My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, June 21, 2008

Enough of Sardar jokes! Mallu jokes are here!!(no offence meant please)

--------------------------------------------------

1) What is the tax on a Mallu's income called?

IngumDax
-------------------------------------------------

2) Where did the Malayali study?

In the ko-lhiage.
--------------------------------------------------

3) Why did the Malayali not go to ko-lhiage today?

He is very bissi.
--------------------------------------------------

4) Why did the Malayali buy an air-ticket?

To go to Thuubai, zimbly to meet his ungle in

Gelff.
--------------------------------------------------

5) Why do Malayalis go to the Gelff?

To yearn meney.
-------------------------------------------------

6) What did the Malayali do when the plane caught fire?

He zimbly jembd out of the vindow.
-------------------------------------------------

7) How does a Malayali spell moon?

MOON - Yem Woh yet another Woh and Yen
---------------------------------------------------

8) What is Malayali management graduate called?

Yem Bee Yae.
--------------------------------------------------

9) What does a Malayali do when he goes to
America ?

He changes his name from Karunakaran to Kevin Curren.
---------------------------------------------------

10) What does a Malayali use to commute to office everyday?

An Oto
-------------------------------------------------

11) Where does he pray?

In a Temble, Charch and a Maask
-------------------------------------------------

12) Who is Bruce Lee's best friend?

A Malaya-Lee of coarse.
------------------------------------------------

13) Name the only part of the werld, where Malayalis don’t werk hard?

Kerala.
--------------------------------------------------

14) Why is industrial productivity so low in Kerala?

Because 86% of the shift time is spent on lifting, folding and re-tying the lungi
----------------------------------------------------

15) Why did Saddam Hussain attackKuwait?

He had a Mallu baby-sitter, who always used to say

'KEEP QUWAIT' 'KEEP QUWAIT'
---------------------------------------------------

16) What is the Latest Malayali Punch Line?

" Frem Tea Shops To Koll Cenders , We Are Yevery Where "
--------------------------------------------------

17) Why aren't Mals included in hockey and football teams ?

Coz whenever they get a corner, they set up a tea shop.
--------------------------------------------------

18) Now pass it on to 5 Mals to get a free sample of

kokanet oil.
--------------------------------------------------

19) Pass it on 10 Mals to get a free pack of
Benana Chibbs.
-------------------------------------------------

20) Pass it on to 15 Mals to get a set of
BROGUN bones....

--------------------------------------------------
(an email forward)
________________________________

Labels:

Friday, June 20, 2008

ఖరీదైన సలహాలు

అందమైన భవంతి ముందు ఒక శ్రీమంతరావు చేతిలో ఖరీదైన విదేశీ సిగరెట్‌ పెట్టెతో దర్జాగా నిలబడి ఉన్నాడు. నిర్లక్ష్యంగా చూస్తూ, విలాసంగా పొగ వదులుతూ ఉండగా దారినపోయే ఒక దానయ్య చూశాడు. దానయ్యగారికి సలహాలివ్వాలన్న సరదా బాగా ఎక్కువ. పోతూపోతూ ఉన్నవాడు ఆగి, శ్రీమంతరావు దగ్గరికి వచ్చి, కళ్లలోకి గంభీరంగా చూస్తూ 'మీకో మంచి సలహా ఇద్దామనుకుంటున్నాను' అన్నాడు. శ్రీమంతరావు అనుమానంగా చూస్తూనే తల వూపాడు. దానయ్య ఒక్కసారిగా విజృంభించాడు. ధూమపానం ఎంత చెడ్డదో, దానివల్ల ఎన్నిరకాల నష్టాలున్నాయో గుక్కతిప్పుకోకుండా వివరించాడు. 'ముఖ్యంగా ఎంత ధనం నష్టపోతారో లెక్కిస్తే మీ గుండె గుభేల్‌మంటుంది. ఇన్నేళ్లుగా మీరు ఈ రకంగా తగలేసిన డబ్బుకనక ఆదాచేసి ఉంటే, ఆ కనబడే అందమైన మేడ, ఇదిగో ఈ చక్కని కారు మీ సొంతమై ఉండేవి తెలుసా?' అని ఉద్రేకంగా ప్రశ్నించాడు. 'నేనూ మీలాగే రోజుకు రెండు పెట్టెలు వూదేసేవాణ్ని. మానేసి ఇలా బాగుపడ్డాను. ఆ అనుభవంతోనే చెబుతున్నాను. ఈ గొప్ప సలహాను మీరు పాటించి, వెంటనే బాగుపడతారని నేను ఆశిస్తాను' అని ఒకానొక ఆధ్యాత్మిక సంతృప్తితో ఆయాసపడుతూ ఆగాడు. శ్రీమంతరావు ఒక్కక్షణం దానయ్యకేసి చూశాడు. 'ఆశించండి. తప్పేంలేదు. ఇప్పుడు నేను కూడా మీకో సలహా ఇస్తున్నాను. ఇలా పనిగట్టుకుని అడక్కపోయినా వచ్చి సలహాలు ఇవ్వడం మీరిక మానేయండి. మీరు చెబుతున్న భవంతికి నేనే యజమానిని. ఈ కారు కూడా నాదే. అయినా సిగరెట్లు మానేసి మీరు కూడబెట్టినది ఏమంత లేదనుకుంటాను. ఉంటే, దానితో ఏ వ్యాపారమో చేసుకుంటూ, పని చూసుకుంటూ ఉండేవారు. కనబడిన ప్రతివాడికీ ఇలా ఉచిత సలహాలిస్తూ ఖాళీగా తిరిగేవారు కాదు. వెళ్ళిరండి, నాకు పని ఉంది' అన్నాడు.

అడక్కుండా ఇచ్చే సలహాలు అప్పుడప్పుడూ ఇలా బెడిసికొడతాయి. ఎదుటివాడికి సలహా నిజంగా అవసరమా కాదా అనిగాని, వింటాడా లేదా అనిగాని ఆలోచించకుండా లేనిపోని పెద్దరికం నెత్తిమీద వేసుకోవడం ఎందరికొ అలవాటు. గట్టిగా చెప్పాలంటే వ్యసనం. 'అయితే ఒక పనిచెయ్యి' అనిగాని, 'ఎందుకు చెబుతున్నానో విను' అనిగాని మనతో ఎవరేనా అన్నారంటే- ఆ వెంటనే వారొక సలహా ఇవ్వబోతున్నారని, వినడానికి మనం సిద్ధంగా ఉండాలనీ అర్థం. అలాఅని, పూర్తిగా మన బుద్ధితోనే, మన తెలివితేటలతోనే జీవితం వెళ్ళిపోతుందా అంటే, కుదరదు. ఎంత మేధావికైనా ఒక్కో సందర్భంలో సలహాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. మైకిస్తే జనాన్ని చితక్కొట్టేసే ప్రతివక్తా మేకిస్తే గోడకు కొట్టగలడా అన్నది అనుమానం. వేలు చితికే సందర్భాలుంటాయి. అలాంటి సందర్భాల్లో పెద్దల సలహాలు ఎంతో మేలు చేస్తాయి. గురుబుద్ధిర్విశేషతః అనేది అందుకే. ఆ మాటనే 'పెద్దల మాట చద్దిమూట'గా అనువదించాడొక బుద్ధిమంతుడు. అనుభవజ్ఞులైన పెద్దలు, గురువుల సలహాలు వినకపోవడంవల్ల మనిషి దెబ్బతినే సందర్భాలుంటాయి. రాయబారానికై వచ్చిన కృష్ణుడి సలహాలుగాని, ఆ సమయంలో భీష్ముడి సలహాలుగాని ధృతరాష్ట్రుడు పట్టించుకోలేదు. అడపాదడపా విదురుడు, వ్యాసుడు చెప్పిన సలహాలూ పెడచెవిన పెట్టాడు. అందుకే ఆయన చెడిపోయాడు. పోయేకాలం సమీపిస్తే మంచి సలహాలు కూడా వినబుద్ధి కావంటారు. పోగాలం దాపురించినవాడు అరుంధతిని, మిత్రవాక్యాన్ని, దీపనిర్వాణ గంధాన్ని కనడు, వినడు, మూర్కొనడు- అని సుభాషితం. ఇక్కడ మిత్రవాక్యమంటే మంచి సలహా అనే అర్థం. మిత్రవాక్యం విని బాగుపడ్డవారిలో ధర్మరాజు అగ్రగణ్యుడు. ద్రోణవధ విషయంలో, సైంధవ సంహారంలో కృష్ణుడి సలహాలు అమోఘంగా రాణించాయి. నిజానికి శ్రీకృష్ణుడు పాండవులకు జీవితకాలపు సలహాదారు.

ఆ తరహా సలహాదారులతో సంప్రతింపులు ఇప్పటికీ లాభసాటి బేరమే అంటున్నారు- నేటి పారిశ్రామికవేత్తలు! ఆత్మబుద్ధిః సుఖంచైవ- సొంత ఆలోచన మంచిదే అని చెప్పిన పెద్దలే, గురువుల సలహాలు అంతకన్నా విశేషమైనవి అన్నారన్నది మనం గుర్తుచేసుకోవాలి. సంక్లిష్టభరితంగా మారిన ఈ ఆధునిక జీవనసరళిలో కుదురుగా కూర్చుని స్థిమితంగా ఆలోచించే తీరిక ఎవరికి మాత్రం ఉంది? ఈ నేపథ్యంలో నిపుణుల సలహాలు పోటీరంగంలో నిలిచిన ప్రతి పరిశ్రమకీ అవసరమవుతున్నాయి. ఆ అవసరాల్లోంచి పుట్టిందే 'కన్సల్టెన్సీ' వ్యవస్థ. కన్సల్టెన్సీల సలహాలు నిశితమైనవేకాదు, ఖరీదైనవి కూడా. రెండేళ్ళుగా వాణిజ్యపరమైన అంశాల్లో తానుపొందిన సలహాలకు పారిశ్రామికవేత్త రతన్‌టాటా అక్షరాలా రూ.532కోట్లు చెల్లించారంటే- మంచి కన్సల్టెన్సీలకు గిరాకీ ఏ స్థాయిలో ఉందో వూహించుకోవచ్చు. ఈ వ్యవస్థ చాలా ఖరీదైనది కనుక 'ఉచిత' సలహాలకు తావులేదు. దారినపోయే దానయ్యల బెడద లేదు. ఆచితూచి సలహాలిస్తారు కాబట్టి ఆశ్రయించిన వారంతా ధర్మజుడిలా లబ్ధిపొందే అవకాశాలున్నాయి. దుష్టచతుష్టయం సలహాలు విని దుర్యోధనుడు చెడిపోయినట్లుగా, గిరీశం సలహాలు పాటించి వెంకటేశం భ్రష్టుపట్టినట్లుగా- తెలివితక్కువ కన్సల్టెన్సీ సలహాలతో దెబ్బతినకుండా ఉండాలంటే మాత్రం స్వామిరామతీర్థ సలహా పాటించాలి. 'రథంపై నిలిచి అర్జునుడిలా పరాక్రమంతో పోరాడు. కాని పగ్గాలు మాత్రం కృష్ణుడి చేతిలోనే ఉండేలా చూసుకో' అన్నారాయన. సలహాదారును ఎంచుకునేటప్పుడే ముందు చూపుతో వ్యవహరించాలి. లేదా దెబ్బతిన్నాక అయినా జాగ్రత్తపడాలి!
(ఈనాడు, సంపాదకీయం, 13:04:2008)
______________________________

Labels:

An interesting story............


Young King Arthur was ambushed and imprisoned by the monarch of a neighboring kingdom. The monarch could have killed him but was moved by Arthur's youth and ideals. So, the monarch offered him his freedom, as long as he could answer a very difficult question. Arthur would have a year to figure out the answer and, If after a year, he still had no answer, he would be put to death. The question was: What do women really want?

Such a question would perplex even the most knowledgeable man, And to young Arthur, it seemed an impossible query. But, since it was better than death, He accepted the monarch's proposition to have an answer by year's end.

He returned to his kingdom and began to poll everyone: The princess, the priests, the wise men, and even the court jester. He spoke with everyone, but no one could give him a satisfactory answer. Many people advised him to consult the old witch, For only she would have the answer. But the price would be high as the witch was famous through out the kingdom for the exorbitant prices she charged.

The last day of the year arrived and Arthur had no choice but to talk to the witch. She agreed to answer the question, but he would have to agree to her price first.

