My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, May 08, 2010

కార్యసాధన

- డాక్టర్‌ వంగీపురం శ్రీనాథాచారి
ప్రతికూల పరిస్థితులనేవేవీ మనిషి చుట్టూ వచ్చి చేరవు. మనిషే వాటిని సృష్టించుకుంటాడు. క్రియాశూన్యతతో వాటిని అధిగమించలేక ఎవరినో నిందిస్తాడు. మనం ఎప్పుడూ చేసే పనినే మాటిమాటికి చేస్తూ పోతుంటే ప్రతిసారి వచ్చే ఫలితమే ఎప్పుడూ ఎదురవుతుంది. భిన్నమైన ఫలితాన్ని పొందాలంటే చేసే పనినీ భిన్నంగా చేయాలి. ఇప్పటిదాకా పొందనిదేదో పొందాలంటే ఇప్పటిదాకా చెయ్యనిదేదో చేయాలి.

విజయం అనేది అనుకోని సంఘటన కాదు. ఓ అద్భుతం అసలే కాదు. ఏ పనికైనా ఈ ప్రపంచంలో ఓ ప్రయత్నం, ఓ ఫలితం అనే రెండే అంశాలుంటాయి. ఎక్కువ ప్రయత్నం చేసేవాడు ఎక్కువ ఫలితం పొందుతాడు. తక్కువ ప్రయత్నం చేసేవాడు తక్కువ ఫలితం పొందుతాడు. గాలిలో దీపంపెట్టి 'దేవుడా, నీవే దిక్కు' అనుకునేవాడు కర్మ, పాప ఫలం అనుకుంటూ కాలయాపన చేస్తూ జీవిత ప్రయాణాన్ని ముందుకు నెట్టే యత్నంలో ఉంటాడు.

ఆమధ్య బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ చైనా నూరు పతకాలు కైవసం చేసుకుంది. భారతదేశం కేవలం మూడు పతకాలు సాధించింది. మరో దేశానికి చెందిన మైఖేల్‌ ఫెల్ప్స్‌ అనే ఈతగాడు ఒక్కడే ఎనిమిది బంగారు పతకాలు సాధించి అజేయుడై నిలిచాడు. ఈ ఫలితాలను యాదృచ్ఛికాలుగా భావించలేం. ఒకరిది అదృష్టం, మరొకరిది దురదృష్టం అనీ సరిపెట్టుకోలేం.

అనుకోకుండానో, అదృష్టవశాత్తో అద్భుతాలు జరుగవు. శ్రమిస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. విజయం సాధించడానికి- చెయ్యగలిగిందల్లా చేస్తే లాభంలేదు. చెయ్యవలసిందల్లా చేయాలి.

ఓ మతపెద్ద ఓ పట్టణ శివార్ల గుండా కారులో ప్రయాణిస్తూ వెళుతున్నాడు. రోడ్డు పక్కన గుబురుగా, దట్టంగా పెరిగిన అటవీ ప్రాంతం పక్కన నందనవనం లాంటి శోభాయమానమైన తోటనొకటి చూశాడు. వెంటనే కారు ఆపి ఆ తోట అందాలను ఆస్వాదిస్తూ కొంత సమయం గడిపాడు. ఆ తోటలో కేవలం గోచీ గుడ్డ కట్టుకుని చెమటలు కక్కుతున్న శరీరంతో ఎండలో చెట్లకు పాదులు సరిజేస్తూ కలుపు మొక్కలు తీస్తున్న రైతును గమనించాడు ఆ మతపెద్ద.

ఆ రైతును పిలిచి 'నీవు ఎంత అదృష్టవంతుడివయ్యా! భగవంతుడు నీకు ఎంత మేలు చేశాడో చూడు. ఈ నిస్సారమైన గుట్టల మధ్య, ముళ్లపొదల మధ్య ఎంతో ఫలపద్రమైన తోటను నీకు బహూకరించాడు. దేవుడికి నీవు ఎంతో రుణపడి ఉండాలి. కృతజ్ఞుడివై ఉండాలి' అన్నాడు. అందుకు సమాధానంగా ఆ రైతు 'ఓ మహానుభావా! మీరు చెప్పినట్లు నేను దేవుడికి కృతజ్ఞుడినై ఉండాల్సిందే! నిజంగా నేను అదృష్టవంతుడినే. ఇరవై సంవత్సరాల క్రితం ఇదంతా అటవీమయంగా రాళ్లతో, ముళ్లపొదలతో నిండి, దుర్భేద్యంగా ఉండి, ఏ కూలినీ ఎంత ప్రాధేయపడ్డా నాకు సహాయపడేందుకు రానప్పుడు, నేనెంత పని చేశానో మీరు చూసి ఉంటే- దేవుడు నాకు ఎంత మేలు చేశాడో మీరు గ్రహించి ఉండేవారు. అయినా మీ మాటలు నేను కాదనడం లేదు. దేవుడు నాకెంతో మేలు చేశాడు. నేను ఆయనకు రుణపడి ఉన్నాను' అన్నాడు. రైతు సమాధానంలో 'శ్రమయేవ జయతే' అన్న అంతస్సూత్రం దాగి ఉంది. మనిషి కర్తవ్యం కేవలం కార్యాచరణ మాత్రమే. ఫలితం పనిని బట్టి ఉంటుంది.

సముద్రం పైపైన ఈదుతూ వెతికితే నాచు తగులుతుంది. అదే శ్రమకు వెరవకుండా లోతుల్లోకి వెళ్లి సాగరాన్ని మధిస్తేనే ముత్యాలు దొరుకుతాయి. ఇదే ప్రకృతిలో దాగి ఉన్న కార్యాచరణ రహస్యం. దైవాన్ని నమ్మినా, దైవంపై ఆధారపడకుండా పనిని నమ్మే కార్యసాధకుడే ఎప్పుడూ గెలుస్తాడు!



(ఈనాడు , సర్వాంతర్యామి,౦౮:౦౫:౨౦౧౦)
________________________________

Labels:

Wednesday, May 05, 2010

90 / 10 Principle - by Stephen Covey


















(An email forward)
_______________________________

Labels: ,

Monday, May 03, 2010

DIPLOMATIC INCIDENT

This is a true story from the Japanese Embassy in US!


Yoshiro Mori


A few days ago, Prime Minister Mori was given some Basic English conversation training before he visits Washington and meets president Barack Obama.

The instructor told Mori Prime Minister, when you shake hand with President Obama, please say 'how r u'.

Then Mr. Obama should say, 'I am fine, and you?' Now, you should say 'me too'. Afterwards we, translators, will do the work for you.'

It looks quite simple, but the truth is...

When Mori met Obama, he mistakenly said 'who r u?' (Instead of 'How r u?’)
Mr. Obama was a bit shocked but still managed to react with humor:
'Well, I'm Michelle's husband, ha-ha.’

Then Mori replied 'me too, ha-ha.’

Then there was a long silence in the meeting room.

(an email forward)

__________________________________

Labels:

... Corporate humour ...









(An email forward)
_______________________________

Labels: ,

మహాకవి... మన దారిదీపం

'నా యింటిపేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిగ్దిగంతం
అభ్యుదయ సుగంధం
అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం'
- అని నినదించిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరంపాటు జరిగాయి. అయినా శ్రీశ్రీ కవిత్వాభిమానులకు ఇంకా తనివితీరలేదు. ఈ నిరంతర కవితా చైతన్యోత్సవం ఆగామి కాలమంతటా జయభేరి మోగించాలని ఉవ్విళ్లూరేవారి సంఖ్య అనంతంగా ఉంది. తెలుగు సాహిత్యంలో వేగుచుక్కగా ఉద్యమించిన గురజాడ అడుగుజాడలో పయనించి, అభ్యుదయ భువన భవనపు బావుటాగా పైకి లేచిన శ్రీశ్రీపై తెలుగు ప్రజలు ప్రకటించిన గౌరవాభిమానాలకు చిహ్నాలు ఈ శతజయంతి వేడుకలు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ వేడుకలు శతజయంతుల చరిత్రలో నూతన స్థాయిని చేరుకున్నాయి. కవిత్వం చదవడం, రాయడం, అనుభవించడం జీవిత లక్ష్యాలుగా ఎంచుకున్న శ్రీశ్రీకి ఇంతటి గౌరవం దక్కడం సమంజసమే. ప్రతిభాగుణం, ప్రయోగశీలం, ప్రాపంచిక చైతన్యం, చమత్కార ప్రియత్వం, అధ్యయన వైశాల్యం- శ్రీశ్రీ కవిత్వానికి పంచప్రాణాలు. ఆయన నమ్మిన సామాజిక సిద్ధాంతం ప్రపంచాన్ని లొంగదీసుకుంది. ఆయన సాహిత్య ప్రపంచాన్ని లొంగదీసుకున్నాడు.'అరిస్తే పద్యం- స్మరిస్తే వాద్యం' అని ప్రకటించుకోగలిగాడు. అధోజగత్‌సహోదరుల కోసం ఆకాశ రథాలను నేలకు దింపాడు. తన కవిత్వాకాశాలను లోకానికి చేరువ చేశాడు. మన చుట్టూ మరో ప్రపంచాన్ని నిర్మించి మనలోకి మనం ఒక మహాప్రస్థానాన్ని కొనసాగించేలా చేయగలిగిన మాంత్రికుడు శ్రీశ్రీ.

సామాజిక ఉద్యమకారులు ఆదర్శస్వప్నంలోంచి వాస్తవ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటారు. కవులు వాస్తవిక ప్రపంచాన్ని స్వాప్నిక జగత్తుగా పరివర్తన చేయాలనుకుంటారు. శ్రీశ్రీ ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడంలో అద్భుతమైన ప్రజ్ఞను ప్రదర్శించి అనర్గళం, అనితరసాధ్యం అయిన కవితామార్గం పట్టాడు. జయభేరి, అవతారం, మరోప్రపంచం, కవితా! ఓ కవితా! వంటి ప్రసిద్ధ మహాప్రస్థాన గీతాల రచనతో 1940 నాటికే ఆయన గొప్ప కవుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు, ఆయనకు అనుకూల- విరుద్ధ వర్గాలకు చెందిన సంప్రదాయ- భావకవిత- అభ్యుదయ మార్గాలకు చెందిన కవులందరూ ఆయనను మూర్ధన్యుడిగా అంగీకరించక తప్పని స్థితి ఏర్పడింది. మహాప్రస్థానం తప్ప శ్రీశ్రీ రాసిన ఇతర రచనల గురించి చాలామందికి తెలియదు. ఆయన స్వతంత్రంగా కథలు రాశాడు. గొప్ప కథలను అనువదించాడు. అద్భుతమైన వచనరచన చేశాడు. నాటికలు రాశాడు. పదబంధ ప్రహేళికలు సృష్టించాడు. చమత్కార రచనలెన్నో చేశాడు. మహాప్రస్థానం ముందు ఇవన్నీ దివిటీముందు దీపాలయ్యాయి. శ్రీశ్రీ శతజయంతిని ఘనంగా జరుపుకొన్నా- మనం ఆయనను వాల్ట్‌ విట్‌మన్‌లాగా అంతర్జాతీయకవిగానో; ఠాగూర్‌, సుబ్రహ్మణ్య భారతి, వళ్లత్తోళ్‌, కువెంపుల తరహాలో జాతీయస్థాయి కవిగానో పేరుపడేలా చేయలేకపోయాం. ఇది తెలుగువారి అశక్తత, అలసత. శ్రీశ్రీ తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి; ప్రపంచ కవులను, రచయితలను తెలుగువారికి పరిచయం చేయడానికి నిజాయతీగా ప్రయోజనాపేక్ష లేకుండా గట్టి ప్రయత్నం చేశాడు. శ్రీశ్రీతో తులతూగగల అనువాద సామర్థ్యం ప్రకటించగల తెలుగువారు అరుదుగా కనిపిస్తారు. తెలుగు యువకులు ఆయన అనువాదాలను అధ్యయనం చేసి ఆ ఒడుపు తెలుసుకొని జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు అందించే కృషి కొనసాగిస్తే- శ్రీశ్రీ లక్ష్యం నెరవేరుతుంది, తెలుగు యువకుల సాహిత్యావగాహన విస్తరిస్తుంది.

మంచి కవిత్వానికి శ్రీశ్రీ అన్నదే గొప్ప బిరుదైతే ఎంతో బాగుండును- అని ఎన్నో దశాబ్దాల కిందట పలికిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మంగళాశాసనం ఈ శతజయంతి వేడుకల రూపంలో సమగ్రంగా సాక్షాత్కరించిందనాలి. శ్రీశ్రీ అస్తమించినా ఆయన కవిత్వం ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంది. శ్రీశ్రీ తనువు చాలించినా ఆయన చమత్కారాలు నిత్యం మన జీవితాల్లో పూలబాటలు పరుస్తూనే ఉన్నాయి. తాను విశ్వసించిన సామాజిక సిద్ధాంతాలకు సైతం తలవంచని గాంభీర్యాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని తన గుండెలోనే దాచుకొని బైటకు ఏమీ తెలియని అమాయకుడిలా, అల్లరి పిల్లాడిలా, విదూషకుడిలా ప్రవర్తించి వెళ్లిపోయాడు శ్రీశ్రీ. ఎన్నడూ తనను తాను అధికుడననీ అనుకోలేదు, అధముడననీ అనుకోలేదు. నువ్వు అధ్యక్షుడివి అన్నప్పుడు పొంగిపోలేదు, నువ్వు కార్యకర్తవు అన్నప్పుడు కుంగిపోలేదు. జీవితమే వైరుధ్యమైనప్పుడు- వైరుధ్యాల కూడలిలోంచి నడవక తప్పదనుకున్నాడు. ఏ నడక నడిచినా తన లక్ష్యం ఒకటేనని చాటుకున్నాడు. ఒక మాటను ఎడం లేకుండా రెండోమాట పలకడంలో మజా ఉంటుందంటాడు శ్రీశ్రీ. 'శ్రీ' అనే అక్షరాన్ని ఎడం లేకుండా రెండోసారి ఉచ్చరించడంలో ఉన్న మజా ఏమిటో మనందరికీ తెలిసిందే. ఆ మజా ఈ శతజయంతితో ఆగదు. సహస్ర జయంతి పర్యంతం నిలిచిపోతుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౦౨:౦౫:౨౦౧౦)
___________________________________

Labels: