My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, November 05, 2011

భోజనోత్సవం

ఆహారం జీవులకు ప్రాణావసరం. దాన్ని ఒక భోగకళగా మలచుకోవడం మనిషి ప్రత్యేకత. ఆత్మకు ఇంపైన భోజనాన్ని సత్కృతులకందే ప్రేరణగా అల్లసాని పెద్దన భావించాడు. దేవదారు వనంలో యాయవారానికని బయలుదేరిన శివబైరాగి భిక్షాపాత్రలో రంభ, ఊర్వశి లాంటి అందగత్తెల చేతులమీదుగా నేతి వంటకాలు వడ్డించిన భోజన ప్రియుడు శ్రీనాధ కవిసార్వభౌముడు! విందుభోజనాదులకు సందర్భశుద్ధి కూడా చూసుకోడన్న విమర్శా ఉంది. హర విలాసంలో ముక్కంటి మూడోకంటి మంటకు ఎర అయిన మన్మథునితోపాటు రతీదేవి సతీ సహగమనం చేసే సందర్భం ఒకటుంది. తామరపూల తేనెలతో ధర్మోదకాలు, తియ్యమామిడి పండ్లతో పిండప్రదానాలు చేయాల్సిందిగా అంత పతీవియోగ దుఃఖంలోనూ పరివారానికి రతీదేవి పురమాయించడం, ఆ మహాకవి ఆహార ప్రియత్వానికి నిదర్శనం. ప్రజాబాహుళ్యం అభిలాషలు, ఆరాటాలు, విలువలకు సంస్కృతి ఒక ప్రతిబింబమైతే- ముందు తరాలకు దాన్ని అందించే బాధ్యత సాహిత్యానిదే. ఏనాటి సమాజ స్వరూప స్వభావమైనా సమ్యక్ దర్శనా భాగ్యానికి నోచుకోవాలంటే... ఆనాటి వివాహ కుటుంబాది సంబంధ బాంధవ్యాలు, ఆచార వ్యవహారాలతోపాటు ఆహార పద్ధతులూ తెలిసి ఉండటం తప్పనిసరి- అంటారు మల్లంపల్లివారు. మన ప్రాచీన కవులు ఈ బాధ్యత గుర్తెరిగారు కనుకనే సందర్భం ఉన్నా లేకపోయినా సందుచూసుకుని మరీ విందు భోజనాలందించారు!


శిష్యసమేతంగా వ్యాస మహామునికి కాశీవిశాలాక్షి చేసిన విందులో వడ్డించిన చాలా పదార్థాలకు శబ్దరత్నాకరంలోనే అర్థాలు దొరకవు- అంటారు కాశీఖండానికి మణికర్ణికా వ్యాఖ్యానాన్ని కూర్చిన శరభేశ్వర శర్మ. పాండురంగ మాహాత్మ్యంలో కపట బ్రహ్మచారై వచ్చిన పరంధామునికి సుశీల అనే పతివ్రతా శిరోమణి ఆతిథ్య మిస్తుంది. ఆ సందర్భంలో తెనాలి రామకృష్ణకవి వర్ణించిన ఖాద్య విశేషాలతో ఒక పరిశోధనా గ్రంథాన్నే వెలువరించదగినంత సమాచారం ఉంది. ఎన్నో వ్యంజనాలు పిండివంటలతో భరద్వాజుడు భరతుడికి, పరివారానికి ఇచ్చిన విందు జగత్ప్రసిద్ధం. భారతీయుల అరవైనాలుగు కళల్లో పాకశాస్త్రమూ ఒకటి. నలభీములు ఆ శాస్త్రంలో అసమాన ప్రతిభాశాలురు. ఆహార పదార్థాలు, వాటి తీరుతెన్నులు, ప్రత్యేక లక్షణాలు, ఇమిడి ఉన్న ఆరోగ్య సిద్ధాంతాలు, వంటశాలలు, వడ్డన విధానాలు... రుగ్వేద కాలంనుంచీ భరతఖండంలో అధ్యయన విశేషాలే! వెల్లుల్లి, తిలపిష్ఠం అనడమే తప్పుగా భావించే శుద్ధ శాకాహారి శ్రీనాథుడు. సిరియాలును తరిగి తిరువెంగనాంచి నానావిధ పాకాలు చేయించిన వైనాన్ని అంత తీరుగా ఆ కవి వర్ణించడానికి కారణం- వాటి ఆహారపు తీరుతెన్నులను అక్షరబద్ధం చేయాలన్నతపనే. కాశీఖండం- కుమారాగస్త్య సంవాదంలో సదాచార విధి చర్చ సందర్భంగా భోజనాలవేళ విధిగా పాటించాల్సిన నియమాల వివరణ ఉంది. తరతరాల తెలుగువారి ఆహార రుచులమీద పరిశోధనలు సాగించి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ గ్రంథమే రూపొందించారు. చిత్రవిచిత్రమైన చిత్రాన్నాల నుంచి, రెండు భోజనాల నడుమ నమిలే అటుకులు అరిసెలవంటి వాటిదాకా- వట్టి వివరాలే కాదు... వాటి వైద్య విలువల్నీ ఆ గ్రంథం విపులీకరించింది.