The old witch wanted to marry Sir Lancelot, The most noble of the Knights of the Round Table, And Arthur's closest friend! Young Arthur was horrified. She was hunch-backed and hideous, had only one tooth, Smelled like sewage, made obscene noises, etc.
He had never encountered such a repugnant creature in all his life. He refused to force his friend to marry her and endure such a terrible burden, But Lancelot, having learnt of the proposal, spoke with Arthur. He said nothing was too big of a sacrifice compared to Arthur's life. And the reservation of the Round Table. Hence, a wedding was proclaimed and the witch answered Arthur's question thus: "What a woman really wants?" She said, "Is to be in charge of her own life."
Everyone in the kingdom instantly knew that the witch had uttered a great truth.
And that Arthur's life would be spared. And so it was.

The neighboring monarch granted Arthur his freedom.
And Lancelot and the witch had a wonderful wedding.
The honeymoon hour approached and, Lancelot, steeling himself for a horrific experience, entered the bedroom.
But, what a sight awaited him.
The most beautiful woman he had ever seen lay before him on the bed.
The astounded Lancelot asked what had happened.
The beauty replied that since he had been so kind to her when she appeared as a witch, She would henceforth be her horrible and deformed self only half the time. And the beautiful maiden the other half.
"Which would you prefer? She asked him.
"Beautiful during the day ... or at night?"
Lancelot pondered the predicament.
During the day he could have a beautiful woman to show off to his friends,
But at night, in the privacy of his castle, an old witch!
Or,
Would he prefer having a hideous witch during the day?
But by night a beautiful woman for him to enjoy wondrous, intimate moments with?


(If you are a man reading this...) What would YOUR choice be?
(If you are a woman reading this) What would YOUR MAN'S choice be?
What Lancelot chose, is given below:
BUT... make YOUR choice before you scroll down below... OKAY?


____________________________________________
Noble Lancelot, knowing the answer the witch gave Arthur to his question,
He said that he would allow HER to make the choice herself.
Upon hearing this, she announced that she would be beautiful all the time.
Because, he had respected her enough to let her be in charge of her own life.

Now... what is the moral to this story?

The moral is...
1) There is witch in every woman no matter how beautiful she is!
2) If you don't let a woman have her own way, things are going to get ugly.

So, always remember:
IT'S EITHER "HER WAY" OR IT'S "NO WAY" !!!
_____________________________________
(An email forward)
______________________________________

Labels:

Monday, June 16, 2008

అక్షరాగ్ని గిరిశిఖరం

16:06:2008 శ్రీశ్రీ 25వ వర్ధంతి
- రావూరి ప్రసాద్‌
... శ్రీశ్రీ- తెలుగు అక్షరాన్ని సాయుధం చేశాడు... తెలుగు పదాన్ని రణగర్జనగా మలచాడు... తెలుగు వాక్యానికి 'యుద్ధ వ్యాకరణాన్ని' నేర్పాడు... తెలుగు పద్యాన్ని సంగ్రామ భేరీనాదంలా పలికించాడు... తెలుగు పాటకు కదన రాగాన్ని కూర్చాడు, కదం తొక్కించాడు...

ఒక మేరునగం గురించి ఓ గులకరాయి ఏం పలకగలదు? ఒక అగ్నిపర్వతాన్ని ఓ ధూళికణం ఏమని వర్ణించగలదు? ఒక మహాసముద్రం గురించి ఓ నీటి బిందువు ఏం మాట్లాడగలదు? ఇవాళ శ్రీశ్రీ గురించి కొత్తగా ఎవరు మాత్రం ఏం రాయగలరు?

వెంటనే- 'మరల ఇదేల రామాయణంబన్నచో నా దైన భక్తి నాది గాన' అన్న విశ్వనాథవారి ఉవాచను గుర్తుకు తెచ్చుకుని- 'మాదైన ప్రేమ మాది గాన' అని సగర్వంగా శ్రీశ్రీ గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే, రావిశాస్త్రి అన్నట్లు 'శ్రీశ్రీగారు మా మహాకవి. ఆయనంటే మాకు ఎంతో ఇష్టం. ఎంతో గొప్ప. మాకు చాలా గర్వం!'

పాతికేళ్ల క్రితం ఇదే రోజున తన 74వ ఏట కనుమూసిన యువకుడు శ్రీశ్రీని ఇవాళ తలచుకోవడం అందుకే. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి ఎవరూ ఏమీ మిగిల్చి ఉండక పోవచ్చు. కానీ-

'ఇలా వచ్చావేం వెన్నెలా?
ఎలా వర్ణించను నిన్ను?...
ఏది రాసినా ఏం లాభం?
ఇదివరకెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నా కన్నా
బాగానే అని వుండొచ్చు'- అన్న శ్రీశ్రీ కూడా 'వెన్నెల పేరెత్తితేచాలు... వెర్రెత్తి పోతుంది మనస్సు' అంటూ 'శరచ్చంద్రిక' గీతాన్ని వెలయించాడు. అలాగే- శ్రీశ్రీ గురించి ఇంతకుముందు చెప్పినవాళ్లు అందరి కన్నా బాగానే చెప్పి ఉండవచ్చు. అయినా మహాకవి పేరు తలుచుకుంటే చాలు... మన మనస్సులూ వెర్రిత్తిపోతాయి. ఆ రెండు అక్షరాలు హృద్రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి.'స్మరిస్తే పద్యమై, అరిస్తే వాద్యమ'య్యే ఆ శబ్ద విపంచి వినిపించే భాస్వరస్వరాలు హృదయాన్నంతటినీ రసమయం చేస్తాయి. శ్రీశ్రీ అంటే నిప్పులు విరజిమ్మే రెండు అక్షరాగ్ని పర్వతాలు... కాంతులు వెదజల్లే రెండు కవితానల ఖడ్గాలు! నవ్య చేతనార్చి- ఒక శ్రీ... నిత్య జాగృతాగ్ని మరో శ్రీ. వెరసి శ్రీశ్రీ అనే రెండు అక్షరాలు వాగ్దేవి కర్ణాభరణాలై ధగద్ధగాయమానంగా వెలుగులీనే రెండు జ్వాలావలయాలు!!

ఈ సమాజ సమరాంగణంలో- అణగారిన ఆర్తజనుల పక్షాన తన అక్షర అక్షౌహిణులను మోహరించిన సారస్వత మహాసేనాని శ్రీశ్రీ.

అతడు- తెలుగు అక్షరాన్ని సాయుధం చేశాడు... తెలుగు పదాన్ని రణగర్జనగా మలచాడు... తెలుగు వాక్యానికి 'యుద్ధ వ్యాకరణాన్ని' నేర్పాడు... తెలుగు పద్యాన్ని సంగ్రామ భేరీనాదంలా పలికించాడు... తెలుగు పాటకు కదన రాగాన్ని కూర్చాడు, కదం తొక్కించాడు.

''ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది ఏం చేస్తోంది?'' అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం- అన్నాడు ఒకప్పుడు చెలం. అవును. కవిత్వంలో విద్యుత్‌తేజాన్ని వికసింపజేసిన తన అక్షరశక్తినంతటినీ పతితులకోసం, భ్రష్టులకోసం, బాధా సర్పదష్టులకోసం వెచ్చించిన తెలుగు శబ్ద విరించి శ్రీశ్రీ. దగాపడిన తమ్ముల, కూడు లేని భిక్షుల, గూడులేని పక్షుల, దిక్కులేని దీనుల, హీనుల బాధల్ని గాధల్ని కష్టాల్ని కన్నీళ్లను పాటలుగా కట్టి తెలుగు కవిత్వాన్ని 'భూమార్గం పట్టించాడు, భూకంపం పుట్టించాడు.'

అప్పటిదాకా తనను నడిపిస్తూ వచ్చిన కవిత్వాన్ని ఆ తరవాతి నుంచి తాను నడిపిస్తూ వస్తున్నానని అంటూ 'ఈ శతాబ్దం నాది' అని చాటుకున్న అల్పసంతోషి శ్రీశ్రీ. ఆ శతాబ్దమే కాదు, కవిత్వపరంగా రానున్న శతాబ్దాలూ శ్రీశ్రీవే. ఎందుకంటే, 'అర నిమిషం గడిచేసరికల్లా అదే నాకు గత శతాబ్ది' అన్నదీ ఆయనే. తనదిగా ఆయన చెప్పుకొన్న శతాబ్దంలో ఎన్ని అర నిమిషాలు గడచిపోయి ఉంటాయో లెక్క వేసుకొంటే- ఎన్ని శతాబ్దాల పాటు శ్రీశ్రీ అక్షర'సరస్వతి' సంతకం చెక్కు చెదరదో అర్థం చేసుకోవచ్చు.

''శ్రీశ్రీ పేరు తలుచుకుంటే చాలు/ వాగ్దేవి ఆలయప్రాంగణంలో అక్షర మహోత్సవం కళ్లారా చూడవచ్చు/ రానున్న సూర్యోదయాలపై కూడా శ్రీశ్రీ సంతకం చేస్తున్న సన్నివేశం చూడవచ్చు''నంటూ మహాకవికి అజంతా అర్పించిన నివాళి అక్షరసత్యం.

శ్రీశ్రీ నిర్మించిన అక్షర దుర్గం జనం కోసం! అధర్మనిధనానికై అతడు సృష్టించిన అక్షర ఖడ్గం జనం కోసం! 'మనుష్య సంగీతాన్ని మీటుతూ, మానవ సందేశాన్ని చాటుతూ, కష్టజీవికి ఇరువైపులా నిలిచి' అతడు కవిత్వీకరించిన అక్షర సముచ్ఛయం జనంకోసం! 'మాటలచేత మాట్లాడిస్తూ, రక్తం చేత రాగాలాపన చేయిస్తూ' అధోజగత్‌ సహోదరులకు బాసటగా అతడు ఆవాహన చేసి ప్రతిష్ఠించిన ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి పద్యం, ప్రతి పాట జనం కోసమే!

తమ కోసం తెలుగు సాహిత్యానికి కొత్త రూపు కల్పించి, కొత్త చూపునిచ్చి, కొత్త రక్తం ఎక్కించి కొత్త దారుల్లో నడిపించిన శ్రీశ్రీకి తెలుగువాళ్లు ఇవాళ చూపిస్తున్న చోటెక్కడ? జయంతులు, వర్ధంతుల సందర్భంగా సంస్మరణ సభలూ సమావేశాలు నిర్వహించో, శిలావిగ్రహానికి పూలమాలలు వేసో, చేతులు దులిపేసుకోవడమేనా మన మహాకవి పట్ల మనం చూపించే కృతజ్ఞత? మనం అర్పించే నివాళి?

శ్రీశ్రీ మన జాతి కవి. తాను యావదాంధ్ర జాతికీ చెందిన కవినని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొన్నారు కూడా. ఆయన అభిమానుల్ని, కొన్ని సంస్థలను మినహాయిస్తే- 'తనవాడు' అని తెలుగు జాతి సగర్వంగా చెప్పుకోవలసిన శ్రీశ్రీకి ప్రభుత్వపరంగా మన్నన దక్కకపోవడానికి రాజకీయాలే కారణమైతే- అది పాలకుల సంస్కార రాహిత్యం; సాంస్కృతికంగా దివాలాకోరుతనం! అయినా- ప్రజల కవిగా అజరామర కీర్తినార్జించుకున్న ఆయనకు ప్రభుత్వ భుజకీర్తులు అనవసరమే.

వ్యక్తిగా తాను అశాశ్వతమని, తన సాహిత్యం ఎప్పటికీ నిలుస్తుందన్నది- తనలోని వ్యక్తిగత లోపాలను విమర్శించేవారికి ఆయన జవాబు. కవిగా ఆయన మహోన్నతుడు, మరణం లేనివాడు. తెలుగువాడి జీవనాడి! శ్రీశ్రీ ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా తన అక్షరాల రూపేణా చిరంజీవే. రావిశాస్త్రి మాటల్లో చెప్పాలంటే- ''భారత జాతికీ, ప్రపంచ సాహిత్యానికీ ఈతడు తెలుగువారిచ్చిన వెలుగుకానుక. తెలుగు భాష ఉన్నంత కాలం ఈయన ఉంటారు. తెలుగుభాష మాసిపోతే, ఈయన మిగతా భాషల్లో ఉంటారు. ఈ ప్రపంచంలో మానవుల మనుగడ ఉన్నంతకాలం ఈయన ఉంటారు. మానవుడు మరో ప్రపంచాన్నీ, మరి కొన్ని లోకాల్నీ వెతుక్కు వెళ్తే శ్రీశ్రీ గారు వారితోపాటు అక్కడ కూడా ఉంటారు. అవును! శ్రీశ్రీ మహాకవి! మహా మనీషి!''

