My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, June 07, 2008

ప్రేమే జీవనాధారం

'నేనెందుకు ఇంకా బతికున్నాను?' అనే శీర్షికతో సుదీర్ఘ కవిత రాసి పత్రికకు పంపించాడొక వర్ధమాన కవి. వెంటనే సంపాదకుల నుంచి ఒక ఉత్తరం వచ్చింది. 'మీరు స్వయంగా తీసుకురాకుండా, దీన్ని పోస్టులో పంపించి జాగ్రత్తపడ్డారు కాబట్టి' అని ఆ లేఖ సారాంశం.

మరీ ఆ కవిగారిలా కాకపోయినా, మనలో చాలామందికి 'ఎందుకు బతకాలి?' అనే ప్రశ్న జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. మహాత్మాగాంధీని సైతం అలాంటి భావన వెంటాడింది. 'నాలో హాస్యచతురతకు చెందిన కుతూహలం లేకుంటే, ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాణ్ని!' అన్నారాయన. అర్ధాంతరంగా తనువు చాలించాలనే ఆలోచన మనిషికి ఎందుకు కలుగుతుంది? బాధలు, కష్టాలు, దుఃఖాలు, అపజయాలు, ఎదురుదెబ్బలు, అవమానాలు, వ్యసనాలు... ఇలా ఎన్నో కారణాలు. అవి మనిషిని తీవ్రంగా పీడించవచ్చు. ఆ సమయంలో ప్రేమ అనేది ఒక్కటీ మనిషికి ఆలంబనగా నిలిస్తే- మనిషి ఆ పెను నిరాశలోంచి తేలిగ్గా బయటపడతాడు. కనుక ఆత్మహత్మకు ప్రధాన కారణం- ప్రేమ రాహిత్యమని చెప్పుకోవాలి. ప్రపంచంలోని ఏ రంగానికి చెందిన గొప్ప విజేత నేపథ్యాన్ని పరిశీలించినా ఒక వాస్తవం బయటపడుతుంది. తల్లిదండ్రుల నుంచి, బంధుమిత్రులనుంచి, జీవిత భాగస్వాముల నుంచి, కన్నబిడ్డల నుంచి వారికి ప్రేమ లభిస్తూ ఉండి ఉంటుంది. కనీసం తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి విజేత కాలేడు. ఆల్‌ఫ్రెడ్‌ నోబుల్‌, ఆయన స్నేహితురాలు బెర్తా ఒకరినొకరు పెళ్లి చేసుకోలేకపోయారు. అయినా ఆమె ప్రేమ నోబుల్‌కు గొప్ప ప్రేరణగా నిలిచింది. డైనమైట్‌ కనుగొనడంలో, లోకకల్యాణానికి వినియోగపడేలా దాన్ని రూపకల్పన చేయడంలో బెర్తా ప్రేమ ఆయన కృషికి జీవధాతువుగా మారింది. డైనమైట్‌ కనుగొనడంవల్ల లభించిన అపార సంపదతో ప్రతిష్ఠాత్మక నోబుల్‌ బహుమతిని వ్యవస్థీకరించడంలో సైతం ఆమె ప్రేమ స్ఫూర్తినిచ్చింది.

చేదు, వగరు, తీపి, పులుపు, కారం... అన్నీ కలిస్తేనే జీవితం. జీవితమంటేనే శిశిరం నుంచి వసంతానికి ప్రయాణం. ఇది ఒక చక్రభ్రమణం. దీనిలో శిశిరం శాశ్వతం అనుకోవడం నిరాశ. వసంతం శాశ్వతం కావాలనడం దురాశ. రెండింటికీ నడుమ గల ఆశను మనిషి ఆశ్రయించాలి. ''...ఆశవలయు... కూడదత్యాశ మాత్రమే...'' అన్నారు నార్ల. నూరేళ్లూ పూర్తిగా సుఖంగా గడిచినవాడు ఎవడూ లేడు. నూరేళ్లూ కేవలం దుఃఖంలోనే మునిగీ ఉండడు. కాకపోతే కష్టసుఖాల చక్రభ్రమణంలో జీవితమనే ఇరుసుకు ప్రేమ అనేది కందెనగా లభిస్తే- ఆ మనిషి అదృష్టవంతుడవుతాడు. ప్రేమనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ఇవ్వలేనివాడికి అడిగే హక్కు ఉండదు. కనుక మనిషి స్వతహాగా ప్రేమించగల స్వభావం అలవరచుకోవాలి. అప్పుడు ప్రేమ తనను వరిస్తుంది. '...సముద్రాలు దాటాడట 'కాళ్లు' తడవకుండా... జీవితాన్ని దాటలేడు 'కళ్లు' తడవకుండా...' అని, మనిషి దుస్థితికి వాపోయాడు ఒక నవీన కవి. సంక్లిష్ట భరితంగా మారిపోతున్న ఆధునిక జీవనసరళిలో మనిషి తరచూ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతున్నాడు. పదిమందిలోనే ఉంటూ- ఒంటరిగా మిగిలిపోవడమే ఈనాటి మనిషి దుస్థితికి కారణం. అనుబంధాలు, ఆత్మీయతలు ఎండిపోతున్నాయి. మనసును శూన్యత ఆవరిస్తోంది. 'తడి' ఆవిరవుతున్నది. ఇలాంటి స్థితిలో మనిషి తిరిగి తనలో ప్రేమను కనుగొని తీరాలి. ఆశను పెంచుకోవాలి. 'ప్రే'లో ప్రార్థన దాగిఉంది, 'మ'లో మమకారం ఉంది అన్నాడొక ఆధునిక కవి. ప్రేమ మనిషిని బతికిస్తుంది, నిలబెడుతుంది. 'కెరటం నాకు ఆదర్శం... లేచి పడినందుకు కాదు- పడినా... లేచినందుకు...' అన్న కవి వాక్కును మనిషి ఆలంబనగా తీసుకోవాలి. ఓదార్పు పొందాలి.

రకరకాల కారణాలవల్ల ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో అలాంటి అభాగ్యుల సంఖ్య దేశంలోకెల్లా అధికంగా ఉండటం- సామాజిక శాస్త్రజ్ఞులను కలవరపరుస్తోంది. 2006 సంవత్సరంలోని మొత్తం సంఘటనల్లో- 38.6శాతం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లోనే నమోదయ్యాయి. విరివిగా ఆత్మహత్యలు వెలుగులోకి వచ్చిన నగరాల జాబితాలో చెన్నై అగ్రస్థానంలో ఉంది. ప్రేమలో అపజయం, చదువులో వెనకబడటం, పెద్దవారి అంచనాలకు తగినట్లు రాణించలేకపోవడం, ఆత్మన్యూనతభావంతో కుంగిపోవడం, తల్లిదండ్రులు విడిపోవడం, ఎడబాటువల్ల ఒంటరి జీవితం, తీవ్రమైన ఒత్తిళ్లు, ఇంట్లో నిత్యం ఘర్షణలు.. వంటి కారణాలు ఆత్మహత్యలకు నేపథ్యంగా నిలుస్తున్నాయి. బతికియున్నచో సుఖములు బడయవచ్చు... జీవన్‌ భద్రాణి పశ్యతి... అని మన పెద్దలు నూరిపోసిన ఓదార్పుహితవచనాలు, తాయెత్తులుగా అనిపించే ధైర్యోక్తులు వారిని చేరనేలేదన్నమాట. తల్లిదండ్రులు క్రికెట్‌ ఆడొద్దన్నారన్న కోపంతో కేరళలోని కొచ్చిలో ఎనిమిదేళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనిషికీ మనిషికీ మధ్య ఉండవలసిన మమతానురాగాలు, బాంధవ్యాలు, స్నేహాలు ఎంతటి కనీసస్థాయికి పడిపోయాయో అటువంటి దుస్సంఘటనలు వివరిస్తున్నాయి. 'జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే చిక్కులే- మెదడుకు బలాన్నిచ్చే టానిక్కులు' అన్నాడు పి.జి.ఓడ్‌హౌస్‌. కష్టాలే మనిషిని మరింత బలోపేతుణ్ని చేస్తాయి. నిరాశచెందే సందర్భాల్లో మనిషి తప్పక గుర్తుచేసుకోవలసిన మరో మంచిమాట చెప్పాడొక ఆంగ్ల రచయిత. 'మనిషి జీవితంలో సర్వస్వాన్నీ కోల్పోయినా, ఒక్కటి మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది- అది భవిష్యత్తు' అన్నాడాయన. అవును- మనిషి బతకాలి, బతికించాలి. తనలో ప్రేమను ఇతరులకు పంచాలి. ఆటుపోట్లు ఎదురైతేనే బతుకు మరింత చేవ తేలుతుంది. సమస్యలను ఎదుర్కొని గెలిస్తేనే దాని సత్తా బోధపడుతుంది. ప్రేమను కనుగొనడం జీవితానికి ధన్యత కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రేమ ఒక్కటే మనిషికి దిక్కు. బయటనుంచి లోపలనుంచి ప్రేమ లభిస్తేనే మనిషి జన్మ సార్థకమవుతుంది!
(ఈనాడు, సంపాదకీయం, 23:03:2008)
______________________________

Labels:

VALUE EACH MOMENT

TOJY MANDAPAM


Everyone is familiar with the adage, "time and tide wait for no man". Our life is made up of a fraction of seconds, minutes, hours, days, weeks, months and years. We should utilise each fraction of our time well.

John Erskine, author, professor, and lecturer had said that he learned the most valuable lesson of his life when he was 14.

His piano teacher asked him for how long he had practised. The boy replied that he practiced for an hour or more.

"Don't do that," warned the teacher. "When you grow up, time won't come in long stretches. Practise whenever you can — five or 10 minutes before school, after lunch, between chores. Spread the practice through the day, and music will become a part of your life."

Erskine stated that the observance of this advice enabled him to live a comparatively complete life as a creative writer, outside his regular duties as an instructor. He wrote most of Helen of Troy, his most famous work, while commuting to work.

Time management consultant Anotonio Herrera asked the participants in a seminar: "If we had to buy time, would there be any difference in how we would spend it? Would the days of our lives be used more wisely? What if you had to pay an advance of Rs. 1000 an hour for the time allotted to you? Would you waste it?" The answer should be obvious.

Time is precious. It is not to be wasted. Ruskin says, "Time is more precious than any other precious stone." A moment lost is lost forever. So value each moment, as this poem so beautifully communicates:

To realise the value of one year,
Ask a student who failed in his or her final exams
To realise the value of one month
Ask a mother who gave birth to a premature baby
To realise the value of one week
Ask an editor of a weekly magazine
To realise the value of one day
Ask a daily wage labourer who has six children to feed
To realise the value of one hour
Ask the lovers who are waiting to meet
To realise the value of one minute
Ask a person who missed his train
To realise the value of one second
Ask the person who survived an accident
To realise the value of one millisecond
Ask the person who won a silver medal in the Olympics.

(The Hindu, Young World, 05:01:2002)
___________________________________

Labels:

Aspiration

A father told his son, "You must read well. You must not waste your time. Time is very precious. A second which is passed, is passed for ever. It will not come again. Always set your targets high. Then only you will be successful. You will achieve your goals only when your target is more than your goal. For example, one who just wants to get 40 per cent and pass the exam must work to get 60 per cent. Then only he will pass the exam. You must get a distinction. In maths you must get at least 90 per cent. For which you must aim at getting cent per cent. Ok? "

Few days later

"Dad! I want a car," the son asked his father.

"Car!" exclaimed the father. He continued, "Why do you need a car? Are you an officer? You are still a student. When I was your age, I had only a cycle. I have the car now after having seen so much of life. A motor bike is sufficient for you, at this age. We will buy a motorbike. All right?"

"Dad! This is exactly what I actually wanted," said the son with joy.

You will achieve your goals only when your target is more than your goal.

(SNEHA RAPUR,
X, St. Gabriel's High School, Warangal.
R.K. PRASANNA, X, The Boys H.S.S., Tiruchi.)

(The Hindu, Young world, 08:12:2001)
______________________________________________

Labels:

Thursday, June 05, 2008

సరికొత్త ప్రేమగురువు

భారతీయ సంప్రదాయంలో దాంపత్యం ఒక పుణ్యక్రతువు. సంతానాన్ని పొందడంద్వారా ప్రజాతంతువు విచ్ఛిన్నం కాకుండా రక్షించడం దంపతీధర్మం. దానికోసం పురుషుడు తన బ్రహ్మచర్యాన్ని త్యాగం చేస్తాడు. తండ్రి గోత్రంతోపాటు, తన కన్యాసౌభాగ్యాన్ని స్త్రీ త్యాగం చేస్తుంది. ఉభయుల త్యాగభాగధేయమై- దాంపత్యం సిద్ధిస్తుంది. భార్య గర్భవతి కావడంతో పాణిగ్రహణ వ్రతం ఫలిస్తుంది. పాలకడలి మథనం కారణంగా- అమృతం ఆవిర్భవించినట్లే, దంపతుల మిథునం కారణంగా శిశూదయమై, స్త్రీకి స్తన్యం సముద్భవిస్తుంది. అమ్మాయి అమ్మగా మారే ఈ క్రమ పరిణామంలో ఆమెలో ఒకానొక వినూత్న చైతన్యం మోసులెత్తుతుంది. లోకోత్తర మాధుర్యం- ఆమెకు అనుభూతం అవుతుంది. ఆ ఆస్వాదనే ఆమెకు 'అమ్మదనాన్ని' ప్రసాదిస్తుంది. ఈ లోకంలో అమ్మదనంకన్నా గొప్పది ఏమీలేదు. 'స్త్రీకి గౌరవవాచకం ఇల్లాలైతే, ఇల్లాలికి గౌరవవాచకం తల్లి' అనడంలో రహస్యం ఇదే! స్త్రీ పురుషుల మధ్య సృష్టి సహజమైన ఈ దాంపత్య ధర్మాన్ని 'ప్రాజాపత్యయజ్ఞం'గా వేదం వర్ణించింది. 'దాంపత్యం సత్సంతానం కోసమే' అని స్పష్టంచేసింది. సంతానావశ్యకతను భారతంలో పాండురాజు కుంతీదేవికి వివరించాడు. జరత్కారువు కథా దాన్నే నిరూపించింది. పురాణాల్లో చాలాచోట్ల ఇది ప్రస్తావనకు వచ్చింది. పెళ్ళి కాగానే 'సంతాన ప్రాప్తిరస్తు', 'పుత్రపౌత్రాభివృద్ధిరస్తు' అని దంపతులను దీవించడాన్ని పెద్దలు ఒక సంప్రదాయంగా అలవరచారు.

దాంపత్య జీవన మాధుర్యానికి శృంగారం అద్భుతమైన ఆలంబన. శృంగారానికి కామం ప్రధాన ప్రేరణ. కామాన్ని భగవద్విభూతిగా వర్ణించింది గీత. సృష్టిలో కామానికి అధిదేవత మన్మథుడు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు అంతటివాడు సరస్వతిని చేపట్టడంలో మదనుడి ప్రమేయం ఉందని మత్స్య పురాణం వివరించింది. పార్వతీపరమేశ్వరులకు వివాహం జరగాలని దేవతలు సంకల్పించి, సహాయం అర్థించింది- మన్మథుణ్నే! శకుంతలా దుష్యంతుల వివాహానికి కారణమైనవాడు మన్మథుడు. సుగాత్రీ శాలీనుల కాపురం నిలబెట్టినవాడు మన్మథుడు. ప్రవరాఖ్యుడు తిరస్కరిస్తే వరూధిని ఎంతగా మదనతాపానికి గురైందో పెద్దన రమణీయంగా వర్ణించాడు. చివరికి మాయాప్రవరుడు కంటపడేసరికి ఒక్కసారిగా అతణ్ని చేరి- ...పంచశరు బారికి చిక్కితి... నీకు దక్కితిన్‌... దయతో ఏలుకొమ్మని కన్నీళ్ళతో ప్రార్థించింది. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు బాణాలు కలవాడు కనుక మన్మథుణ్ని పంచశరుడు అంటారు. ఆ అయిదింటిలో ఏది తగిలినా మనసులో తక్షణం వలపు పుట్టుకొస్తుంది. మన్మథుడి ప్రభావానికి లోనైన స్త్రీపురుషుల దేహభాష మారిపోతుంది. కూకుండ నీదురా... కూసింత సేపు... అన్నట్లుగా సతమతమైపోతుంది. శరీరంలోకి యౌవనం ప్రవేశించినంత రహస్యంగా, నిశ్శబ్దంగా వలపు మనసులోకి ప్రసరిస్తుంది. అందువల్లే మన్మథుడు ఈ లోకానికి వలపుగురువు.

పెళ్ళిచూపుల్లో ఒకరినొకరు చూసుకోగానే, ఒక మధురక్షణంలో మనసులో ఏమూలో 'నా జీవిత భాగస్వామి' అని నిర్ధారించే- ఒకానొక పరమ నాజూకు స్పందన కలగడం తీపి అనుభవం. జీవిత పర్యంతం తలచుకున్నప్పుడల్లా శరీరంపై పులకలు రేపే మంచి జ్ఞాపకం. మన్మథుడి ప్రమేయంతో- పరస్పర ఆకర్షణకు లోనైన యువతీయువకులు తమలో ఏదో వింత రసాయన చర్య ప్రారంభమైందని గ్రహించే లోపున, అది వలపుగా పర్యవసించి, అర్థంకాని తహతహ పుట్టించడం- మధురాతిమధురమైన అనుభూతి. అలా అత్యంత సహజంగా, ప్రకృతిసిద్ధంగా- పురుషుణ్ని చూడగానే స్త్రీ పమిట సవరించుకున్నంత అలవోకగా జనించవలసిన వలపును 'సిజేరియన్‌' ద్వారా పుట్టించాలనుకోవడం పెద్దవింత. ఏ వేకువజామునో నిశ్శబ్దంగా సుతారంగా విచ్చుకునే కోమలమైన గులాబిరేకులను చేత్తో మొరటుగా వికసింపజేసే కార్యక్రమానికి- సింగపూర్‌ ప్రభుత్వం సమకట్టింది. సృష్టికార్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. మన్మథుణ్ని తోసిరాజని, తానే 'ప్రేమగురువు'గా అవతరించింది. వెనకటికి ఒక వ్యవసాయ అధికారిని ప్రశ్నలు జవాబులు శీర్షికకు పిలిచారు. 'నా మొగుడు నన్నేలుకోవాలంటే ఏం చెయ్యాల'న్న ప్రశ్నకు- వలపు రెండు పాళ్ళు, వయాగ్రా రెండు పాళ్ళు బాగా కలియబెట్టి, భర్త మనసులోకి పిచికారీ చెయ్యమన్నాడాయన. సింగపూర్‌ ప్రభుత్వం ఆ తీరుగానే వ్యవహరిస్తోంది. అరటిగెలలను కావవేసి బలవంతంగా ముగ్గబెట్టినట్లు- సంతానం కనమని బలవంతం చేస్తోంది. మన్మథ ప్రభావం బాగా క్షీణించిందో ఏమోగాని, ఆ దేశంలో యువత పెళ్ళిళ్ళ జోలికి పోవడం లేదు. జనాభా వృద్ధి గణనీయంగా పడిపోయి, పిల్లల్ని కన్నవారికి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందించే స్థితి ఏర్పడింది. పాఠ్యాంశాల్లోకి వలపుగీతాలు, కామ ప్రవచనాలు చొరబడ్డాయి. శివధనుర్భంగంవేళ రాముడి చూపునకు తాళలేక సీత కనురెప్పలు వాల్చింది- అన్నారు విశ్వనాథ. 'అలావద్దు' అంటున్నారు సింగపూర్‌ ఉపాధ్యాయులు. ''అయిదు సెకండ్ల పాటు మగవాడు మీకళ్ళలోకి సూటిగా చూశాడంటే- మీ పట్ల ఆకర్షణ కలిగిందని అర్థం. మీరు కూడా రెప్పవాల్చకుండా చూడండి. దాన్ని ఒక అవకాశంగా అర్థం చేసుకోండి''- అవీ ఇప్పుడక్కడి పాఠాలు. హతోస్మి!
(ఈనాడు, సంపాదకీయం, 30:03:2008)
______________________________

Labels:

MOB RULE


VISHWARUPA BHATTACHARYA

There seems to be no end to the spate of spine chilling incidents of mob violence. The alarming regularity at which such incidents are taking place leaves no doubt in the minds of the people that our country is on the verge of civil unrest. All in the name of democratic dissent, getting quick justice and a perceptible pessimism about bringing the offenders to book, people resort to vandalism, physical thrashing, killing and lynching every now and then.

Diffusion of responsibility

One school of thought believes that the system of governance is accountable for such pessimism which fuels public anger when their valid grievances are not addressed. However, incidents of mob violence are not always in pursuit of instant justice but often are opportunities to settle scores between individuals or groups.

Resorting to violence has become the easiest way for a mob to settle a matter in their own favour as anonymity of becoming a part of the mob in such violence leads to a diffusion of responsibility for their actions and it makes it easier for them to get away with their own crime of meting out punishment to a culprit.

It has also been observed that people bay for the blood of a potentially weak opponent and become defenceless when faced with a stronger one. How else can it be explained that on the one hand petty offenders (like the chain snatcher in Bhagalpur) are mercilessly beaten up by a mob or a seemingly helpless crowd silently watches as women are paraded naked for offences as ridiculous as witchcraft, while on the other there are not even protests against offences committed by the rich and the powerful like the BMW case or the kidney scam case.

Such macabre incidents are so common these days that often they don’t even draw attention of the people or the media. As happened with the terrible incident in which a mob of around 60 people (locals) decoupled the bogie of a train in which a group of Delhi University students were travelling and tried to set it afire when students tried to resist eve-teasing.

People gloat with a sense of heroism when they take law into their hands. Even a person remotely related/affected by a crime would not mind being part of the mob and thrashing the so-called culprit without even having any inkling about the issue.

Besides, in most cases of mob violence/justice one finds enough display of opportunistic debauchery. Why is it that more often than not in such cases mob resorts to disrobing a person as a way of punishment?

Patronage

What is more appalling is that in many such cases the offenders get patronage from various quarters which safely bails them out from punitive action. The so-called patrons stand by the mob in furthering their own cause. Indeed, without such patronage, it is difficult to imagine how culprits of such incidents, despite widespread condemnation and media coverage, go scot-free.

In this context it is apt to quote Prof. Dipankar Gupta: “When a riot happens it is because the killers know that no harm is going to come to them. If they had the slightest fear that they might not come home, that they might be jailed, even killed, they would never have ventured out.” The same logic stands amply proved in all cases of mob violence.

Some hold the view that these incidents have always been occurring in our society but now they appear to be on the rise only because of widespread coverage by the electronic media which was not so much earlier. However, this gives little reason for consolation. There is no denying that incidents of mob violence in our society are rampant and something urgently needs to be done before there is utter jungle raj in society.

(The Hindu, Open page, 01:06:2008)
______________________________

Labels:

The bookaholic blogger

BETWEEN THE COVERS
Social networking or book blogs? Read on to catch the action. PRADEEP SEBSTIAN

2008052213dd1r8kg402.jpg

“The Bookaholic Blogger’or“Bookish Blogs” or“The Literary Blogsphere”Facebook or book blogs? Take your pick. For me, it’s no contest: the bookish blog goes where Facebook dares not. The literary blogsphere is made up of blogs by writers (where an author such as Jeanette Winterson will confess to throwing rubber paperweights at her cats when stuck for a word) literary magazines, publishers, and reader’s blogs (where all the interactive action happens). The reader’s blog (that is, a blog by you or me) seems to me a more public version of the marginalia we make in books – scribbles on the side of the page about what we feel.

That’s where the true action is: a community of readers blogging about what they’re reading that week. Did I just write reading? Change that to reviewing. It’s changed the insular world of book reviewing. The reader’s blog now decides what’s worth reading. Since the blogger doesn’t have to go through editors or publishers, a wide range of books are discussed. It also means there’s no quality control on the writing, and there’s no guarantee that a book a blogger recommends is worth your trouble. But, as most blog readers will tell you, many a time blogs by general readers and journalists seem more interesting than those by professional critics and writers. There are now hundreds of book blogs now, constantly shifting shape. To help us navigate the literary blogsphere comes a timely book, “The Bookaholics Guide to Book Blogs” by Rebecca Gillieron and Catheryn Kilgarriff. The book is a fine attempt at, shall I say, blogroll? A handy overview of the best blogs out there. It disappoints us by not mentioning book blogs from India.

I’d like to mention a few noteworthy Indian bloggers. The writer Amitava Kumar’s literary blog, for instance, is consistently interesting for the way it blends culture, politics and art with literature. The layout is easy on the eyes and the accompanying images are always striking. The other notable Indian blogs I’d include are: Kitabkhana, Sepia Mutiny, Amardeep Singh, India Uncut, and Indian Writing. There are several more, but I’ll let you discover them on your own. Part of the great fun of reading blogs is how one blog opens out to another. The U.K. and U.S. blogs/weblogs/literary forums are more comprehensively represented in the Guide, staring with the best-known ones (Maud Newton, Booklust, Bookslut, Bookninja, Literary Saloon, Salon, Jeanette Winterson, Toby Litt, Galley Cat) and moving on to more obscure but noteworthy blogs. The Guide quotes chunks of blog text to showcase the style and concerns of a particular blogger. It shows you how, even though there are myriad blogs competing for your attention, you can use the book to locate the exact blog(s) that will appeal to you. The best bloggers, according to the editors, “are the ones who have no motive other than to share their love of books with other readers”.

(The Hindu, Nxg, 22:05:2008)

_____________________________

Labels:

నాన్నకు వందనం!

- డాక్టర్‌ ఎమ్‌.సుగుణరావు
ఒక వూళ్ళో ఒక పండితుడు ఉండేవాడు. సకల శాస్త్రాలు ఔపోసన పట్టి బాగా పేరు గడించాడు. అతని కొడుకూ తన పాండిత్య ప్రతిభతో అనేక సన్మానాలూ, బహుమానాలూ పొందుతూ తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. తండ్రి మాత్రం పెదవివిప్పి ఏ మెచ్చుకోలు మాట మాట్లాడేవాడు కాదు. పైగా కొడుకు పాండిత్యంపై విమర్శలు చేసేవాడు. కొడుక్కి విపరీత ద్వేషం కలిగి తండ్రిని చంపేయాలనుకున్నాడు. ఒకరోజు తమ ఇంటి అటకపైనున్న తిరగలిని తండ్రి తలమీదకు విసురుదామని అతడి ప్రయత్నం. ఆ సమయంలో తండ్రి భోజనానికి కూర్చున్నాడు. తల్లి భోజనం వడ్డిస్తోంది. తల్లిదండ్రుల మాటలు అతడికి వినిపించాయి. 'పాపం, మన అబ్బాయి మీ ప్రవర్తనకు కుమిలిపోతున్నాడు, ఎంతో ప్రతిభతో వెలుగుతున్న అతడిని మీరు అభినందించడం లేదు ఎందుకని?' అంది తల్లి. ఆ మాటలకు తండ్రి నవ్వుతూ 'తల్లితండ్రులు పొగిడితే బిడ్డలకు ఆయుఃక్షీణం. మనం పొగిడితే వారిలో గర్వం తలెత్తుతుంది. అందుకే మనసులోనే వాడి ప్రతిభకు ఆనందపడుతున్నాను. పుత్రోత్సాహాన్ని లోలోపలే దాచుకుంటున్నాను' అన్నాడు. తండ్రి మాటలు విన్న ఆ కొడుకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. అటక దిగి తనను క్షమించవద్దనీ, ఏదైనా శిక్ష విధించమని ప్రాథేయపడుతూ తండ్రి కాళ్లు పట్టుకున్నాడు. ఆ యువకుడే 'తొందరపాటు నిర్ణయం వినాశానికి హేతువు' అనే అర్థం వచ్చే ఒక అద్భుతమైన శ్లోకాన్ని రచించిన మహాకవి భారవి.

తండ్రి మాటకోసం సింహాసనాన్ని తృణీకరించి అడవిమార్గం పట్టిన శ్రీరాముడు, తండ్రికోసం జీవితాంతం బ్రహ్మచారిగా గడిపిన భీష్ముడు, తన తండ్రి యయాతికోసం తన యవ్వనాన్ని ధారపోసి వృద్ధాప్యాన్ని స్వీకరించిన పురూరవుడు... ఇలా ఎందరో మహానుభావులు- తమ తండ్రుల ఆజ్ఞానుసారం జీవించి మహాత్ములుగా చరిత్రలో నిలిచిపోయారు.

- ఇవన్నీ పురాణకాలం నాటి సంగతులు. నేటి పరమాణు యుగంలో నాన్నల పరిస్థితి ఏమిటి? రెక్కలు, ముక్కలు చేసుకుని బిడ్డల ఉన్నతి కోసం జీవితపర్యంతం తుదిశ్వాస వరకూ జీవించే తండ్రులకు మిగులుతున్నదేమిటి? జీవఫలం చేదువిషం. తమను పున్నామనరకంనుంచి తప్పిస్తాడని భావించే తండ్రులకు జీవించి ఉండగానే నరకం చూపించే కొడుకుల సంగతులు మనకు తెలుసు. తండ్రులు భారం అవుతున్నారని వారిని వృద్ధాశ్రమాలకు తరలించే ప్రబుద్ధులు మనకు సమాజంలో కనిపిస్తున్నారు.

పుత్రోత్సాహం తండ్రికి కొడుకు పుట్టిన వెంటనే రాదనీ, ఆ కొడుకు గుణగణాలు సమస్త జనులూ తెలుసుకొని పొగిడినప్పుడు మాత్రమేనన్న సుమతీ శతకకారుడి వాక్కులు అక్షరసత్యాలు.

తల్లిదండ్రుల మీద దయచూపని కొడుకు పుట్టినా చనిపోయినవానితో సమానమనీ, పుట్టలోని చెదలు పుట్టినట్టే పుట్టి ఎలా నాశనమవుతాయో, దయార్ద్ర హృదయం లేని కొడుక్కూ అదే గతి అనీ వేమన చేసిన నీతిప్రబోధం అన్ని కాలాల్లోనూ అందరూ గుర్తుంచుకోదగినది.

యజ్ఞాల్లో పితృయజ్ఞం అనుపమానమైనదంటారు వేదాంతులు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా గుర్తించి వారిని సేవించడమే ఈ యజ్ఞ భావనగా పండితులు పేర్కొన్నారు. పితృయజ్ఞానికి ఆద్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన తన మాతాపితలనే సర్వస్వంగా భావించి వారిచుట్టూ ప్రదక్షిణ చేశాడు. అది మొత్తం ప్రపంచాన్ని చుట్టివచ్చే యజ్ఞానికి సమానంగా ప్రసిద్ధికెక్కింది. తల్లిదండ్రులకు చేసే సేవ లేదా పితృయజ్ఞం వారికే కాదు ఈ ప్రపంచం మొత్తానికి చేసే సేవగా వినాయకుడు పితృయజ్ఞం ద్వారా లోకానికి చక్కటి నీతిని ప్రబోధించాడు.

యస్మా త్పార్థివ దేహః ప్రాదుర భూద్యేన భగవతా గురుణా!
నంతు నమాంసి సహస్రంతస్మై సర్వజ్ఞ మూర్తయేపిత్రే!

ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అటువంటి భగవత్‌ స్వరూపుడైన సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలకొలది నమస్కారాలు అని ఈ శ్లోకం అర్థం.
ఈ శ్లోకంలోని పరమార్థాన్ని గ్రహించి నాన్నలకు వందనం చేద్దాం. పితృయజ్ఞంలో భాగస్వాములమవుదాం.
(ఈనాడు, 04:06:2008)
______________________________

Labels:

Tuesday, June 03, 2008

మై ఫామిలీ


భార్య శాంతి, పిల్లలు శశాంక్‌, మేఘాంశ్‌లతో శ్రీహరి
(EEnadu,01:06:2008)
_________________________________

Labels: ,

పలుకు తేనెల తల్లీ


నిఘంటువుతో నిగారింపు
డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి
(రచయిత విజయనగరంలోని మహారాజ బోధనాభ్యసన కళాశాలలో యు.జి.సి. పరిశోధకులు)
___________________________________________________
లిపి, నాగరక వ్యవహారం, సాహిత్యం ఉన్న ప్రతి భాషకు నిఘంటువు అవసరం. ఈ స్థితిలో ఉన్న ప్రపంచ భాషలన్నింటికి నిఘంటువులున్నాయి. నిఘంటువు అనేది ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు, ఏదో ఒకవిధంగా రాసి పడేసే పుస్తకం కాదు. మారుతున్న కాలంలో ఎదురయ్యే అవసరాలన్నింటిని తీర్చడానికి ఎప్పటికప్పుడు ఎలా అవసరమైతే అలా, ఎవరికి వీలైతే వారు సమర్థతతో, విజ్ఞతతో నిఘంటు నిర్మాణం చేస్తూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో పుట్టి బాగా వ్యాప్తిలోకి వచ్చిన కొత్త పదాలను పదబంధాలను, భావనలను, వాడుకలను జత చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంగ్లిషు, నిఘంటువుల సరికొత్త ప్రచురణలు వెలువడుతూ ఉండటం మనకు తెలుసు. ఒక్క ఇంగ్లిషు అనే కాదు, ఏ భాషలోని నిఘంటువులైనా సమకాలీన భాషా సమాజపు అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని ధరించవలసి ఉంది.

కాలం ఆధునికతలోంచి ఉత్తరాధునికతలోకి ప్రవహిస్తోంది. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం దినదినానికి కొత్త ముఖాన్ని మార్చుకుంటోంది. కొత్త శాస్త్రాలు, భావనలు, పరిభాషలు, సంజ్ఞలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఏ భాషలో ఉంటే అది సంపన్న భాష అవుతోంది. కొత్త నీటికి చేపలు ఎగబాకినట్లు విద్యార్థులు, విద్వాంసులు ఆ భాషను నేర్చుకోవడానికి ఎగబడుతున్నారు. మామూలు జనమంతా ఆ భాషనే వేదంగా భావించి మిథ్యా ప్రతిష్ఠ కోసం వెంపర్లాడుతున్నారు. ఈ స్థితి మారాలంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మన భాషలో అందరకూ అందుబాటులోకి రావాలంటే ఆ శాస్త్రాలు, భావనలు, పరిభాషలు, సంజ్ఞలు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుకు సరికొత్త నిఘంటు నిర్మాణం అవసరం.

సంస్కృతంలోలాగే తెలుగులో కూడా పూర్వం పద్య నిఘంటువులుండేవి. వాటికి కాలదోషం పట్టి మూలనపడ్డాయి. కొంచెం అటూఇటూగా తెలుగులో ఆధునిక నిఘంటు నిర్మాణం ఆరంభమై రెండు శతాబ్దాలు కావస్తోంది. ఎన్నిరకాల ఆధునిక నిఘంటువులున్నాయో దాదాపుగా అన్నిరకాల నిఘంటువులూ తెలుగులో వచ్చాయి. తొలిదశలో తెలుగు నిఘంటు నిర్మాణానికి పూనుకొన్న పాశ్చాత్యులు నిఘంటువుల్లో సాహిత్య భాషతోపాటు సామాన్య ప్రజల వాడుక భాషకు కూడా స్థానం కల్పించారు. ఆ స్ఫూర్తి ఆనాటి నుంచి కొనసాగి ఉంటే, మన పండితులు అప్పటి నుంచి సాహిత్య భాషతోపాటు సామాన్య జనుల వాడుక భాషకు కూడా ప్రామాణ్యాన్ని కల్పించి నిఘంటువులకెక్కించి ఉంటే తెలుగు భాషలోని పదజాలం సురక్షితమై ఉండేది. మన పండితులు కావ్య ప్రయోగంలోని దేశ్య భాషను మాత్రమే నిఘంటువులకు ఎక్కించారు. ఆ కారణంగా మన భాషకెంతో నష్టం కలిగింది. అచ్చ తెనుగు నిఘంటువులు కృతక భాషకు ప్రామాణ్యాన్ని కల్పించాయి. సంప్రదాయ పండితులు కూర్చిన, సమకూరుస్తున్న నిఘంటువులు అసమగ్రమైనవని భావించి తెలుగు అకాడమీ వంటి సంస్థలు- కొన్ని దశాబ్దాల కిందటి నుంచి 'మాండలిక పదకోశాలు', 'వృత్తి పదకోశాలు' వంటి ప్రయోజనకరమైన కొత్త నిఘంటువులు నిర్మించడానికి పూనుకున్నాయి. ఆశయశుద్ధి ఉన్నంతగా ఆచరణ శుద్ధి లేని కారణంగా ఈ ప్రయత్నం ఇంకా పూర్తిగా ఫలవంతం కాలేదు. ఇంతకంటే దయనీయమైన స్థితి ఇంకొకటుంది. తెలుగువారికి ఇతర భాషా నిఘంటువులను ఉపయోగించడం తెలుసుకానీ తెలుగులో కొన్ని నిఘంటువులున్నాయని, వాటిని ఉపయోగించవలసిన అవసరం ఉందని వారు ఎన్నడూ అనుకోరు.

ప్రతిమాటకు ఒక చరిత్ర ఉంటుంది. ఆమాట పుట్టుపూర్వోత్తరాలు, స్వరూప స్వభావాలు, అర్థ పరిణామ దశలు, పతనం- ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే నిఘంటువు ఉండాలి. ఆధునిక నిఘంటు నిర్మాణంలో- పరిణత బుద్ధులైన విద్వాంసులు మాత్రమేకాక విద్యార్థులు, పల్లెలలో అడవులలో కొండలలో నివసించే ప్రజలు కూడా మాటా-మాటా కలిపి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమకాలీనంగా తామరతంపరగా వృద్ధి పొందుతున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ప్రధానంగా రెండు రకాలుగా ఉంది. వీళ్లు- వాళ్లు అనే తేడా లేకుండా దైనందిన వ్యవహారంలో ప్రజలకందరకు తప్పనిసరిగా అవసరమయే విజ్ఞానం ఒకటి. కళ, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక, వాణిజ్యాది రంగాలలో ప్రత్యేక శ్రద్ధతో నిష్ణాతులు కాగోరే వారికి ఉపయోగపడే విజ్ఞానం మరొకటి. అంటే, ఒకటి సర్వసామాన్యమైన విజ్ఞానం. రెండవది ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే విజ్ఞానం. ఈ రెండు రంగాలలోను ఇప్పుడు పెనుమార్పులు సంభవిస్తున్నాయి. వీటికి సంబంధించిన భావనలు, పరిభాషలు, సంజ్ఞలు కొత్తగా రూపొందించుకొనేటప్పుడు ఇందులో కొంత భాగమైనా అందరికీ అందుబాటులో ఉండే భాషలో ఉండాలి. అందరికీ ఉపయోగపడే నిఘంటవును తయారుచేసినపుడు పండితుడు తన అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వకూడదు, సామాన్య విద్యార్హతగల వారి అవగాహన స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిభాష తత్సమ పదమా, దేశ్యపదమా అనే కాక సరళంగా, సుభోదకంగా ఉందా, లేదా అని ఆలోచించాలి. నూతన పరిభాషా కల్పనలో ఇంకొక అతివాదం కూడా ఉంది. ఆంగ్ల పరిభాషను యథాతథంగా ఉపయోగించడమే సరియైనదని, ప్రతి పదాన్ని తెలుగులోకి మార్చుకోవడం చాదస్తమని ఆ అతివాదులంటారు. ఏ సంజ్ఞలను, పరిభాషలను, మూలభాష నుంచి యథాతథంగా గ్రహించాలి? ఏవి అనువదించుకోవాలి? వేటికి కొత్తపదాలు సృష్టించుకోవాలి? అనే విచక్షణతో నిఘంటు నిర్మాణం చేయాలి కానీ ''తాఁబట్టిన కుందేటికి మూడే కాళ్లు'' అనే పిడివాదం ఇక్కడ పొసగదు. ఒక పండితుణ్ణి 'ఫ్త్లె ఓవర్‌' అన్న మాటను తెలుగులోకి మార్చమంటే, ''గగనపథం'' అంటాడు. అదే ఒక గ్రామీణుడ్ని అడిగితే ''పైదారి'' అంటాడు. ఇందులో ఏది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందో నిఘంటుకారుడు నిర్ణయించుకోవాలి. నిఘంటు నిర్మాణానికి ఒక పండిత వ్యవస్థతో పాటు ఒక గ్రామీణ వ్యవస్థ కూడా అవసరం. గ్రామీణుల నుంచి సేకరించిన పదజాలాన్ని క్రమబద్ధం చేసి పండితులు నిఘంటు నిర్మాణం చేయాలి. ఇది ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. ప్రయోజనం లక్ష్యంగా సాగే యజ్ఞం. అధునాతనమైన ఒక నిఘంటువు అవసరాన్ని గుర్తించి ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తులు ఎవరికివారుగా నడుం కడుతున్న సమయమిది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సి.ఎస్‌.టి.టి. (కమీషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నలాజికల్‌ టెర్మినాలజీ) అన్న సంస్థ ఇప్పటికే వివిధ శాస్త్రాలకు సంబంధించి కొన్ని లక్షల పరిభాషలను సృష్టించింది. ఏ విషయానికైనా జాతీయస్థాయిలో ఒకే పరిభాష వాడుకలోకి రావాలనే లక్ష్యంతో ఈ సంస్థ కృషి చేస్తోంది. నిఘంటువులపై హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక జాతీయ సదస్సును నిర్వహించింది. ఆధునిక అవసరాలను తీర్చే సమగ్రం, అధునాతనం అయిన తెలుగు నిఘంటు నిర్మాణం కోసం వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యుల నుంచి పరిశోధన పత్రాలను సేకరించి ప్రకటించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భాషాభివృద్ధి పీఠం వారు ఒక జాతీయ సదస్సును నిర్వహించి, దేశంలోని విద్వాంసులను ఆహ్వానించి వివిధ విషయాలకు సంబంధించిన నిఘంటు నిర్మాణంలో ఎన్నో అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ఓ ముఖ్య విషయాన్ని గమనించాలి. జాతీయస్థాయిలో ఒకరు, ప్రాంతీయస్థాయిలో ఒకరు ఒకే అంశానికి రెండు పరిభాషలను కల్పించడం వల్ల వ్యవహారంలో క్లేశం ఏర్పడుతుంది. ఆ క్లేశాన్ని నివారించడానికి నిఘంటు నిర్మాతల మధ్య ఒక అవగాహన, ఒక సమన్వయ ధోరణి ఉండాలి.

అధునాతన అవసరాలను తీర్చేందుకు కొత్త నిఘంటువును తయారుచేయాలనుకొనే వారు సోదర భాషల పట్ల దృష్టి మళ్లించాలి. తమిళులు ఆధునిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఏ భాషలో ఏ కొత్త పరిభాష వచ్చినా వెనువెంటనే దానికొక తమిళ పదాన్ని సృష్టిస్తారు. ఎక్కువ సందర్భాలలో అది అనువాదం కాక కొత్తగా సృష్టించిన పదమై ఉంటుంది. కాఫీ, టీ వంటి పదాలకు కూడా తమిళ పదాన్ని సృష్టించడం అతివాదమని, ఆ చాదస్తాన్ని మనం తలకు రుద్దుకోకూడదని కొందరు భావిస్తున్నారు. అందువల్ల మనం వెనుకపడతామని వారి విశ్వాసం. కానీ అది సరికాదు. చైనాలో రోదసీ విజ్ఞానానికి అధినేతగా పనిచేస్తున్న ఆచార్యురుడికి ఇంగ్లిషు రానేరాదని, ఆ విజ్ఞానాన్నంతటినీ అతడు మాతృభాష నుంచే అధ్యయనం చేశారని ఒక ఆచార్యుడు చెప్పగా విన్నాను. ఆ దృష్టితో చూసినప్పుడు సాధ్యమైనంత వరకు మనం తెలుగులో కొత్త పరిభాషలను కల్పించుకోవడమే మంచిదని విజ్ఞులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైతే మనం తమిళులను మార్గదర్శకులుగా గ్రహించాలి. తెలుగులో మనం కొన్ని పరిభాషలను సృష్టించుకోవడం సాధ్యం కాకపోయినట్లయితే వాటిని మనం మన సోదరభాషలైన తమిళ, కన్నడ, మళయాళల భాషల నుంచి అరువు తెచ్చుకోవడానికి వెనుకాడకూడదు. అవి మన భాషా కుటుంబానికి చెందినవి, క్రమంగా ఆ పరిభాషలు మనభాషలో కలిసిపోయి ఒక సహజ సౌందర్యాన్నీ, సామరస్యాన్నీ సాధిస్తాయి. అధునాతన నిఘంటువు- విద్యా, వైజ్ఞానికాది ఇతర రంగాల వారి కంటే పత్రికల వారికి, దృశ్యమాధ్యమానికి ఎంతో అవసరం. అందుచేత అధునాతన నిఘంటు నిర్మాణానికి వారు సంఘటిత కృషి చేయాలి. ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేపట్టిన కార్యక్రమాలు నత్తనడక నడుస్తాయని, అవి పూర్తి కావడానికి ''ఏండ్లును పూండ్లును పట్టు''నని మన అనుభవంలో ఉన్న విషయం. కాబట్టి అధునాతన అవసరాలను తీర్చడానికి ఈ రంగంలో కర్తవ్యనిష్ఠ, బాధ్యత, క్రమశిక్షణ, అంగబలం, అర్థబలం - అన్నింటికీ మించి విచక్షణ జ్ఞానంగల ప్రభుత్వేతర సంస్థలు అకుంఠిత కృషి జరపవలసి ఉంది. తెలుగు భాషా సాహిత్యాలకు గౌరవాదరాలు తగ్గి అవి క్షీణదశలో ఉన్న ప్రస్తుత స్థితిలో మన తెలుగు భాషను ఇతర భాషా సమాజాలతో సమాన గౌరవంకలదానిగా చేయడానికి ఈ నిఘంటు నిర్మాణం ఎంతో అవసరం.
(ఈనాడు,07:04:2008)
---------------------------------------------------

Labels: ,

Monday, June 02, 2008

జీవన మకరందం


కొందరిని చూస్తుంటే- ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఆనందంగా కనిపిస్తారు. మరికొందరిని చూస్తే నిత్యం దుఃఖం ఓడుతూ ఉంటారు. 'నువ్వు ఆనందస్వరూపుడివి...' అంటుంది వేదాంతం. కాదు పొమ్మంటుంది- వాస్తవ జీవితం! ఈ వ్యత్యాసానికి మూలాలు కనుగొనాలని మనిషి ఎంతోకాలంగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆనందంకోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. దాని నిజస్వరూపం బోధపడక, స్వేచ్ఛగా విలాసంగా గడపడమే- ఆనందం అని మనిషి పొరపడటం మనం ఈనాడు చూస్తున్నాం. సుఖమూ, సంతోషమూ, ఆనందమూ అనేవి నిజానికి వేరువేరు. ఈ మూడూ ఒకటేనని మనిషి పొరపడుతుంటాడు. సుఖం అనేది ఇంద్రియ, లేదా శారీరక సంతృప్తిని వ్యక్తం చేసే పదం. ఎండలో తిరిగినవాడు చల్లని నీడలోకి రాగానే శరీరానికి సుఖంగా అనిపిస్తుంది. సంతోషమనేది మనసుకు కలిగేది. మంచి సమాచారం విన్నప్పుడో, ఏదైనా బాగా కలిసొచ్చినప్పుడో మనసు ఉత్తేజమవుతుంది. మనసుకు సంతోషం కలిగినప్పుడు శరీరం కూడా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటుంది. ఈ రెండింటికన్నా ఉన్నతమైనది, ఉదాత్తమైనది- ఆనందం. శారీరక మానసిక ఆధ్యాత్మిక కక్ష్యలు మూడింటికీ సంతృప్తిని కూర్చే ఒకానొక గొప్ప స్థితిపేరు ఆనందం. ఆత్మకు సంతృప్తిని కలిగించే పనులను చక్కబెట్టినవారికి- ఆనందమయ స్థితి వరంగా లభిస్తుంది. 'ఆత్మలోని అంతర్గత శక్తిమూలంగా ఆనందం ప్రభవిస్తుంది'- అన్నాడు మార్కస్‌ అరిలియస్‌. 'ఆనందం తన సహజసిద్ధమైన స్వభావమని మనిషి మరిచిపోవడమే జీవితంలో విషాదానికి కారణం' అన్నాడాయన. ఆనందాన్ని మనిషి స్వయంగా అనుభవించవలసి ఉండగా- 'దాన్ని ఇతరుల కళ్ళ ద్వారా చూడాలనుకోవడం అవివేకం' అన్నాడు షేక్‌స్పియర్‌. లోకంలో ఎక్కడ చూసినా ఈ రకమైన వివేక రాహిత్యమే ప్రస్తుతం రాజ్యమేలుతోంది.

ఇంద్రియ సుఖాలనే- ఆనందానుభూతులుగా మభ్యపెట్టాలని అల్లసాని పెద్దన్నగారి వరూధిని తీవ్రయత్నం చేసింది. శారీరకమైన సౌఖ్యాలకీ, ఆత్మగతమైన ఆనందానికీ వ్యత్యాసం బాగా తెలిసినవాడు కనుక ప్రవరుడు ఆమె కోరికను నిస్సంకోచంగా తిరస్కరించాడు. ఆత్మ సాంగత్యంతో ప్రమేయంలేని ఇంద్రియాలది ఆనందంకాదు- అర్థంలేని సుఖం! పట్టుతేనె రుచి తెలిసినవాడు శాక్రిన్‌ తీపికి మోజుపడడు. ఆనందం విలువ తెలిసినవాడు కేవల ఇంద్రియ సుఖాలకు వెంపర్లాడడు. ప్రవరుడి వైఖరిలోని ఈ కాఠిన్యాన్ని అర్థం చేసుకోవాలంటే- మహాత్మాగాంధీ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. 'ఆనందమనేది ఏమేమి పొందామన్నదానికన్నా- ఏమేమి వదులుకోగలిగామన్నదానిపై ఎక్కువగా ఆధారపడుతుంది' అన్నారాయన. ప్రవరుడు వదులుకున్నది సుఖం, పొందింది ఆనందం! మనం ఏవేవో ఖరీదైన వస్తువులు కొని తెచ్చి, ఇంటినిండా పేర్చి, వాటికి యజమానులం అయ్యామని సంతోషిస్తాంగాని, వాటికి బానిసలం అవుతున్నాం అనేదే- చేదునిజం. ఈ సత్యం బోధపడితే మనిషికి దుఃఖంనుంచి సంతోషం మీదుగా ఆనందంవైపు ప్రయాణం చెయ్యడం సులభమవుతుంది. జీవితం అనేది మనిషికి లభించిన బహుమతి, ఆనందమనేది సాధించవలసిన బహుమతి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు, హాస్యసన్నివేశాలు చూసి ఆనందంతో హాయిగా నవ్వుకునేవారి శరీరాల్లో 'ఇంటర్‌ ఫెరాన్‌గామా' అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. మనిషి అనారోగ్య లక్షణాలను దూరంచేసే రసాయనమది. మనిషి ఆనందమయస్థితిలో ఉన్నప్పుడు మానసిక, శారీరక సమతౌల్యం ఏర్పడుతున్న విషయమూ రుజువైంది.

మానవ జన్యువులపై పరిశోధన చేసినవారు- జన్యుపరంగా చూస్తే మానవుడి ఏకైక విధి సంతానోత్పత్తిగా తేల్చిచెప్పారు. సంతానోత్పత్తి వయసు దాటిపోగానే జన్యువులు బలహీనపడటం మొదలవుతుంది. క్రమంగా శరీరనిర్వహణ విధులు నిర్వహించే జన్యువులు నీరసపడతాయి. వ్యాధులు దేహాన్ని చుట్టుముడతాయి. ఒకరకంగా మనం చనిపోవడం లేదు- జన్యువుల చేతిలో హత్యకు గురవుతున్నాం.. అని న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మెడిసిన్‌ ప్రొఫెసర్‌ టామ్‌కిర్క్‌వుడ్‌ మూడేళ్ళక్రితమే ప్రకటించారు. అదే జన్యువుల పాత్రను మరో కొత్తకోణంలోంచి విశ్లేషిస్తూ- మనిషిలో ఆనందానికి కారణం జన్యువులేనని ఎడింబరో విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు కొత్తగా ప్రకటించారు. 'బాహ్యప్రపంచంలోని పరిస్థితుల కారణంగా మనిషి ఆనందంగా ఉంటాడని అందరం అనుకుంటాం. నిరంతరం ఆనందంగా ఉండటంలో జన్యువుల పాత్ర ఎంతో అధిక'మని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ విస్‌ అంటున్నారు. వాళ్ళ జీవితాల్లో కష్టాలు లేవనుకుంటే పొరపాటు అంటున్నారాయన. ఆనందమయ స్థితిని అందుకొన్న అదృష్టవంతుల జీవితాల్లోనూ కష్టాలుంటాయి, వేదన ఉండదు. వారి జీవితాల్లోనూ శ్రమ ఉంటుంది, అలసట ఉండదు. ఆటుపోట్లు ఉంటాయి, కుంగిపోవడం ఉండదు. చైతన్యగతమైన ఆనందం- మానవ శరీరానికి ఇచ్చే గొప్ప కానుక ఇది. మొత్తం 900 మందిని పరిశీలించగా ఈ తరహా వ్యక్తిత్వం కలిగిన అందరి శరీరాల్లోనూ ఒకే రకమైన జన్యునిర్మాణం ఉన్నట్లు డాక్టర్‌ అలెగ్జాండర్‌ గుర్తించారు. జన్యువుల ఏకైక విధి సంతానోత్పత్తి అయినప్పుడు- ఆనందన్నిచ్చే జన్యువులకు ఆ లక్షణం ఎక్కడినుంచి వచ్చింది? ఆ జన్యువుల పుట్టుకకు కారణమైన ఆనందమయస్థితిలోని మనిషినుంచి! ఆ మనిషి జీవలక్షణాలు జన్యువుల్లో నిక్షిప్తమైందన్న మాట. తియ్య మామిడి కావాలనుకుంటే- బంగినపల్లి టెంకలను నాటుకుంటేనే కదా సాధ్యమయ్యేది. వేపవిత్తులు నాటితే చెరకుగడలు మొలవవు. నిత్యం దుఃఖంలో నానుతూ ఉండే మనిషి ఆనందాన్ని పంచలేడు. నిరంతరం ఆనందంగా ఉన్నవాడు మాత్రమే చుట్టూ ఉండేవారికి, తరవాతి తరానికి సైతం తన జీవలక్షణమైన ఆనందాన్ని అందించగలడు. ఎవరైనా తమ దగ్గర ఉన్నదే ఇవ్వగలరు!
(ఈనాడు, సంపాదకీయం, 16:03:2008)
--------------------------------------------------

Labels:

KASH



Knowledge, Attitude, Skills and Habits (KASH, in HR parlance) are the pillars of employability.

While knowledge could be acquired through academic qualification, attitude is something that one develops right from school days. Participating in extra-curricular, co-curricular and sports events plays a great role in nurturing the ‘team person’ in an individual.

When we speak of skills, we mean self-reliance skills, general skills, people skills and specialised skills. Apart from these, enthusiasm, flexibility, reliability and willingness to learn further are vital.

Leadership is again, seen not just as something to do with leading a team. It has a lot to do with managing diversity, especially in todays context. And managing diversity is one of the greatest challenges for any leadership. Students should look at honing these traits in them while at college, so that they fit into the industry comfortably.

Health care, tourism, hospitality are some of the areas that are coming up in a big way. Several opportunities are available. Make yourselves ready for them.

Latha Rajan Director, Ma Foi Management Consultants
(The Hindu, Education plus Chennai, 02:06:2008)
----------------------------------------------------------------------------

Labels: