My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, April 21, 2009

The intelligent Engineer!!

A pastor, a doctor and an engineer wait for a particularly slow group of golfers. The engineer fumes, "What's with these guys? We've been waiting for 15 minutes!"

The pastor says, "Hey, here comes the groundskeeper. Let's have a word with him."

"Say, George, what's with that group ahead of us? They're rather slow, aren't they?" the doctor asks.

The groundskeeper tells them that the other golfers are a group of blind firefighters who lost their sight saving the clubhouse from a fire and that they come and play for free whenever they want.

The group is silent for a moment.

The pastor says, "That's so sad. I will say a special prayer for them tonight."

The doctor says, "Good idea. I'm going to contact my ophthalmologist buddy and see if there's anything he can do for them."

The engineer says, "Why can't these guys play at night?"

(an email forward)
_________

Labels:

Monday, April 20, 2009

తెలివైన మదుపునకు.. ఏడు సూత్రాలు


జయప్రకాశ్‌
(వ్యాసకర్త హైదరాబాద్‌లోని ఆర్‌ఎల్‌పీ సెక్యూరిటీస్‌లో డైరెక్టర్‌)

గత నెల రెండో వారం నుంచి స్టాక్‌ మార్కెట్లలో అనూహ్యంగా ర్యాలీ మొదలైంది. బహుశా దీన్ని ఎవరూ ఊహించి ఉండరు. దాదాపు 4 నెలల పాటు స్థిరీకరణ జరిగిన తరువాత మార్కెట్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. చూడబోతే ఇది సరికొత్త ర్యాలీ (2008 అక్టోబరు- 2013) మాదిరిగా కనిపిస్తోంది. కాకపోతే అక్కడక్కడా ఆగుతూ, దిద్దుబాటుకు లోనవుతూ సూచీలు మళ్లీ గరిష్ఠ స్థాయిలకు చేరడానికి కొన్నేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో మదుపుదార్లు కొన్ని ప్రాథమికాంశాలను గుర్తెరిగి ప్రవర్తించాలి. గతంలో చేసిన తప్పులను పునరావృత్తం చేయడం సరి కాదు.

మదుపుదార్లు మళ్లీ మళ్లీ మననం చేసుకోవలసిన సప్త సూత్రాలివి:


1. ఏదీ శాశ్వతం కాదు
ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఏదీ లేదు.. ప్రతిదీ మార్పులకు లోనవుతూ ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌కూ ఇది వర్తిస్తుంది. షేర్ల ధరలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. షేర్ల యజమానులు మారిపోతూ ఉంటారు. మదుపుదార్ల ప్రవర్తన కూడా ఒకే విధంగా ఉండదు. డబ్బు ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళ్లిపోతూ ఉంటుంది. అన్నీ అటూ ఇటూ కదులుతూ ఉంటాయి. మదుపుదారు ఈ సంగతిని కనిపెట్టి స్టాక్‌ మార్కెట్‌/షేర్‌ ధరల హెచ్చు తగ్గుల నుంచి లాభపడే ప్రయత్నం చేసినప్పుడు అదే వివేకం అనిపించుకొంటుంది.

2. ధర- విలువ
స్టాక్‌ మార్కెట్లో షేర్ల ధరలను నడిపించేది దానికి ఉన్న వాస్తవిక విలువ. దీనికి తోడు కంపెనీ ఆర్జనపై ఆధారపడి షేర్‌ ధర పెరుగుతుంది. మదుపుదారు దాని విలువను పసిగడితే ఆ విలువకు తగ్గట్లుగా ధర ఒక నిర్ణీత స్థాయికి వృద్ధి చెందుతుంది. మార్కెట్లో కనిపించేది షేర్‌ ధర అయితే, షేరు విలువను తెలుసుకొనేందుకు మాత్రం సంబంధిత కంపెనీ మూలాలను శోధించాల్సిందే. షేర్ల ధరలు పెరిగేది ముఖ్యంగా కంపెనీ ఆదాయాల మీద ఆధారపడేనన్న విషయాన్ని మరచిపోకూడదు.



3. గొప్ప వ్యాపారంపై మోజుపడండి..

మీకు అర్థమైన వ్యాపారం చేసే కంపెనీనే విశ్వసించండి. ఆ కంపెనీలో ఈ కింది లక్షణాల కోసం వెతకండి. అ) వృద్ధి అవకాశాలు; ఆ) తక్కువ రుణ భారంతో, పెట్టిన మూలధనం మీద ఆర్జన అధికంగా ఉండటం; ఇ) వాటాదార్ల విలువ స్థిరంగా పెరుగుతున్నదీ, లేనిదీ.

ఈ మూడిటికీ సమాధానం 'అవున'నిపిస్తే, ఆ కంపెనీని పెట్టుబడికి అర్హమైందిగా ఎంచుకోవచ్చు.

4. కొనే వేళ
దీనినే కదా గుర్తించాల్సింది. సరైన ధరలో షేర్లు కొనుగోలు చేయడంలో మదుపుదారు యుక్తి బయటపడుతుంది. ఒక షేరు, దాని వాస్తవిక ధరలో 50 డిస్కౌంట్‌లో లభిస్తున్నప్పుడు దానిని కొనాలి. ఆ తరువాత ఓపిగ్గా ఎదురుచూడటమే. షేరు వాస్తవిక ధర కన్నా 50 శాతం ప్రీమియం ధర లభించిన టైములో అమ్మివేయవచ్చు. రెండింతల లాభాన్ని జేబులో వేసుకోవచ్చు.

5. సంక్షోభం సరైన సమయం
మార్కెట్లో తీవ్ర సంక్షోభం చోటుచేసుకొన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో కొంతకు షేర్లు తెగనమ్మి బయటకు వెళ్లిపోదామనుకుంటారు. కానీ తెలివైన మదుపుదారు మేల్కొనాల్సింది ఆ సమయంలోనే. ధరల పతనం అయిపోయిందని గుర్తించి కొనుగోళ్లు మొదలుపెట్టాలి. ఎందుకంటే మార్కెట్లో 'డిస్కౌంట్‌ సేల్‌' ఉండేది అప్పుడే కాబట్టి.

6. ఆ రెండూ కీలక దశలు
స్టాక్‌ మార్కెట్‌ కనిష్ఠ, గరిష్ఠ స్థాయిలను ఆనవాలు పట్టడం మదుపుదార్లకు అలవాటుగా మారాలి. కనీస స్థాయి అయినా, గరిష్ఠ స్థాయి అయినా హెచ్చు ట్రేడింగ్‌ పరిణామాలు (వాల్యూమ్‌) నమోదు అవుతాయి. ఇదొక గుర్తు. అప్రమత్తంగా ఉంటే వీటిని గుర్తించడం పెద్ద కష్టం కాదు.

7. ఎప్పుడూ మార్కెటే కరెక్టు
మదుపరులు ఎప్పుడైనా మార్కెట్‌ ప్రవర్తనకు అనుగుణంగా వ్యవహరించాలే గాని, తమ ఆలోచనల ప్రకారం మార్కెట్‌ ఉంటుందనుకుంటే పొరపడ్డట్లే. మార్కెటే ఎప్పుడూ యథార్థమైనది. మనం దానిని అనుసరించడమే నీతి.

బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి సెన్సెక్స్‌ ప్రస్తుత పుస్తక విలువ రూ.3,700. కనిష్ట స్థాయిలో ఏటా 10 శాతం విలువ పెరుగుతుందని అనుకొంటే వచ్చే మూడేళ్లలో (2011-12 నాటికి) పుస్తక విలువ రూ.5,000 అవుతుంది. దీనికి 5 పీఈ (ప్రైస్‌ ఎర్నింగ్‌) ఇచ్చినా సెన్సెక్స్‌ 25,000 పాయింట్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ఇతర అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి.
(ఈనాడు,౨౦:౦౪:౨౦౦౯)
_______________________________

Labels:

Sunday, April 19, 2009

మంచి నోట్సు... మార్కుల గని!

సత్య
స్వయంగా నోట్సు రాసుకునేవారు ఉత్తమ విద్యార్థుల కోవలోకి వస్తారు. అసలు నోట్సు జోలికే పోనివారు సగటు విద్యార్థులని ఇట్టే అంచనాకు వచ్చెయ్యవచ్చు. నోట్సు రాసుకునేవారిలో కూడా 95 శాతం విద్యార్థులు పాటించేది- సంప్రదాయ బద్ధమైన 'లీనియర్‌ నోట్సు'. దీని ప్రయోజనాలు పరిమితమే!

సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి ఉన్నతశ్రేణి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇతరుల విజయ రహస్యాన్ని ఆరా తీస్తుంటారు. తాము ఎన్నిసార్లు రాసినా విజయం వరించదేమని పోటీపరీక్షలు రాసిన కొందరు సందేహం వెలిబుచ్చుతుంటారు. అలాంటివారిని 'మీ నోట్సు ఓసారి చూపించ'మని అడిగితే 'నేను నోట్సు రాసుకోను. పుస్తకాలు చదివి నేరుగా పరీక్షలు రాస్తాను' అంటారు.ఇలాంటివారికి తక్కువ మార్కులు రావడం వింతేమీ కాదు. వీరంతా సగటు విద్యార్థులు. నోట్సు ప్రయోజనం తెలుసుకోని సామాన్యులు. పోటీ పరీక్షల అభ్యర్థులెందరో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అసలు కీలకం ఎవరికి వారు నోట్సు తయారుచేసుకోవడమే.

ఎందుకు రాసుకోవాలి?
అనేక పాఠ్యాంశాల నుంచీ, ఇతర వనరుల నుంచీ సేకరించిన కీలక పదాలనూ, ముఖ్య భావాలనూ క్రోడీకరించి సంగ్రహంగా, సమగ్రంగా రాసుకునేదే నోట్సు. గుబురుగా పేరుకుపోయిన సమాచారానికి ఓ క్రమానుకృతిని కల్పించి చక్కగా అర్థమయ్యేలా చేస్తుందిది. విషయానికి మనదైన ప్రత్యేకశైలిలో వ్యాఖ్యానం చేస్తుంది నోట్సు. పునశ్చరణకు ఇదెంతో సౌలభ్యం.

* అనేక పుస్తకాలూ, వనరుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఒకచోట చేర్చటం వల్ల మూల గ్రంథాలను పదేపదే చూడాల్సిన బాధ తప్పి, సమయం ఆదా అవుతుంది.
* క్లిష్టమైన భావాలను సులభంగా, సంక్షిప్తీకరించడం వల్ల విషయం అర్థమవుతుంది.
* విశ్లేషణాత్మకంగా విషయాన్ని వివరించడం వల్ల తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికి సహకరిస్తుంది నోట్సు.

మన మనసులో ఎంతో విస్తృతమైన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అది ఉద్దీపనం పొంది వెలికి రావడానికి ప్రేరణ కావాలి. దాన్ని కల్పించే ఉపకరణమే నోట్సు. ఎవరో రాసిన నోట్సుకు అలాంటి ప్రేరణ ఉండదు. స్వయంగా రాసుకున్న నోట్సుకే ఆ శక్తి ఉంటుంది. స్వయంగా రాసుకున్న నోట్సులో మన ముద్ర ఉంటుంది. 'ఒరిజినాలిటీ' ఉంటుంది. ఒరిజినాలిటీ ఉన్న జవాబులకే ఎక్కువ మార్కులు వస్తాయి. అంతే కాక, విషయం పట్ల అవగాహన పెరగాలన్నా, తేలిగ్గా విషయం గుర్తుపెట్టుకోవాలన్నా ఎవరి నోట్సు వారే తయారుచేసుకోవాలి. మనం తయారు చేసుకునే నోట్సు SMART గాఉండాలి.

నిర్దిష్టమైన (Specific) :
విషయం నిర్దిష్టంగా ఉండాలి. అంటే భావాల్లో స్పష్టత ఉండాలి. డొంక తిరుగుడు పనికి రాదు. వ్యర్థమైన విషయాలు లేకుండా విషయ వివరణలో సూటిదనం ఉండాలి.

లెక్కించడానికి (Measurable) వీలుగా :
విషయాన్ని ఎన్ని కోణాల నుంచి విశ్లేషిస్తున్నామో, ఎన్ని వర్గాలుగా విభజిస్తున్నామో అవగతం కావాలి.

లక్ష్యసాధన (Achievable) ముఖ్యం :
మార్కులు సాధించే లక్ష్యంతో నోట్సు ఉండాలి. ఉపయోగకరంగా ఉండే విషయాలనే రాసుకోవాలి. సందర్భశుద్ధి విషయానికి ప్రాణం కావాలి.

వాస్తవమైన (Realistic) అంశాలు :
అందంగా ఉన్నాయి కదా అని మనకు అర్థం కాని విషయాలు అందులో చేర్చకూడదు. వాస్తవమైన విషయాలనే రాసుకోవాలి. కవితాత్మకంగా ఉండే పరుల భాషలో కన్నా స్పష్టంగా, హుందాగా ఉండే సొంత భాషలో రాసుకుంటేనే నోట్సు ఉపయోగకరం.

కాలపరిమితిలో (Timeframe) ఒదగాలి:
నోట్సు చాట భారతంలా ఉండకూడదు. ఒడ్డు పొడవుతో పాటు నోట్సుకు కాల కోణం (Time Dimension) ఉండాలి. ఒక టైమ్‌ ఫ్రేమ్‌లో విషయం ఇమిడిపోవాలి. అంటే పది నిమిషాలకో, అర్థగంటకో సరిపడేలా విషయాన్ని తయారుచేసుకోవాలి.

లీనియర్‌ నోట్సు (Linear Notes)
నోట్సు వల్ల ఎన్ని ఉపయోగాలున్నా వాటి నుంచి ఎన్ని సత్ఫలితాలు వస్తున్నా చాలామంది విద్యార్థులు సొంతంగా నోట్సు రాసుకోరు. రాసుకున్నవారిలో కూడా 95 శాతం విద్యార్థులకు నోట్సు ఎలా తయారుచేసుకోవాలో తెలియదంటే అతిశయోక్తి కాదు. వారంతా సంప్రదాయ బద్ధమైన లీనియర్‌ నోట్సునే తయారుచేసుకుంటారు. ఎడమ నుంచి కుడికి వరుసలలో (lines) , వాక్యాల రూపంగా ఉంటుంది కాబట్టి దీనికి linear notes అని పేరు.

సమయం ఆదా అవుతుందా?: లీనియర్‌ నోట్సు వాక్యాల రూపంలో ఉండటం వల్ల కీలక పదాలతో పాటు వాక్యపూరణకు అవసరమయ్యే 80 శాతం వ్యర్థపదాలు ఇందులో చోటు చేసుకుంటాయి. అందువల్ల విలువైన సమయం వ్యర్థమైపోతుంది.

చూసినంతనే అర్థమవుతుందా?: లీనియర్‌ నోట్సు పేరాలు/పాయింట్ల రూపంలో ఉండటం వల్ల మొత్తం చదివితేనే కానీ అసలు విషయం అర్థం కాదు. చూసినంతనే విషయం స్ఫురించదు. తటిల్లతలా మనసులో తళుక్కుమనదు.

గుర్తుపెట్టుకోడానికి వీలవుతుందా?: విడివిడిగా ఉండే పదాలనూ, వాక్యాలనూ మెదడు గుర్తుపెట్టుకోదు. గుర్తుపెట్టుకోవాలంటే జ్ఞాపకశక్తికి అవసరమయ్యే సూత్రాలు నోట్సులో ఇమిడివుండాలి. లీనియర్‌ నోట్సులో ఈ జ్ఞాపకశక్తి సూత్రాలన్నీ ఇమిడివుండవు.

లీనియర్‌ నోట్సులో ఇలాంటి పరిమితులెన్నో ఉన్నాయి కాబట్టే దాన్ని అనుసరించేవారు తమకు మంచి జ్ఞాపకశక్తి లేదని వాపోతుంటారు. నిజానికి పరిమితి ఉండేది వారి జ్ఞాపకశక్తికి కాదు, వారు రాసుకునే నోట్సుకే!



లీనియర్‌ నోట్సుకుండే పరిమితులు అధిగమించి ఓ చక్కని నోట్సు విధానం ఉంది. 40 ఏళ్ళ క్రితమే 'వాల్టర్‌ పాక్‌' అనే విద్యావేత్త దీన్ని తయారుచేశాడు. విదేశాల్లో విశేష ఆదరణ పొందుతున్న ఆ నోట్సు విధానం ఏమిటో, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం!


ఇదీ
... నోట్సు రాసే పద్ధతి!




విషయం తేలిగ్గా అర్థం కావాలి; సమయం ఆదా అవ్వాలి; చదివింది చక్కగా గుర్తుపెట్టుకోవాలి! ఈ 3 పనులనూ సాధ్యం చేసేదే కార్నల్‌ నోట్సు. నోట్సు ఎలా తయారుచేసుకోవాలో చెప్పడమే కాక, దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలియజేస్తుందిది.

నలబై ఏళ్ళ క్రితం వాల్టర్‌ పాక్‌ (Walter Pauk) అనే విద్యావేత్త ఓ నోట్సు విధానాన్ని తయారుచేశాడు. దీనికి కార్నల్‌ నోట్సు విధానం/కార్నల్‌ పద్ధతి అని పేరు. అమెరికాలోని కార్నల్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు నోట్సు రాసుకునే విధానాన్ని మెరుగుపరచడం కోసం ఇది రూపొందింది. క్రమేపీ ఈ నోట్సు పద్ధతి అమెరికా అంతటా విస్తరించింది; ఎన్నో దేశాల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందుతోంది.

ఈ పద్ధతిలో నోట్సు రాసుకునే ప్రతి కాగితాన్నీ ముందుగా మూడు భాగాలుగా విభజించాలి.

* పేపర్‌ కింద నుంచి రెండు అంగుళాల పైభాగంలో అడ్డంగా గీత గీయాలి.

* కాగితం ఎడమ భాగంలో రెండున్నర అంగుళాల స్థలాన్ని కేటాయించి, కింద గీసిన సమాంతర గీతకు ఆనుకునేలా నిలువుగా గీత గీయాలి.

* దీనివల్ల మొత్తం పేపర్లో మూడు విభాగాలు ఏర్పడతాయి. 2.5X9అంగుళాల స్థలం ఎడమభాగంలో, 6X9అంగుళాల స్థలం కుడిభాగంలో, 2 అంగుళాల స్థలం కింది భాగంలో వస్తుంది.

* ఈ మూడు భాగాలకూ కార్నల్‌ పద్ధతిలో ప్రత్యేక ప్రయోజనాలున్నాయి.


నోట్సు తయారీలో 6 'ఆర్స్‌'
కార్నల్‌ పద్ధతిలో రాసుకునే నోట్సులో ఆరు మెట్లు ఉంటాయి. ఇవన్నీ ఆంగ్లంలో Rఅక్షరంతో ఆరంభమయ్యే ఆరు పదాలకు చెందిన అంశాలు. అందుకే దీన్ని ఆరు Rsవిధానం అంటారు.

కాగితాన్ని మూడు భాగాలుగా విభజించాక 6X9అంగుళాల కుడిభాగంలో నోట్సు రాసుకోవాలి. ఈ 6 ఆర్స్‌ విధానం అక్కడినుంచే ప్రారంభం అవుతుంది.

1. రికార్డ్‌ (Record):ఉపన్యాసం ప్రారంభమైనప్పుడు లేదా ఓ పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు కావలసిన విషయాన్ని కుడిభాగంలోని జాగాలో రాయడం (రికార్డు చేయడం) ప్రారంభించాలి. ముఖ్యమైన విషయాలనే రాసుకోవాలి. వ్యాకరణం, విరామ చిహ్నాలు వగైరాలు ముఖ్యం కాదు. విషయం అర్థమయ్యేలా ఉంటే చాలు. కాలం ఆదా చేయడానికి మీకు అర్థమయ్యే 'షార్ట్‌ హ్యాండ్‌' ఉపయోగించండి. ఏమైనా, ఓసారి రాత పూర్తయ్యాక చదివితే అర్థమయ్యేలా నోట్సు రాసుకోవాలి.

2. రెడ్యూస్‌ (Reduce):నోట్సు రాయడం పూర్తి అయ్యాక దానిలోని కీలక పదాలను (Key words) /కీలక భావాలను వేరు చేసి వాటిని రెండున్నర అంగుళాలు ఉండే ఎడమవైపు మార్జిన్లో రాసుకోవాలి. ప్రశ్న రూపంలో రాసుకుంటే మరీ మంచిది. మొత్తం సమాచారాన్ని క్షణంలో స్ఫురింపజేసే జ్ఞాపకచిహ్నాలుగా ఇవి పనిచేస్తాయి.
.
3. రీకేప్‌చ్యులేట్‌ (Recaptulate):ఇది 'సారాంశం' అనేదానికి పెద్దపేరు. పేజీలోని మొత్తం విషయ సారాంశాన్ని కాగితం దిగువభాగంలోని రెండు అంగుళాల స్థలంలో రాసుకోవాలి. ప్రతి పేజీలోనూ ఆ విషయానికి సంబంధించిన సారాంశాన్ని రాసుకోవాలి. ప్రతి పేజీలో రాసుకున్న కీలక అంశాల ఆధారంగా మొత్తం నోట్సు సారాంశాన్ని చివరిపేజీలో రాసుకోవాలి. దీనివల్ల ఒకే పేజీలో మొత్తం విషయాన్ని అవగతం చేసుకోవడానికి వీలవుతుంది.

4. రిసైట్‌ (Recite):విషయాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఉపయోగపడే బలమైన ప్రక్రియ- వల్లెవేయడం. అంటే కేవలం తిరిగి చదవడం కాదు; విషయాన్ని మన సొంత మాటల్లో మనకు మనం వివరించుకోవడం. విషయాన్ని పైకి వల్లెవేయడం వల్ల నేర్చుకునే ప్రక్రియ వేగవంతమవుతుంది. సొంత మాటల్లో విషయాన్ని మననం చేయడం వల్ల దానిలోని లోతైన భావం అర్థమవుతుంది. కుడిభాగంలో ఉండే నోట్సునూ, ఎడమభాగంలోని కీలక పదాలనూ ఒకేసారి చూడడం వల్ల మెదడుకు జ్ఞాపకశక్తికవసరమయ్యే అభ్యాసం లభ్యమవుతుంది.

5. రిఫ్లెక్ట్‌ (Reflect):విషయాన్ని వల్లెవేయడమే కాక, దాన్ని లోతుగా అవలోకనం చేసుకోవాలి. నేర్చుకున్న సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా అనువర్తింపజేసుకోవాలో, అదివరకే మనకు తెలిసిన విషయంతో దీన్నెలా అనుసంధానించుకోవాలో ఆలోచించాలి. కొత్తగా నేర్చుకున్న సమాచార ప్రాధాన్యాన్నీ, దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే అదనపు లాభాన్నీ బేరీజు వేసుకోవాలి.

6. రివ్యూ (Review):రాసుకున్న విషయాన్ని తరచూ పునః సమీక్షించుకోవాలి. అంటే తిరిగి చదువుకోవడం కాదు; విషయాన్ని స్పష్టంగా మనవైన మాటల్లో వివరించుకోగలగడం. దానివల్ల విషయం మస్తిష్కంలో నిత్యనూతనంగా ఉంటుంది. అందువల్ల పరీక్షల ముందు బట్టీపట్టే బెడద తప్పిపోతుంది.

నోట్సు ఎలా తయారుచేసుకోవాలో చెప్పడమే కాక, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియజేస్తుంది కాబట్టే కార్నల్‌ నోట్సు ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. విషయాన్ని తేలిగ్గా అర్థం చేసుకోడానికీ, కాలాన్ని ఆదా చేసుకోవడానికీ, చదివినదాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవడానికీ కార్నల్‌ నోట్సు అద్భుతంగా పనిచేస్తుంది.



కార్నల్‌ నోట్సు విలువైన ఉపకరణం

కార్నల్‌ నోట్సుకు ఓ ఉదాహరణ చూద్దామా? ప్రసిద్ధ పరిశోధక సంస్థ 'గేలప్‌ ఆర్గనైజేషన్‌' విజయ రహస్యం అనేఅంశంపై ఓ సర్వే నిర్వహించింది. దాన్ని కార్నల్‌ నోట్సులో ఎలా రాసుకోవచ్చో పరిశీలిద్దాం.


మిగతా నాలుగు లక్షణాలకు కూడా ఇదే పద్ధతిలో నోట్సు రాసుకొని, చివరిపేజీలో మొత్తం విషయంపై సారాంశాన్ని (summary) తయారు చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న కార్నల్‌ నోట్సు 'లీనియర్‌ నోట్సు' పోలిస్తే వందరెట్లు మేలుతరంగా ఉంటుంది. విద్యార్థులకే కాదు; పెద్దలకు కూడా ఈ నోట్సు విధానం చక్కని ఉపకరణం. ఇలా కార్నల్‌ నోట్సుకు ఎన్నో ఉపయోగాలున్నా, దీనికి కూడా కొన్ని పరిమితులు లేకపోలేదు. కీలక పదాలతో పాటు వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు ఇక్కడా చోటుచేసుకుంటాయి. ఇది చిత్రాల రూపంలో ఉండదు; రంగులతో విషయ వివరణ జరగదు. కాబట్టి జ్ఞాపకశక్తిని పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం తక్కువే.
కార్నల్‌ నోట్సు 'లీనియర్‌ నోట్సు'తో పోలిస్తే వందరెట్లు మేలుతరంగా ఉంటుంది. విద్యార్థులకే కాదు; పెద్దలకు కూడా ఈ నోట్సు విధానం చక్కని ఉపకరణం


విషయాన్ని వల్లెవేయడమే కాక, దాన్ని లోతుగా అవలోకనం చేసుకోవాలి. నేర్చుకున్న సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా అనువర్తింపజేసుకోవాలో, అదివరకే మనకు తెలిసిన విషయంతో దీన్నెలా అనుసంధానించుకోవాలో ఆలోచించాలి. కొత్తగా నేర్చుకున్న సమాచార ప్రాధాన్యాన్నీ, దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే అదనపు లాభాన్నీ బేరీజు వేసుకోవాలి.


సొంత మాటల్లో విషయాన్ని మననం చేయడం వల్ల దానిలోని లోతైన భావం స్పష్టంగా అర్థమవుతుంది.
(ఈనాడు,౦౯ & ౧౬:౦౩:౨౦౦౯)
____________________________________

Labels: ,

What & Why ?

What does Burundanga mean?

Burundanga is the other name of the drug ‘Scopolamine’, used for criminal activities like rape or to rob innocent victims. The drug is passed on to the victim through business cards, pamphlets, etc. Even if the skin, through touch, absorbs just a very small quantity of the drug it has the desired effect. The drug is also administered through tablets added to drinks. This is known as the ‘dating drug’.

— Pulkit Jain, Bangalore
------------------------------------------------

why is gold softer than iron?

The softness of a metal is its ability to undergo permanent deformation under applied stress. All metals have specific crystalline structures. Each structure has its own densely packed crystalline planes. There exist line defects and plane defects in a crystal system. Such defects are more in densely packed crystal systems, i.e., metallic crystals with higher density, and result in a number of slip planes, which can easily deform under a little stress. Noble metals like platinum, gold and silver have extra slip planes called twinning. Iron and most of its have very rigid and open packed crystal structures and are difficult to deform.

— Sujay Bhattacharya, Pune
-------------------------------------------------

What is the 'six degrees of separation' theory?

The theory was the brainchild of psychologist Stanley Milgram who wanted to find the answer to the small-world problem. So in the 1960s, he conducted an experiment by mailing a packet to 160 people in and around Omaha Nebraska, that needed to reach a broker in Boston. The findings showed that these letters reached the broker in five to six steps. This concept has been explained well in the book 'The Tipping Point' by Malcolm Gladwell. American playwright John Gaure is believed to have popularised this phrase by his work named after the theory, 'Six degrees of Separation'.

- Devanshi Vaishnav, Bangalore
------------------------------------------------

Why are viruses at the borderline of living and non-living things?

A virus has a very simple composition. It has a protein sheath inside which there is a strand of DNA. A virus shows some properties akin to living organisms. However, unlike other organisms, they show some properties that are akin to non-living things. They can undergo crystallization and in that form, survive for billions of years. They can survive very high temperatures, freezing cold and ultra-violet radiation in space vacuum, in crystallized form.

— Sachindra Tavkar, via email
__________________________________
(Times Of India, 19:04:2009)
__________________________________

Labels: ,

Cow is so good, it can give milk in packets

In a recent interaction with six-year-old children, I asked them to write a short description of any animal of their choice. I gave them a structure for the essay — namely the first line should describe their chosen animal in such specific manner that the readers should be left in no doubt, the second few lines should detail the use/danger of the animal to humans and the last line can be used to express their personal opinion of the animal.I usually use this exercise to gauge how “schooled and boxed in” the children are and based on this I decide at what level I should begin my writing workshop with them. But it emerged that this particular group was full of poets. For the sake of my readers, I have remedied the children’s sentences and spellings a bit, but the import is intact. Read on:

A boy who chose to write on cow said in his first sentence (describing the animal in specific manner), “A cow is a cow. Not a goat.”Going on to the second paragraph, he explained, “Many animals have milk, but a cow is so good that it can give milks even in packets” and his last line said it all, “I love a cow. It is so useful I know its spelling.”

Another child enthralled me with her version of the lion. Her first line read — “Lines are fat and hairy.” Second paragraph — “Lions run after non-veg items like chicken, egg, mutt­on, beef. We cannot be friends with lion as we are also non-veg item.” And finally, “Lions are useful to us in cinemas.”

Then came the dog. “Do I like my dog or my sister? My sister fights with me. My dog only bites me. I bathe in Dettol, my dog also. My sister’s name is Minu. My dog’s name is Joker. I feel sad because they make fun of my dog. He is not joker, but my sister is mean. I hate my sister. I love my dog. He is useful. Sister is dangerous.”

Yet another child wrote about the owl. “Owl is living in villages or forests, inside a tree hole. They are so wise that crow, sparrow and everyone go to Owl for wisdom. An owl sleeps in the day. But I cannot. I come to school in the day. Also I live in city. So I don’t know anything about owl. So bye-bye.”

Next came the snake. “Ssssssssssssssssssssss­ssssss, a snake shouts like this. When we say ssssssssssssssssssssssssss it means keep quiet. Teachers shout like snake. Snakes dance very well. For annual day we did snake dance. A snake is useful in school programmes.”

There was one on Hippos too. “Hippo has large hips. They live in Discovery TV. I have a hippo soapbox. If hippo and elephant fight, who will win? I am very sorry; I don’t know any use of Hippo.”

And I particularly love the one on elephants. “Elephant is big, black and very strong. From far they look like black clouds. They wear bells to warn us. Their anklets are so big we use them as chains. Elephant is the national animal of the world.”

There were many other lovely entries about the rabbit, peacock, monkey and even fish. The children eventually created some beautiful poetry with me which I shall share with my readers in another column.The children employed such exquisite expressions, boldness and revealed such expanse of heart and mind that I regretted my adulthood, which seems to stand in my way of writing good poetry. What more can I say? I only hope that the children’s “schooling does not interfere with their education” and I can only hope that these children remain the poets they so easily are!

(Jaya Madhavan
First Published : 19 Apr 2009
The New Indian Express)
____________________________________

Labels: ,

ఎంత చదివినా గుర్తుండదా?

సత్య

మన పరీక్షలు చాలావరకూ జ్ఞాపకశక్తిని పరీక్షించేవే! అందుకే చదివిన విషయాలను గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం. 'ఎంత కష్టపడి చదివినా నాకసలు గుర్తుండదు' అంటూ బాధపడే విద్యార్థుల సంఖ్య తక్కువేమీ కాదు. కొన్ని శాస్త్రీయమైన సూత్రాలు సాధన చేస్తే ఏ విద్యార్థికైనా జ్ఞాపకశక్తి అద్భుతంగా మెరుగుపడుతుంది.

చదివిన విషయాలను తేలిగ్గా మర్చిపోవటం వల్ల ఈ పోటీ ప్రపంచంలో చాలా వెనకబడాల్సివస్తుంది. జ్ఞాపకశక్తి లోపానికి కింది మూడిటిలో ఏదో ఒకటి కారణం కావచ్చు.

* సమాచారాన్ని స్పష్టంగా మనసుపై ముద్రించకపోవటం
* మనసుపై ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరచకపోవడం
* ఆ భద్రపరిచిన సమాచారాన్ని సరిగ్గా వెలికితీయలేకపోవటం

సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించడం (
Registration ),జాగ్రత్తగా భద్రపరచడం (Retention), సరిగ్గా వెలికితీయడం (Retrieval) అనే మూడు దశలను సమర్థంగా అమలు చేయడమే జ్ఞాపకశక్తి. మూడు కార్యక్రమాలూ వేర్వేరుగా కాక సమన్వయపూర్వకంగా పనిచేసినపుడు (3Rformula)అద్భుత జ్ఞాపకశక్తి అలవడుతుంది.

దీని అమలుకు ముందు జ్ఞాపకశక్తికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవటం అవసరం.

ఒకే రకం మెదడు
జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధావికైనా, సామాన్యుడికైనా ఉండే మెదడు 1450 గ్రాములే. బూడిద రంగులో ఉండే ఇది శరీర బరువులో 2 శాతమే ఉన్నా మనలోని 20 శాతం శక్తిని వినియోగించుకుంటుంది. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ ఆధారపడివుంటుంది. కాబట్టి మందమతులుగా భావించుకునే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎంతో అవకాశముంది.

మూడిటి సంయోగం
మనిషికి ఉండేది మూడు మెదళ్ళ సంయోగమని శాస్త్రీయంగా నిరూపించాడు పాల్‌ మెక్‌లియన్‌. వీటికి రెప్టీలియన్‌, లింబిక్‌, కార్టికల్‌ అని పేర్లు పెట్టాడు.

* రెప్టీలియన్‌ మెదడు ఒత్తిడి కలిగిస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే జ్ఞాపకశక్తి సరిగా పనిచేయదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.


* లింబిక్‌ మెదడు భావోద్వేగాలకు పుట్టిల్లు. జ్ఞాపకశక్తి మీద భావోద్వేగాల ప్రభావం అధికం. సంతోషకరమైన విషయాలూ, విషాదకర సంఘటనలూ ఎక్కువకాలం గుర్తుండిపోవటానికి కారణమిదే. కాబట్టి దీర్ఘకాల స్మృతిలో సమాచారాన్ని దాచుకోవాలనుకునేవారు ఉద్వేగాలను సమర్థంగా వాడుకోవాలి.

* ఇక అతి ముఖ్యమైంది కార్టికల్‌ మెదడు. మన మెదడులో అరవైశాతమున్న ఈ మెదడుకు నాలుగు ప్రత్యేకతలున్నాయి. వాటినే స్టీవెన్‌ ఆర్‌. కవీ నాలుగు ప్రకృతి వరప్రసాదాలు (four endowmentsఅంటాడు. అవి స్వీయ అవగాహన శక్తి (Self Awareness),వూహాశక్తి (
Imagination) , విచక్షణ శక్తి (Conscience), ఇచ్ఛాశక్తి (Independent Will).ఈ నాలుగూ జ్ఞాపకశక్తికి మూలస్తంభాలు. వీటిని తెలుసుకొని సద్వినియోగం చేసుకునే విద్యార్థులు అత్యుత్తమ స్థాయికి చేరతారు.

ఎక్కువ చదివితే పిచ్చెక్కదా?
చిన్నగా కనిపించే మన మెదడు కోట్లాది నాడీకణాలతో నిర్మితమైంది. ఒక వ్యక్తి మెదడులో లక్ష కోట్ల నాడీ కణాలు ఉంటాయని అంచనా. అంటే నాడీకణం ఎంత చిన్నగా ఉంటుందో ఊహించుకోండి. అంత సూక్ష్మ నాడీకణం సైతం ఎంతో శక్తిమంతమైందే. ఒక కంప్యూటర్‌కు ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి నాడీకణంలో ఉంటుంది. దీన్ని బట్టి మొత్తం మన మెదడు ఎంత శక్తిమంతమైందో, ఎంత అమూల్యమైందో అర్థమవుతుంది.

నాడీ కణాలు ఏవీ విడిగా ఉండవు. ఒకదానితో మరొకటి 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి. పెద్ద టెలిఫోన్‌ ఎక్స్చేంజిలో వైర్ల నెట్‌వర్క్‌ మాదిరిగా మెదడు పనిచేస్తుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి, విశ్లేషించగలుగుతుంది.

చాలామందికి ఎక్కువ చదివితే పిచ్చెక్కుతుందనే అపోహ ఉంది. నిజానికి ఎంత ఎక్కువ సమాచారాన్ని మనం అందిస్తే అంత శక్తిమంతంగా మెదడు పనిచేస్తుంది. దానివల్ల కొత్త నాడీకణ మార్గాలు ఏర్పడతాయి. అవి జ్ఞాపకశక్తిని అధికం చేస్తాయి. కాబట్టి నాడీకణాల మాయాజాలాన్ని తెలుసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.

గుర్తుండిపోవాలంటే...
* మన మెదడు హార్డ్‌వేర్‌ అయితే దానికి ఉండే మైండ్‌పవర్‌ సాఫ్ట్‌వేర్‌. మాగ్నటిక్‌ పవర్‌ వల్లే మనం మాట్లాడేది రికార్డవుతుంది. అలాగే మనం చదివే సమాచారం మెదడులో ఉండటానికి మైండ్‌పవరే కారణం. కాబట్టి ఈ పవర్‌ను తెలుసుకుంటే జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేసుకోవచ్చు.

* మైండ్‌నే మనసు అంటాం. ఇది చేతన (10 శాతం), అంతశ్చేతన (90 శాతం) అని రెండుగా ఉంటుందని మానసిక నిపుణులంటారు. పెన్‌ఫీల్డ్‌ అనే సైకాలజిస్ట్‌ పరిశోధన ప్రకారం పంచేంద్రియాల నుంచి సేకరించిన ఏ విషయాన్ని అయినా మనసు రికార్డు చేస్తుంది. దాన్ని మనం వాడకపోతే అంతశ్చేతనలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకశక్తిని అభివృద్ధి పరచుకోవాలంటే అంతశ్చేతన మనసును ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి.

* మనసు నాలుగు స్థితుల్లో ఉంటుంది. ఒక్కో స్థితిలో ఒక్కో తరంగ విధానాన్ని కలిగివుంటుంది. జ్ఞాపకశక్తి పైన ఈ తరంగ విధానం ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఉత్తమమైన తరంగ స్థితి ఆల్ఫా (Alfa). తెల్లవారుజామున మనసు ఆహ్లాదంగా ఉండటానికీ, చదివింది తలకెక్కడానికీ కారణం ఈ ఆల్ఫా స్థితే. అందువల్ల ప్రశాంత వాతావరణంలో నిర్మల స్థితిలో మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.


శిక్షణతో సాధ్యమే
జ్ఞాపకశక్తి కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే దక్కే వరం కాదు. అదొక నైపుణ్యం. సాధన చేస్తే ఎవరైనా దాన్ని అలవర్చుకోవచ్చు. ''మంచి జ్ఞాపకశక్తి, చెడ్డ జ్ఞాపకశక్తి అనేవి నిజానికి లేనేలేవు. ఉన్నదల్లా తర్ఫీదు పొందినదీ (Trained Memory), తర్ఫీదు పొందనిదీ (Untrained Memory) '' అంటాడు జ్ఞాపకశక్తి మీద విశేష పరిశోధన చేసిన హేరీ లొరేనీ.

''సగటు మనిషి తన మేధాశక్తిలో కేవలం పది శాతం వినియోగించుకుంటాడు. మిగతా 90 శాతం నిరుపయోగం కావడానికి జ్ఞాపకశక్తి సూత్రాలను ఉల్లంఘించడమే'' అంటాడు ప్రఖ్యాత సైకాలజిస్టు కార్ల్‌ సీషోర్‌. మాయలూ, మంత్రాల మీద కాకుండా ప్రకృతి సూత్రాలమీద ఆధారపడి పనిచేస్తుంది జ్ఞాపకశక్తి. Registration, Retention, Retrieval అనే మూడు దశలూ ప్రకృతి సూత్రాలమీదే ఆధారపడి పనిచేస్తాయి.



_____________________________________________
పడిన ముద్ర చెరిగిపోదు!

చాలామంది విద్యార్థులు ఏకబిగిన పుస్తకం చదవాలని ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే బాగా గుర్తుంటుందని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. మధ్యమధ్యలో కొంత విరామం ఇచ్చి చదివితేనే విషయాలు బాగా గుర్తుంటాయి. శాస్త్రీయంగా నిరూపితమైన సత్యమిది! సమాచారాన్ని మనసులో స్పష్టంగా ముద్రించటం (రిజిస్ట్రేషన్ )జ్ఞాపకశక్తికి తొలి దశ. చదివిన విషయాన్ని ఎంత స్పష్టంగా నమోదు చేస్తే అంత విపులంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి చాలా మార్గాలున్నాయి. ప్రధానమైనవాటిని పరిశీలిద్దాం.

ఏకాగ్రత
నాలుక మీద కదలాడుతోంది కానీ బయటకు రావటం లేదంటూ చాలామంది చికాకుపడుతుంటారు. ఈ పరిస్థితికి కారణం- విషయాన్ని ఏకాగ్రతతో నమోదు చేయకపోవటమే. ఇతర పనుల మీద మనసు మళ్ళకుండా... చేసే పని మీద శ్రద్ధ పెట్టడమే ఏకాగ్రత. ఇది కుదరాలంటే ఆకలి, అలసట, ఒత్తిడి వంటి పరిస్థితులుండకూదు. శబ్దాలు, కాలుష్యం, ఆకర్షణలకు దూరంగా ఉండాలి.

పరిశీలన
పొగమంచులో ఫోటో తీస్తే బొమ్మ సరిగా రాదు. సమాచారం స్పష్టంగా అర్థం కాకపోతే గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సమాచారాన్ని వివిధ కోణాల నుంచి పరిశీలించి స్పష్టంగా అర్థం చేసుకుంటేనే మెదడు మీద ముద్రపడుతుంది.

జ్ఞానేంద్రియాల వినియోగం
కొందరు విద్యార్థులు కేవలం చదవడానికే ప్రాధాన్యం ఇస్తారు. కొందరు వినడానికీ, కొందరు చూడడానికీ, కొందరు చెప్పడానికీ, కొందరు చేయడానికీ ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల సమాచారం పూర్తిగా నమోదు కాదు. చదవడం వల్ల 20శాతం, వినడం వల్ల 30 శాతం, చూడడం వల్ల 40 శాతం, దాన్ని తిరిగి చెప్పటం వల్ల 50 శాతం, చేయడం వల్ల 60 శాతం గుర్తుంటాయని పరిశోధకులు అంటారు. అలా కాక, చదవడం, వినడం, చూడడం, చెప్పడం, చేయడం అనేవాటికి సహకరించే పంచేంద్రియాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే 90 శాతానికి మించి విషయం నమోదవుతుంది.

చిత్రాల కల్పన
చాలామంది పరాకు పడడానికి కారణం- వారు పదాలను గుర్తుపెట్టుకోవాలనుకోవడమే. మన మెదడు అక్షరాలను గుర్తుపెట్టుకోదు. చిత్రాలనే గుర్తుపెట్టుకుంటుంది. చిత్రాలలోనే ఆలోచిస్తుంది. ఈ చిత్రాలు బొమ్మల రూపంలో ఉండొచ్చు. ఆకృతులు (images)కావొచ్చు, గ్రాఫులు కావొచ్చు. రేఖాచిత్రాలూ, మైండ్‌ మ్యాపులైనా కావొచ్చు. అందువల్ల అక్షరబద్ధంగా ఉండే సమాచారాన్ని చిత్రబద్ధంగా చేయగలిగితే మెదడు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటుంది. అక్షరాలను చిత్రాలుగా మలచుకుని ముద్రించడమే జ్ఞాపకశక్తి అసలు రహస్యం.

రంగుల లోకం
తెలుపు నలుపు చిత్రాలను మెదడు గుర్తుపెట్టుకోదు. రంగు రంగుల చిత్రాలనే అది గుర్తుపెట్టుకుంటుంది. కారణం కుడివలయంలోని మెదడు రంగులను ఇష్టపడుతుంది. కాబట్టి అక్షరబద్ధంగా ఉండే నోట్సును వర్ణచిత్రాల్లోకి మారిస్తే అచ్చు గుద్దినట్టు గుర్తుంటుంది.

లయాత్మకత
చిన్ననాటి చిట్టిపొట్టి పాటలూ, వేమన-సుమతీ శతక పద్యాలూ మనకు గుర్తుండిపోవటానికి కారణం వాటిల్లో ఉండే లయాత్మకతే. అందుకే వేదాలను శ్లోకబద్ధం చేశారు. కావ్యాలను పద్యమయం చేసి, యతిప్రాసలు ఏర్పరిచి లయను కూర్చారు. అందువల్ల గుర్తుంచుకోదగ్గ అంశాలూ, ఫార్ములాలను లయాత్మకంగా మార్చుకోవాలి.

భావోద్వేగాల బాసట
అక్షరాలను చిత్రాలుగా మార్చటం, చిత్రాలను రంగులతో అలంకరించడం, లయాత్మకత జోడించటమే కాకుండా భావోద్వేగాలతో రంగరించాలి. ప్రేమ, భయం, హాస్యం, కోపం, శాంతం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న చిత్రాలు బలంగా గుర్తుంటాయి.

వూహా ప్రాగల్భ్యం
విజ్ఞానం కంటే ఊహాశక్తి గొప్పదంటాడు ఐన్‌స్టెయిన్‌. మనం నమోదు చేయదల్చిన విషయానికి ఊహాశక్తిని జోడించాలి. మన అనుభవాల్లో రంగరింపజేసుకోవాలి. ఓ గులాబిపువ్వును ఊహించుకోవటమే కాకుండా దానికి రంగు, రుచి, వాసన కల్పించుకోవాలి. అప్పుడే అది శాశ్వతంగా ముద్రితమవుతుంది.

అనూహ్యత
అసాధారణ విషయాలే అబ్బురపరుస్తాయి. వాటినే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. అందువల్ల సాధారణ విషయాలను అనూహ్యంగా మార్చాలి. హాస్యాన్ని జోడించినా, హాస్యాస్పదంగా మార్చేసినా, వింతలూ విడ్డూరాలు జత చేసినా, విపరీతమైన పరిమాణంలో ఊహించుకున్నా అవి మన జ్ఞప్తిలో శాశ్వతంగా ఉంటాయి.

సంపూర్ణత్వం
విడిగా ఉండే సమాచారం కన్నా సంపూర్ణత్వంలో ఉండే సమాచారాన్నే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. శరీరంలో వివిధ అవయవాలకు ప్రత్యేక స్థానం ఉన్నట్టుగానే విషయంలోని ప్రతి అంశానికీ ఓ ప్రత్యేకస్థలం, స్థానం ఉంటుంది. అందువల్ల మనం మెదడులో ముద్రించే సమాచారం విషయం మొత్తంలో ఏ భాగానికి చెందిందో, అందులో దాని ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుంటే గుర్తుంచుకోవటం సులువు.

కథా రూపం
పిల్లలకూ, పెద్దలకూ కూడా కథలంటే చాలా ఆసక్తి. మనం నేర్చుకోబోయే ఏ విషయాన్నయినా- అది సాంకేతిక సమాచారమే అయినా ఓ కథలా అల్లుకుని మనసులో ముద్రించుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. కొత్త పదాలు నేర్చుకోవాలనుకునేవారు ఆ పదాలతో ఓ చక్కని కథ అల్లుకుంటే గుర్తుపెట్టుకోవడం తేలిక అంటాడు- ఆంగ్లభాషను ఆసక్తికరంగా మలచిన హేరీ షెప్టర్‌. కథలో ఉత్సుకత ఉంటుంది. ఉత్సుకత జ్ఞాపకశక్తికి పెట్టుబడి లాంటిది.

ప్రాథమ్య సూత్రం
మనం చదివినదాంట్లో తుదీ మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. దీన్నే ప్రాథమ్య సూత్రం అంటారు. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వస్తాయి. అందువల్ల చదివినదానిలో అతి తక్కువ మాత్రమే మనసులో నమోదు అవుతుంది.

చదివే రెండు గంటల కాలంలో నాలుగు వ్యవధానాలు ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు, 4 తుది ఘటనలు ఏర్పడతాయి. అందువల్ల చదివినదానిలో ఎక్కువ నమోదు కావడానికీ, గుర్తుండటానికీ వీలవుతుంది.

తాజాదన సూత్రం
ఎప్పుడో చదివి వదిలేవాటికన్నా ఇటీవల చదివినవాటినే మెదడు గుర్తుపెట్టుకుంటుంది. 1993లో, 2008లో ముంబాయిలో ఉగ్రవాద దాడులు జరిగాయి. 93లో వేలమంది చనిపోయారు. నగరమంతా అల్లర్లు చెలరేగాయి. 2008లో పరిమిత ప్రాంతంలోనే అల్లర్లు జరిగాయి. మృతుల సంఖ్యా తక్కువే. అయినా 93 ఘటన కన్నా 08 నాటి సంఘటనే బలీయంగా గుర్తుండటానికి కారణం తాజాదన సూత్రమే. విద్యార్థులు కూడా పరీక్షరోజు ఉదయాన్నే ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఓసారి చూసుకుంటే బాగా గుర్తుపెట్టుకొని రాయవచ్చు.