తాను సృష్టించుకున్న మరో ప్రపంచంలోకి శ్రీశ్రీ మహాభినిష్క్రమణం చేసిన రోజిది.
''...యుగ సంగీతాన్ని

లక్షనక్షత్రాలుగా వెలిగించాడు
శతకోటి జలపాతాలుగా నినదించాడు
'శ్రీశ్రీ చనిపోయాడ'ని అనకండి
ఒక మహాకవి అమరత్వం అతనిది!''- అంటూ కవి శివసాగర్‌ శ్రీశ్రీకి ఘటించిన కవితాంజలి స్మరణీయం.

నిజమే. శ్రీశ్రీ లేడని అనకండి. అతను చనిపోలేదు... కవిత చవిపోలేదు.

శ్రీశ్రీ-
అధునాతన భారతాన
అనల'గీత'కాద్యుడు
ఎన్ని యుగాలైనా
ఎప్పటికీ ఆరాధ్యుడు!
(eenadu,16:06:2008)
____________________________

Labels: ,

Sunday, June 15, 2008

డబ్బిస్తే చాలు...


ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్‌ చక్రవర్తి- తన జైత్రయాత్రను మధ్యలోనే ముగించి, తిరుగు ప్రయాణమయ్యాడు. బాబిలోనియా వద్ద తీవ్రంగా జబ్బుపడ్డాడు. దేశదేశాలనుంచి ప్రముఖ వైద్యులను పిలిపించారు. ఫలితం లేకపోయింది. దేహయాత్రను చాలించే స్థితిలో, చుట్టూచేరి విలపిస్తున్న బంధుమిత్రులతో అలెగ్జాండర్‌ అన్నాడు- 'మీరంతా ఎందుకలా బాధపడుతున్నారు? నేను మామూలుగా పోతున్నానా? ప్రపంచ ప్రసిద్ధులైన ముఫ్పయిమంది వైద్యుల సహాయంతో మరణిస్తున్నాను!' అని. ధీరుడైనవాడు మరణాన్ని అలా తీసుకుంటాడు. 'నీ పూజకోసం పూచినపూవును నేను. తుంచడానికి ఎందుకింకా ఆలస్యం?'- అని దేవుణ్నే ప్రశ్నించాడు విశ్వకవి రవీంద్రుడు. కొందరి మరణం చూస్తే ముచ్చటేస్తుంది. 'మనమూ అలాగే పోతే ఎంత బాగుంటుంది!'- అనిపిస్తుంది. ప్రాణం విడిచిపెట్టేసినా, కొందరి మొహాలు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉంటాయి. శ్రీ పరమహంస యోగానందజీ 1952 మార్చి ఏడోతేదీన తమ దేహయాత్ర చాలించారు. తరవాత ఇరవై రోజులపాటు వారి పార్థివదేహం ఏ రకమైన శారీరక క్షయాలకూ గురికాలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చచ్చిపోవడానికీ, దేహాన్ని విడిచిపెట్టడానికీ చాలా తేడా ఉంది. ధన్యజీవులు దేహాలను సునాయాసంగా విడిచిపెట్టేస్తారు. మిగిలినవారి విషయంలో ప్రాణాలు పోవడమే ఉంటుంది. 'నేను చనిపోతున్నాను' అనేది ఆసురీభావన. 'శరీరాన్ని నేను విడిచిపోతున్నాను' అనేది అమృతభావన. జీవించిన విధానాన్నిబట్టి మనిషి మరణప్రక్రియ ఆధారపడుతుంది. చివరి క్షణంలో తండ్రి నోట 'నారాయణ' పదంలో సగమైనా పలికిద్దామని, కొడుకులు తాపత్రయపడి, జనపనారను తెచ్చి ఆయన కళ్ళముందు ఆడించారు. అతికష్టంమీద కళ్ళు తెరచి 'అది పీచు' అన్నాడు తండ్రి. అదే చివరి మాట అయింది!

చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారికి విజయవాడలో సన్మానం జరిగేనాటికి ఆయన కడువృద్ధులు. శిష్యులంతా ఆయనను చేతుల మీద ఎత్తుకుని ఇంట్లోంచి బయటికి తీసుకొస్తుండగా చూసి వీధిలో వారంతా 'అయ్యోపాపం' 'ఎప్పుడు' అంటూ కంగారుగా వచ్చి చేరారు. చెళ్ళపిళ్ళవారు నవ్వుతూ 'ఫర్వాలేదురా అబ్బాయ్‌! నేను చనిపోతే నలుగురూ వస్తారని తేలిపోయింది. ధైర్యం వచ్చింది'' అన్నారు. మనిషి పోయాడని తెలిసేసరికి- వెళ్ళిచూడాలని బంధుమిత్రులందరికీ అనిపించిందంటే- ఆ మనిషి గొప్పగా బతికాడని అర్థం. 'పీడ విరగడ అయింది' అని అనిపిస్తే ఆ మనిషి బతుకు వ్యర్థం. అందుకే నలుగురినీ మంచి చేసుకోవాలని చెబుతారు. పాడెను మోయడానికి కనీసం నలుగురు అవసరమని అందులో సూచన. జీవిత నాటకరంగం మీదకు ప్రవేశం ఎంత ముఖ్యమైనదో, నిష్క్రమణం అంత ముఖ్యమైనది. వీధిగడపపై ఉంచే చమురుదీపాన్ని 'దేహళీదత్తదీపం' అనేవారు. అది నట్టింట్లోకే కాదు, వీధిలో నడిచే బాటసారులకు కూడా వెలుగుచూపించేది. జీవితాన్ని అలా దేహళీ దత్తదీపంగా మలచుకున్న మనిషి చనిపోతే, ఊళ్ళకి ఊళ్ళే శ్మశానానికి కదలివచ్చేవి. మళ్ళీ కళ్ళు తెరుస్తాడేమో అనే ఆశతో పాడెను ఒకసారి నేలమీదకు దింపి చూసేవారు. ఎవరికివారే తమ సొంతమనిషి పోయినట్లు ఎగసి వచ్చే దుఃఖంతో విలవిలలాడితే అది నిజానికి చావుకాదు, స్వర్గప్రాప్తి! కడసారి చూపుకోసం ప్రజలు తహతహలాడారంటే ఆ మనిషిది అమోఘమైన మరణం. ధన్యమైన జీవితం. ఒక గాంధీ పోతే ఈ జాతి అంతా అలా విలపించింది. ఒక నెహ్రూ చనిపోతే అలా ఎడబాటుకు గురయింది. తనకోసం ఏడ్చేవాళ్ళు నలుగురుంటేనే- బతుకైనా, చావైనా! మనిషి అంతిమయాత్రనుబట్టి నిర్ణయించవచ్చు- ఎలా జీవించాడనేది!

కడసారిచూపు అనేది ఆత్మీయతకు సంబంధించిన చేత. అంత్యేష్టి అనేది వైదిక సంస్కారాలకు సంబంధించిన మాట. దూరంగా ఉన్న బంధుమిత్రులంతా వచ్చేవరకు ఆగి, వారికి చివరిచూపు దక్కనిచ్చి, ఆ తరవాతే అంత్యక్రియలు నిర్వహించడం- చనిపోయిన మనిషికి లభించే కనీస గౌరవం! అంత్యక్రియలకు హాజరుకావడం వెనుక మానవీయమైన కొన్ని మహత్తర విలువలున్నాయి. గుండెతడికి సంబంధించిన కొన్ని తీయని గుర్తులున్నాయి. ఆత్మశాంతికి సంబంధించిన ఆనవాళ్ళున్నాయి. 'కన్ను తెరిస్తే జననం, కన్నుమూస్తే మరణం, రెప్పపాటుసేపు మనిషి జీవితం' అని కవి అన్నట్లు జీవితపు క్షణికతను గుర్తుచేసే గొప్ప పాఠాలున్నాయి. అవన్నీ త్వరలో ప్రశ్నార్థకాలు కాబోతున్నాయి. బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌ శ్మశానవాటిక ఆన్‌లైన్‌ ద్వారా అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారానికి ముందుకు వచ్చింది. ప్రత్యేక వాహనాలు వచ్చాక రుణం తీర్చుకోవడాలు, భుజం మార్చుకోవడాలు తగ్గిపోయాయి. కొంత డబ్బు చెల్లిస్తే- ఎవళ్ళో వచ్చి మోసుకుపోతున్నారు. ఇప్పుడు సౌతాంప్టన్‌ శ్మశానంవారు మరో సరికొత్త సదుపాయం ప్రకటించారు. నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు- రుద్రభూమికి వెళ్ళేపని కూడా లేదు. దహనవాటికపై జరిగే తంతులుగాని, ఖననదృశ్యాలుగాని నేరుగా ఇంటర్‌నెట్‌లో చూపించేస్తారు. ఇంట్లోనే కూర్చుని వాటిని తిలకించవచ్చు. ఒకవేళ దానికీ ఆపూట తీరిక లేకుంటే- డీవీడీల్లో సైతం భద్రపరచి ఇస్తారు. ఒక్కో డీవీడీకి మన కరెన్సీలో నాలుగువేల రూపాయల దాకా ఖర్చవుతుంది. తల్లి మరణానికి తల్లడిల్లిపోయి... 'నీ కొంగు పట్టుక నీదువెంట పోవుటకులేక కన్నీటిబొట్లు రాల్తు..'నని విలపించిన నాయనికి సహానుభూతిగా కంటతడిపెట్టిన సహృదయులు- గుండెతడిని ఆవిరిచేస్తున్న ఈ పరిణామాలకు ఏమైపోతారో తలచుకుంటేనే భయం వేస్తోంది. ఈ సరికొత్త సదుపాయం మనిషి సమాధికా, మానవత్వం సమాధికా?
(ఈనాడు,సంపాదకీయం, 06:04;2008)
___________________________________

Labels:

సుఖానికి అలసత్వమే అవరోధం

- ప్రొఫెసర్‌ పిసిపాటి వెంకటేశ్వరరావు
మానవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ సుఖాన్నే కోరుకొంటాడు. సుఖమయ జీవనానికి కావలసింది సంపద. ధనధాన్యాలు, వస్తువాహనాలు, ఇల్లు వాకిలి మొదలైనవి వస్తురూప సంపదలు. కీర్తిప్రతిష్ఠలు, బంధుమిత్రుల ఆదరాభిమానాలు, ఇరుగుపొరుగువారి సహకారం ఇత్యాదులు భావరూప సంపదలు. విద్య నిగూఢసంపద. ఆరోగ్యం మరొక ఉత్కృష్ట సంపద. ఈ సంపదలను ఏ కొద్దోగొప్పో సాధించుకోవాలన్నా, ఉన్నవాటిని పెంపొందించుకోవాలన్నా తగిన రీతిలో వాటికోసం యుక్త వయస్సునుంచే ప్రయత్నించాలి. సంపదలను సాధించుకోవటం ఒక ఎత్త్తెతే, వాటిని నిలబెట్టుకొంటూ సుఖంగా జీవించటం మరొక ఎత్తు. ఈ విషయాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు చూద్దాం అనే ధోరణిని విడిచి వెనువెంటనే కార్యసిద్ధికి ప్రయత్నించటం అత్యవసరం. అలా ప్రయత్నించ (లే)కపోవటానికి కారణం మనిషిలోని అలసత్వమే. అదే ఉపేక్ష, వేచి చూ...స్తూ..నే ఉండే ధోరణి. ఈ జాడ్యం ఆవహించిన మనిషి ఇహలోక సుఖానికే కాక పరలోక సుఖానికీ దూరమవుతాడంటారు.

దివసేనైవ తత్‌ కుర్యాద్‌ యేన రాత్రే సుఖంవసేత్‌
అష్టమాసేన తత్‌ కుర్యాద్‌ యేన వర్షాః సుఖంవసేత్‌
పూర్వేవయసి తత్‌ కుర్యాద్‌ యేన వృద్ధః సుఖంవసేత్‌
యావజ్జీవేన తత్‌ కుర్యాద్‌ యేన ప్రేత్య సుఖంవసేత్‌
(రాత్రివేళ సుఖంగా నిద్రించాలంటే తనకూ, ఇంటికీ కావలసిన జాగ్రత్తలన్నీ పగలే తీసుకోవాలి. వర్షకాలంలో సుఖంగా ఉండాలంటే మిగిలిన ఎనిమిది నెలల్లోనే అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి. వృద్ధాప్యంలో సుఖంగా ఉండాలంటే యుక్తవయస్సు నుంచే దేహదారుఢ్యాన్నీ, మనోనిబ్బరాన్నీ పెంపొందించుకోవాలి. చనిపోయిన తరవాత సుఖానికి జీవితాంతం పాటుపడాలి). ఇది వివేకశాలి అయిన విదురుడు చేసిన బోధ. ఈ విషయాల్లో అలసత్వం ఏమాత్రం పనికిరాదని పరోక్షంగా చేసిన హెచ్చరిక.

ఇవన్నీ ప్రత్యక్ష విషయాలే అనుకొన్నా, 'ప్రేత్యసుఖం' అనే విషయంలో మాత్రం ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. 'చనిపోయిన తరవాత సుఖమేమిటి? అది లేనేలేదు' అని కొందరి అభిప్రాయం. 'ఉందేమో!' అని మరికొందరికి ఒక అనుమానం. 'ఉంది' అని బహుకొద్దిమందికి పూర్తివిశ్వాసం. 'ఇంతకీ అది ఉందా, లేదా' అనే వాదనలకు దిగి తర్కించుకొంటూ దుర్లభమైన మానవ జన్మను వృథా చేసుకోకుండా, ఉందని ప్రయత్నిస్తే అది లేకపోయినా నష్టంలేదు. లేదని ఉపేక్షిస్తే మాత్రం అది ఉంటే మరెన్ని జన్మలెత్తినా తీరని నష్టమే సంభవిస్తుందని శ్రీశంకరుల హిత వాక్కు.

ఈ సుఖాన్ని కూడా సాధించుకోవాలనుకొంటే జీవితాంతం ధర్మానికి కట్టుబడి ఉండాలనేది మహాత్ముల బోధ.
ధర్మాచరణకు మార్గాలు ఎనిమిది. అవే యజ్ఞం, అధ్యయనం, దానం, తపస్సు, సత్యం, సహనం, అహింస, నిర్లోభత్వం. త్రికరణ శుద్ధిగా వీటిలో ఏ మార్గాన్ని నమ్ముకొని జీవితాంతం పాటుపడినా లక్ష్యం సుగమమే అవుతుంది. లలాట లిఖితం, ప్రాప్తం, అదృష్టం, కర్మఫలం, గ్రహస్థితి అనే విషయాల్లో సత్యం ఉన్నా లేకున్నా- వాటినే నమ్మి మన చేతిలో ఏదీ లేదనుకొంటూ నిర్లిప్తంగా జీవించటం సమంజసం కాదు. చక్కని పురుష ప్రయత్నంతో ఏదైనా సాధ్యమేనని చెబుతోంది.

(సర్వ మే వేహ హి సదా సంసారే రఘునందన! సత్యక్‌ ప్రయుక్తాత్‌ సర్వేణ పౌరుషాత్‌ సమవాప్యతే||)
అలసత్వాన్ని విడిచి, ఈ బోధను కార్యరూపంలో పెట్టి సుఖాలను సొంతం చేసుకొనేవారందరూ వివేకశీలురే.

(ఈనాడు,అంతర్యామి,15;06:2008)
_____________________________________

Labels: ,

ధ్యానం- జ్ఞానం


- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు

ఒక అమాయక భక్తుడు పురాణశ్రవణానికి వెళ్ళాడు.
'భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడ వెతికినా కనిపిస్తాడు' అన్న గురువు మాటలు అతనిలో బలంగా నాటుకున్నాయి. ఉన్న పళంగా భగవంతుణ్ని వెతుకుతూ బయలుదేరాడు. ఊరూరా తిరుగుతూ కొండలూ, లోయలూ గాలిస్తూ అడవిదారి పట్టాడు. చాలాదూరం నడవడంతో అలసి ఒక చెట్టునీడన విశ్రమించాడు. ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకుంటున్న రుషి ఆ భక్తుణ్ని చూసి 'ఎవరిని వెతుక్కుంటూ బయలుదేరావ్‌?' అన్నాడు. 'దేవుణ్ని' అన్నాడు భక్తుడు. రుషి నవ్వుతూ, 'దేవుణ్ని వెతుక్కుంటూ ఇంతదూరం వచ్చావ్‌, ఎక్కడ వెతికినా కనిపించే ఆ దేవుణ్ని ఒకచోట వెతకడం మరచిపోయావ్‌' అన్నాడు.
'ఎక్కడ స్వామీ?' అడిగాడు భక్తుడు.
'నీలాంటి భక్తులు వెంటపడుతున్నారని, దేవుడు ఎవరూ వెదకని ప్రదేశంలో కొలువై ఉన్నాడు. ఆ ప్రదేశం ఏమిటో ఎవరూ ఊహించలేరు' అన్నాడు ఆ రుషి. 'దయచేసి ఆ ప్రదేశం ఏమిటో చెప్పండి?' అన్నాడు భక్తుడు ఆతృతగా. 'అది, నీ మనసు, నీ మనసులోకి తొంగి చూడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు' అన్నాడు రుషి.
వెంటనే ఆ చెట్టుకింద కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానముద్రలోకి వెళ్ళాడు. నిమిషాలు గడిచాయి. అవి గంటలుగా మారి చాలాసేపటి తరవాత భక్తుడు కళ్ళు తెరిచాడు. తననే గమనిస్తున్న రుషిని చూసి 'స్వామీ... నా మనసులోకి తొంగిచూశాను, ఏమీ కనబడలేదు' అన్నాడు అమాయకంగా. అపుడు రుషి 'నువ్‌ నీ మనసులో ఏమీలేని శూన్యస్థితిని సాధించావ్‌, అంటే ఆకాశంలో అంతులేనిది, అదే నిరాకారుడైన భగవంతుని శక్తిస్వరూపం' అన్నాడు.
- ఈ కథలో పేర్కొన్న విధంగా పారమార్థిక ధ్యానం ద్వారా అంతర్యామితో మమేకమయ్యే మార్గం సులభతరం అని యోగిపుంగవులైనవారు ధ్యానమార్గాల్ని గురించిన బోధనలు సాగించారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీనిద్వారా భవిష్యత్తుపై భయంగానీ, నిన్నటి గురించిన దిగులుగానీ లేని 'ఈ క్షణంలోకి ప్రయాణించడం సులభం' అని మరికొంతమంది యోగులు ప్రవచించారు. నువ్వు ఎవరు, నేను ఎవరు, ఈ సృష్టి రహస్యం ఏమిటనే ప్రశ్నలకు ధ్యానంద్వారా సమాధానం లభిస్తుందంటారు వేదాంతులు. ధ్యానంద్వారా తమలోకి తాము అంతర్ముఖులై తమ అంతర్వాహిని వినగలుగుతారు. అలా మనస్సు అంతః పొరల్లోకి చూడటం ధ్యానం ద్వారానే సాధ్యం, అదే ఆత్మశోధన అన్నారు గాంధీ.
సముద్రం అంటే చాలా ఉన్నతమైనదనీ దానిలో జలక్రీడలు చేయడం అంతులేని ఆనందం కలిగిస్తుందనీ ఎవరో చెబుతుంటే ఒక చేప విని, తన తల్లి చేపను అడిగింది. 'అసలు సముద్రం అంటే ఏమిటి?' అని. ఆ తల్లి చేపకూ సమాధానం తెలీదు. తమ సహచర చేపల్ని ప్రశ్నించింది. అసలు ఏ చేపకూ సముద్రం గురించిన విషయం అంతు చిక్కలేదు. ఆ చేపలన్నీ కలిసి సముద్రం గురించి అన్వేషణ సాగించాయి. వాస్తవానికి, ఆ చేపలు నివసించేది సముద్రంలోనే. అదే అజ్ఞానం.
పైన చెప్పిన కథలోని అమాయక భక్తుడు తన మనసుమందిరంలో కొలువై ఉన్న దేవుణ్ని తెలుసుకోలేక వూరూవాడా తిరిగినట్టుగా, ఆ చేపలు సైతం సముద్రంలో సంచరిస్తున్నా అజ్ఞానంతో సముద్రపు ఉనికినే మరచిపోయాయి. ఈ రకమైన అజ్ఞానపు చీకట్లు తొలగి జ్ఞానజ్యోతులు వెలగాలంటే ధ్యానం సహాయకారిగా నిలుస్తుందనేది ఈ కథలు చెప్పే ఆధ్యాత్మిక ప్రబోధం.
ధ్యానం చేసేకొద్దీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగేకొద్దీ ధ్యానంలో అవగాహన అదేస్థితిలో మెరుగవుతుంది అంటారు ధ్యానం ద్వారా జ్ఞానసంపన్నులైన మహానుభావులు. అలాంటివారు చూపిన ధ్యానమార్గంలో నడిచి జ్ఞానవంతులు కావడం అందరికీ సులభసాధ్యం, ఆచరణ యోగ్యం.
(ఈనాడు, అంతర్యామి, 11:06:2008)
_____________________________________

Labels: ,

నాగభైరవ కోటేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య నాగభైరవ కోటేశ్వరరావు (76) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక్కడి మధురానగర్‌లోని స్వగృహంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతి చెందారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. భార్య చాలాకాలం క్రితమే చనిపోయారు. అనేక కథలు, కవితాసంపుటిలు రాసిన నాగభైరవకు.. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేది. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'కు ఆయన మాటలు కూడా రాశారు. ఇరవై సినిమాలకు పాటలు రాశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ కార్యదర్శి నారాయణ సంతాపం వ్యక్తంచేశారు. మూడు దశాబ్దాలుగా తన వచన కవితలతో యువతరాన్ని ప్రోత్సహించారని, కవిత్వం ద్వారా అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాగభైరవ సిద్ధహస్తుడని వైఎస్‌ పేర్కొన్నారు. ఆయన రచనలు తెలుగుసాహితీ ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందాయని, రంగాజమ్మ, కన్నీటిగాధ, గుండ్లకమ్మ చెప్పిన కథలు సామాజిక స్పృహకు నిదర్శనాలని బాబు తెలిపారు. నాగభైరవ ఎందరో యువ సాహిత్యవేత్తలను ప్రగతిశీల సాహిత్యం వైపు నడిపించిన ఉద్యమకారుడని నారాయణ శ్లాఘించారు.

కవన విజయంతో ప్రాచుర్యం: నాగభైరవ వృత్తి రీత్యా అధ్యాపకుడైనా.. కవి, రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా భిన్న భూమికలు పోషించారు. ప్రకాశం జిల్లా రావినూతలలో 1931 ఆగస్టు 15న జన్మించిన ఆయన.. ప్రాథమిక విద్యాభ్యాసం ఆ జిల్లాలోనే పూర్తి చేశారు. తెలుగు భాషపై మమకారంతో తెలుగు మాధ్యమంలోనే ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగరీత్యా నెల్లూరు వెళ్లారు. అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో దీర్ఘకాలం తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, చేబ్రోలు, ప్రకాశం జిల్లాలోని చీరాలలో పనిచేశారు. విధులు నిర్వహిస్తూనే.. సాహిత్యంపై అభిరుచితో కథలు, కవితా సంపుటిలు, నవలలు రాశారు. ఇందులో రంగాజమ్మ, కన్నీటి గాథ, తూర్పు వాకిళ్లు, ఒయాసిస్సు ముఖ్యమైనవి. 'భువన విజయం'కు వ్యంగ్యానుకరణగా ఆయన రాసిన 'కవన విజయం' పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. 300కిపైగా ప్రదర్శనలు నిర్వహంచారు. తెలుగు సాహిత్యంపై 'గురజాడ నుంచి బెజవాడ దాక' అన్న కవితా రూపం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. వెలుతురు స్నానం, గుండ్లకమ్మ చెప్పిన కథలు, పద్యరూపకాలనూ రచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. 2001లో తానా అమెరికాలో నిర్వహించిన తెలుగు మహాసభలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈయనకు రాజాలక్ష్మి ఫౌండేషన్‌, గడియారం వేంకట శేష శాస్త్రి, రామినేని ఫౌండేషన్‌ వారి నుంచి పురస్కాలు పొందారు.
(ఈనాడు, 15:06:2008)
__________________________________

Labels: ,