ఆహారం కేవలం జిహ్వ సంతృప్తి కోసమే కాదు, ఒంటికి పట్టి ఆరోగ్య వృద్ధికి దోహదపడాలి. శుచి, రుచితోపాటు తుష్టి, పుష్టి కారకాలు పుష్కలంగా కలిగిన పోషకాహారమే సంపూర్ణాహారం. అది లభించడమే మహాభాగ్యం. షడ్రుచులు, అష్టాదశ రసాలు, చతుర్విధాలుగా త్రికాలాల్లోనూ సేవించి హరాయించుకోగల జీర్ణశక్తి కలిగి ఉండటమే ఆరోగ్యం- అని వస్తుగుణ ప్రకాశిక వాదం. ఆహారాన్నిబట్టి స్వభావం అంటుంది తైత్తరీయం. అందుబాటులో ఉన్న భోగమేదైనా ధర్మబద్ధంగా ఆరోగ్యభంగం కానంతవరకూ అనుభవించడం దోషంకాదు. నాగరికత మోజులో స్థానిక వాతావరణానికి అననుకూలమైన విదేశీ ఆహారపు అలవాట్లకు బానిసలమైతే నష్టపోయేది మన ఆయుష్షే. వింధ్య పర్వత గర్వభంగానికని బయలుదేరాల్సిన అగస్త్యుడు కాశీని వదిలిపోవడానికి బాధపడింది నిత్యం తాను పరమ ప్రీతిగా సేవించే 'శ్రీ విశాలాక్షి కెంజేతి భిక్ష'కు దూరమవ్వాల్సి వస్తుందనే! కాశీఖండంలో గుణనిధి, శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారుడు- తిండికి మొహం వాచిపోయి ఉన్న దీనదశలో కన్నతల్లి తమకు ఆరగింపులకు పెట్టిన 'గిన్నెలోని పెరుగును, వంటకంబు వడపిందియలను' పదేపదే తలచుకొని కుమిలిపోతారు. కరవులు ముంచుకొచ్చీ, వరదలతో పంటలు ముంపుకొచ్చీ, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి వాతావరణ పరిస్థితులు కొంతకాలంగా అనుకూలించని సాగు- రైతన్న మెడమీద పుండుచేసే కాడిగా మారిపోయింది. ఫలితంగా, 2010-11 ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఏడుకోట్ల ప్రజలు మరింత పేదరికంలోకి కూరుకుపోయారు. కూటిలోకి కూరాకు కూడా దొరకని దారుణ ఆహార సంక్షోభం మున్ముందు ముంచుకు రానుందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మనిషి జీవితానికి, తిండి ప్రధాన అవసరం. అది మనిషి ప్రాథమిక హక్కు కూడా! నిరుపేదలకు నిజమైన భోజనోత్సవం ఇంకెంత దూరంలో ఉందో కదా!
(ఈనాడు సంపాదకీయం, ౧౬:౧౦:౨౦౧౧)
_________________________

Labels:

ఆకుపచ్చ'ధనం'

అశ్వత్థవృక్షాన్ని నాశనం లేనితనంలో సంసారంతో పోల్చాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదిహేనో అధ్యాయంలో. రావి ముక్కోటి దేవతల ఆవాసమని భారతీయుల విశ్వాసం. దత్తావతార పరంపరలో వృక్షాలకుండే ప్రాధాన్యం విశేషమైనది. షిర్డీసాయి పన్నెండేళ్లు వేపచెట్టుకింద తపస్సు చేసినట్లు చెబుతారు. పంటపొలాలు లక్ష్మీ నివాసాలని ప్రాచీనుల భావన. సంతాన కామన, గ్రహదోష విముక్తి, పితృదేవతల అనుగ్రహం వంటి లౌకిక కార్యకలాపాలన్నింటికి అశ్వత్థ, బిల్వ, శింశుప వంటి వృక్షదేవతల అనుగ్రహం అత్యంత ఆవశ్యకమని బ్రహ్మవైవర్త పురాణం నుంచి తైత్తరీయ సంహిత దాకా ఘోషిస్తున్నాయి. అన్యమత సంస్కృతుల్లోనూ వృక్షసంపదకు గౌరవస్థానముంది. బౌద్ధ హీనయాన సంప్రదాయ శిల్ప కళాఖండాల్లో తథాగతుడికి సంకేతం బోధివృక్షమే. యూదుల ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో సృష్టి అంటే జీవవృక్షం. యూరోపియన్లు ఇగ్డ్రాసిత్ మహావృక్షంగా అభివర్ణించేది ఈ జీవవృక్షాన్నే. ఈజిప్షియన్, ఇస్లామిక్ వంటి ప్రాచీన సంస్కృతులన్నీ వృక్షప్రాథమిక స్వరూపాన్ని వివరించాయి. మానవాళి మనుగడకు మూలాధారం ప్రకృతి ప్రసాదించిన వృక్షసంపదే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో- అత్తవారింటికి పోతున్న శకుంతలను తపోవన వృక్షాల అనుమతీ తీసుకొమ్మని కణ్వమహర్షి కోరింది అందుకే. చెట్లపాదుల్లో నీరు పోయకుండా తాను చుక్కనీరైనా తాగేది కాదు శకుంతల. అలంకారమంటే ఎంత మమకారమున్నా చిగురుటాకు తెంపడానికీ ఇష్టపడేది కాదామె. మొదటిసారి మొక్క పూతకొచ్చినప్పుడు అదో మహోత్సవంగా సంబరాలు జరుపుకొనే ప్రకృతి ప్రేమే ప్రపంచమంతటా పరచుకుని ఉండేది నిన్నమొన్నటిదాకా.

చెట్లు, తీగెలు, పూలు, పళ్లు, చిగురుటాకులు, వసంతాలు, హేమంతాలూ- ఇవే ఒకనాటి మన మహాకవులకు అభిమాన కవితా వస్తువులు. ప్రకృతితో తాదాత్మ్యత పొందడం సుకవిత లక్షణంగా భావించిన రోజులవి. శివుడికోసం తపోనియమంలోకి దిగుతూ గౌరి తన హొయలు విలాసాలను పూలతీగెల్లో భద్రంగా దాచుకుంది- అంటాడు కుమార సంభవంలో కాళిదాసు. ప్రవరాఖ్యుణ్ని అడ్డుపెట్టుకొని అల్లసాని పెద్దనామాత్యులు హిమగిరి వర్ణనలవేళ చెలరేగిపోయారు. భగీరథుడు తలవెండ్రుకలు జడలు కట్టేదాకా నిశ్చింతగా తపం చేయగలిగాడన్నా, బిడియం విడిచి పార్వతి ఏకాంతంలో శివుడు డస్సిపోకుండా అవిశ్రాంతంగా సేవలందించగలిగిందన్నా... అదంతా అడవితల్లి చలవే! త్రేతాయుగంలో పతీవియోగం వేళ సీతమ్మతల్లి శోకాన్ని పంచుకున్నది ఒక అశోక వృక్షం. మేఘనాథుడి మాయదెబ్బకు మూర్ఛిల్లిన లక్ష్మణస్వామిని పునర్జీవితుణ్ని చేసింది ఆంజనేయుడు తెచ్చిన సంజీవనీ మూలిక. 'అసతోమాసద్గమయా' తత్వం తథాగతుడి హృదయానికి తట్టింది ఓ బోధివృక్షం కిందేగదా! గడ్డిపరకనుంచి మహా వటవృక్షం దాకా మొక్కలోని ప్రత్యంగమూ మానవ జాతికి చేస్తున్న ఉపకారాలను ఏకరువు పెడుతూ పోతే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. పోతన భాగవతంలో గోపబాలురు వేసవితాపాన్ని తట్టుకోలేక తరుచ్ఛాయల కింద చేరిన సందర్భంలో గోపాలకృష్ణుడు పాదపాల ప్రయోజనాలను తెలియజెబుతాడు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ నుంచి, మన తెలుగువాడు గోపీచంద్ దాకా పోతనలాగా వృక్ష మహిమలను కథలుగా చెప్పినవారు ఎందరో. వాటిని చెవిన పెట్టేవారు కరవవుతున్నారు ఈ కలికాలంలో!

తరుదేవతల మహాప్రసాదం తగుపాళ్లలో లేకపోతే మనిషి ఎంత తిన్నా అది అసంపూర్ణాహారమే అంటుంది ఆయుర్వేదం. మనిషి పుట్టుకకు ముందునుంచే చెట్టు ఉంది. బట్ట కట్టడానికి పత్తి, పెరిగి పెద్ద కావడానికి పండ్లూకాయలు, పండుగలకు తోరణాలు, పెళ్ళిళ్లకు మండపాలు, చివరికి అంత్యదశలో కాష్ఠమై కాలేదీ చెట్టుచేమలిచ్చే కట్టెలతోనే గదా! అణుయుద్ధంలో అంతా సర్వనాశనమైపోయినా బీజరూపంలో భూగర్భంలో దాగి అదను చూసుకుని తిరిగి మోసులెత్తే బతుకు చేవ సృష్టిమొత్తంలో ఉన్నది ఒక్క మొక్కకే- అంటారు జగదీశ్ చంద్రబోస్. 'వాడిన వనవాటిక / మరల తిరిగి పల్లవిస్తుంది' అన్న దాశరథి గేయంలో దాగున్న భావమూ అదే! రాకాసి రెక్కల నీడలో వ్యాపారమొక్కటే వూపిరవుతున్న ఈవేళ పచ్చదనం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోతుండటం విషాదకరం. పచ్చని పొలాలను, అడవులను విచ్చలవిడిగా దున్నేసి పరిశ్రమలు నెలకొల్పే పిచ్చితనంతో మనిషి మనుగడకే ముప్పు ముంచుకొస్తోంది. అంతకంతకు వృక్షసంపద తరిగిపోతూ భూగోళాన్ని వేడెక్కించేస్తోంది. రుతుధర్మాలు గతి తప్పి కొత్తరోగాలు కమ్ముకొస్తున్నాయి. వేరునుంచి చిగురుదాకా నిస్వార్థంగా సకలం సమర్పించుకునే వృక్షసంతతిని సర్వనాశనం చేయడం- మనిషి స్వవినాశానికి మొదటి మెట్టు. అర్ధశతాబ్ది వయసున్న ఒక వృక్షం అందించే సేవల విలువ రూపాయల్లో సుమారు పదిహేడు లక్షలు. మూడుపదుల చదరపు కిలోమీటర్ల పచ్చదనం ఒక్కరోజులో అందించే ప్రాణవాయువు ఒక మనిషికి రోజంతా సరిపోతుందని అంచనా. హెక్టారు భూమిలోని చెట్టూచేమా ఇరవైనాలుగు కిలోల సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా కాపాడటంతోపాటు ఆరునుంచి ఎనిమిది డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గించగలవు. పచ్చదనాన్ని మించిన పసిడిధనమిది. మనిషికి ప్రకృతిలో మరేదీ ఇంత ఉచితంగా దొరకదు. ఎక్కి ఉన్న కొమ్మనే విరిచేసే వెర్రితనం మనిషి మానుకోవాలి. వృక్షాలను నరికితే ఆరునుంచి రెండేళ్లదాకా బెయిలు ఇవ్వని కారాగారవాస శిక్ష విధించే జీవవైవిధ్య మండలి చట్టాన్ని అందుకే అందరం హృదయపూర్వకంగా స్వాగతించాలి.
(ఈనాడు సంపాదకీయం, ౩౦:౧౦:౨౦౧౧)
_________________________________

Labels:

పేగుబంధం

మొత్తం 'పందొమ్మిదిమంది దేవతల దివ్యాలయం మానవ శరీరం' అన్నది భారతీయ వైదిక విజ్ఞాన భావన. ఈ ఆలయం గర్భగుడిలో నిత్యం వెలుగుతుండే అఖండజ్యోతే ప్రాణమని ప్రశ్నోపనిషత్తు పాఠం. 'మూడు మూలల పెట్టె మూతదీసే నేర్పు తెలుసుకోండి! మూత దీసితె భూతము గనపడును తెలిసికోండి' అంటూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు పాడింది ఆ ఆపాజ్యోతి ఘనతను గురించే. శల్య రక్త మాంసములపైన చర్మపు ముసుగు, పలు వ్యాధులకు నెలవు, పంచభూతాల కొలువు- అంటూ పురందరదాసు వంటి విరక్తులు ఈసడించిన ఈ తోలుబొమ్మనే- 'చతుర్విధ భూతములందు గడు/ హెచ్చు... నీచమని చూడరాదు' అంటూ నారాయణ శతక కర్త నెత్తికెత్తుకున్నాడు. మానవ శరీరాన్ని రథంతో పోల్చింది కఠోపనిషత్. 'పొంగేటి కుంగేటి మురుగేటి తరుగేటి/ అగ్నిలోపడి దగ్ధమగు దేహానికి పొంగేవు ఏలరా' అని ఎన్ని తత్వాలైనా పాడుకోవచ్చు. ముక్కోటి దేవతలు ఒక్కటైతేగాని చక్కని ఈ దేహ నిర్మాణం సాధ్యమే కాదంటారు ఆగంటి లక్ష్మప్ప వంటి తాత్విక విచారకులు. 'పుష్పం ఒక సంపూర్ణ వికాసం కోసం ఎన్నో దశలను దాటివచ్చినట్లే- మానవజన్మ సంబుద్ధం కావడానికి గడిచి రావాల్సిన దశలు ఎన్నో ఉంటాయి'- అన్నది బౌద్ధికుల భావన. జాతక కథల క్రమం ప్రకారం సిద్ధార్థుడు బుద్ధుడు కావడానికి దాటివచ్చిన దశలు అక్షరాలా అయిదువందల నలభై ఏడు. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా తీసుకున్నా నవమాసాలు నిండి తల్లిగర్భంనుంచి బైటపడ్డ పిండం ఏకకణం నాటి స్థితి- వీరబ్రహ్మేంద్రస్వామి భావించినట్లు, శ్రీహరిని వెతకడానికి తిరిగిన చిలుక పరిస్థితే! 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/ నేను చేసిన పుణ్యము నేటివరకు' అన్న భావన వెనకున్న మర్మం పుట్టుకకన్న పుట్టించిన ఆ అమ్మలోనే గొప్పతనం ఉందని చాటిచెప్పడమే!

దైవ జీవ భావాలకు ఆలవాలమైన అమ్మ గర్భమే శిశువు ఆవిర్భానికి కొలువైన గర్భగుడి. కోటేరు ముక్కు, కోల కళ్లు, లేత కొబ్బరివంటి చెక్కిళ్ళు, చెక్కిళ్లలోకి చిలిపి నవ్వులు తెచ్చిపెట్టే నొక్కులు- పొత్తిళ్లలో నవ్వు పువ్వు పూయాలంటే పేగుపంచే తల్లి ఎన్ని నొప్పులు భరించాలో! ఎన్ని నియమాలు పాటించాలో! బీజ దశనుంచి బిడ్డను భూమి మీదకు తీసుకుని వచ్చేదాకా తల్లి పొందే ఆ 'దేవకీ పరమానందానుభవా'లను పోతన భాగవతం కళ్లకు కట్టింది. ఆదికవి నన్నయనుంచి నేటి కవి ఆచార్య గోపి దాకా అమ్మతనం కమ్మదనాన్ని గురించి కలవరించని కవి లేడు. 'పదినెలలు మోసి కనియ- తల్లి రుణంబు దీర్చగలవె?' అంటుంది కుమారీ శతకం. అమ్మకు అమ్మయి పుడితే తప్ప తీరనిదీ ఆ జన్మాంతర రుణభారం. పాలగుమ్మి పద్మరాజు పురిటిపాట వింటుంటే అసలెన్ని జన్మలెత్తినా తెంపుకోలేనిదేమో ఈ పేగుబంధం అనిపిస్తుంది. 'ఆ రాత్రి... గడియారం చక్రం పంట్లో కాలం చిక్కుబడింది. కీలు కీలునా వేదన. అమ్మో అంది అమ్మాయి చివరకు చటుకుని తోసుకు తూరుపు కొసకు/ పండులా లేచాడు సూర్యుడు. అమ్మది చూపూ, నాన్నది రూపూ... పండుని కన్నది నా తల్లి' అని అప్పుడు అంటారు యావన్మంది. అలిసిన నరాల మసకల్లోపల అమ్మ చైతన్యం మాత్రం ఒక బందీ. వెలసిన తుపాను వెనకటి ధీమాను గుండెలోపల నిలుపుకోలేకపోతే ఇబ్బందే. స్త్రీకి ప్రసవం మరో జన్మ అన్నది లోకోక్తి. జన్మ చరితార్థత కోసం మరో బ్రహ్మగా మారి ప్రాణసంకటాన్ని భరించి మరీ మరోజీవికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. తాను లేకున్నా తన మొలక ఉండాలన్న అమ్మదనపు ఆర్తి- మానవాళిని చిరంజీవిగా దీవిస్తోంది!
భోజరాజీయంలోని గోమాత వ్యాఘ్రరాజానికి ఆహారంగా మారే ముందు ముందుగా ఆందోళన చెందింది- 'జఠరాగ్ని బొక్కి పడుచు/బొరుగిండులకు నొంటిబోవ గుక్కలు దోల/కరచునో' అనుకొంటూ తన లేగదూడను గురించే! వేటగాడొకడు వలవేసి పట్టుకున్నప్పుడు ఆ వలలో చిక్కిన తల్లిపక్షి విలపించింది చావు గురించి కాదు... రెక్కలింకా రాని పిల్లల గురించే! శ్రీనాథుని శృంగార నైషధంలో నలుని చేతికి చిక్కిన హంస ప్రాణం కోసం వాపోయిందీ కన్న సంతానం జీవన స్థితిగతులకోసమే. నెల తప్పడం తల్లితనం పరీక్ష ఉత్తీర్ణతలో మొదటి మెట్టయితే... క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో పండంటి బిడ్డను కనడం చివరిమెట్టు. ప్రాణానికన్నా తాను ఎక్కువగా ప్రేమించే నాథుని నిజప్రాణ ప్రతిబింబాన్ని ఆ నాథుని చేతిలో పెట్టాలనే ఏ వివాహిత అయినా కోరుకుంటుంది. ఆ ప్రయత్నంలో తన ప్రాణాల్ని కూడా లెక్కచేయని నైజం ఆమెది. యూఏఈ జాతీయురాలైన ఒక మహిళ మెదడు వాపు వ్యాధితో ఆసుపత్రిపాలై వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించేనాటికి ఏడు నెలల నిండు గర్భిణి. ఆమె చివరి కోరిక ప్రకారం కడుపులోని శిశువును రెండు నెలలపాటు ఆమె గర్భసంచీలోనే ప్రాణావసర సాధనాలతో సంరక్షించిన వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స ద్వారా చక్కటి ఆరోగ్యంతో ఉన్న శిశువును తండ్రి చేతిలో పెట్టారు! కవి ప్రసాదమూర్తి చెప్పినట్లు 'అమ్మ ఎక్కడికీ వెళ్లదు. మహా అయితే తాను పంచిన రక్తంలోనుంచే తిరుగు ప్రయాణం కడుతుంది.' పేగుబంధం అంత బలమైనది. 
(ఈనాడు సంపాదకీయం, ౨౫:౦౯:౨౦౧౧)
_________________________

Labels: ,

Friday, November 04, 2011

CLIFF HANGER



Clinging on for dear life to the side of a vertical cliff, the tiny lion cub cries out pitifully for help.
His mother arrives at the edge of the precipice with three other lionesses and a male. The females start to clamber down together but turn back daunted by the sheer drop.

Eventually one single factor determines which of them will risk her life to save the youngster – motherly love.

The drama begins: The mother arrives at the edge of the cliff as her son cries out for rescue after being trapped when he slipped.




On the brink: Four lionesses look over the edge before aborting their rescue mission because of the sheer drop

Slowly, agonizingly, the big cat edges her way down towards her terrified son, using her powerful claws to grip the crumbling cliff side.

One slip from her and both animals could end up dead at the bottom of the ravine.




Just as the exhausted cub seems about to fall, his mother circles beneath him and he is snatched up in her jaws.

She then begins the equally perilous journey back to the top. Minutes later, they arrive and she gives the frightened creature a consoling lick on the head.

The dramatic rescue, captured by wildlife photographer Jean-Francois Largot, was played out in Kenya ’s Masai Mara game reserve.

Despite the presence of wardens to deter poachers, day-to-day life for the lions is not without its dangers … as the cub learned the hard way.



Rescue mission: The mother inches her way down the cliff face to rescue the terrified cub before locking him in her jaws and making her way back up the cliff face.




Motherly love: The mother gives her son a lick to say that all is well in the pride following the drama!

(An email forward)
__________________________________________

Labels: ,

Tuesday, November 01, 2011

The Hierarchy




































(From Facebook)
_________________________________________________

Labels: ,

Sunday, October 30, 2011

Elopement


Daughter : "I am in love with the neighbor, so I am running away with him."

Dad: Thanks , you have saved my money & time.

Daughter: Dad, I am reading the letter left by Mom!

(From Facebook)__________________________________________

Labels: