My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, May 13, 2006

తథాగతుడు/ శ్రీలంక(srilanka)











Dr.Manmohan Singh(PM) launches, at Vigyan Bhavan in New Delhi, the year long commemoration of the 2,550th anniversary of the 'Mahaparinirvana' of Buddha.
Follow the path of righteousness, benevolence and humanism.



_____________________________________________________________________________________

Labels:

To beat the blistering summer heat


_____________________________________________________________________________________

Labels:

తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే

[డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి "ఇంటింటా తెలుగు దివ్వె" (వ్యాఖ్యానం- 'ఈనాడు'దినపత్రిక 25:04:2006) నుండి ఎత్తి రాసిన కొన్ని అంశాలు]

తెలుగువారిలో ప్రతి ఒక్కరూ తెలుగుకు నిలువెత్తు దర్పణంలా నిలవాలి.
మనం పలికే ప్రతి పలుకులో తెలుగుకే పట్టం కట్టాలి.
ప్రతి పలకరింతా తెలుగు పులకరింత కావాలి.

......................... తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే,...................... ఇప్పటికయినా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనలో తెలుగు బాగా వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మనం చిత్తశుద్ధితో కొన్ని నిర్ణయాలు తీసుకొని, వాటిని తు.చ. తప్పకుండా ఆచరిస్తే ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మనల్ని చూసి ప్రభుత్వం కూడా మార్గం మార్చుకుంటుంది.

[1]ముందుగా- తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వారి సంతకాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుగులోనే చేయాలి. బ్యాంకు లావాదేవీల దగ్గరనుంచి, ఉద్యోగం చేసే చోట చేస్తున్న పొట్టి సంతకాల దాకా!

[2]మనమందరం కలిసి ప్రతిరోజూ సాగించే ఉత్తర, ప్రత్యుత్తరాలు అసంఖ్యాకంగానే ఉంటాయి. ఆ ఉత్తరాలలో నిర్దేశించిన విషయం ఆంధ్ర దేశ పరిధిలో ఉంటే, ఆ విషయాన్ని; ఉత్తరాలపై రాసే చిరునామాల్ని కూడా తెలుగులోనే రాయండి. ఒకవేళ ఆయా అధికారులు ఆంధ్రేతరులైనట్లయితే, తెలుగులో ఉన్న ఆ లేఖల్ని చదివి తర్జుమా చేయించుకునే తలనొప్పి వారిదే అవుతుంది.

[3]బజారుకు వెళ్ళి మనమేదైనా కొనేటప్పుడు వాటి పేర్లను సహజంగా తెలుగులోనే చెప్పి కొనుక్కురండి. నిత్యావసర వస్తువుల్ని, పచారీ సామాన్లను, కూరగాయలను, పండ్లను ఇలా పలకడానికి ఇబ్బందిలేని, తెలుగు భాషలో చక్కని పదాలు ఉన్న వాటిని ఆ పేర్లతోనే పలకండి. తెలుగు భాషలో లేని పదాలు గల ఇతర భాషలలోని వస్తువుల పేర్లను (టీవీ, సైకిలు, రేడియోవంటివి) అలాగే పలకండి.

[4]బ్యాంకు ఫారాలను, మనియార్డరు ఫారాలను, చలానాలను నింపేటప్పుడు ఒకవైపు ఆంగ్లంలోనూ, మరొకవైపు తెలుగులోనూ నమూనా ఉంటే తెలుగులోనే కచ్చితంగా నింపండి.ఏవైనా దరఖాస్తులు రాయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ తప్పుల తడకలతో ఆంగ్లంలో రాయడం మానేసి చక్కగా తెలుగులో స్వేచ్ఛగా రాసి (మాట్లాడే భాషనే) ఆత్మవిశ్వాసంతో నిలబడండి.

[5]టీవీ చూస్తున్నప్పుడు తెలుగు ఛానళ్ళనే చూడండి.

[6] (అ)తెలుగు భాషతోపాటుగా మనోవికాసాన్ని కలిగించే భాగవతం, దేవీ భాగవతం, పంచతంత్రం వంటి (టీవీ) కార్యక్రమాలను తప్పనిసరిగా పిల్లలకు చూపించండి.
(ఆ)మీ పిల్లల్ని రోజుకో గంట సేపు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర కూర్చోపెట్టండి. వారి చేత తెలుగు సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, కథలు, పాటల రూపంలో చెప్పించండి. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషను ఎంపిక చేయండి.
(ఇ)ఇంటి దగ్గర పిల్లలకు రోజూ కొన్ని కొత్త తెలుగు పదాల్ని నేర్పిస్తూ తెలుగులోనే మాట్లాడండి.
(ఈ)కనీసం వారానికో పద్యం వాళ్లు నేర్చుకొని చక్కగా చదివేటట్టు చూడండి.

(7)విజటింగ్ కార్డులను, వివిధ శుభకార్యాలకోసం మనం ముద్రించే శుభలేఖలను తెలుగులోనే ముద్రించి అందరికీ పంచండి.

(8)పాఠశాలల్లో తెలుగులో మాట్లాడవద్దని నియంత్రించే యాజమాన్యాన్ని తల్లిదండ్రులందరూ కలిసి నిలదీయండి.

(9)ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడేవారికి చిన్న చిన్న బహుమతుల్ని ఇవ్వండి. ఎవరైనా తెలుగు వచ్చి కూడా ఇంగ్లీషులో మాట్లాడితే వారితో తెలుగులోనే మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అపరిచితులకు తెలుగు రాదేమోనని ముందుగా మీరే ఊహించేసుకొని ఆంగ్ల సంభాషణ ప్రారంభించకండి. చక్కగా తెలుగులోనే మాట్లాడండి. వారికి చక్కగా అర్థమవుతుంది. వారానికొక రోజు (సెలవు రోజైన ఆదివారమైతే మరీ మంచిది) పూర్తిగా చక్కని తెలుగు భాషలో మాట్లాడాలనే నిర్ణయాన్ని ఇంటిల్లిపాదీ తీసుకొనేట్లు చూడండి.

(10)శుభాకాంక్షల్ని నోరారా తెలుగులోనే తెలియజేయండి. (ఎదుటి వారు ఇంగ్లీషులో చెప్పినాసరే!)

ఇలా ప్రతిఒక్కరూ నిత్యం తెలుగును గుర్తుంచుకొని వ్యవహరించాలి. ఇప్పటికే తెలుగు వచ్చినవారంతా ఈ సూచనలు పాటిస్తే తెలుగుకు ప్రాచుర్యం తక్కువ కాలంలోనే ఎక్కువగా లభిస్తుంది..............

తెలుగును వ్యాప్తి చేయడంలో ప్రజల బాధ్యత ప్రజలది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిది. సాధ్యమయినంత వరకు మన నిత్య జీవనాన్ని పూర్తిగా తెలుగుమయం చెయ్యడానికి ఎవరికీ ఏ ఇబ్బందికానీ ఖర్చుకానీ ఉండదు. ఉద్యమాలు చేసి ఆయాసపడనక్కర్లేదు. ఉద్యమస్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అది నూటికి నూరుపాళ్ళూ ఆచరించేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తక్కినవారిని ప్రభావితం చేసి కార్యోన్ముఖులయ్యేలా చూడాలి. ఇది మనందరి గురుతర బాధ్యత. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపజేయడమో, లేక క్రమక్రమంగా కొండెక్కిపోతున్న వెలుగును పోగొట్టుకొని, మన భాషా సంస్కృతుల్ని అజ్ఞానంలోనికి నెట్టుకొని ఉనికిని కోల్పోవడమో... అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. ఆలోచించండి. ఆచరించండి. ఉద్యమించండి.
____________________________________________________________________

Labels:

Friday, May 12, 2006

This is a Thomas Kinkade painting. It's rumored to carry a miracle!




If God brings you to it, He will bring you through it.

Happy moments, praise God.
Difficult moments, seek God.
Quiet moments, worship God.
Painful moments, trust God.
Every moment, thank God.


____________________________________________________________________________________

Labels:

Monday, May 08, 2006

'పన్నులలో సంపన్నుడు' ఫిడేలు రాగాల "పఠాభి"

Pattabhi Rama Reddy, noted film maker,poet and mathematician (born in Nellore, Andhra Pradesh, on February 2, 1919), passed away in Bangalore on May6.

Reddy was greatly influenced by Rabindranath Tagore in Shantiniketan, where he studied for two years. He joined Calcutta University for his master's degree in English literature . The din, the squalor, and the human misery around in Calcutta shocked him to the core. Exploitation of innocence by the rapacious commercial cult disturbed him. The clouds of world war in 1938, further unveiled harsh reality for him. The metaphors of Tagore's poetry suddenly lost its meaning. It had become difficult for him to concentrate on his studies in Calcutta and he returned to Nellore.He entered his family business of Mica export at Gudur, and very often travelled between Madras and Nellore. During his visits to Madras, he used to meet Sri Sri and Mallavarapu Visweswara Rao (both revolutionary poets). It is during this time he wrote Fidelu Ragala Dozen (A Dozen Melodies), a collection that recorded his observations in Madras and Nellore. That book of poetry written over six decades ago ushered in the modern phase in Telugu poetry. Reddy later went on to study Mathematics in Columbia University. By becoming an active member of Madras Players Amateur Theatres he produced and directed many plays. He founded Jayanthi Pictures in association with K.V. Reddy and P.N. Reddy and produced the Telugu film, Pellinaati Pramanalu, which bagged the National award.
The maker of Samskara(the movie won the President's gold medal for the best feature film) was harassed rather cruelly by the government during the Emergency(1976). Snehalatha Reddy, the leading actress in Samskara and wife of Reddy, was accused of concealing information about the whereabouts of George Fernandes (who later become Union Minister in successive Governments), a trade union leader, whose arrest had been ordered in the Emergency roundup. Snehalata Reddy known to be a friend of Mr. Fernandes, denied knowledge of Fernandes's whereabouts. She was jailed and interrogated for eight months. An asthmatic deprived of medicine; she fell seriously ill and was released just before her death. She died in January 1977, five days after her release.
The other films of Pattabhi Rama Reddy were Chandamarutha, Sringaramasa, as well Devara Kaadu in Kannada; Krishnaarjuna Yuddham and Bhagyachakram in Telugu.

He leaves behind daughter Nandana Reddy, son Konarak Reddy, son-in-law Kirtana Kumar and grand daughter Zui.

(Please visit http://www.eenadu.net/sahithyam/display.asp?url=chaduvu42.htm )_________________________________________________________________


("ఫిడేలు రాగాల డజన్","కయిత నా దయిత","పఠాభి పంచాంగమ్" మొ.కొన్ని పుస్తకాలను, "పెళ్ళినాటి ప్రమాణాలు", "సంస్కార"(కన్నడం)సినిమాలను మనకు జ్ఞపకాలుగా మిగిల్చి తిక్కవరపు పట్టాభి రామ రెడ్డి గారు 06-05-2006 న పరమపదించారు.)
------------------------------------------------------

"నాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందు టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి.
నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తోపద్యాల్ నడుముల్ విరగదంతాను
చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని
చాల దండిస్తాను
ఇంగ్లీషు భాషా భాండారంలోనుండి
బందిపోటుంజేసి కావల్సిన
మాటల్ను దోస్తాను
నా యిష్టం వచ్చినట్లు జేస్తాను
అనుసరిస్తాను నవీనపంథా,
కానీభావ కవిన్మాత్రము కాన్నే: నేనహంభావ కవిని."- పట్టాభి.
-------------------------------------------------------

కొన్ని పఠాభి పన్నులు(puns)~:

"తీసినా వేసినా బాధ కల్పించునవి పన్నులు."

'ఉద్యోగులలో రెండు రకాల వారున్నారు
చేసేవారు కొందరు
కాజేసే వారు కొందరు.'

'ఈనాడు అంతా తారుమారు,
ఆశలు మన్ను ముట్టినవి,
ధరలు మిన్ను ముట్టినవి.'

'వెలయాలు చాల ప్రియము,
ఆలు చాల సరసము.'

'సధవ-తలిరుబోడి
విధవ-తలబోడి.'

'సారాయి త్రాగినవాడు
షరాయి వీడిపోతున్నా తాను
వయిస్రాయి ననుకొంటాడు.'

'పాపం చేయకుండా గర్భం దాల్చింది
క్రీస్తుమాత మరియమ్మ
గర్భం దాల్చకుండా పాపం జేయాలని
కొందరు సుందరీమణుల కోరిక.'

'సంఘ మర్మం- ఒకని కూతురు
మరొకనికి పెండ్లాము
వేరొకనికి తల్లి కూడాను.'

'చాలామంది నీతివంతులుగ వుండటం
చాలినంత దైర్యం లేకపోబట్టి
అవినీతికి అతి సాహసం కావాలి.'

'పంట పండించటంలో పూజ్యమైనా
కోతలు కోయడంలో మొనగాడు.'

'ప్రపంచములోని అభ్యుదయం
చాల పాళ్ళు సంశయాత్ముల వల్ల సమకూరినదే.'

'నిరాశకన్ననూ దురాశ మంచిది.'

'తమిళదేశస్తులు గలభా చేయడం తక్కువ
ఇంతకూ వారి భాష 'అరవం'గదూ.'

'నీవు కూర్చునట్టి డబ్బు ఇతర్ల పాలు
నిజానికి నీవు ఖర్చించునదే నీది.'

'కేంద్ర ప్రభుత్వంలో చాలా
డిల్లీ డాలీయింగు.'

'రష్యన్లకు నిండా తాగడం 'వాడ్క'.'


'సినిమా వ్యాపారం బ్రహ్మాండమైన లాటరీ
అదృష్టం ఉన్నవాడు 'వాసన్'.
లేనివాడు ఉపవాసన్.'

'ముండ మోయుటకన్న
బండ మోయుట మేలు.'

"స్త్రీకి శృంగారవంతమ్ము చీర,అని
సుమతి అంటాడు
చీర లేకున్న స్త్రీ మరీ శృంగారవంతమంటాను."

"గాందీమహాత్ములు ఒకే ఒక్కరు
బ్రాందీ మహాత్ములు మటుకు పెక్కురు."

"ఈ కాలం విద్యార్థులలోన
శాస్త్ర విజ్ఞానానికి చాలా ప్రాముఖ్యం
అందులో మరిన్నీ కామశాస్త్ర విజ్ఞానం."

'పదవి కోరను నేను
నేను కోరేది పెదవి."

"పాశ్చాత్య సంఘం~: తన స్నేహితులంతా తన భార్యను, తాను తన స్నేహితుల భార్యను కామించుటకు వీలున్న విధానము."

'ఎయిర్ హోస్టెస్ = విమానవతి."

'బాగుపడాలన్న
భయం వద్దు భక్తి వద్దు."

'స్కిన్ డాక్టర్ల వద్దకు పోవటం పొరబాటు
చర్మం వలిచేస్తారు."

"కాంచనం, కాంత, కాదంబరి అనేవి
జగత్తులో ముక్కాలు
మిగిలింది నేను."

"హరి సేవవల్ల స్వర్గప్రాప్తి సందిగ్ధము
మనోహరి సేవవవల్ల
భూలోకమే స్వర్గతుల్యము."

"నిత్యమూ నాకు ఆలు
బహువచనంగానే ఇష్టము."

"కులతత్వము ఖిలానికి హేతువు
కుల హీనులదే భవిష్యత్తు."

"విధవకు గుడితీసి కొమ్ములు పెట్టేట్లు
చేశారు వీరేశలింగంగారు."

"మనస్సును స్వాదీన మందుంచుట సులభమే నాకు
దేహాన్ని స్వాధీనమందుంచుట కష్టాతి కష్టమగు కార్యము."

"కాంతల జయించుట ద్వివిధంబు
1.అందినచో జుట్టి పట్టి కిందకు రమ్ము
2.అందనిచో కాళ్ళు పట్టి పయికి లెమ్ము."

"చెరకు చనుటకన్నను
చెరకు తినుట సులభము."

"ముడి విప్పిన కోక శాస్త్రము
సులభంగా బోధ పడుతుంది."

"పణ్యాంగన పుణ్యానికి వస్తుందా, పాపం."

"మరుని కయ్యానికి మడతి కాలు
దువ్వినాడు మనోహరుడు."

"కాంతతో ప్రశాంత జీవితం దుష్కరము
కాంతవినా ప్రశాంత జీవితం దుస్సాధ్యము."

"కాముకి మనసు 'మెత్త'మనసు."


"నరలోకమునకు 'క' ప్రత్యయం చేరుటవల్ల నరకలోకం ఏర్పడుతుంది అంతేగాని వేరే నరకలోకం లేదు."

"జారత్వం ఎక్కువై వాని జన్మ శ్రుతిమించి రోగాన పడింది."


"రాగము వల్ల ప్రణయమువిరాగము వల్ల ప్రణవము."


"ఉద్యోగం పురుష లక్షణంనిరుద్యోగం మహాపురుష లక్షణం."

"తలంబ్రాలు కాదుఅది తలన్ వ్రాలు."


"దంతి కన్న వదంతి పెద్దది."


"దగ్గుకు పరుష స్వరూపమునే క్షయ అంటారు."


"నిలకడగా నీరు త్రాగుట కన్నా పరుగెడుతూ బీరు త్రాగుట కొందరికిష్టం."


"వధూవరులకు చదువుకన్నా చదివింపు లెక్కువగా ఉన్నవి."


"చనిపోయిన వాని నామస్మరణం కన్న వాని వీలునామస్మరణం చేస్తుంటారు బంధు మిత్రులు."


'పెళ్ళి కావలసిన ఆడ పిల్లలకుపరధ్యానము కాదు 'వర'ధ్యాన మెక్కువ."


"సామాన్యులనే మాన్యులుగా తలంచు పద్దతి డెమోక్రసి."


"విప్పుటకు వీలుకానిది ప్రేముడి."


"నరుల సమరుల కావించునవే మరులు."


"వారనారి యింటికి చాలా 'రూక'పోకలు జరుగుతాయి."


"గ్రామాలు గరిక ప్రడేశాలే గాని,నాగరిక ప్రదేశాలు కావు."


"ఉత్తమాంగం అని పేరేకానిచాల మందికి ఉత్త అంగం మటుకేను."


'ఈ నాడు స్టాకు బ్రోకరు వద్దకు, రేపు పాన్ బ్రోకరు వద్దకు."


"చుక్కెదురు కావడం మంచిది కాదు కాని,చక్కని చుక్కెదురు కావడం అదృష్టమే."


"రామ రాజ్యం కాదు నేను కోరేది,నేను కోరేది విరామ రాజ్యం."


"ఇంతి నడుము పూజ్యము."


"చీట్లాడువారికి, క్రైస్తవులకు ఏసు దయ ఉండాలి."


"ఈనాడు సబ్బుకన్నా నున్నగా జారిపోతూన్నది డబ్బు."


"ప్రపంచంలో 'పయికాలు' ఉన్నవానిదే పయిచేయి."


--------------------------------------------------

Labels: ,