సబ్లిమినల్‌ ప్రక్రియ
పైన చూసిన అంశాలన్నీ ప్రయత్నపూర్వకంగా మన మనసు మీద సమాచారాన్ని ఎలా ముద్రించుకోవాలో తెలియజేస్తున్నాయి. అయితే స్వప్రయత్నం లేకుండా కూడా జ్ఞాపకశక్తిలోకి సమాచారాన్ని పంపవచ్చు. అదే సబ్లిమినల్‌ ప్రక్రియ. ప్రకటన సంస్థలు ఈ కళను వినియోగించుకొని లాభాలు ఆర్జిస్తుంటాయి. అలసటగా ఉండి ఓ షాపులోకి వెళ్ళిన వ్యక్తి కొద్దిపేపట్లోనే సేదతీరి అనేక వస్తువులు కొనటానికి కారణం ఆ షాపులో మంద్రస్థాయిలో వినపడే ఆహ్లాదకరమైన సంగీతమే. అది అలసటను తీర్చటమే కాకుండా అతడు కొనటానికి సుముఖుడు కావటానికి కొన్ని సంకేతభావాలు పంపిస్తుంది. విద్యార్థులు ఆల్ఫా సంగీతాన్ని జోడిస్తూ క్లిష్టమైన విషయాలు చదివితే అవి స్పష్టంగా మనసులో నమోదవుతాయి.
_________________________________
మనం చదివినదాంట్లో తుదీ మొదలు భాగాలే గుర్తుంటాయి. మధ్యలోది మరుగునపడిపోతుంది. ఏకధాటిగా రెండు గంటలు చదివినపుడు ఓ మొదలు, ఓ తుది మాత్రమే వచ్చి చదివినదానిలో అతి తక్కువే మనసులో నమోదవుతుంది. అయితే ఆ రెండు గంటల కాలంలో నాలుగు వ్యవధానాలు ఇస్తూ చదివితే దానిలో 4 మొదలు, 4 తుది ఘటనలు ఏర్పడతాయి. చదివినదానిలో ఎక్కువ నమోదై, గుర్తుండిపోతుంది.

__________________________________________

(ఈనాడు, ౬ & ౧౩ :౦౪:౨౦౦౮)
__________________________________________

Labels:

సాటిలేని సాధనం... మైండ్‌ మ్యాపింగ్‌


సత్య

ఎంత విస్తృతమైన విషయాలనైనా కొన్ని గీతలూ, పదాల్లోకి మార్చి గుర్తుపెట్టుకోవచ్చంటే మీరు నమ్మగలరా? దాన్ని సాధ్యం చేసేదే మైండ్‌ మ్యాపింగ్‌. అభ్యాసం చేస్తే విద్యార్థులకు ఇది ప్రయోజనకరం.

ఎంతో ఉపయోగకరమైన 'కార్నల్‌ నోట్సు'కు కూడా కొన్ని పరిమితులున్నాయి. అవి- వాక్యపూరణకు అవసరమైన వ్యర్థపదాలు చోటుచేసుకోవటం, జ్ఞాపకశక్తి వినియోగానికి తక్కువ అవకాశం ఉండటం. ఈ లోపాలను సవరించి మంచి ఫలితాలనిచ్చే తిరుగులేని నోట్సే 'మైండ్‌ మ్యాపింగ్‌'. మన మెదడు పనిచేసే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ విధానాన్ని మానవాళికి అందించిన విద్యావేత్త టోనీ బూజాన్‌.

మైండ్‌ మ్యాపింగ్‌ స్వరూపం చూద్దాం. విషయానికి కీలకమైన ప్రధాన భావం ఓ చిత్రం/దానికి చిహ్నమైన ఆకృతి (image) రూపంగా నోట్సు మధ్యభాగంలో ఉంటుంది. చెట్టులోని కాండానికి కొమ్మలు అతికినట్టు ప్రధాన భావానికి ప్రతిరూపమైన చిత్రం/ ఆకృతికి అనుసంధానంగా మిగతా భావాలు కొన్ని వర్గాలుగా విడివడివుంటాయి. ప్రతి భాగం తనకు సంబంధించిన విజ్ఞానాన్ని శాఖ, ఉపశాఖలుగా ప్రదర్శిస్తుంది. శాఖ, ఉపశాఖల లైన్ల (lines) పైన ముఖ్యభావాలను సూచించే కీలక పదాలు, చిత్రాలు లేదా గుర్తులను సూచిస్తారు. ఈ శాఖలు, ఉపశాఖలు, చిత్రాలు, చిహ్నాలు వివిధ రంగుల్లో ఉండడం వల్ల మైండ్‌మ్యాపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మైండ్‌ మ్యాపింగ్‌ ఎలా చేయాలి?
దీని నిర్మాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఆకృతిలో ఎంత స్వేచ్ఛ కనిపిస్తుందో, దాని నిర్మాణంలో అంత శాస్త్రీయత ఇమిడివుంటుంది. మైండ్‌మ్యాపులను ఇష్టం వచ్చినట్టు కాక, కొన్ని సూత్రాల ఆధారంగా తయారుచేసుకోవాలి. సౌలభ్యం కోసం వాటిని ఐదు వర్గాలుగా విభజించి, మైండ్‌ మ్యాపు నిర్మాణాన్ని చూద్దాం.


1. పేపరు మధ్య నుంచి నోట్సు
తెల్లగా ఉండే కాగితాన్ని అడ్డుగా ఉండే లాండ్‌స్కేప్‌ ఆకృతిలో పెట్టి దాని మధ్యభాగంలో విషయానికి కీలకమైన ప్రధానభావాన్ని ఓ చిత్రం/ దానికి చిహ్నమైన ఆకృతి రూపంలో చిత్రించాలి.

ఉదాహరణకు... పుస్తకం చదవడం వల్ల ఉపయోగాల గురించి నోట్సు రాసేటప్పుడు పేపరు మధ్యలో పుస్తకం ఆకృతిని గీయాలి. ఇలా నోట్సు మధ్యభాగంలో ప్రారంభించడం వల్ల మన ఆలోచనలకు అన్నివైపులా అల్లుకుపోయే అవకాశం లభిస్తుంది. పైగా, భావాలను స్వేచ్ఛగా, సహజంగా వ్యక్తీకరించడానికి వీలవుతుంది.

2. ప్రధాన చిత్రానికి శాఖల అమరిక
చెట్టుకు కొమ్మలు, వాటి రెమ్మలు ఎలా పొందికగా ఉంటాయో, అదే విధంగా మైండ్‌మ్యాపులోని శాఖలు, ఉపశాఖలు ఒకదాని నుంచి మరొకటి పుట్టుకొచ్చినట్టు చక్కని అమరికలో లైన్లు గీయాలి. మధ్యశాఖలను లావుగా, ఉపశాఖలను సన్నగా గీయాలి. రేఖల నిడివి సమానంగా ఉండాలి. చెట్టుకొమ్మల మల్లే ఈ రేఖలు కూడా వంపు తిరిగి సహజంగా ఉండేలా గీయాలి. అలా ఉంటేనే మెదడు గుర్తుపెట్టుకుంటుంది.

3. కీలక పదాల, చిత్రాల, రంగుల వాడుక
శాఖల, ఉపశాఖల లైన్ల పైభాగంలో కీలక పదాలను అందంగా రాయాలి. ఒక గీతపై ఒక పదమే ఉండాలి. మాటలతో పాటు గుర్తులు/చిత్ర ఆకృతులు వాడితే మరీ మంచిది. ఓ చిత్రం వేల మాటల అర్థాన్ని స్ఫురింపజేస్తుంది కదా! అలాగే మైండ్‌మ్యాపులో తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏమంటే- కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ముఖ్యశాఖ, దాని ఉపశాఖలు, వాటి ఉప ఉపశాఖలన్నీ ఒకే రంగులో ఉండాలి. వాటిపై రాసే చిత్రాలను కూడా రంగుల్లో చిత్రిస్తే మెదడు బాగా గుర్తుపెట్టుకుంటుంది. రంగులకు సృజనాత్మకత ఎక్కువ. కాబట్టి అవి వేల భావాలను ప్రేరేపిస్తాయి.

4. స్పష్టమైన నిర్మాణం
అవసరానికి తగ్గట్టు కావలసిన రీతిలో వంచుకోడానికి మైండ్‌మ్యాపులో అవకాశం ఉన్నా, దానిలో కూడా ఓ స్పష్టమైన నిర్మాణం ఉంది. శాఖల పొడవు, పదాల నిడివి సమానంగా ఉంటాయి. ఒక శాఖకూ, మరో శాఖకూ మధ్య ఉండే ఖాళీస్థలం కూడా సమానంగా ఉంటుంది. అందువల్ల మైండ్‌మ్యాప్‌ ఆకర్షణీయంగా కన్పిస్తుంది. మైండ్‌మ్యాపును పెంచి రాయవలసివస్తే వేరే పేపర్లో కానీ, పక్క పేపర్లో కానీ రాయకూడదు. ఉన్న పేపరుకు మరో పేపరును అతికించి పేపరును పెద్దది చేయాలి. ఒకే పేపర్లో మొత్తం మైండ్‌మ్యాపును చిత్రించాలి.

5. సృజనాత్మక విధానం
మైండ్‌ మ్యాపు తయారుచేసే విధానం వినోదాత్మకంగా ఉండాలి. వ్యక్తిలోని సృజనాత్మకత, కాల్పనికత, భావుకత, ఊహా ప్రాగల్భ్యాలను నిద్ర లేపేలా ఉండాలి. అలాగే మైండ్‌మ్యాపును లిఖించే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వం నోట్సులో ప్రతిఫలిస్తూ ఉండాలి. అందం, అభినయంతో మైండ్‌మ్యాపు ఆకర్షణీయంగా ఉండాలి.
మైండ్‌మ్యాపును తయారు చేసుకోవటం గురించి చెప్పుకున్న పై భావాలను మైండ్‌మ్యాపులో ఏ విధంగా చిత్రించవచ్చో చూడండి.
________________________________________

అభ్యాసం చేస్తే అద్భుతాలు


మైండ్‌ మ్యాపు ఎలా రాయాలో అభ్యాసం చేసి, నోట్సును ఈ పద్ధతిలో రాసుకుంటే విద్యార్థులకది శక్తిమంతమైన ఉపకరణమవుతుంది. అప్పుడు పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోచ్చు; తక్కువ కాలంలో రాసుకోవచ్చు; పునశ్చరణ సులభమవుతుంది; మర్చిపోయే ప్రసక్తే ఉండదు!

మైండ్‌ మ్యాప్‌ ఉపయోగాలను ప్రధానంగా పది రకాలుగా చెప్పుకోవచ్చు.

మైండ్‌ మ్యాప్‌ వల్ల పొందే లాభాలను
ఓ మైండ్‌మ్యాపుగా ఇలా చిత్రీకరించవచ్చు.

1. విషయం అర్థం కావాలంటే: ప్రధాన అంశాన్ని ఒక చిత్రం లేదా దాని చిహ్నమైన ఆకృతి ద్వారా నోట్సు మధ్యలో చిత్రించాలి. దాని చుట్టూ ముఖ్యమైన భావాలను శాఖలుగా అమర్చాలి. ఒక్కొక్క శాఖలో సాపేక్షంగా ఇతర భావాలను పేర్చి, వాటికి తగిన వివరణ ఇవ్వాలి. ఇలా చేస్తే ఎంతటి క్లిష్టమైన భావమైనా తేలిగ్గా అర్థమవుతుంది.

2. కాలం ఆదా చేయాలంటే: మైండ్‌ మ్యాపింగ్‌లో కీలక పదాలకు చోటు ఉంటుంది. రాతలో 80 శాతం ఆక్రమించే పూరణపదాలకు (ఫిల్లింగ్ వొర్ద్స్) కు తావుండదు. అందువల్ల తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు రాసుకోవచ్చు.
3. స్పష్టంగా గుర్తుండాలంటే: మన మెదడు ఎలా పనిచేస్తుందో మైండ్‌ మ్యాప్‌లో చిత్రీకరణ అలా జరుగుతుంది. మెదడు, మైండ్‌మ్యాప్‌ పరస్పరం బింబ ప్రతిబింబాలుగా ఉంటాయి. దానివల్ల-

  • శాఖ, ఉపశాఖలతో అనుసంధానమనేది జ్ఞాపకశక్తికి ప్రాణవంతమైన సూత్రం. ఒక భావం తట్టగానే వందల వేల భావాలు మన మస్తిష్కంలో నిద్రలేవడానికి కారణమిదే. అలాంటి అనుసంధానం, అల్లిక జిగిబిగి మైండ్‌మ్యాప్‌కు ప్రత్యేకం.

  • మెదడు కీలక పదాలనూ, చిత్రాలనూ, ఆకృతులనూ గుర్తుపెట్టుకుంటుంది. మైండ్‌మ్యాప్‌లో ఉండేవి కూడా కీలక పదాలూ, చిత్రాలూ, ఆకృతులే. అందువల్ల అమోఘమైన జ్ఞాపకశక్తి మైండ్‌మ్యాప్‌ సొంతం.
* ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని తరచూ సమీక్షించుకుంటూ ఉండాలి. మైండ్‌మ్యాప్‌ వల్ల విషయాన్ని చూడకుండానే సమీక్షించుకోవచ్చు.

* మైండ్‌మ్యాపులు దృశ్యాత్మకంగా ఉండడం వల్ల పునశ్చరణ (రివిజన్‌) చేయడం తేలిక అవుతుంది.

4. మెదడుకుండే అనంతశక్తిని వాడుకోవాలంటే: మెదడులోని కుడి ఎడమ వలయాల్లో అనంత మేధాశక్తి దాగివుంటుంది. ఊహాశక్తి, చిత్రలేఖనం, పద విజ్ఞానం, తార్కిక అంశాలు ఉన్న కుడి, ఎడమ వలయాలు అనుసంధానమైనపుడు అద్భుతశక్తి ఆవిర్భవిస్తుంది. మెదడులోని ఈ అపూర్వశక్తులను అనుసంధానం చేసుకోవడానికి మైండ్‌మ్యాప్‌ చక్కగా సహకరిస్తుంది.
5. సృజనాత్మకంగా ఆలోచించాలంటే: యాంత్రికమైన లీనియర్‌ ఆలోచనా విధానానికి కాక, క్రియాత్మకమైన లేటరల్‌ ఆలోచనా విధానానికి మైండ్‌మ్యాప్‌ అవకాశం కల్పిస్తుంది. అందువల్ల మనసు సృజనాత్మకమైన కొత్త ఆలోచనలతో ప్రేరణ పొందుతుంది.
6. సమస్యా పరిష్కారం చేయాలంటే: విషయాన్ని విశ్లేషించడం, దాన్ని కొన్ని వర్గాలుగా విభజించడం, వాటిమధ్య అనుబంధాన్ని నిర్మించడం మైండ్‌మ్యాప్‌కు కొట్టిన పిండి. అందువల్ల సమస్యలోని వివిధ పార్శ్వాలను ఏకకాలంలో అవగతం చేసుకోడానికీ, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం రాబట్టడానికీ మైండ్‌మ్యాప్‌ సహకరిస్తుంది.
7. ప్రణాళికాబద్ధంగా ఉండాలంటే: విషయాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికీ, ఓ క్రమపద్ధతిలో వ్యవస్థీకరించడానికీ, ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్తంగా ఒకచోట నిక్షిప్తం చేయడానికీ పక్కా ప్రణాళిక కావాలి. ప్రణాళికా ప్రక్రియకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది మైండ్‌మ్యాప్‌. కాబట్టి సుదీర్ఘ పరిశోధనా పత్రాలు రూపొందించడానికీ, విపులమైన వ్యాసాల/ పుస్తకాల రచనకూ, సుదీర్ఘమైన సభల నిర్వహణకూ; ప్రయాణాలు, వినోద యాత్రల వంటి అనేక క్లిష్టమైన అంశాలు చేపట్టడానికీ మైండ్‌మ్యాప్‌ అనుకూలంగా ఉంటుంది.
8. ధారాళంగా భావ వ్యక్తీకరణ చేయాలంటే: ఒక ఉపన్యాసం రక్తి కట్టాలంటే వక్త ధారాళంగా, సుదీర్ఘంగా భాషిస్తూ ఎలాంటి విరామాలు లేకుండా శ్రోతలను ఉర్రూతలూగించాలి. సుదీర్ఘమైన, విషయ ప్రాధాన్యం ఉన్న ప్రెజెంటేషన్స్‌ వంటి భావవ్యక్తీకరణకు దృశ్యాత్మకంగా ఉండే మైండ్‌మ్యాప్‌లు ఎంతో సదుపాయంగా ఉంటాయి.
9. చదువు వినోదాత్మకంగా సాగాలంటే: చిత్రాలతో, వివిధ వర్ణాలతో మైండ్‌మ్యాపులు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని తయారుచేయడం, చదవడం కూడా తమాషాగా ఉంటుంది. అందువల్ల చదువు వినోదాత్మకంగా ఉండి, ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
10. సర్దుబాటుతో పాటు స్పష్టమైన ఆకృతి కలిగివుండాలంటే: స్పష్టమైన ఆకృతిని కలిగివుంటూనే మైండ్‌మ్యాపులో అవసరానికి తగ్గట్టుగా సర్దుబాటు గుణం ఉంటుంది. అంతేకాక ఒక ప్రధాన భావాన్ని ప్రతిబింబించే శాఖకూ, మరొక ప్రధాన భావాన్ని వ్యక్తం చేసే శాఖకూ మధ్య కొంత ఖాళీ చోటు ఉంటుంది. నూతన విషయాలను చేర్చుకొని రాసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అందువల్ల కాలం వెచ్చించి, మరొక మైండ్‌మ్యాప్‌ రాసుకోవాల్సిన అవసరం లేదు.
(ఈనాడు, ౨౩ & ౩౦:౦౩:౨౦౦౯)

________________________________________________

Labels: