది తల్లి. ''ఏం బాగో... వరస చూస్తే రేపు కూడా స్కూలుకు వెళ్ళాల్సి వచ్చేట్లే ఉంది...'' అన్నాడు సుపుత్రుడు గంభీరంగా.
''స్కూల్లో చదవటం నేర్పేమాట నిజమేకాని ఏ పుస్తకం చదవాలో ఏ పుస్తకం చదవకూడదో మాత్రం నేర్పరు...'' అంటూ విద్యా విధానంపై చిన్నచురక వేశారో రచయిత. వెనకటి చదువులకు, ఆ పద్ధతులకు నేటి విద్యకు ఇప్పటి విధానానికి చాలా తేడా ఉంది. ''వేదమూ, శ్రౌతమూ, స్మార్తమూ, జ్యోతిశ్శాస్త్రమూ, మంత్రశాస్త్రమూ, వీటి సమ్యగ్బోధకు సాహిత్య విద్యా- మా కుల విద్యలివి'' అని రాశారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన ''అనుభవాలూ జ్ఞాపకాలూను'' పుస్తకంలో. ఇంగ్లిష్ చదువుల ప్రాభవం పెరిగాక పూర్వ విద్యలన్నీ పక్కకు తప్పుకొన్నాయి. ''నాతో మాట్లాడ్డవే ఒక ఎడ్యుకేషన్...'' అని డాంబికాలు పలికే గిరీశం- ''తెల్లవాళ్ళ స్కూళ్ళల్లో మన చదువులంటే ఖాతరీ లేదండీ... ఎంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్ధిమెటిక్, ఆల్జీబ్రా, మాథమాటిక్స్- యివన్నీ హడలేసి చెప్తారండీ...'' అని కోతలు కోస్తాడు. గీగర్ఫీ అంటే జాగర్ఫీకి అన్నగారు కాబోలు అనుకొని అమాయకులు తెల్లమొహాలు పెడతారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే. ఆ చెప్పేవాడు గిరీశంలాంటి అతి తెలివితేటలు కలవాడైతే ఇహ చెప్పనే అక్కరలేదు. గిరీశంలాంటి పంతుళ్ళు ఉంటే పిల్లలకు వినోద కాలక్షేపాలకు కొదవ ఉండదుకాని అటువంటి పంతుళ్ళుకాక చదువే పరమార్థంగా చెప్పే ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండటంతో పిల్లలు స్కూలుకు వెళ్ళాలంటే ఇష్టపడక బద్దకిస్తుంటారు. ఈ పద్ధతికి స్వస్తి చెప్పించి పిల్లలు స్కూలుకు రోజూ క్రమం తప్పకుండా వచ్చేటట్లు చేయటానికో కొత్త పద్ధతి కనిపెట్టారు మధ్యప్రదేశ్‌లో.

తలనొప్పి కడుపునొప్పి కళ్ళమంటలు అంటూ రకరకాల కారణాలు వల్లెవేసి స్కూళ్ళకు ఎగనామం పెట్టే పిల్లల ఆటలు మధ్యప్రదేశ్‌లో ఇక సాగవు. నెలకోసారి పిల్లల ఇళ్ళకు వెళ్ళి వారి చదువు సంధ్యల గురించి, ప్రవర్తన గురించి తల్లిదండ్రులతో చర్చించి రావాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉపాధ్యాయులందర్నీ ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లో విద్యాప్రమాణాల స్థాయి నానాటికీ దిగజారుతోందని నిరక్షరాస్యతా ఎక్కువగానే ఉందని విమర్శలు చెలరేగుతుండటంతో విద్యాశాఖవారీ కొత్త పద్ధతి తలపెట్టారు. ''టీచర్లందరూ నెలకోసారి తమ క్లాసులోని విద్యార్థుల ఇళ్ళకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడతారు... విద్యార్థులు చదువుపట్ల చూపుతున్న శ్రద్ధను, పరీక్షల్లో తెచ్చుకుంటున్న మార్కులను గురించి చర్చిస్తారు... స్కూల్లో వారికి ఎదురవుతున్న ఇబ్బందులనూ తెలుసుకొని వాటి నివారణకు తగు చర్యలు తీసుకుంటారు. దీని వల్ల పిల్లలు చదువులో మరింత శ్రద్ధ వహించి మంచి మార్కులు తెచ్చుకోవటానికి వీలుపడుతుంది'' అని చెబుతున్నారు అక్కడి విద్యాశాఖ అధికారి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కూళ్ళన్నిటిలో ఈ విధానాన్ని అమలుపరుస్తారు. ఆ రాష్ట్రంలో విద్యాప్రమాణాలను మెరుగుపరచాలనే ప్రయత్నాలు రెండు సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటికే నేరుగా వెళ్ళి పరామర్శించే పద్ధతి ప్రవేశపెట్టారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో అక్షరాస్యుల సంఖ్య తక్కువ. జాతీయ స్థాయిలో అక్షరాస్యత 64.8శాతమైతే, మధ్యప్రదేశ్‌లో 63.7శాతం మాత్రమే. తల్లిదండ్రులూ పిల్లలూ చదువుపట్ల శ్రద్ధ చూపి అక్షరాస్యతను పెంచేందుకు అయ్యవార్లు ఇంటింటికీ తిరిగి ఆరా తీసే పద్ధతి ఉపయోగపడగలదని అధికారులు ఆశపడుతున్నారు!

(http://www.eenadu.net/archives/archive-27-8-2006/homelink.asp?qry=Editorial)
-----------------------------------------------------------------------------

Labels:

అంతా నమ్మకంలో ఉంది

''భగవంతుడొక్కడే శాశ్వతుడు'' అన్న గాంధీజీ, ''భగవంతుడు హేతువాదానికి అందనివాడు. నమ్మకం ఉన్నవారికి ఏ రూపంలో కోరితే ఆ రూపంలో కనపడతాడు. అతడు సర్వాంతర్యామి'' అనీ చెప్పారు. నాస్తికులు భగవంతుడు లేడంటే- ఆస్తికులు వేదవేదాంగాలు, పురాణాలు, భక్తుల కథలు సాక్ష్యాలుగా చూపుతూ దేవుడున్నాడని వాదిస్తుంటారు. దేవుడున్నాడా, లేడా అనే విషయమై తరతరాలుగా తర్కవితర్కాలు సాగుతూనే ఉన్నాయి. మహాభక్తులుగా పేరు తెచ్చుకున్నవారికి సైతం, ''కలడు కలండనెడివాడు కలడో లేడో'' అనే సందేహం అప్పుడప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ప్రపంచమంతటా అనిర్వచనీయ నిగూఢ శక్తి వ్యాపించి ఉన్నదనీ దాని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరనీ అందరూ అంగీకరిస్తున్నదే. ఆ అగోచరమైన శక్తే భగవంతుడు అని దేవుణ్ని నమ్మేవారు దృఢంగా విశ్వసిస్తారు. ''నడిచెడివాడు నడిపించెడివాడు చేసెడివాడు చేయించేవాడు అంతా ఆ పరమాత్మే'' అని భగవద్గీతా చెబుతుంది. ఇదే అదనుగా తమ అకృత్యాలకు సైతం దేవుడే బాధ్యుడంటూ కుతర్కాలు చేస్తుంటారు గిరీశంలాంటి పండితులు. ''ఓ దేవుడా! నా మనస్సు యిండిపెండెంటుగా సృజించావా లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే నా యిష్టవొచ్చిన పనల్లా నేను చేశాను. నువ్వెవరు అడగటానికి? ఇలాంటి చిక్కులు పెట్టావంటే హెవెన్‌లో చిన్న నేషనల్ కాంగ్రెస్ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ... అష్లాగయితే నువ్వే నాచేత పాపం చేయించావు గనక నీకే ఆ శిక్ష కావాలిసింది. దేర్‌ఫోర్ చలో నరకానికి చలో అంటాను'' అంటూ వితండవాదం చేస్తాడు గిరీశం.

విశ్వాసానికీ హేతువాదానికీ చుక్కెదురు. నమ్మకం కలవారికి భగవంతుడు విశ్వమంతా నిండి ఉన్నట్లే అనిపిస్తాడు. నిదర్శనాల నిరూపణ, హేతువాదాన్ని పక్కనపెడితే భగవంతుడు ఎక్కడలేడు? ''వాడవాడల వాడె జాడలన్నిట వాడె'' అనిపిస్తుంది. ఏదో ఒక అదృశ్యశక్తి మనకు ఆసరాగా ఉన్నదనే భావన మనిషికి ఆత్మస్త్థెర్యాన్ని కలిగించి మనోబలాన్ని పెంచుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కోవటానికి ఆ బలం తోడ్పడుతుంది. ''తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది'' అని ఒక కవి వెటకారంగా అన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మనుషుల్లో భక్తిభావం పెరిగిపోతూనే ఉంది. 'ఆపదలో మొక్కులు, సంపదలో మరుపులు' అని సామెత. ఆపద కలిగినప్పుడు విధిగా అందరికీ భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ''రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మకా'' అంటూ అలనాటి గజేంద్రునికి మల్లేనే భగవంతుని వేడుకుంటారు. ఎన్నో మొక్కులూ మొక్కుకుంటారు. ఆపద తీరిన తరవాత వాటిని మరిచిపోవటమూ షరా మామూలు. మనుషులు ఆశావాదులే కాదు- స్వభావాలు సందర్భాలనుబట్టి అవకాశవాదులూ అవుతుంటారు. మంచితనమే అసలైన మతం, సిసలైన దేవుడు అంటారు విజ్ఞులు. ''మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును, అంత స్వర్గసుఖంబులన్నవి అవని విలసిల్లున్'' అన్నారు మహాకవి గురజాడ. మహాకవి పలుకులు ఎప్పుడు నిజమవుతాయో కాని, ఈ లోపున మనుషులు ఎవరి విశ్వాసాలను అనుసరించి వారు ప్రవర్తిస్తున్నారు.

'నమ్మి చెడినవారు లేరు. నమ్మక చెడిపోతే పోయేరు' అన్న తత్వంలో మంచి నమ్మకమే ఉన్నట్లుంది తూర్పు ఇంగ్లాండులోని పోలీసు శాఖవారికి. అందుకే దొంగలను, అసాంఘిక శక్తులను పట్టుకోవటానికి దేవుడి సాయాన్ని కోరుతున్నారు. తూర్పు ఇంగ్లాండులోని లింక్లాన్‌షైర్ పట్టణానికి చెందిన క్రిస్టియన్ పోలీసు సంఘం దొంగలు, దుండగుల ఆటలు కట్టించటానికి దేవుడి సహాయాన్ని కోరటమే మంచి మార్గం అంటోంది. వారు సరికొత్త ప్రార్థన పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఆ సంస్థకు చెందిన పోలీసు సభ్యులంతా సామూహిక ప్రార్థనలు నిర్వహించి అసాంఘిక శక్తులను పట్టుకోవటానికి తమకు సాయపడవలసిందిగా దేవుణ్ని వేడుకొంటున్నారు. ప్రార్థనాలయాలతోపాటు ఇతర చోట్లా దుండగులు విధ్వంసాలకు తెగబడకుండా ఉండేందుకు ఈ ప్రార్థనలు తోడ్పడతాయని వారు విశ్వసిస్తున్నారు. ''ప్రజల మాన ప్రాణాలను రక్షించి దుండగులను పట్టుకోవటానికి ప్రార్థనలవల్ల పోలీసులకు కొత్త శక్తి వస్తుందని మా విశ్వాసం. మా ప్రార్థనలను ఆలకించి భగవంతుడు సాయం చేస్తాడనే మాకు గట్టి నమ్మకం'' అంటున్నారు ఆ సంస్థ ప్రతినిధి. పోలీసు శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేసి రిటైరయిన డాన్ ఆక్స్‌సెల్ అనే ఆసామీ ప్రస్తుతం లింక్లాన్‌షైర్ క్రిస్టియన్ పోలీస్ సంఘానికి ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్. ''నాకు ఇటువంటి ప్రార్థనల్లో చాలా నమ్మకం ఉంది. భగవంతుడు మన విన్నపాలు విని తప్పకుండా సహాయం చేస్తాడు. వ్యక్తిగతంగా నా ప్రార్థనలు ఫలించి నాకు మేలు కలిగిన సందర్భాలు ఉన్నాయి'' అంటున్నాడాయన. భగవంతునిపై భక్తివిశ్వాసాలు కలిగి ఉండటంలో తప్పేమీలేదు. ఆపదల్లో భగవంతుణ్ని తలచుకోవడం, తమను ఆపదనుంచి తప్పించమని వేడుకోవటం పరిపాటే. మన రాష్ట్రం భగవంతుని రాజ్యమని ముఖ్యమంత్రే సెలవివ్వడం తెలిసిందే. ఏ విషయంలోనైనా మానవ ప్రయత్నం, కృషి, కర్తవ్య నిబద్ధతా తప్పకుండా ఉండాల్సిందే మరి! గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహిమ అంటే సరిపోతుందా?

(http://www.eenadu.net/archives/archive-20-8-2006/homelink.asp?qry=Editorial)
--------------------------------------------------------------------------

Labels: ,

తెలివి ఎవరి సొమ్ము?

వివేకం ఒకరి సొత్తు కాదు. కాస్తో కూస్తో తెలివి తేటలు అందరికీ ఉంటాయి. మోతాదుల్లోనే తేడాలు. కొందరికి తెలివి తేటలు అధికంగా ఉంటాయి. మరికొందరు అంత తెలివిగా ఉండరు. అతితెలివి కలవారితోను ఇబ్బందే, తెలివితక్కువ వారితోనూ కష్టమే. అమాయకత్వాన్ని మంచితనంగా భావిస్తే అసలు ఇబ్బందే ఉండదు. పరమానందయ్య శిష్యులను ఈ కోవలోకి చేర్చవచ్చు. తెలివి ఒకరి సొమ్మా తోట సుబ్బమ్మా- అంటూ నిలవేశాడట ఓ సుబ్బారాయుడు. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాకపోయినా తామే చాలా తెలివికలవాళ్లమనే అహం కొందరిలో ఉంటుంది. ''చెయిముట్టు సరసం అంటే నాకు కరచరణాలు ఆడవు కాని వ్యవహారాలంటే చెప్పు యెత్తుకి ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను...'' అంటాడు రామప్ప పంతులు. అంతటి తెలివితేటలు కలవాణ్నీ- ''యీ రామప్పపంతులు చిక్కులకు జాకాల్ తెలివికి బిగ్ యాస్...'' అంటూ వర్ణిస్తాడు గిరీశం. ఆ వర్ణనకు మధురవాణి విరగబడి నవ్వుతుంది. తెలివితేటలు అధికమైనప్పుడూ అభాసుపాలయ్యే అవకాశం ఉంది. అతడు పైలాపచ్చీసు పురుషుడు. సినిమాలనీ షికార్లనీ తెగ తిరుగుతుంటాడు. భార్యను మాత్రం గడప దాటనివ్వడు. ఆవిడ సూక్ష్మగ్రాహి. భర్త అనుమానం పిశాచి అని తెలుసు. అతని అనుమానానికి అడ్డకట్టవేసి ఇంటిపట్టునే కట్టి పడెయ్యటానికి మంచి ఉపాయం కనిపెట్టింది. ''ఇంట్లో ఏం తోచటంలేదండీ. ఏ సినిమాకైనా వెళ్దాం. మీకు వీలుకాకపోతే పక్కింటి పిన్నిగారితో వెళతాలెండి...'' అంటుంది. అంతే- ఆ తరవాత రెండు రోజులు మానవుడు గడప దాటడు!
స్త్రీ పురుషుల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న వివాదం ఆదినుంచీ రగులుతూనే ఉంది. తెలివితేటల విషయంలో మగవారూ ఆడవారూ ఒకరితో మరొకరు పోటీ పడుతూనే ఉన్నారు. ''అతడు ఆమెల ఫైటు, అతివ ఛాన్సులు బ్రైటు, ఆడదెపుడూ రైటు...'' అన్నారు ఆరుద్ర. సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అయినప్పటికీ ప్రతి విషయంలోనూ మగవారు ఆడవారు పోటీపడుతుండటం మొదటినుంచీ జరుగుతూనే ఉంది. ''మావారు నే గీచిన గీటు దాటరు'' అని గర్వపడుతుందా ఇల్లాలు. అంతకంటె రెండాకులు ఎక్కువ చదివిన శ్రీమన్నారాయణుడు ఫ్రెండ్సుతో పేకాడి బార్‌కు కూడా వెళ్ళి అర్ధరాత్రి తూలుకుంటూ ఇంటికొచ్చి ''ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. ఊపిరాడటం లేదు. తల బద్దలు కొట్టేస్తుంది...'' అంటూ నటసమ్రాట్‌లా నటించేస్తుంటే- నమ్మేస్తుంది అమాయకురాలు. అయ్యగారి బూట్లు విప్పటంతో పదసేవ ప్రారంభించి వేడివేడిగా కాఫీ కలిపి ఇచ్చి, బతిమాలి అన్నం తినిపించి జోలపాట మినహాగా పవళింపు సేవ పూర్తిచేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆలుమగలులో ఎవరు ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించారన్నది విజ్ఞులు తేల్చాల్సిన విషయం. అసలు రసజ్ఞులెవరూ ఇటువంటి ముచ్చట్ల జోలికి పోయి తీర్పులివ్వటానికి సిద్ధపడరు. తెలివితేటల సంగతి పక్కన పెడితే మాటల్లో మాత్రం అతివే మేటి. ''ఆటల పాటల పేటికలారా, కమ్మని మాటల కొమ్మల్లారా...'' అని గురజాడ అననే అన్నారు. మధురవాణి వంటి పేర్లు ఆడవారికే ఉన్నాయి కాని అటువంటి భావం స్ఫురించే పేర్లు మగవారికున్నట్లు ఎక్కడా దాఖలాలు లేవు.

''ఆడది మెచ్చిందే అందం మొగాడి కన్ను మసక'' అంటుంది మధురవాణి 'కన్యాశుల్కం' నాటకంలో. కళ్ళ విషయంలో ఏమో కాని మెదడు విషయంలో మాత్రం మగవారిదే పైచేయి. అలాగని శాస్త్రజ్ఞుల అధ్యయనంలో తేలింది. ఇప్పటివరకు మేధ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే అన్న అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం సరికాదని బుద్ధిబలంలో మగవారే ఆడవారికంటె ముందుంటారని బయటపడింది. వెస్టర్న్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞుల బృందం మనస్తత్వ శాస్త్రజ్ఞుడు జె.ఫిలిప్ రష్టన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం 17 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న లక్షమంది యువతీ యువకులను పరీక్షించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ యువతీ యువకులందరికీ రకరకాల ఐ.క్యు. పరీక్షలు నిర్వహించారు. యువతుల కంటె యువకులే నాలుగైదు పాయింట్లు ముందున్నట్లు రుజువైంది. సామాజిక, ఆర్థిక సంబంధాల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పెట్టిన పరీక్షలన్నింటా మగవారే ఎక్కువ తెలివితేటలు ప్రదర్శిస్తున్నట్లు బయటపడింది. లోగడ ఓ పరిశోధనలోనూ ఇటువంటి ఫలితాలే వచ్చాయి. శైశవ బాల్యదశల్లో తెలివితేటలరీత్యా ఆడపిల్లలకు మగపిల్లలకు ఆట్టే తేడా కనిపించకపోయినా యౌవన ప్రాదుర్భావ సమయం నుంచీ మార్పులు కనిపిస్తున్నాయని తేటపడుతోంది. ఇందుకు కారణం ఆడవారికి మగవారికి మెదడు పరిమాణంలో ఉండే తేడా కూడా కావచ్చంటున్నారు. దేహబలం, బుద్ధిబలాల్లో మగవారే ఆధిక్యాన్ని కలిగి ఉన్నా, వాక్చాతుర్యంలో అమ్మాయిలదే మొదటి స్థానమని శాస్త్రజ్ఞులూ అంగీకరిస్తున్నారు. మాటల్లో మగవారు మగువలతో పోటీపడలేరని అంతా ఒప్పుకొంటున్నారు. ఆ విషయం తెలుసుకోవటానికి పెద్దగా పరిశోధనలు అక్కర్లేదనే విషయం అందరికీ తెలిసిందే!

Labels:

Sunday, October 29, 2006

Bloggers have a long way to go!

A bit like the Indian population, the blogosphere substantially multiplies in size with each passing day. In India, in particular, a recent and interim ban on blogs meant that bloggers were able to garner more attention than the ban itself and were thus able to get their virtual voices heard in the real world of newspapers and television. The question that we now seek to answer is this — Can India ever achieve superpower status in the blogosphere?

Author of the blog, labnol.blogspot.com, ex-IITian Amit Agarwal gave up his regular day job with Infosys to become a professional blogger. He says, "There are various factors that currently prevent India from being a blogging superpower. We do not have enough people blogging and more importantly, there aren't enough people reading blogs. To add to this, the majority of Indian blogs are personal diaries that would only be interesting to the family and friends of the blog's author."

Still to achieve critical mass
Agarwal is of the opinion that unlike other countries, many bloggers in India have not realised that blogs can be a good mechanism to generate revenue. He says, "Advertising apart, there is a lot else that you can do to make money from your blog. But this requires a desire to take on great risks and one also needs to dedicate a lot of time to ensure that one's blog is easily locatable on varied search engines. And there aren't enough people doing that." For India to break through the seams of the blogosphere, feels Agarwal, Indian bloggers need to do a lot more than just write good content.
Amit Varma's blog, indiauncut.blogspot.com, won the Best Indiblog award in 2005 and his is arguably the most popular Indian voice in the blogosphere. Varma believes that the term 'superpower', in the context of the world or the blogosphere, can prove to be very misleading. And like Agarwal, he believes that Indian blogging and bloggers have a long way to go. He says, "If we are to look at the state of blogging in the States, we would find that there are many political blogs, which are influential and help mobilise election campaigns. India is different because blogs don't have such a high readership here and Internet access isn't high enough to influence voting patterns." Varma does go on to add that the advent of vernacular blogging, however, might change this status quo as it would make blogs more ubiquitous and eventually, politically influential.

A collective private history
Delhi-based Nikhil Pahwa of mixedbag.blogspot.com believes that any connection made between a nation's blog and its superpower status, can well be logically fatal. He argues, "When the Americans started bombing Iraq, an Iraqi national found a computer in a still-functional cyber-café and blogged away. His blog went on to become one of the most powerful and popular blogs on the Internet and thanks to the blog, he was able to get a job with The Guardian. But his achievement obviously does not reflect or sediment Iraq's reputation as a superpower of any kind."

If we take Pahwa's argument a little further and conclude that blogs are personal voices that are fashioned by a larger national one, we should also be able to say that the collective of Indian blogs will eventually prove to be a useful lens through which we can view the country's transition from what it dreams to be to what it becomes. Chandrahas Choudhury, who blogs at middlestage.blogspot.com, says, "Blogs record the changes that occur and since blogs are personal voices that seek to make sense of complex issues, they collectively become the private history of a country."
_______________________________
Factoid
•As of July 2006, there were 40,128 bloggers on blogspot.com, who identified themselves as Indians

•Of these, 80 per cent were male and 13 per cent female. This is a serious deviation from the global blogging gender scenario, where 45 per cent are men and 38 per cent women

•Fifty one per cent of Indian bloggers fall under the 21-30 age group

Source:miteshvasa.blogspot.com
________________________________________________
(Shreevatsa NevatiaNew Delhi, October 20, 2006
http://hindustantimes.com/2006/Oct/21/8131_1826005,00160138.htm )
________________________________________________

Labels:

The Indian hell

A man dies and goes to hell. There he finds that there is a different hell for each country.

He goes to the German hell and asks, "What do they do here?" He told,"First they put you in an electric chair for An hour. Then they lay you on a bed of nails for another hour. Then The German devil comes in and beats you
for the rest of the day." The man does not like the sound of th at at all,so he moves on.

He checks out the USA hell as well as the Russian hell and many more. He discovers that they are all more or less the same as the German hell.

Then he comes to the Indian hell and finds that there is a long line of people waiting to get in. Amazed, he asks, "What do they do here?" He told, "First they put you in an electric chair for an hour. Then they lay you on
a bed of nails for another hour. Then the Indian devil comes in and beats you for the rest of the day." "But that is exactly the same as all the other hells - why are there so many people waiting to get in?"
"Because maintenance is so bad that the electric chair does not work, someone has stolen all the nails from the bed, and the devil is a former Govt servant, so he comes in, signs th e register and then goes to the canteen!!!!! !"
___________________________________

Labels: