My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, December 19, 2012

Don't judge people....

 
A 24 year old boy seeing out from the train's window shouted...

"Dad, look the trees are going behind!" dad smiled and a young couple sitting nearby, looked at
the 24 year old's childish behaviour with pity, suddenly he again exclaimed ... "Dad, look, the clouds are running with us !" 

The couple couldn't resist and said to the old man... "why don't you take your son to a good doctor?" 

The old man smiled and said ... "I did and we are just coming from the hospital, my son was blind from birth, he just got his eyes today..."

Every single person on the planet has story.
"Don't judge people before you truly know them. the truth might surprise you... think before you say something...!!!


(via Facebook)
_____________________________

Labels:

Tuesday, December 18, 2012

Let go.....


(via Facebook)
_____________________________________________

Labels:

ప్రేమ యాత్ర


తలపుల వలపుల కలగలుపు వల 'పెళ్లి'! అనంత రసాస్వాదన, రసరమ్య స్వప్నావిష్కరణ... రెండూ ఇందులోనే. ఆ సంబరం అర్ణవమైన వేళ 'కణకణమందు నీ యునికిగంటి, సుమధ్య సువర్ణ కింకిణీ/ క్వణనములందు నీ మధురగానము వింటి, విశాల సృష్టిలో/ అణువణువందు నీ మహిమ లారసికొంటి'- అని ఉభయులూ ఏకోన్ముఖులు కావడం కరుణశ్రీ భావించినట్టు, సుమనోహర దృశ్యమే. ప్రేమించి పెళ్లి చేసుకోవడమా, పెళ్లిచేసుకుని ప్రేమించడమా అన్న చర్చ, ప్రేమైక జీవన సౌందర్య పిపాసులకు పూర్తిగా అయిష్టం. అన్నింటికన్నా ప్రధానం ప్రేమతత్వమనుకుంటే, పెళ్లితో అది స్థిరపడుతుందన్నది తిరుగులేని వాస్తవం. నీటికి పారుదల ఎంత సహజసిద్ధమో పెళ్లయిన జంట మధ్య ప్రేమవాహినీ అంతే. అరిటాకులో అన్నంలా వెచ్చవెచ్చగా ఉండేదీ, తమలపాకులో సున్నంలా ఎర్రెర్రగా పండేదీ ఆ రసానుభవమే. 'మాధవీ విలాసంలా మధువసంత హాసం'లా ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే అదే ఆ ఇద్దరి రసోద్దీపనకీ సముద్రమంత వేదిక. ఆ అంతా సొంతం, శాశ్వతం చేసుకునే క్రమంలో ఇద్దరూ ఒక్కరిగా మారి సాగించే విహారయాత్ర అపూర్వమూ అపురూపమూ. అంతటి రసవత్తర ప్రేమయానానికి నగరాలూ నదీతీరాలూ వనాలూ భవంతులూ మజిలీలు. నారాయణ కవి భావించినట్టు 'కడకన్నుల కాంక్షలు పల్లవింపగా' క్రీగంట చూసుకుంటూ, గుసగుసలాడుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, కలిసి నడుస్తూ, కలిసే స్నానాలు చేస్తూ, శ్రమిస్తూ, విశ్రమిస్తూ... వారు సాగించేవన్నీ ముద్దూ మురిపాలే. ఆకలిదప్పులు లేకుండా, అలుపూ సొలుపూ కానరాకుండా ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు! ఆ ప్రపంచంలో ఉండేదల్లా ఆ ఇద్దరే! పొద్దస్తమానమూ వారిది సొగ'సరిగమల' ఆలాపన, సరస సామ్రాజ్య నిర్వహణ.

కవి సుధాంశుడు సందర్శించినట్టు- దంపతుల ఆ మధురాతిమధుర యాత్ర 'లలిత లాస్య నవ మహోదయం/ మంజుల మధుకర మన్మధోదయం'. అన్యోన్యత నిలుపుకోవాలన్న తపన తనువంతా నిండాలే కానీ, సరస విహార తరుణాన ఈ భువికి ఆ దివి దిగిరాక తప్పదేమో! ఇరు హృదయాల్నీ దేహాల్నీ మమేకం చేసే శుభ సందర్భమది. కలిసి ఆడుకునే ఊసులు, చేసుకునే బాసలు, వాలిపోవడాలు, సోలిపోవడాలు ఎంతెంత ఉత్తేజ కారకాలో! కలలూ కోరికల కలబోతతో జీవిత భాగస్వామి అంతర చిత్రం ఆ స్థలిలోనే నవ్య కోణంలో ఆవిష్కారమవుతుంది. బెరుకంటూ లేకుండా ఎటువంటి అవాంతరమూ రాకుండా ఉభయత్రా స్వేచ్ఛగా స్వతంత్రంగా పంచుకునే భావాల వెల్లువ ఉంటుందక్కడ. యుగళ గీతంలా వలపు బాణంలా సుతారంగా సూటిగా మదిని తాకడం అనుభవమై 'స్వర్ణకుమారి' కృతికర్త వర్ణించినట్టు 'మంద మలయానిలముల్ పులకించి స్వర్గసౌఖ్యములొలికించునట్టు' సంతోష సాగరాన్ని తరలించుకొస్తుందది! ఆ కడగంటి చూపులోని పడిగాపుల అర్థమేమిటో, ఆ సుతిమెత్తని తాకిడి వెనక అంతరార్థమేమిటో తెలిసేది వారికే. లోపలా వెలుపలా ఉండే తేడాలన్నీ అరిగిపోయి తరిగిపోయి కరిగిపోయి చివరికి కనుమరుగయ్యేదీ భార్యాభర్తల ప్రేమ పర్యటనలోనే! 'వలపుల బావిలో మునుక వైచెను జీవిత మాధురీ సుధా/ కలశము; పైకి చేదుకొనగా వలె చంచల కాలచక్రపుం గిలకల మీదుగా' అన్నారందుకే క్రాంతిశ్రీ. పెళ్లి నూరేళ్ల పంటగా ఉండాల్సిన చోట ఎప్పుడైనా మంట లేచిందన్నా, కలకాలం పదిలపరచాల్సిన పెళ్లిపుస్తకంనుంచి పుటలు కొన్ని జారిపోయాయన్నా... అక్కడేదో లోపమో దోషమో ఉన్నట్టే! సరసకు వచ్చినప్పుడే అది సరసమవుతుంది కానీ వరస తప్పితే దాపురించేది విరసమే కదా! నిట్టూర్పుల పొగలూ సెగలూ చుట్టుముడితే ఏ కాపురమైనా ఉక్కిరిబిక్కిరే. అయినా దువ్వూరివారన్నట్టు 'ప్రణయపాశంబులెట్టివో బలిమిబట్టి/ లాగినను ద్రెవ్విపోవక సాగుచుండు' అనుకోక తప్పదిక.

వివాహాలు ఆ లోకంలో నిర్ణయమైతే, విడాకుల వ్యవహారం ఈ లోకంలోనా అనిపిస్తుంది ఒక్కోసారి. కారణాలేవైనా, పగలొచ్చిన అలకా కలతా రాత్రి దాటినా తీరకపోతే- ఆ ఇద్దరిదీ ఒంటరి అంకె! ఆరుద్ర అవలోకించినట్టు వారి 'జీవితం శాశ్వత మథనం, తుదిలేని కథనం'. స్థితిగతులు ఆ తీరులో ఉన్నా 'మరో హనీమూన్' ఫలంగానే రససిద్ధి సులభ సాధ్యమవుతుందని 'మ్యారేజ్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా' అధ్యయనం ఇదివరకే తేల్చిచెప్పింది. పెళ్లయిన రెండు దశాబ్దాలకు పలు కారణాలతో విడిపోవాలనుకున్న జంట ద్వితీయ యాత్రతో ఏం పొందిందన్న కథాంశంతో చలనచిత్రమూ మునుపే వచ్చింది. అదే అద్వితీయ యోచనతో మలేసియా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం సైతం తాజాగా ఉత్తమ ఫలితాలనే అందించింది. పెళ్లయిన కొన్నాళ్ల తరవాత రకరకాల పరిస్థితుల్లో కీచులాటకు దిగుతున్న జంటల్ని 'ఇంకోసారి వెళ్లిరమ్మ'ని ఉల్లాస యాత్రకు పంపించారక్కడ! సమస్యల తీవ్రత తట్టుకోలేక వేరుపడాలన్న ఆలోచనదాకా వచ్చిన పురుషులు, స్త్రీల పాలిటా అదో ఆశాజ్యోతి అయింది. 'ఇద్దరం ఒక్కటే'నన్న మానసిక, శారీరక సఖ్యతతో ఆ తరహా విహారం వారికో తీపి జ్ఞాపకంగా మారింది. దాంపత్య బంధాన్ని ఆ విధంగా బలోపేతం చేసిన ప్రభుతకు సౌహార్ద్రపూరిత కృతజ్ఞత తెలిపేలా చేసింది. పెదవి విరుపులూ కోపతాపాలకు మారుగా సరదాలు, ఆనందాలకు ఆ స్థలమే స్థానం కల్పించిందన్న మాట! 'ప్రేమ చొరరాని తావులు పృథివి లేవు లే'వన్న నాళంవారి మాటలు నవోత్సాహ కారకాలైతే 'సకల యత్నముల నుత్సాహంబె మనుజులకు సకలార్థ మూల'మన్న 'రంగనాథ రామాయణ' కర్త వాక్కులు మరిక యాత్రా ప్రోత్సాహక రస గుళికలే! 


(28:10:2012, ఈనాడు ) 
________________________

Labels:

What- to use/ to love...

(via Facebook)
____________________________________

Labels:

వైవిధ్య మోహనం

సకల జీవజాలానికీ ఆలవాలమీ లోకం. ఒక్క మానవులకే కాక, కవిశ్రీ వీక్షించినట్లు 'పచ్చని పంటచేలు, పయిపై జను మబ్బులచాలు, తోటలో/ విచ్చిన జాజిపూలు, నులివెచ్చని తేనెలు, వానలున్, గడున్/ ముచ్చటగొల్పు లేళ్లు...' ఇత్యాదులన్నీ ఇందులో భాగాలు. మహా ప్రాణులు మొదలు అల్పజీవాల వరకు లెక్కకు మిక్కిలి నిండిన ఈ సువిశాల విశ్వసీమలో 'పరమ హితమె పరమ ధర్మ'మన్న పోతనామాత్యుని మనసారా స్మరించి కళ్లూ చెవులూ సారించాలే కానీ ఎటుచూసినా సమైక్యజీవన సుందర నందనమే! అల్పాయువైన పరమ సాధారణ కీటకమూ ఇక్కడే, సృష్టికి ప్రతిసృష్టి చేసేంత యుక్తీ శక్తీ నిండిన మానవుడు ఉండేదీ ఇక్కడే! లోకంలో లక్షలాది జీవరాశులున్నా వాటన్నింటినీ మించిన బుద్ధిజీవి కనుకే మంచిచెడుల విచక్షణ మనిషికెక్కువ. 'ధర్మసాధనములందు నాద్యమగు సాధనంబు దేహంబు కాదె' అన్న నాటి శ్రీనాథ భాషితం మదిలో మెదిలిందే తడవుగా, డేగ బారి నుంచి ఓ పావురాయిని కాపాడేందుకు తన శరీర మాంసభాగాన్ని కోసి తులలో వేసిన శిబి గుర్తురాక మానడు. దేహఖండాలెన్ని వేసినా ఆ మూగ ప్రాణి బరువుకు సరితూగలేదన్న నివ్వెరపాటుతో ఏకంగా తనను తానే తక్కెడకు అర్పించుకున్న ఆ ఉదాత్తతకు కళ్లు చెమర్చకా మానవు. పరోపకార పరాయణత అంతగా విలసిల్లిన మన భరత భూమిలో 'లలితోద్యాన పరంపరా పిక శుకాలాప ప్రతిధ్వానముల్' వినవచ్చినందుకు అలనాటి ఆ 'ఆముక్తమాల్యద' కర్త ఎంత పులకించి ఉంటారో? ఆనాడు అడవిలో పుట్టిన ముక్కుపచ్చలారని పసికందును రెక్కలు చాపి ఆదుకున్న శాకుంతలాల్ని చూసి కణ్వ మహర్షి మది ఇంకెంత పరవశించిందో! ఆ పక్షుల ఉపకార గుణానికి గుర్తుగానే 'శకుంతల' అయిందా బిడ్డ. పెరిగి పెద్దయిన ఆమెకు స్నేహితురాలైన ప్రియంవదదీ ప్రకృతీ పక్షిసంతతితో మమేకమైన హృదయమే.

పక్షుల కలిసికట్టుతనాన్ని విపులీకరించిన 'నల దమయంత చరిత' ప్రకారం, హంసల సొగసు నడకల్ని తిలకించి పరవశించాడు నాయకుడు. ఆ గుంపులో ఒకదాన్ని ఎగిరిపోకుండా పట్టుకోవడంతో, మిగిలినవన్నీ సహచరి విముక్తి కోరి అక్కడే ఆకాశంలోనే ఇటూ అటూ తిరిగాయి. శరత్కాలపు మేఘాల తెల్లదనానికి హంసల తెలుపూ తోడవడం వాటి లోలోపలి నిర్మలతను సూచించిందనడం మరింత విశేషాంశం. మరిక అంతా తెలిసిన, ఎంతో చూస్తున్న మనుషుల ద్వారా పశుపక్ష్యాదులకూ క్రిమికీటకాలకూ కలుగుతున్న మేలెంత? 'జప తపంబులకన్న చదువుసాములకన్న ఉపకారమే మిన్న' అన్న 'కూనలమ్మ' కర్త పిలుపునీ, 'చక్కని చిలకల పంజరములనిడి రెక్కలు దాస్తావెందుకూ? 'కో'యని నిద్దుర లేపే కోళ్లను గొంతులు కోస్తావెందుకూ?' అనే కరుణశ్రీ నిరసననీ గ్రహించి వ్యవహరించాల్సింది మనిషి మాత్రమే. ఉపకరించకపోగా బంధించీ వధించీ దానవత చూపుతోందీ మానవుడే! రూప నిర్మాణాల్లో ఎంతెంతో చిన్నవైన రెక్కల పురుగులు సైతం ఇతర సూక్ష్మజీవాల్ని పరిహరించి మానవ జాతికి ఎంతో కొంత ఉపయోగపడుతుంటే, తన మానాన తాను పోతున్న చిరుచీమను సైతం కాలరాచి వేలితో చిదిమేసి వదిలించుకుంటున్నాడు మానవుడు! పురుగు పుట్రల నుంచి పంటపొలాల్ని సంరక్షించే కప్ప, జనావళికి హాని కారకాల్ని నిర్మూలించే బల్లి, పుష్కలమైన స్థితిస్థాపకత్వంతో తన గూడును పటుతరం చేసుకుని ఇవాల్టి రక్షక కవచాల రూపకల్పనకు కీలకాధారంగా నిలిచిన సాలీడు... వీటన్నింటితో- భూమి పోషణ, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ సాధ్యపడుతున్నాయి. ఇదంతా చూస్తుంటే 'పరుల కుపకరింప పరలోక హితమగు'నన్న వేమన వాణి గుర్తురావడం లేదూ! పంచే గుణమంటూ లేకుంటే, సిరివెన్నెల అన్నట్లు 'చివరికీ ప్రపంచంలో మిగిలేదల్లా శూన్యమే!'

ప్రకృతి భాగాలైన పూలూ పక్షులూ జంతువులూ చూపే త్యాగబుద్ధి... వాటన్నింటి కంటే ఉన్నతుడనుకునే వ్యక్తికి ఎందుకుండదో? స్వార్థమే అంతటికీ కారణమన్న వేంకట పార్వతీశ కవుల దృక్పథంలో నుంచి చూస్తే 'తాను తన పండు దినబోదు తేనె యరటి/ తాను దన పాల గ్రోలదు ధన్య సురభి/ తాను దన తావి గ్రోలదు తమ్మిపూవు/ జగతిలో నరుడొక్కడె స్వార్థపరుడు'. ప్రకృతి ఎంతమాత్రం మనిషిమీద ఆధారపడి లేదు. ఆ రీత్యా పాఠాలు నేర్చుకోవాల్సిందీ నేర్చుకున్నవాటిని ఆచరించాల్సిందీ మానవుడే! ఎందుకూ కొరగాదని ఎందరో అనుకునే పేడపురుగు నేలమీద ఉన్నవాటిని తిని వ్యర్థాల నిర్మూలనకు దోహదపడుతోంది. పండ్లను తిని రెట్టలు వేసి, ఆ ప్రాంతమంతా విత్తనాల్ని విస్తరించి వృక్షకోటిని పెంచుతోంది కలివికోడి పక్షి. మేధావి చెహోవ్ చెప్పినట్లు ప్రకృతే మనిషికి సృజనశక్తినిచ్చి, తానుగా కొంతన్నా జోడిస్తాడన్న నమ్మకంతో ఉంది. కాలక్రమాన జోడించిందంటూ ఏదీ లేకపోగా ఉన్నదంతా మటుమాయం అవుతుండటమే వైచిత్రి. నర్తన రీతిలో సాగుతూ వందలాది సహచరాలకు దోహదమయ్యేలా తేనెను గూడునిండా నింపుతుంది తేనెటీగ. అది చూపే ఆ సంవిధాన నైపుణ్యమే ఇప్పుడు మన వేలికొసల తాకిడితోనే అపారంగా మన ముందు నిలిచే సమాచార ప్రవాహానికి స్ఫూర్తి! విదేశీ శాస్త్రవేత్తల ఈ తాజా పరిశోధన ఫలితం జీవ వైవిధ్య ప్రక్రియకో మేలి మలుపు. 'నీకున్నది నలుగురికీ పంచు, ఆ గుణంలో అందర్నీ మించు' అన్నది జన నాదమూ జీవన విధానమూ అయిననాడు- హితమూ సుఖమూ అదే! 

(21:10:2012, ఈనాడు )
_____________________________

Labels:

Success secret















(via Facebook)
__________________________________

Labels:

పోతపోసిన ప్రజాకవి

భారతీయ సంస్కృతికి మూలకందాలు మూడు గ్రంథాలు. వాల్మీకి వ్యాసమహర్షుల విరచితాలు రామాయణ భారత భాగవతాలు. తొలి రెండూ ఆంధ్రావనికి అందాయి. భాగవతంమీదే ఎవరిచూపూ పడలేదు. చూపుపడినా చేయిసాచే సాహసం ఏ కవీ చేయలేదు! హయగ్రీవ బ్రహ్మవిద్యగా నామాంతరం ఉన్న భాగవతం కవిత్వ కార్కశ్యానికి పరాకాష్ఠ కావడమూ కారణం కావచ్చు. ఆ మహాభాగవత ఫలం ఒక తెలుగు చిలుక కోసం మీదుకట్టీ ఉండవచ్చు. వీరశైవాన్ని ప్రచారం చేసిన సోమనాథుని 'పాలుకుర్తి'కి చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలో ఉంది ఆ చిలుక. పేరు పోతరాజు. భోగినీ దండకాన్ని ఒక రాచవలరాజు వీనులకు విందుగా వినిపించిన రాసిక్యానుభవం అప్పటికే ఆ శుకరాజు సొంతం. ఆ 'శుకముఖ సుధాద్రవం'గా భాగవతం అందటం తెలుగువారు చేసుకున్న అదృష్టం. సంస్కృత భాగవతం పారాయణం నిరంతరాయంగా సాగే రోజుల్లో ఏ దివ్యక్షణాన పోతన్నకు శ్రీమన్నారాయణ ప్రపంచాన్ని వివరించాలన్న కుతూహలం రేగిందో! పనిగట్టుకొని ఒక నిండుపున్నమి రాత్రి గోదావరీనది సైకతాన మహేశ్వర ధ్యానానికని సాగడమేమిటి! కాంతాసమేతుడైన ఓ రాజముఖ్యుడు కనిపించి 'భవబంధ విముక్తి' మార్గంగా భాగవతాన్ని తెలుగు చేయమని పురమాయించటమేమిటి! అది శ్రీరామచంద్రమూర్తి ఆనగా పోతన భావించడమేమిటి! చరిత్రకు అందని సంఘటనల వాస్తవావాస్తవాలను నిర్ధారించడం కష్టం కానీ... 'శూలికైన దమ్మి చూలికైన' తెలిసి పలుకుట కష్టమైన భాగవతాన్ని 'అందరూ' మెచ్చే విధంగా బమ్మెర పోతన తెలుగు చేయడం మాత్రం ఏ చరిత్రా కాదనలేని సత్యం. అది, తెలుగు భాష చేసుకున్న పుణ్యం!

భాగవతం తెలుగుసేతే ఒక విశేషమైతే... భాగవతంలోని విశేషాలు ఇంకెన్నో! కమ్మని కావ్యాన్ని ఏ ప్రభువుకో అంకితమిచ్చి వెయ్యిన్నూట పదహార్లు సంభావనగా పుచ్చుకొమ్మని ఒత్తిళ్లు వచ్చే ఉంటాయి. పోతరాజు అంతపనీ చేస్తాడేమోనన్న భీతితో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడలు కవిగారి ఇంటి గడపన చేరి 'కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ' ఏడ్చిందట. 'నిను నా కటికిం కొనిపోయి యల్ల క/ ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము'మని భారతికి పోతన బాస చేశాడట. రాజుల్ని కాదనడానికి ఎంత సాహసం కావాలీ! ప్రారంభంనుంచీ బమ్మెర పోతనది ప్రత్యేక మార్గమే. రామచంద్రుని ఆనతో చేస్తున్నానన్న రచన ఆరంభంలోనే పోతన సంప్రదాయానికి విరుద్ధంగా నాలుగు ఉత్పలమాలలతో శ్రీకృష్ణుడికి షష్ఠ్యంతాలు సమర్పించాడు. కృష్ణ చరిత్ర మధ్యలో శ్రీరామ కథను విస్తారంగా చెప్పి ఆ లోటును పూడ్చుకున్నాడు. వీరశైవ మతానుయాయి అయిన కేసన వంశాన పుట్టీ పరమ భాగవతోత్తముడిగా రూపాంతరం చెందిన విచిత్ర చరిత్ర పోతరాజుది. అర్థంలేని నిషేధాలను ధిక్కరించడంలో పోతన్నది ఎప్పుడూ ముందు వరసే. లాక్షణిక ధిక్కారం చేసి వేశ్యయే కావ్యనాయికగా తెలుగులో 'భోగినీ దండకం' రాసి కొత్త ఒరవడి పెట్టిన సృజనకారుడు పోతరాజు. సంప్రదాయ లక్షణంగా వస్తున్న కుకవి నింద చేయనేలేదు. శబ్దాలంకార ప్రియుడేకానీ... వ్యర్థ పదప్రయోగాలకు, అపస్వరాల లౌల్యానికీ పోతన బద్ధ విరోధి. సంస్కృత సమాసభూయిష్ఠమైన రచనలను ఒక వర్గంవారు ఆదరించేవారు. అచ్చ తెనుగు రాతలను మెచ్చుకునే విజ్ఞులు మరికొందరు. మధ్యేమార్గంగా అందరినీ మెప్పించే శైలిని స్వీకరించి తెలుగు భాగవతాన్ని పండిత పామర శిరోధార్యంగా మలచిన లౌకిక అలౌకిక యోగి పోతన- పోతపోసిన ప్రజాకవి.

పోతనగారి మహాశివుడు హాలాహలం మింగబోతున్నా పక్కనే ఉన్న సర్వమంగళ వారించదు. జగత్కల్యాణం ఆ జగన్మాత లక్ష్యం. సంప్రదాయానుసారం గొల్లలు చేసే ఇంద్రయాగాన్ని ప్రశ్నించి 'కానలు, కొండలు, పసుల గాదిలివేల్పులు గొల్లవారికిన్' అంటూ ప్రకృతిపూజ అవసరాన్ని ప్రతిపాదిస్తాడు శ్రీకృష్ణుడు. గీతలో చెప్పిన కర్మయోగ ఆవశ్యకతను ప్రజోపయోగంగా మలచడం ఆ నాయకుడి లక్షణం. కాళింది మడుగులో పడ్డ బిడ్డను తలచుకొని ఎర్రన్న సృజించిన యశోదమ్మ ఎడాపెడా ఏడిస్తే... పోతన్న సృష్టించిన తల్లిమాత్రం 'తండ్రీ! నీవు సర్పదష్టుండవైయున్న నిచట మాకు ప్రభువు లెవ్వరింక' అని రోదిస్తుంది. బిడ్డ క్షేమంకన్నా ముందు ప్రజల యోగక్షేమాల చింత ఆ తల్లిది. బాల ప్రహ్లాదుడు జాతి లక్షణానికి విరుద్ధంగా హరిభక్తిలో పడినప్పుడు హిరణ్యకశ్యపుడిలోని తండ్రి స్వజాతి రక్షణ గురించే బెంబేలుపడతాడు. శ్రీకైవల్య సిద్ధికని శ్రీకారం చుట్టిన భాగవత రచనలో పోతన అడుగడుగునా తపించింది కేవలం మోక్షప్రాప్తి మార్గాలకోసమే కాదు. తనసృష్టి- తనచుట్టూ ఉన్న లౌకిక లోకానికీ ఒక చక్కని సత్వదృష్టినీ కలిగించాలన్న తపన పోతనది. అడుగడుగునా పాఠకుల గుండెను తడుముతూ, తడుపుతూ సాగింది కనుకనే శ్రీమదాంధ్ర మహాభాగవతం కాలపరీక్షకు ఎదురు నిలిచి తెలుగువారి గుండెల్లో మతాలకతీతంగా నిలబడింది. భాగవతం ప్రజాదరణకు కేవలం భక్తి ప్రభావమే కాదు- మంద్ర గంభీర గమనంగల శైలీకారణమే! 'పోతన భాగవతం సహజధారా విలసితం, ఓజః ప్రసాద గుణోజ్జ్వలితం' అంటారు వామపక్ష భావాభిమాని అయిన ఆరుద్ర! భాగవతంలోని వివిధ ఘట్టాలు, పలుకుబడులు, పద్యాలు తెలుగుజాతి జీవనంలో నీళ్లలో పాలుగా కలగలిసిపోయాయి. కరుణశ్రీ అన్నట్లు 'అచ్చపు జుంటి తేనియల, నైందవ బింబ సుధారసాల గో/ ర్వెచ్చని పాలమీగడల, విచ్చెడి కన్నె గులాబి మొగ్గలన్/ మచ్చరికించు మధుర మంజుల మోహన ముగ్ధ శైలి'ని తెలుగు మనసులకు రుచి చూపించిన సుకవి పోతన. అలాంటి కారణజన్ముణ్ని కన్న తెలుగుతల్లి ధన్యచరితే కదా! 

(14:10:2012, ఈనాడు )

__________________________

Labels: ,