My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, August 05, 2009

ఒక్క నిమిషం...


'రెండు నిమిషాల్లో తయారై వచ్చేస్తాను' అని చెప్పి గదిలోకి దూరిన భార్యకోసం అరగంట నుంచి ఎదురుచూస్తున్నాడు పతిదేవుడు. 'ఇరవై నిమిషాలు ఆలస్యంగా నడుచుచున్నది' అని ప్రకటించిన రైలుకోసం గంటకు పైగా కాచుకుని ఉన్నారు ప్రయాణికులు. ఇలాంటి సందర్భాల్లో నిమిషం నిడివి మారుతూ ఉంటుంది. సమయానికి ప్రత్యేకంగా కొలత అంటూ ఉండదు. గంటలో అరవయ్యో భాగం నిమిషమని మన లెక్క. నిమిషంలో అరవయ్యో భాగం సెకండు అంటాం.

మన పెద్దలైతే ఇలాంటి లెక్కల్లో చాలా సూక్ష్మదృష్టి ప్రదర్శించారు. చీకటిగా ఉన్న గదిలోకి ఏ మూలనుంచో ఒక సూర్యకిరణం చొరబడిందనుకోండి- పొడుగాటి ఆ వెలుగుచారలో మనకు ఎన్నోకోట్ల దుమ్ముకణాలు కనబడతాయి. వాటిలోంచి ఒకేఒక్క ధూళి రేణువును పట్టుకుని తూచగలిగితే దాని బరువును 'త్రస' అంటారు.
దాని కొలతను ముప్ఫై పరమాణువులుగా లెక్కించారు. సూక్ష్మమైన 'త్రసరేణుభారం' మొదలుగా ఎన్నోవేల రెట్ల తూకాలను మనవాళ్ళు లెక్కలుకట్టారు. వివిధ విభాగాలతో కూడిన సైనిక బలాన్ని ఎలా లెక్కించాలో మహాభారతం వివరించింది. ఒక రథం, ఓ ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు సైనికులు మొత్తం పదిమంది బృందాన్ని 'పత్తి' అంటారు. పత్తికి మూడురెట్లు సేనాముఖం. దానికి మూడు రెట్లు అయితే అది గుల్మం. మూడు గుల్మాలు కలిస్తే ఒక గణం. మూడు గణాలు కలిసి వాహిని. దానికి మూడింతలు పృతన. దాన్ని మూడుతో గుణిస్తే ఒక చమూ. మూడు చమూలు ఒక అనీకినీ. దానికి పదిరెట్లు అక్షౌహిణి. కురుక్షేత్రంలో మొత్తం సైన్యం పద్దెనిమిది అక్షౌహిణులు.

ఇక సంఖ్యామానానికి వస్తే ఒకట్లు, పదులు, వందలూ... అంటూ లెక్క వెయ్యికోట్లు దాటాక- ఒక్కో సున్న చొప్పున చేర్చుకుంటూ పోతే అర్బుదం, ఖర్వం, పద్మం, క్షోణి, శంఖం, క్షితి, క్షోభం, నిధి, పరతం, పరార్థం, అనంతం, సాగరం, అమృతం, అచింత్యం, భూరి, మహాభూరి... దాకా ఆ లెక్క విస్తరిస్తుంది. ఒకటి పక్కన ముప్ఫై అయిదు సున్నాలు చేరిన సంఖ్య మహాభూరి అవుతుంది.

సీతా స్వయంవరం ఆరంభమైంది. శ్రీరామచంద్రుడు శివకార్ముకాన్ని పట్టి ఎక్కుపెట్టబోయాడు. ఉన్నట్టుండి విల్లు ఫెళ్ళున విరిగిపోయింది. 'ఆ ఒక్క 'నిమేషం'బునందె నయము జయమును భయము విస్మయము గదుర' అంటూ కరుణశ్రీ వర్ణించారు. రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుణ్ని పట్టి బంధించబోయారు కౌరవులు. కృష్ణుడు కుపితుడయ్యాడు. 'మీ అందరను చంప ఒక్క 'నిమేష' మాత్రము చాలు నాకు... అయినను విధాత మీ నొసట వేరుగ లిఖించె' అని తమాయించుకున్నాడు. పై రెండు సందర్భాల్లోను నిమేషమంటే అరవై సెకండ్ల సుదీర్ఘ వ్యవధి కాదు. దాని నిడివి మహా అయితే ఒక్కక్షణం! జీవి పుట్టిన నిమేషంనుంచి ఆయువు లెక్క ఆరంభమవుతుందన్నది శివపురాణం. శివపురాణం లెక్కలో పదిహేను నిమేషాలు ఒక 'కాష్ఠ'. ముప్ఫై కాష్ఠలు ఒక కళ. ముప్ఫై కళలైతే అది ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు కలిసి ఒక అహోరాత్రం లేదా ఒక రోజు!

మహాభారతం శాంతిపర్వం సైతం ఇంచుమించు ఇదే కొలతను చెప్పింది.

తైత్తిరీయ ఉపనిషత్తు ప్రకారం పద్దెనిమిది నిమేషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కళ. ముప్ఫై కళలు ఒక క్షణం. ముప్ఫైఆరు క్షణాలను ఒక ముహూర్తంగా తైత్తిరీయం పేర్కొంది.

ఇవి కాక మన పెద్దలు లిప్త, లవం, త్రుటి వంటి మరీ సూక్ష్మమైన కొలతలను పాటించారు. లిప్త అంటే కనురెప్పపాటు. జనకుడికి పూర్వం మిథిలను పాలించిన 'నిమి' చక్రవర్తి పేరుమీద ఈ రెప్పపాటు వ్యవధికి 'నిమిషం'గా పేరొచ్చింది (రెప్పపాటు లేనివారు కనుక దేవతలు అనిమిషులయ్యారు).

వ్యాకరణ పరంగా చెబితే ఇది 'మాత్ర'. తామర రేకులను బొత్తుగా పెట్టి పదునైన సూదితో కసుక్కున పొడిస్తే ఒక రేకునుంచి మరో రేకుకు పట్టే సూదిమొన ప్రయాణ కాలాన్ని 'లవం' అన్నారు. అలాంటి లవాలు ముప్ఫై కలిస్తే అది త్రుటి. పత్రికల్లో 'త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం' అని రాస్తుంటారు. ఆ త్రుటి కొలత అది.

'ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?' అని ప్రశ్నించాడొక సినీకవి. అక్కడ నిమిషం కొలత అనంతం. భవిష్యత్తులో ఏనాడో ఏదో సంఘటన జరిగే నిమిషానికే అది వర్తిస్తుంది. ఆ ప్రత్యేక నిమిషానికే విలువ. పోగొట్టుకొనే పక్షంలో అది మరీ పెరిగిపోతుంది. గుండెనొప్పి ప్రారంభమైనప్పటినుంచీ వైద్య సహాయం అందేదాకా ప్రతినిమిషం చాలా విలువైనది. ప్రతి నిమిషం గంటలా తోస్తుంది. చేజారిపోతున్న ఒక్కో క్షణం అప్పుడు విలువైనదే. అందుకే ఎంతో అమూల్యమైనదనే మాట పోగొట్టుకొనే కాలానికి మరీ వర్తిస్తుందన్నాడు ఒక పాశ్చాత్య తత్వవేత్త. 'పోగొట్టుకోబట్టే దానికా విలువ' అనీ అన్నాడాయన. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమన్న అధికారుల పట్టుదలతో ఇటీవల చాలామందికి నిమిషం విలువ బాగా తెలిసొచ్చింది. కాకపోతే ఈ విషయంలో ఒకపేచీ ఉంది. అభ్యర్థి ఆలస్యమయ్యాడని నిర్ణయించడం ఏ గడియారం ప్రకారం సబబు? ఏ గడియారం ఈ విషయంలో ప్రామాణికం? 'లగ్నానికి ఇక మూడే నిమిషాలుంది' అని పురోహితుణ్ని హెచ్చరించాడు పెళ్ళిపెద్ద. 'నాది రేడియో టైం' అన్నాడాయన ధీమాగా! అప్పట్లో అది ప్రామాణికం. ఇప్పుడు టీవీ ఛానళ్లు, సెల్‌ఫోన్లు సమయాన్ని చూపిస్తున్నాయి. అయితే, తమ స్వయంప్రతిపత్తిని ప్రకటించడానికా అన్నట్లు అవి తలోసమయం చూపిస్తాయి. దేన్నిబట్టి అభ్యర్థి ఆలస్యమయ్యాడని నిర్ణయించగలం? 'పరీక్ష ఒత్తిడికన్నా సమయపాలనకు సంబంధించిన ఒత్తిడి మరీ తలనొప్పిగా ఉంది' అంటున్నారు తల్లిదండ్రులు. దానివల్ల ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశాన్ని తమ పిల్లలు కోల్పోతున్నారన్నది వారి బాధ. పరీక్షకు అనుమతి దొరకనివారి పరిస్థితి 'నీవు ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు' అని ఆరుద్ర చెప్పినట్లయింది. 'ఇంకా నయం... ఆ అధికారులకు లిప్త, త్రుటి వంటివి తోచలేదు' అని ఒకాయన నిట్టూర్చడం దీనికి కొసమెరుపు!
(ఈనాడు, సంపాదకీయం, ౦౭:౦౬:౨౦౦౯)
______________________________

Labels:

మనిషి- మనసు

- డాక్టర్‌ డి.చంద్రకళ
మనిషి ఎంత ఎత్తు ఎదిగినా మనసు చేతిలో మాత్రం కీలుబొమ్మే. మనసు మనిషిని గొప్పవాడిగానూ చెయ్యగలదు, అధఃపాతాళానికి తోసెయ్యనూగలదు. బహు చంచలమైన మనసు మనిషిని ఇంద్రియ సుఖాలవైపు లాగి పతనావస్థకు చేరుస్తుంది. మనిషి తన వివేకంతో కోరికలనే గుర్రాలకు బుద్ధి అనే కళ్ళెం వేసి మంచి మార్గంవైపు నడిపించాలి.

'ఎవరు వివేకంతో తన మనసును తాను జయిస్తాడో ఆ గెలిచిన మనసు తనకు బంధువవుతుంది, ఓడిపోతే అదే తన అంతశ్శత్రువవుతుంది' అనేది శ్రీకృష్ణుని గీతావచనం.

ఒక రాజ్యంలో సేనాధిపతి హఠాత్తుగా మరణించాడు. ఇంకొకరిని నియమించడంకోసం పోటీ తలపెట్టారు. ఆ పోటీలో అన్ని పరీక్షలకు నిలబడి గెలిచినవారు ముగ్గురు. ఎవరిని నియమించాలా అని సందిగ్ధంలో పడ్డారు రాజుగారు. వారిని పిలిపించి 'మీ ముగ్గురూ పరీక్షల్లో నెగ్గారు. అయినా ఒక్కరే విజేతగా మిగలాలి... దానికి రేపే ఆఖరి పరీక్ష. ఈ రాత్రికి మీరు నా అతిథులు, మా విందును స్వీకరించాలి' అని పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. రకరకాల మధుపానీయాలు, ఘుమఘుమలాడే వంటకాలు, నాట్యంకోసం నర్తకీమణులు- విందు, వినోదం జోరుగా సాగుతున్నాయి. ఇంతలో పదిమంది ముసుగు మనుషులు చొరబడి రాజును చుట్టుముట్టారు. పోటీకి నిలిచినవారిలో ఒక యువకుడు మత్తులో మునిగి ఉన్నాడు. మరొక యువకుడు నర్తకీమణులతో నాట్యంచేస్తూ తన్మయత్వంలో ఉన్నాడు. మూడో యువకుడు మాత్రం వెంటనే కార్యోన్ముఖుడై ముసుగు మనుషుల్ని ఎదుర్కొని వారు వెన్ను చూపేలా చేశాడు. రాజుగారు చప్పట్లు కొడుతూ 'శభాష్‌! నేను పెట్టిన ఆఖరి పరీక్షలో గెలిచింది నువ్వే. నిన్ను నా రాజ్యానికి సేనాధిపతిగా నియమిస్తున్నాను' అన్నాడు. మనిషి ఎంత వీరుడు, శూరుడు అయినా మనసు పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ కథలోని నీతి.

మనసు రెండు తలల పాములాంటిదంటారు పెద్దలు. ఒకటి ధర్మంవైపు నడిపిస్తుంది. మరొకటి అధర్మం వైపు లాగుతుంది. ఈ రెంటి మధ్య సంఘర్షణే మనిషిని ఆందోళనకు గురిచేస్తుంది. శరీరాన్ని బలహీనపరుస్తుంది. వీటిని సమన్వయపరచేదే వివేకం. ఇది మంచి చెడులను విశ్లేషించి బాధ్యతగల వ్యక్తిగా తయారుచేసి కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడేలా చేస్తుంది.
(ఈనాడు, అంతర్యామి, ౨:౦౮:౨౦౦౯)
_____________________________


Labels: ,

Sunday, August 02, 2009

KENTUCKY FRIED CHICKEN

He was 65 years old when he received his first social security check of $99. He was broke, and owned a small house and a beat up car. He made a decision that he has got to change. The only idea he had was a chicken recipe, which his friends liked. With that idea in mind, he took massive action. He left his home Kentucky and traveled to many states in the US to sell his idea. He told the restaurant owners that he had a chicken recipe that people liked and he was giving it to them for free. What he wanted in return was for the restaurant owners to pay him a small percentage on the pieces of chicken sold. He got rejections after rejections, but did not give up. In fact, he got over 1000 rejections. He got 1009 no’s before he got his first yes. With that one success Colonel Harland Sanders is known throughout the world for his food joints called Kentucky Fried Chicken (KFC).

SUCCESS PRINCIPLE:
Age is no barrier to success, and so is capital. What is needed is an idea put into action, followed with proper planning and persistency. How many of us will keep knocking on doors when we have received 1000 rejections? I presume not many! This is why there are not many successes like Colonel Sanders.
"Any man's life will be filled with constant and unexpected encouragement, if he makes up his mind to do his level best each day."
Have Great Days Ahead.
(An email forward)
___________________________

Labels:

మట్టి వాసన


పసిపిల్లలకు అభం సుభం తెలియవు అంటుంది లోకం. 'భం' అంటే తార లేదా నక్షత్రం అని అర్థం. మంచి గుణాన్ని 'సు'గుణం అన్నట్లే, మంచి నక్షత్రాన్ని 'సు'భం అంటారు. సంపత్తార, మిత్రతార, క్షేమతార... వగైరాలు కలిసొచ్చే నక్షత్రాలు. సుభాలు. సుభానికి విరుద్ధమైనది 'అభం'. విపత్తార వంటి కీడు తెచ్చే నక్షత్రాలు అభాలు. ఈ తేడాలు, వివరాలు అంతగా తెలియవు కాబట్టి పసిపిల్లలను అభం సుభం ఎరుగనివాళ్ళని అనడం లోకంలో పరిపాటి. అభము సుభమ్ములం దెలియక ఆర్చెడి దేబెలు మాకు లెక్కయే?... అన్న తిరుపతి వేంకటకవుల ప్రయోగం ఈ అర్థంలోదే! అభం సుభం తెలియకపోవడమే బాల్యానికి అలంకారం. 'నా హృదయంలో నిదురించే చెలీ, పాటలో 'నీ వెచ్చని నీడ' అని ప్రయోగించారు కదా... నీడ ఎక్కడైనా వెచ్చగా ఉంటుందా?' అని శ్రీశ్రీని ఒక కుర్రవాడు ప్రశ్నించాడు. శ్రీశ్రీ అతణ్ని తేరిపార చూసి 'అభం సుభం తెలియని పసివాడివి... పెద్దయ్యాక నీకే తెలుస్తుందిలే' అని బదులిచ్చారు. పెద్దయ్యాక కన్యాశుల్కంలో గిరీశంలా తయారయ్యే అవకాశవాదులు సైతం బాల్యంలో అభం సుభం తెలియని పసివాళ్ళే కావడం ఈ సృష్టిలోని విశేషం. కల్లాకపటం ఎరుగని వయసు, కల్మషం తెలియని మనసు బాల్యానికి సహజసిద్ధమైన కవచకుండలాలు. తేడాలు పాటించకపోవడం అనేది బాల్యంలోనే సాధ్యం. ఒకే కంచం, ఒకే మంచం అనే మాట ఒక్క బాల్యానికే సరిగ్గా నప్పుతుంది. పక్కవాడి కంచంలోని వూరగాయను గబుక్కున తినేసి 'కావాలంటే నా నోరు చూడు' అని అడ్డంగా బుకాయించే బాల్యాన్ని భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు బమ్మెర పోతన. అలాంటి నిష్కల్మషమైన పనులు పెద్దయ్యాక సాధ్యంకావు. అందుకే బాల్యం అమూల్యం! బాల్యంలో అనుభవాలు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతారు. గాఢమైన చేదు అనుభవాలు ఆ వయసును గాయపరిస్తే- పెద్దయ్యాక ఆ వ్యక్తి సంఘ వ్యతిరేక శక్తిగా మారే అవకాశం బాగా ఎక్కువ.

చెరువుల్లో ఈతలు, నదీతీరాల్లో ఇసుక గూళ్ళు, జామచెట్లపై కోతి కొమ్మచ్చులు, మైదానాల్లో గాలిపటాలు, వర్షం నీటిలో కాగితం పడవలు, లేగదూడలతో సయ్యాటలు, తూనీగలతో సరాగాలు, పక్షులతో పరాచకాలు... ఇవీ మన సంప్రదాయ క్రీడావినోదాలు! కేవలం బాల్య వినోదాలే కావు- మనిషిలో కలివిడితనానికీ ఇవే పునాదులు. నేలతో నెయ్యం, నింగితో స్నేహం, నీటితో సావాసం, పంచభూతాలతో జట్టుకట్టడం, ప్రపంచంతో ప్రకృతితో కలిసికట్టుగా జీవించడం... ఇవే సిసలైన బాల్యానికి గీటురాళ్లు. మనిషితనానికి ఆనవాళ్ళు. నిజానికి లోకజ్ఞానం అక్కడినుంచే అలవడుతుంది. వికాసం అప్పుడే మొదలవుతుంది. బొమ్మల కొలువులు, వామన గుంటలు, గవ్వలాటలు, చెమ్మచెక్కలు, కాకి ఎంగిలి మామిడి ముక్కలపై ఉప్పూ, కారం అద్దుకు తినడం... వంటివి లేకపోతే బాల్యానికి అందమూ లేదు, అర్థమూ లేదు. అద్దాల మేడల్లో అబ్బురంగా పెరిగే అసూర్యంపశ్యలకు ఆ బాపతు బాల్యంతోను, కమ్మని మట్టివాసనతోను పరిచయం ఉండదు. ఒంటరిగా కూర్చుని నిత్యం యంత్రాలతో సావాసం చేసే పిల్లల శరీరాలు ఎదుగుతాయేగాని, మనసులు ఎదగవు. వెనకటికో ముని సుఖంగా తపస్సు చేసుకుంటుంటే హంతకుడొకడు వచ్చి తన పిడిబాకును దాచిపెట్టమని అడిగాడు. నిత్యం దాన్ని పరిశీలించడం, దాని గురించి ఆలోచించడం అలవాటై ముని స్వభావంలో క్రమంగా నేర ప్రవృత్తి అంకురించిన కథ మనకు తెలుసు. బాల్యంలో బొమ్మ పిస్తోళ్ళ ఆటలతోనే తప్ప సజీవమైన పిట్టల పాటలతో పరిచయం లేని పిల్లల విషయంలోనూ అదే జరుగుతుంది. మట్టిలో తెగ ఆడి ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుపోయిన బాలకృష్ణుణ్ని చూస్తే- కైలాసంలో ఒంటినిండా విభూది పూసుకున్న శివుడు గుర్తొచ్చాడు పోతన్నకు! బయట నుంచి వచ్చినప్పుడల్లా రకరకాల కాలుష్యాలు పులుముకుని వస్తున్న పిల్లలను చూస్తుంటే దెయ్యాలు గుర్తొస్తున్నాయి మనకు!

ఇసుకతో గుడి కడతారు... తీరిగ్గా అలంకారాలు అద్దుతారు... తోచినంతసేపూ హాయిగా ఆడుకుంటారు... పొద్దుపోయేసరికి కట్టడాలను చులాగ్గా కూలగొట్టి పిల్లలు నిశ్చింతగా ఇంటిదారి పడతారు. బెంగలూ దుఃఖాలూ ఏమీ ఉండవు. సృజనాత్మకత అనే కాదు, మనిషిలో తాత్విక స్వభావానికీ అంకురారోపణ జరిగే సన్నివేశమది. నిర్జీవమైన యంత్రాలతో ఆట నైరాశ్యాన్ని నింపుతుంది. సజీవమైన పశువులతో, పక్షులతో ఆడుకునే పిల్లల హృదయాల్లో మానవీయ విలువలు స్థిరపడతాయి. అందుకే మన పెద్దలు సాహిత్యంలో సైతం విరివిగా జంతువులను సృష్టించారు. పశువూపక్షీ పిల్లామేకా పెట్టాపుంజూ చెట్టూచేమా- అన్నీ మనిషికి తోబుట్టువులేనన్న భావాన్ని మనసుల్లోకి చొప్పించారు. అవీ మానవ పరివారంలో భాగమేనని బోధించారు. పెంపకంలోనూ, సాహిత్యం ద్వారానూ ప్రకృతితో మనిషి బంధాన్ని పటిష్ఠం చేశారు. అలాగే జంతువుల బొమ్మలను ఆట వస్తువులుగా అందించారు. ఈ రకమైన సంప్రదాయ క్రీడావిధానాలు, ఆట వస్తువుల మూలంగా మనిషి వికాసానికి ఎంతో మేలు జరుగుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన బాల్య వికాస నిపుణుడు, మనస్తత్వవేత్త డాక్టర్‌ జాన్‌ జురైదిని పరిశోధనలో తరతరాల సంప్రదాయ ఆటపాటలు మనిషిలో సృజనాత్మకతకు, వికాసానికి, చలాకీతనానికి కారణం అవుతున్నాయని తేలింది. ఎలక్ట్రానిక్‌ ఆట వస్తువులు, కంప్యూటర్‌ క్రీడలు- పిల్లల్లోని భావుకతకు, ఊహాశాలితకు హానిచేస్తున్నాయనీ రుజువైంది. పిల్లల్లో నేరప్రవృత్తికి అవి దోహదపడుతున్నాయని డాక్టర్‌ జాన్‌ ప్రకటించారు. మరో శాస్త్రవేత్త కారెన్‌ స్టాగ్నిటి సంప్రదాయ క్రీడారీతులు, ఆటపాటలు, వస్తువులు- పిల్లలకు సహజత్వాన్ని నేర్పుతున్నాయన్నారు. సామాజిక జీవన కౌశలం, భాషాపటిమ, సమగ్రవికాసం వంటివాటికి అవే పునాదులుగా చెబుతున్నారు. ఎంతసేపూ పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లిదండ్రులు ఇకపై వారిని సమర్థులుగా రూపొందించే ప్రయత్నాలు చెయ్యాలన్నది వారందరి హెచ్చరిక!

(ఈనాడు, సంపాదకీయం, ౩౧:౦౫:౨౦౦౯)
____________________________

Labels:

DIVORCE


An elderly man in Mumbai calls his son in New York and says, 'I hate to ruin your day son, but I have to tell you that your mother and I are getting a divorce; 35 years of marriage... and that much misery is enough!'
'Dad, what are you talking about?' the son screams.
'We can't stand the sight of each other any longer,' the old man says.

'We're sick of each other, and I'm sick of talking about this, so you call
your sister in Hong Kong and tell her!'
Frantic, the son calls his sister, who explodes on the phone.
'Like heck they're getting divorced,' she shouts, 'I'll take care of this.'
She calls Mumbai immediately, and screams at the old man, 'You are not
getting divorced. Don't do a single thing until I get there. I'm calling my brother back, and we'll both be there tomorrow. Until then , don't do a thing, DO YOU HEAR??' and she hangs up.
The old man hangs up his phone and turns to his wife. 'Okay', he says,
'It's all set. They're both coming for our anniversary and paying their own airfare!!'

MORAL: No man / woman is busy in this world all 365 days. The sky is not going to fall down if you take few days LEAVE and meet your dear ones. OFFICE WORK IS NOT EVERYTHING IN LIFE and MONEY MAKING IS NOT EVERYTHING IN LIFE.
(An email forward)
___________________________

Labels: ,

ON BLINDNESS


Total people in India : 110 Crores
Daily average death count : 62389
Daily average birth count : 86853
Total Blind in India : 682497
If each dying person donate his/her eyes, within 10 days, India achieves the distinction - No blind person in the country
.

(An email forward)
___________________

Labels: