My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, January 12, 2013

వంశవృక్షం


నిరంతర జీవధారగా కొనసాగే కాలం ఏనాడూ ఆగదు, మారదు. ఆ వేగ గమనంలో ఆగేదీ సాగేదీ మారేదీ దారి మళ్లేదీ మనిషే! నిత్యకృత్యాల పెను ఒత్తిళ్ల మధ్య అతనెంతగా పరిభ్రమిస్తున్నా, ఎర్రన కవి తలచినట్టు- జననీ జనకులకు సుగతి కలిగించేవాడే ధర్మాత్ముడు. ఎంతటి ఘన చరితుడికైనా చిరునామా... అమ్మా నాన్నా. జన్మనిచ్చిన వారినీ వంశానికి మూలంగా నిలచిన పురుషులనీ ప్రాతః స్మరణీయులుగా సంభావించడమే మనిషితనం. సృష్టికర్త బ్రహ్మదేవుడికే తన మూలాలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిందని పురాణం చెబుతోంది. అది అత్యంత సర్వసహజమైన ఉత్సుకత. 'తన్ను దానెరుగలేని తలపేటి తలపు' అన్న అన్నమయ్య భాషితాన్నీ ఇక్కడ స్మరించుకోవాల్సిందే. పుట్టుకకీ పెరుగుదలకీ మూలకారకులైన తాత ముత్తాతలు, సంబంధీకుల్ని పేరుపేరునా తలచుకోవడంలో జీవితకాలానికి సరిపడేంత ఆనందముంది. పుట్టి పెరిగిన ప్రదేశాన్ని చూడాలన్న తాపత్రయం ఎంతో, పూర్వీకుల వివరాలు తెలుసుకుని నమస్కరించుకోవాలన్న కాంక్షా అంతే. మనుషుల్నీ మనసుల్నీ నిత్యమూ కలిపి ఉంచేంత జీవన సూత్రం ఇక్ష్వాకుల వంశ చరితలో ప్రతిఫలిస్తుంది. ఆ కుల తిలకుడు శ్రీరామచంద్రుడైతే, కుమారుడు కుశుడి ద్వారా కొనసాగిందంతా రఘువంశ కీర్తి విస్తరణే. తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించేలా మహా తపమాచరించిన భగీరథుడిదీ సఫల మనోరథమే.

'వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే' అనడంతోనే అత్రి, అగస్త్య, ఆంగీరస, వసిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, భృగు, జమదగ్నాది మహర్షుల దర్శనమవుతుంది. పుత్రపౌత్రాది పరంపర వర్ణన సాగిన ప్రతిసారీ 'జన్మవృక్షమునకు చవి గలయట్టి పటుతర కమనీయ ఫలములు రెండు కెరలు/ భోగములొండు కీర్తి రెండవది' అని చాటిన అలనాటి పల్నాటి చరితా జ్ఞప్తికి రాక తప్పదు. కదనరంగానికి కదిలే ముందు భార్యామణిని చూడబోయిన బాలచంద్రుడు అక్కడే సౌందర్యారాధన బంధితుడవుతాడు. ఆ పరిష్వంగ వలయం నుంచి తప్పించి కూతురు ముఖతః అల్లుణ్ని కర్తవ్యోన్ముఖం చేసేందుకు రేఖాంబ సాగించిన బోధ వారి వంశకీర్తిని విశదపరచేదే! తరాలూ వారసత్వాలూ అనేకానేక రంగాల్లో ఉన్నా, వంశ మూలాల ఆలోచనే మనోమందిరాన్ని పరమానందభరితం చేస్తుంది. జీవన సంస్కార వారసత్వమే ఎప్పుడైనా ఎవ్వరికైనా గర్వకారణం. 'వరమున బుట్టితిన్, భరత వంశమున జొచ్చితి, నందు పాండు భూ/ వరునకు గోడలైతి, జనవంద్యుల బొందితి, నీతి విక్రమ/ స్థిరులగు పుత్రులం బడసితిన్, సహ జన్ముల ప్రాపు గాంచితిన్' అంటూ అన్నింటా ఉన్న తన ప్రశస్తిని చాటిన ద్రౌపదిదీ మూలాచార పరాయణత్వమే. సత్యం, ధర్మం, శమం, దమం, విక్రమం, ప్రియవాక్యం తదితరాలూ గుణసంపత్తికి తార్కాణాలు. వారసత్వాన్ని పదిలపరచి విస్తరించాలన్న భావన వెనక వంశాభిమానముంది. వూరూ పేరూ ప్రస్తావించి 'నచట పుట్టిన చివురు కొమ్మైన చేవ' అంటూ ప్రవర కథాసంబంధ అభివర్ణన సాగించారు మనుచరిత్రకారులైన పెద్దనామాత్యులు. 'వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె/ నందు పెక్కండ్రు నృపులుదయంబు నొంది/ నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్ర కీర్తి/నధికులైరి తదీయాన్వయమున బుట్టి' అన్న వేరొక సందర్భమూ మూల చరితుల సంబంధమే. అంతటి ముఖ్యులు సహా విశిష్టులైన మహా రుషుల పేర్లను కలిపి చూసుకుని, తామూ అదే కుటుంబానికి చెందినవారమన్న ప్రవరాన్విత భావం పొందడం ఎవరికి వారికే అబ్బురమనిపించే అనుభవం.

ఎన్నడూ చెదరని, ఎప్పటికీ చెరగని, ఏనాటికీ తెగని అనుభవాన్నిచ్చేవి కళలు, సాహిత్యం, చరిత్రలు. ఆకట్టుకునే త్రివేణీ సంగమంలా, అంటిపెట్టుకునే పుట్టుమచ్చలా అవి శాశ్వతాలు. నాడు నేడు రేపు అన్నవి ఎవరికి వారు గీసుకునే కొండగుర్తులనుకుంటే, కలసి మెలసి జీవించడంలో ప్రతి ఒక్కరూ అందుకునే ఉల్లాస స్థాయి శిఖరంతో సమానం. ఆదికవి నన్నయ 'కీర్తి నిలుపుటయు కాదె/ జనులకు జన్మఫలంబు' అనడంలో వెల్లివిరిసేది మూలధర్మాల సంరక్షణ సంకల్పమే. కంటిముందే కాగితాల మడతల్లోకి జారిపోతుంది గతం. చూస్తుండగానే గుమ్మంలోకొచ్చి నిలుస్తుంది వర్తమానం. ఆశగా వూరించి వూహల ఉయ్యాలలూగిస్తుంది భవితవ్యం. అయినా 'మా పూర్వీకులు...' అని ప్రారంభించడంలోనే మనిషిలోని ప్రేమాభిమానాలూ అచ్చట్లూ ముచ్చట్లూ పెల్లుబికి, శుభకామనలై నిలవడంతో పాటు దివ్య దీవెనల్నీ కోరుకుంటాయి. పండుగలూ పబ్బాలప్పుడు ఉమ్మడిగా చేసుకునే వేడుకల్లో అందరికీ అనుభవానికొచ్చేది- ఆ ఉల్లాసమే, ఆ ఉత్సాహమే! సొంత వూళ్లో 'అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్, మావయ్య, తాతయ్య, బామ్మ'ల వంటి బంధుత్వ పిలుపులూ జనజీవన భాగ్యాలే. ఆయా సత్సంప్రదాయ పరంపరలే భువిలోని తదుపరి తరాలకు సదా ఆరాధ్యాలు, ఆదర్శప్రాయాలు. 'విశ్వంభర' కర్త గళం పలికినట్టు 'మట్టిలో మొలిచిన ఏ మొక్కయినా/ నేలపైన అలాగే ఉండాలనుకోదు/ తాను చెట్టంత ఎదిగిపోయే గడియ/ ఎప్పుడా అని ఎదురుచూస్తుంది'. మతం, భాష, ప్రాంతం, ఆచారం, సంప్రదాయం... అన్నింట్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నా, వాటిని ఏకోన్ముఖం చేసే ప్రగాఢ శక్తి మూలాల అన్వేషణ, ఆరాధన, పరిరక్షణల్లోనే దాగుంది. అదే మన సంస్కృతి, అదే మనందరిలోని భారతీయత.

(సంపాదకీయం, ఈనాడు , 23:12:2012)
--------------------------------------------

Labels: ,

Friday, January 11, 2013

Focus on the three ‘H’s

 
(The statue of Swami Vivekananda silhouetted 
against setting sun at Unakal lake in Hubli.) 

.......Swami Vivekananda redefined the word `atheist’ when he declared that as per the new religion, an atheist is one who does not believe in himself, not necessarily the one who does not believe in God. 
 
....On another occasion he said that if he could get one hundred ‘believing’ young men he would revolutionise the entire world.

One of his writings asks the youth to focus on the three `H’s - ‘Heart’ to feel for the poor and the marginalised, ‘Head’ to think and `Hands,’ which would convert thoughts into deeds.
He urged the youth to have a pure purpose, stick to truth, banish fear and doubt and surge ahead in life with the intensity of a forest fire. 

He wants our youths to emulate an oyster. It is believed that an oyster waits for the rain that falls when the star Swati is on the ascent. When that happens it comes to the surface, receives a drop of rain and recedes to the depths to develop a pearl.
Live for others:
‘They alone live, who live for others, the rest are more dead than alive,’ he observed. “It is better to wear out than rust out,” he said advising the younger generation to work, work and work till the goal is reached. Swamiji was one among the early visionaries who saw an invisible bridge between Indian and Western cultures. He interpreted Hindu scriptures and philosophy to the Western people in an idiom they could easily comprehend. Thus they were at ease with science and technology on the one hand and humanism on the other and there was no quarrel between the two.
Perhaps the best tribute to the life and mission of Swami Vivekananda in one line was paid by Rabindranath Tagore. Talking to another Nobel laureate, Romain Rolland, Tagore said, “If you want to know India, study Vivekananda.” 
(January 12th is observed as National Youth Day)
(SRIDHAR-CHAAMA, The Hindu, 11:01:2013)
------------------------------------------------------------ 

Labels: , , ,

INDIAN

All religion teaches tolerance and not hatred, brotherhood and not enmity, Peace and harmony and not violence.. Therefore, let us practice it than preaching it..... :) 
Accept - Non violence movement..
At the center of non-violence stands the principle of love.... Non-violence requires a double faith, faith in God and also faith in man.We do not need guns and bombs to bring peace, we need love and compassion to one and other.
 
(via W.O.W, Facebook)
------------------------------------------------

Labels: ,

7 Rules of life






















via Facebook
---------------------------------------------------------------------------

Labels:

Wednesday, January 09, 2013

Age & Maturity

















via Facebook
---------------------------------------------------

Labels:

దృష్టికి దివ్యత్వం


రెప్పపాటులో హత్తుకుపోయే అయస్కాంతమే చూపంటే. ఆ మహత్తేమిటో కానీ- ఆనంద విషాద సంభ్రమాదుల్ని మనిషి అనుభవానికి తెచ్చి, ప్రజాకవి వేమనకు కనిపించినట్టు 'చూచువారికెల్ల జూడ వేరై యుండు/ చూపు జూచి తెలియజూచువారు/ చూచి తాము చూపు చూపె తామగుదురు' అనిపిస్తుందది. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు మానవ గుణాలైతే ఆ దేహపు మూల లక్షణాల్లో కీలకం దర్శనమే! అది పన్నెండు జతల కపాల నాడుల్లో ఒకటైన దృష్టినాడికి పుట్టుక స్థలి. చూపునకు వర్తించే సమస్త సమాచారాన్నీ నేత్రముఖంగా నిలుపుతుంది దర్శనచక్రం. అందులో అర్ధ నిమీలితాలే కాక పరిపూర్ణ అవలోకితాలూ ఉండటం దృష్టి ధర్మం. 'చూచెదవేలనో ప్రణయ సుందరి' అని రాగాలాపన సాగించిన 'అద్వైతమూర్తి' కర్త మరో సందర్భంలో 'సమరమ్ము గావించు సత్య కన్నులనుండి వెడలు క్రోధ వీక్షణాలు' చూడగలిగిందీ ఆ కారణంగానే! దివ్య, జ్ఞాన, హ్రస్వ, దూర, పూర్ణ, అభేద దృష్టులు అనేకమున్నా నేత్రాంచలాల నుంచి జాలువారినంత మేర సహజానుభూతి అందించేది సమదృష్టి మాత్రమే. తొలిచూపు మొదలు కడచూపు వరకు కొనసాగే జీవన గమనంలో... ఓరగా చూసేవీ, సోగకళ్ల అంచుల్లో దాగుడుమూతలాడేవీ, చల్లని చూపులు ప్రసరించి అలరించేవీ, ఉల్లాసభరితాలు. కోరగా, చురచురా, నిప్పులు రాల్చేలా చుట్టుముట్టే వీక్షణాలు కలవర కారకాలు. మూగచూపూ ఎదురుచూపూ చిన్నచూపుతో మానవాళికి కలిగేవి అనేకానేక విభిన్న అనుభవాలు. వాటన్నింటినీ మేళవించి పరికించినప్పుడు 'జల్లెడను చూడు, పొల్లును సంగ్రహించి/ సారమౌ గింజలను క్రింద జారవిడుచు' నన్న కబీరు మాటల అంతరార్థం బోధపడక తప్పదు.

సీతా స్వయంవర వేళ శిష్యుడు రామచంద్రుడి మోము చూసిన మునివర్యుడి చక్షువుల్లో ఆశీస్సుమాల కాంతిమాల! సభామండపంలో జానకీదేవిని క్రీగంట తిలకించిన రాఘవుడిలో మహదానంద ప్రేమ డోల! చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు... సిగ్గు సిగ్గంటు ఉరిమే కళ్లతో లేచి గర్జించిన తెల్లమొగాలవారిలో క్రోధాగ్ని జ్వాల! కాలిదోవ సైతం కానరాని కీకారణ్యాన పతి ప్రాణాన్ని దక్కించుకోవాలని పరితపించిన సావిత్రీలలామ దయనీయ నయన. 'సమవర్తీ, నీకిది ధర్మమా?' అని ఆ 'రక్త నయనమ్ముల' యముడిని వెంటాడి మరీ విజేత కాలేదా ఆ బేల చూపుల బాల? పసికందును పొత్తిళ్లలో దాచుకుని నీటిమడుగు వైపు నడిచిన కుంతీకుమారికి ఆ బిడ్డ 'వాలుగన్నుల చక్కదనాల తండ్రి'. 'చిన్నినాన్నకు కన్నులు చేరడేసి' అంటూనే ఒత్తుకుంటూ హత్తుకుంటూ కూనను పెట్టెలో పరుండబెట్టిందా తల్లి. ఏటి కెరటాల్లో కదిలి వెళుతున్న చిన్నారిని 'నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష లోచనమ్ముల'తో చూస్తూనే ఉండిపోయిన ఆమెను తలచుకున్న ఎవరికైనా కళ్లు చెమర్చవూ? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. వెన్నెల కురిపించినా, మంటలు రగిలించినా ఆ కళ్లతోనే. తపోముద్రలో నిమగ్నుడైన పరమశివుడే లక్ష్యంగా సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు చెరకు విలుకాడు. ఆ మహిమాన్విత శస్త్రం మొదట గౌరి కడగంటి చూపులో కలిసిపోయి, పిదప సూటిగా ముక్కంటి గుండెలోనే గుచ్చుకుపోయింది. ధ్యానాన్ని భగ్నంచేశాడన్న ఆగ్రహంతో మరుక్షణంలోనే మన్మథస్వామిని భగ్గుమనిపించాడా ఫాలనేత్రుడు. భిన్నకోణంలో చూసినప్పుడు- చూపులు కలసిన శుభవేళ సంతోషం సాగరమవుతుంది. చూపులు కలబడినప్పుడు మాత్రమే ఎంత నిర్మాణముంటుందో అంత విధ్వంసమూ తప్పదక్కడ! 'చూపు చినుకై తాకితే వలపు వరమై వరిస్తుంది' అన్న కవి గళం 'తలపు పిలుపై మేల్కొలిపితే పలుకు స్వరమై మైమరపిస్తుంది' అనడం ఎద ఎదలోనూ వెల్లివిరియాల్సిన ఆశావాదానికి ప్రత్యక్ష ని'దర్శనం'.

రాయలవారి కలలోకొచ్చాడు జలజాక్షుడు. ఆ సువిశాల నేత్రద్వయుడు 'చామనచాయ మేనితోడ అరవిందముల కచ్చులడగించు జిగి హెచ్చు ఆయతంబగు కన్నుదోయి తోడ' సాక్షాత్కరించిన దృశ్యం మననీయ కృతి 'ఆముక్తమాల్యద' సాక్ష్యంగా నయనపర్వం. విష్ణుమూర్తి వర్ణన తరుణంలో 'పెద్ద ఎర్రదామరల వంటి నేత్రాలు గలవాడ'నడమూ నేత్రానంద దాయకమే! అన్ని ఆనందాల కలబోతే జీవితమనుకుంటే, నిఖిలేశ్వర్ దర్శించినట్టు అందులో ప్రత్యక్షమయ్యేది 'కాంతి పరావర్తన దృశ్య పరంపర/ పరస్పర సంబంధ బాంధవ్యాలతో నిరంతరం చలించే అవిరామ కిరణధార' కాలమా... ఆగేది కాదు. అనంతంగా, అవ్యయంగా ఉండే కాలం- విశ్వమంతటినీ తన చుట్టూ తానే తిప్పుకోగల రంగుల రాట్నం. ఈ పరిభ్రమణ క్రమంలో ఇప్పటి తాకే తెర సాంకేతిక విజ్ఞతా ఇకముందు తెరమరుగవుతోంది. స్పర్శించే పనీ లేకుండా ఒక్కటంటే ఒక్క చూపునే సాధనంగా మలచుకున్న కొంగొత్త పరిజ్ఞానం భవిష్యత్ యవనికపైన ఆవిష్కారం కానుంది. కనుపాప నుంచి ప్రతిబింబించే పరారుణ కిరణాల ఆధారంగా దూరవాణి యంత్రం(మొబైల్) పనిచేసేలా నవీన రూపనిర్మాణం ముగించారు లండన్ పరిశోధక విద్యార్థులు. అంటే- కేవలం కంటిచూపుతోనే ఈ తరహా యంత్ర పరికరాల్నీ పూర్తిగా నియంత్రించవచ్చన్న మాట! నూతన సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చే ఇటువంటి పరిజ్ఞానంతో ఇక పుటలు తిరగేయడాలు, ఆటలాడుకోవడాలు తదితరాలన్నీ చూపులతోనే జరిగిపోతాయి. 'దివ్య' దృష్టి అంటే బహుశా ఇదేనేమో! 

(సంపాదకీయం , ఈనాడు , 04:11:2012)
-----------------------------------------

Labels:

Children



















via Facebook
--------------------------------------

Labels:

Thoughts of life













 via Facebook
------------------------------------------------------------------------

Labels: ,

జల తరంగిణి



 సమస్త మానవాళినీ అనంత రసానంద వాహినిలో ఓలలాడించే సుమధుర మంత్రాక్షరి... సంగీతం! అష్టభోగాల్లో ఒకటిగా, చతుష్షష్టి కళల్లో మేటిగా ఘనతనందుకున్న ఆ గాన మధురిమే పానుగంటి కంటిముందు నిలిచినట్టు 'కన్నులకు జల్వ చెవులకు గమ్రతయును/ శ్వాస సంస్తంభనమున నాసకును బలిమి/ గాత్రమున రోమహర్షణ కలన మఱియు/ మనసునకు దాండవంబు నాత్మకును శాంతి/ సర్వరోగ సంహరణంబు'గా సర్వజన ప్రయోజనకరమైంది. వీర, శృంగార, కరుణ, శాంతి, హాస్యాది నవరస మిశ్రితంగానూ జనజీవన రంగమంతటినీ ఆవహించిందా రాగసుధ! దశవిధ ప్రణవ నాదాల్లో పాటతో పాటు చోటుచేసుకున్న వీణ, వేణు, మృదంగ వాద్యాదులూ లలిత చరిత మృదుకర చరణాలు... అరుణారుణ సమప్రభా భాను కిరణాలు. ఢమఢమ డమరుక నాదాలైనా భంభం శంఖారావాలైనా ధిమింధిమిత మంగళ మృదంగాలైనా ప్రతి మదినీ కదిలించేవీ, అణువణువూ మురిపించి మైమరపించేవీ! మనోజ్ఞ మల్లికావనిలో సుధామధుర కోమల గీతిక ఆలపించిన వనితామణిలో 'కరుణశ్రీ'కి ప్రణయకాంక్ష కనిపించింది. మహేశుని తపోదీక్షను భగ్నపరచిన అనుంగుడు ఆ ఫాలనేత్రాగ్నిలో భగ్గుమనగానే, సహచర జవరాలి నోటినుంచి కన్నీటి పాట వినవచ్చింది. 'చిచ్చువలె చందురుడు పైకివచ్చినాడు/ హెచ్చరిలినాడు గాడుపుపిల్లవాడు/ రాడు మోహన మురళీస్వరాలవాడు' అని హృది రగిలిన రాధికలో విరహ బాధ గోచరించింది. 'వేణుగీతివయి నిద్దుర లేపితివీ ప్రసుప్త బృందావనమున్' అన్న మరో లలన జ్యోతిర్మయి- సుందర పదాంకిత కింకిణికా ధ్వనులు మోగిన వేళ కవి ప్రశంసను వశపరుచుకుంది. ఘల్లుఘల్లున కాలిగజ్జెలు మోగుతుండగా మునుముందుకు సాగిన వేరొక భామామణి నడచినంత దూరమూ సుమనోహర దృశ్యమాలికే ప్రత్యక్షమైంది.

ఎండిన మోడులు చివురించడం, బండ గుండెలు ద్రవించడం కూడా గీత సంగీతాలతో సులభసాధ్యమనేందుకు పురాణ సంబంధ ఆధారాలు ఇంకా ఎన్నెన్నో. మంద్ర, మధ్యమ, తార స్థాయులతో స్వరభేదాలున్నా వాటన్నింటి సుస్థిర లక్ష్యం జన మనోరంజనమే. భావాన్ని గానంతో సమృద్ధం చేసి చూపేది రాగం. ఆ గానం వీనులవిందుగా కొనసాగడానికి ఉపకరించేది లయ. ఆరోహణ, అవరోహణల సమ్మేళనంతో స్వర గాంధర్వం విస్తరించినప్పుడు రసజ్ఞ శ్రోతలకు అదే రక్తిప్రదాయకం. 'సంగీత సాహిత్య సమలంకృతే/ స్వరరాగ పదయోగ సమభూషితే'నన్న కవి కైమోడ్పులకు అది ఉత్ప్రేరకం. అంతటి గీతామాధురీ ధారలో తడవనిదెవరు? మల్లెలతోటలోని ఆ మలయ మారుతాన్ని శ్వాసించని వారెవరు? 'నభమున చంద్రుడు తిలకించెనే/ చిరునవ్వుల వెన్నెల లొలికించెనే/ చక్కనితీవలు తరులు సరస్సులు/ చిక్కని మధువులు చిలికించెనే' అన్న క్రాంతదర్శి వర్ణనకు పులకించని మనసంటూ అసలుంటుందా? గాత్రమైనా వాద్యమైనా స్పందించే హృదయులతో అదో కరస్పర్శ, ఆదరపూర్వక పరామర్శ. సంగీతనిధి రామరాజ భూషణుడు ప్రస్తుతించినట్టు 'బాల రసాలమూ, పికపాలి పాలిటి అమర సాలమూ' అదే. పాలు, పెరుగు, చక్కెర, తేనెలవంటి పంచామృతాల సమం సంగీతమే. కర్పూరం, కస్తూరి, జవ్వాది, పన్నీరు, శ్రీగంధాది సుగంధాల సారమంతా గాన, గ్రహణ, శ్రవణ, మననాలతో సిద్ధిస్తుందనేదీ అందుకే. ఆస్వాదించినంత కాలమూ, అనంతరమూ ఏ ఆలాపనైనా అక్షరం, అక్షయం. పంచభూతాల్లో ఒకటైన జలానిది ద్రవణ గుణం. ఆ ద్రవీకరణే సంగీత పరిణామం. పొంగి పొరలిన లావణ్యం అలలా, నింగిమీద నక్షత్రాల నీలినీడల వలలా మనోమందిరాన్ని ఆక్రమిస్తుందది. కవి గాయక నట వైతాళిక భువన విజయంలో వెండి వెన్నెల జిలుగులెన్నని? కలవరించి పలవరించాల్సిన సరిగమలూ సురాగాలూ జీవితకాలంలోలెక్కకు అందనన్ని!

'కళ్లు మూసుకుని పడుకున్న గదికి విశ్వనాదాలు మంద్ర శ్రుతిలో వినిపిస్తున్నాయి/ ఆ నాద మాధురిలో పరవశించిన గది... విశ్వాన్నే తన కౌగిట్లో పొదుగుకుంది' అన్న 'విశ్వంభర' కర్త భావన మధురాతి మధురం. మనసారా ఆలకించాలే కానీ- గీతగోవిందం అలరిస్తుంది, కృష్ణలీలా తరంగం మురిపిస్తుంది. దేశీయం, విదేశీయం, జానపదం వంటి భేదాలేవీ సంగీత రసాస్వాదనలో అసలే ఉండవు. అజరంగా నిలిచే, అమరంగా వెలిగే గీతానందం... సింగరార్యుడన్నట్టు 'సంగీతవిద్య కెలమిన్/సంగడి సాహిత్యవిద్య సరిగా రెండున్/ మంగళవతి కలిగిన యా/ రంగు వచింపగ దరమె'. సంగీత సాహిత్యాలకున్నట్టే, జలానికీ అలలకీ అవినాభావ సంబంధముంది. వాటి మేలు కలయిక- మనసున మల్లెల మాలలూగిస్తుంది, కన్నుల వెన్నెల కాంతి నింపుతుంది. రాగంతో అనురాగం చిలికించి, రక్తితో అనురక్తిని ఒలికించే గానం ఏ మాటలకీ అందనిది, ఏ విశేషణాలకీ లొంగనిది. ఆనందానికి పర్యాయపదమేదైనా ఉందా అంటే, చటుక్కున గుర్తుకొచ్చేది గానమే! జీవన నందనాన నిరంతర యవ్వనిని తలపించే గానకళను బ్రిటన్ సంగీతకారుడు కిర్కీ వినూత్నరీతిలో ప్రదర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈతకొలనులోని జలతరంగాలతో సంగీత సృష్టి చేశారు. శరీరానికి అమర్చుకున్న యంత్ర పరికరాల వూతంతో కొలను అలలతో సంగీతామృతాన్ని పాలీమౌత్ విశ్వవిద్యాలయం వేదికగా యువ హృదయాలకు పంచిపెట్టారాయన. ఆ జల తరంగిణిని వర్తమాన జన మనోల్లాసిని అనుకుంటే, భవిష్యత్తు తరాలకది శాశ్వత వర ప్రసాదినే కదా! 

(సంపాదకీయం , ఈనాడు ,18:11:2012)
---------------------------------------------- 

Labels: ,

Memory















(via Facebook)
-------------------------------------------------------------

Labels:

జీవన సంజీవని

నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనడంలో 'శతమానం భవతి' ధ్వనిస్తే, వెయ్యేళ్లు హాయిగా వర్ధిల్లాలని కోరుకోవడంలో శుభ దీవెనే కాక ప్రగాఢ కామనా ప్రతిఫలిస్తుంది. అజేయంగా తిరిగే, అమేయంగా వెలిగే కాలచక్రంలో 'క్షణాలు దినాలు మాసాలు సంవత్సరాలు/ యుగాలు కల్పాలు కల్పాంతాలు' గిరగిరా చరచరా సాగిపోవడాన్ని మునుపే చూసింది కవినేత్రం! 'చిరంజీవ చిరంజీవ- సుఖీభవ సుఖీభవ' అని ఒకటికి రెండుసార్లు పలకడమన్నది కేవల ఆశీర్వచనమో వేదనాదమో కాదు. 'శతాయుష్మాన్ భవ' అన్న ఏడక్షరాలూ సప్తమహర్షుల హస్తాల నుంచి ఒక్కొక్కటిగా జాలువారిన పవిత్ర అక్షతలూ ఆశీస్సుమాల మాలలే! శత వసంతాల జీవన కాలాన్ని లోకులంతా కోరుకున్నా ఆ పత్రం నేలరాలకుండా చేసే, ఆ దేహదీపం ఆరిపోకుండా చూసే బాంధవుడెవరు? ఆయురారోగ్య భోగభాగ్యాలతో తులతూగాలని ఆబాలగోపాలానికీ ఉంటుందికానీ, ప్రాణ పరిపూర్ణ సంరక్షణే అసలు ప్రశ్న. 'అంబుధులీద వచ్చు, ప్రళయాగ్నులు గుప్పిట బట్టవచ్చు, గ్రం/థంబులు వ్రాయవచ్చు, గగనానికి నిచ్చెన వేయవచ్చు, వి/శ్వంబు జయింపవచ్చు, హిమశైలమునెక్కగ వచ్చు గాక/ చోద్యంబగు చావుపుట్టుకల దైవరహస్యమెరుంగవచ్చునే' అన్నారందుకే కవిశ్రీ. బాల్య కౌమార యౌవన వార్ధక్యాలనే చతుర్విధ దశలుగా కొనసాగే జీవన యానంలో మానవులకు ఆశలు శతకోటి! అయినా, సురవరం వారన్నట్టు- 'పుట్టుట గిట్టుట పుడమి జనులకు కట్టడి/ చావు బ్రతుకు వర్తించు చక్రగతి'. చిగురుటాకు అంచున వూగిసలాడే నీటిబిందువు వంటిది ప్రాణమైతే, అది ఉన్నంత కాలమూ- ప్రభాకరుని ప్రకాశం, ధ్రువతార తేజం, మేఘంలా వర్షించడం, చందమామలా స్పర్శించడం కావాలంతే!

ఉపకార చింతన, ధర్మ పరిరక్షణ కలగలిసిన తరుణాన స్థితప్రజ్ఞత, సత్యసంధత, స్థిరత, దానశీలత, ప్రతిభా ప్రపూర్ణతలూ సుగుణసంపన్నాలే. పురాణగాథల్లోని ఆంజనేయ, విభీషణ, కృప, పరశురామ, అశ్వత్థామ, బలి, వ్యాస చరితలు మానవాళికి బోధించేవీ ఈ విలక్షణతలే.. వీరందరిదీ పూర్ణాయు ప్రతీక. హితసాధనలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఘనతర పతాక. 'కాలము పోవును, కడకు మాట నిలుచు' అని క్షేత్రయ్య పలికినా, 'కీర్తి నిలుపుటయు కాదె జనులకు జన్మఫలంబు' అంటూ నన్నయ ప్రవచించినా- ఆ అర్థం బహుజన హితం, ఆ భావం బహుజన సౌఖ్యం. 'మనసులో పుట్టిన మంచి తలంపు/ లాచరణమునందు అలవికాకున్న/ జన్మఫలంబేమి? చచ్చుటే మేలు!' అన్న శ్రీనాథ సుభాషితమూ సర్వదా మననీయం, బహుధా స్మరణీయం. ఒక ప్రాణి జననం ఎప్పుడూ ఎక్కడా అని అడిగితే బదులు పలకొచ్చు. అదే ప్రశ్న మరణం గురించి అడిగితే- సమాధానమేదీ ఉండదు. వేమన 'ఏమి గొంచు వచ్చె నేమి దా గొనిపోవు/ బుట్టువేళ నరుడు గిట్టువేళ' అన్నదీ బదులు తెలియనిదే. తెలిసిందల్లా ఒక్కటే- జీవనకాలం ఎంత అనేకన్నా, అది ఎంత ప్రయోజనకరమన్నదే ఏనాటికైనా మిన్న. కాలజ్ఞతే మనిషి విజ్ఞతకు నికార్సయిన సూచిక. నిరంతరం పరిభ్రమించే కాలం ఒక్క క్షణమైనా ఆగదు. ఆగేదీ సాగేదీ మనిషే కనుక, మంచిని పెంచాల్సిందీ పంచాల్సిందీ ఆ మనిషే. మనుగడ ఓ నవరస భావ పూర్ణ నాటక వేదిక. సర్వ సమర్థంగా పాత్రపోషణ చేయాల్సిన మానవుడికి అందుకే 'అందనిదానికోసమయి అఱ్ఱులు చాచకు, లేనిదానికై/ కొందల మందబోకు, చెడు కోర్కెల చెంతకు చేరనీకు, నీ/ కందినదానితోడ ముదమందుచు, మోమున మందహాసముల్/చిందుచు సాగిపొమ్ము నవజీవన చైత్ర వనాంతరమ్ములన్' అని దారిదీపం చూపింది కరుణ కవి హృదయం. ఏడుస్తూ పుట్టి, కొన్నిమార్లు ఏడుస్తూ పెరిగి, ఇంకొన్నిసార్లు ఇతరుల్ని ఏడిపించిపోయే ప్రాణితో ఈ నేలకు ఉపకారమేమిటనీ నిలదీసిందా స్వరం. 'కలలొచ్చే సమయాన మేలుకోకు, కాలం కలిసొస్తే నిదురపోకు' అన్న హితోక్తి జనచేతనకు దోహదపడే నవామృత మాత్ర!

మిసిమి ప్రాయమైనా ముదిమి వయస్సయినా జీవితేచ్ఛ ఒకటే. కలకాలం విలసిల్లాలన్న శుభాకాంక్షకు పసికందు మొదలు ముదివగ్గుదాకా స్పందించేది బోసినవ్వుతోనే. అన్నమయ్య నిర్ధరించినట్టు 'తగిలి సంపదలచే దనిసినవారు లేరు/ ఒగరు సంసారభార మోపనన్నవారు లేరు/ జడిసి ఆయుష్యము చాలునన్నవారు లేరు'. లోక గమనాన్ని గమనించిన ఆయన నయనాల ఎదుట వరసగా సాగిపోతున్న దృశ్యాలు, రంగులు మార్చుకున్న వైనాలు అనేకం. వాటిని విశ్లేషిస్తే 'పెంచగ బెంచగ బెరిగీ నాసలు/ తుంచగ దుంచగ దొలగునవి/ తడవగ దడవగ దగిలీ బంధము/ విడువక విడువక వీడునది' అన్నట్టుంది స్థితి. నిలిచినదొకటే నిజం, తెలిసిన తెలివే ఘనం అంటే, అదేనేమో మరి. తెలియాల్సింది ఇంకా ఉందనుకున్నప్పుడు 'పక్కనే ఉన్న లోయలోకి తొంగిచూసి/ శిఖరం తన లోతెంతో తెలుసుకోవాలనుకుంది/ వృక్షం కళ్లుమూసుకుని/ తన వేళ్లు నేల పొరల్లోనికి ఎంత దూరం సాగిపోయాయో వూహించుకుంది' అనే సినారె మాలిక గుర్తురాక మానదు. శిఖరస్థాయిగా వృక్షసమంగా మూలలకీ విస్తరించిన వైద్య సదుపాయాలు ప్రజానీకానికి దీర్ఘాయువు ప్రసాదిస్తున్నాయి. జీవన ప్రమాణాల పెంపుదల కారణంగానూ- ఈ ఏడాది పుట్టిన బాలల్లో మూడోవంతు మంది వందో పుట్టినరోజు చేసుకుంటారంటోంది లండన్‌లో జరిగిన తాజా అధ్యయనం. దాంపత్య బంధంతో పాటు ఉత్తమ స్నేహ సంబంధం మనిషి ఆయువును పెంచి తీరుతుందని కూడా అక్కడి పరిశోధకులు తేల్చిచెప్పారంటే, సంజీవని... ఎదుట నిలిచినట్టేగా!


(సంపాదకీయం , ఈనాడు , 25:11:2012)
--------------------------------------------------
_________________________________________

Labels: