My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 19, 2009

జీవితం ఒక యోగం

- చక్కిలం విజయలక్ష్మి
జీవితం గురించి, భగవంతుని గురించి సరైన అవగాహన లేనివారే
జీవతమూ, భగవంతుడూ వేరు వేరు అనే భావనతో ఉంటారు. భగవంతుడు సృజించిన, భగవంతునిలోంచి ఉత్పన్నమైన జీవితం ఆయనతో వేరుపడి ఎలా ఉంటుంది!? చెట్టులోంచి వచ్చిన కాయ చెట్టు తాలూకు జీవ లక్షణాలనే కలిగి ఉంటుంది- రూపం వేరైనా. చాలామంది భగవంతుణ్ని పూజ గదికే పరిమితం చేసి ఉంటారు. ఎంతో నిష్ఠగా, పవిత్రంగా పూజావిధిని నిర్వహించిన వ్యక్తి, పూజ ముగించి ఆ గది తలుపులు మూయగానే పూర్తిస్థాయి 'సామాజిక స్పృహ'ను పులుముకుంటాడు ఒక వ్యక్తిలోని దైవత్వానికి, రాక్షసత్వానికి ఒక 'గడపమాత్రం' దూరమేనా!?

వేదం 'సర్వభూత దయ'ను నిర్దేశించింది. నీచస్థాయి జీవి అయిన కుక్కనైనా కాలితో తన్నకూడదని విజ్ఞుల ఉపదేశం. చీపురుకట్టకూ తగిన మర్యాద ఇవ్వాలని దివ్య జనని శారదామాత అభిప్రాయం. మనం మన సాటి మనిషిని, తోటిమనిషిని మానసిక హింసకు గురి చేస్తున్నాం. మన స్వార్థంకోసం మరెందర్నో, మరెన్నింటినో... మరెన్ని రకాలుగానో. మనం రెండు వేషాలు వేస్తూ ఉంటాం- మానసికంగా! ఒకటి భక్తుడిగా, మరొకటి సామాజికుడిగా. నాటకీయత మనకుఅవసరం లేదు. వేషాల మార్పుతో పనిలేదు. కదలని దేవుడు పూజామందిరంలో ఉంటే, కదిలే దేవుళ్లు బయట ఉన్నారు. పలకని దేవుడు లోపల ఉంటే, పలికే దేవుళ్లు బయట ఉన్నారు. అంతే. మనుషులేకాదు, సమస్త జీవజాలం, జీవంలేని వస్తుజాలమూ భగవంతుని సృజనే. ఆయన ప్రతిరూపమే. మనం సామరస్య స్పృహ, సమతాదృష్టి కలిగిఉంటే చాలు.

విజ్ఞులు భగవత్సాధనకు ఒక్క యోగాన్ని మాత్రమే నిర్దేశించలేదు.
భక్తి, జ్ఞాన యోగాలతోపాటు కర్మయోగాన్నీ సూచించారు. సర్వభూత దయ, సాటి మనుషుల పట్ల సామరస్య ధోరణి, త్యాగం, విరాగం, నిష్కామకర్మ, ప్రతి కర్మలో ఆధ్యాత్మిక దృష్టి... ఇవన్నీ కర్మయోగమే. యోగాన్ని పూజామందిరంలో మాత్రమే యోగీ నిక్షిప్తంచేయలేడు. భగవంతుణ్ని ఒక్క ఆలయంలో మాత్రమే రుషీ ఆవాహన చేయలేడు. మోక్షం దేవుడూ గరిటెతోవడ్డించేది కాదు. అందుకు జీవితాన్నిచ్చాడు భగవంతుడు. ఇది చాలా సరళమైన యోగం. అదే... జీవితాన్ని యోగంగా భావించటం.

ఎలా! ఇదెలా సంభవం!?
సామాజిక జీవనంలో ఒక రూపాయి సంపాదించాలంటే, కేవలం పదిమందిలో ఒకరిగా గుర్తింపు పొందాలంటే, కనీసం కుటుంబ సభ్యుల ప్రేమ సంపాదించాలంటే ఎంతో కష్టపడతాం. మరెంతో త్యాగం చేస్తాం. మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు, దాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ మాత్రం శ్రమ తీసుకోలేమా? ఏ మాత్రం సాహసం చేయలేమా? దాని ఫలితం సర్వోత్కృష్టమైన, సర్వ శ్రేష్ఠమైన జీవన్‌ ముక్తి, జన్మ రాహిత్యం. పరమాత్మ పదం. దానికై చేయలేనిది ఏముంది? చేయరానిది ఏముంది? ప్రారంభంలో కష్టం అనిపించినా సాత్వికాహారంలా క్రమేణా సులువవుతుంది. రుచి దొరుకుతుంది. చివరకు వదలలేనిదవుతుంది. అందుకే ఆ పనిలో నిమగ్నమవుదాం.

దిశగా...
ప్రతి పనిలో పక్కవారి ఇబ్బందిని గమనిద్దాం. ప్రతి లాభంలో పక్కవారికి భాగం అందేలా చూద్దాం. ప్రతి మాటలో పక్కవారికి మాధుర్యం అందజేద్దాం. దైన్యాన్ని పోగొడదాం. ధైర్యాన్ని, ధీశక్తిని ప్రోది చేద్దాం. అవతలివారి ఆవేదనలో సగం మనం తీసేసుకుందాం. మన ఆనందంలో సగం అవతలివారికి భాగం పెడదాం. అప్పుడు ప్రపంచమే పూజామందిరం అవుతుంది. ప్రతి దేహధారీ దేవుడై విలసిల్లుతాడు. అప్పుడు మన పూజ ఒక్క దేవుడికి కాక కోట్లాది దేవుళ్లకు అందుతుంది. మన ఆరాధన ఒక పూజా మందిరానికే చెందక ప్రపంచపరివ్యాప్త మవుతుంది. మన సాధన ఒకటికి కోటి రెట్లుగా మారి, పరమాత్మవైపు మనం వేసిన ఒక్క అడుగు కోట్లాదిఅడుగులకు చేరి అగణితమై భగవంతుడు మరింత, మరెంతో చేరువై అరచేతిలో ఆమలకంలా భాసిస్తాడు. మన 'ప్రేమవిశ్వరూపం' ముందు వామనుడై, అంగుష్ఠ మాత్రుడై, కుశాగ్ర (తృణాగ్ర)మాత్రుడై మన హృదయంలో ప్రేమమీద తానుగాబందీయైపోతాడు.
(ఈనాడు, ౧౯:౦౯:౨౦౦౯)
__________________________________

Labels: ,

తెలుగువాడి వేదన


-శంకరనారాయణ
తెలుగువాడు ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని తేల్చి చెబుతాడు. చిన్న జబ్బునైనా తేలిగ్గా చూడడు. పడిశం పదిరోగాల పెట్టు అని కాస్త దూరంగా ఉంటాడు. ముక్కూమొహం చూసేటప్పుడూ జలుబు ఏమైనా ఉందా అని నిశితంగా చూడ్డం ఈమధ్య అలవాటు చేసుకున్నాడు. ఆబాలగోపాలమూ ఇదే వరస!

పూర్వకాలంలో మునులు తపస్సును 'ముక్కు మూసుకుని' ఎందుకు చేసేవారని ప్రశ్నిస్తే- 'స్వైన్‌ఫ్లూ భయంతోనే' అని తెలుగునాట చిచ్చరపిడుగులు జవాబు చెబుతున్నారు. ఈరోజుల్లో అయితే శుభ్రంగా ముక్కుగుడ్డలు వాడుకునేవాళ్లు అంటున్నారు. ప్రజలు స్వైన్‌ఫ్లూతో బాధపడుతుంటే- ప్రభుత్వం మాత్రం 'స్వయం ఫ్లూ'తో బాధపడుతోందని, ఆరోగ్యం 'యావత్తు'పోయి ఆ 'రోగం'తో బాధపడుతున్నవారు విమర్శిస్తున్నారు. మనది అపరిశుభ్ర దేశమనీ, ప్రపంచంలోని చెత్త అంతా ఇక్కడే పేరుకుంటుందనీ ఖండఖండాంతరాల్లో ఒకటే ప్రచారం! విదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంటాయనీ హోరెత్తుతుంటుంది. చిత్రమేమిటంటే, ఎయిడ్స్‌ మొదలుకొని స్వైన్‌ ఫ్లూ వరకు అన్ని జబ్బులూ విదేశాలనుంచే ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి తప్ప, ఏ జబ్బూ ఇండియానుంచి ఎగుమతి కావడంలేదు.

'ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అని ఎప్పుడూ పాడే తెలుగువాడు వైద్యంలో చేయితిరిగినవాడే! ఆ మాటకొస్తే పైసా ఖర్చు లేని మందూ మనవాడే చెబుతాడు. 'లంఖణం పరమౌషధం' అంటాడు. మందుకు విపరీతార్థం చెప్పి 'పానా'యామం చేయగల దిట్ట తెలుగువాడే! ఎవడి ఇంట్లో వాడు వైద్యం చేసుకుంటానంటే అతగాడు ఒప్పుకోడు. ఔషధం కానిది అవనిలో లేదు అంటూనే పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదంటాడు! నవ్వొచ్చిందంటే వైద్యుణ్నీ లెక్కచెయ్యడు. 'వైద్యో నారాయణో హరిః' అని అందరూ అంటుంటే, అతడు వైద్యోనారాయణో 'హరీ' అని పళ్లికిలిస్తాడు. హరీ అన్నా, టపా కట్టడమన్నా తెలుగువాడి అర్థం వేరుగా ఉంటుంది. తిక్కరేగితే చెట్టంత వైద్యుణ్నీ పట్టుకుని 'నీచేతి మాత్ర వైకుంఠయాత్ర' అనడం తెలుగువాడికే చెల్లు.

ప్రపంచంలో ఏ పిచ్చీ లేనివాడు ఎవడూ లేనట్టే, ఏ జబ్బూ లేనివాడు ఎవడూ లేడన్నది తెలుగువాడి సిద్ధాంతం.
'లేనివాడికి ఆకలిజబ్బు ఉన్నవాడికి అరగని జబ్బు' అని పాడతాడు.

వైద్యవృత్తి రహస్యాలను తెలుగువాడు ఔపోసన పట్టాడు. అందుకే 'చావుకు పెడితేకానీ లంఖణానికి తేలదు' అంటాడు. 'నినువీడని నీడ' ఎవరూ అని అడిగితే వైద్యుడు అని తెలుగువాడు ఠక్కున చెబుతాడు. 'చచ్చేదాకా వైద్యుడు వదలడు' అని చెబుతాడు. వెనకటికి రోగులు వైద్యులను చూసి భయపడేవాళ్లు. స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని, ఇప్పుడు రోగులను చూసి వైద్యులు భయపడుతున్నారు. ఏ రోగివల్ల తన ప్రాణంమీదికి వస్తుందోనని తల్లడిల్లుతున్నారు.

'నేను రాను మొర్రో సర్కారు దవాఖాన'కు అనేది ప్రభుత్వ వైద్యుల గీతం కూడా అయిపోయింది.

'ఎన్నో వ్రణాలు కోసినాను, నా వ్రణం కోసినప్పుడున్నంత నొప్పి లేదే' అన్నవాడూ మన వైద్యుడే!

జబ్బులకు సైతం మానసిక బలహీనతలు అంటగట్టడం తెలుగువాడి ప్రతిభే. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటాడు!

'ఇంతింతై జబ్బు ఇంతై' అనడం మనవాడికి పరిపాటి. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయిందే అని కలత చెందుతాడు. దీనికన్నా పుండుమీద కారం రాసినట్టు మాట్లాడేవారిని చూసి ఎక్కువ బాధపడతాడు.

'బాధే సౌఖ్యమనే భావన' తెలుగువాడి ఆరోగ్య వేదాంతం! నొప్పికి విరుగుడూ చెబుతాడు. 'గర్భాధానం ముచ్చట్లు లంఖణాల్లో తలచుకుంటే' ఎంత బాగుంటుంది అంటాడు. అన్నీ సాగితే రోగమంత భోగమే లేదంటాడు. 'అన్నం హితవు లేనివాణ్ని కరవేం చేస్తుంది?' అని ప్రశ్నిస్తాడు.

అంతమాత్రాన ప్రతిదానికీ లేదు, లేదంటే వూరుకోడు. ప్రత్యేకించి తన భార్య నోటివెంట లేదు అనే మాట వస్తే అస్సలు వూరుకోడు. 'పుండు మీదికి నూనె లేదంటే బూరెలొండవే పెళ్లామా' అన్నవాడూ తెలుగువాడే.

విశేషమేమిటంటే, తెలుగువాడు వైద్యుడి దగ్గరకు పోయేటప్పుడు తన జాతకం ఎలా ఉందో ఆలోచించడు. వైద్యుడి హస్తవాసి ఎలా ఉందోనని ఆరాతీస్తాడు. అదేమిటంటే 'ఆయుష్షు గల రోగి హస్తవాసి గల వైద్యుని దగ్గరకే పోతాడు' అని చెబుతాడు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ వైద్యుల నియామకాలన్నీ హస్తవాసి పరీక్షించి ఇస్తే బాగుంటుందనిపిస్తాడు.

అలవోకగా ఆరోగ్య సూత్రాలు, ముందు జాగ్రత్తలు చెప్పడం తెలుగువాడికి అలవాటు. 'అనగా అనగా రాగం, తినగా తినగా రోగం' అంటాడు. 'రాయంగరాయంగ కరణం... పారంగ పారంగ మరణం' అని సిద్ధాంతీకరిస్తాడు. 'అరఘడియ భోగం... ఆరు నెలల రోగం' అనీ హెచ్చరిస్తాడు. అరిశె ఆరు నెలల రోగం బయటకు తెస్తుదని పరిశోధనాత్మకంగా చెబుతాడు.

తెలుగువాడు 'ఎవ్వనిచే జనించు' పద్యమే కాదు , ఎవ్వనిచే మరణించు' అన్న పద్యమూ పాడతాడు. 'ఆయువు గట్టిదైతే అన్ని రోగాలూ పోతాయి' అని ధీమాగా చెబుతాడు. 'ఆయుష్షు లేక చస్తారు కానీ ఔషధం లేక చస్తారా?' అని ఎదురు ప్రశ్నలు వేస్తాడు. ఇంతచేసీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నానంటాడు. 'కొత్త వైద్యుడి కన్నా పాత రోగి మేలు' అంటాడు. అంతవరకు సర్దుకోవచ్చు. ఎటొచ్చీ కొత్త వైద్యుల నియామకం ఎందుకు? పాత రోగులనే వెతికి పట్టి ఆసుపత్రుల్లో వైద్యులుగా నియమించాలంటాడేమోనని ఎంతమంది హడలి చస్తున్నారో ఎవరికి తెలుసు?
(ఈనాడు, ౧౯:౦౯:౨౦౦౯)
__________________________

Labels: ,

Tuesday, September 15, 2009

తొలి వేలుపు


తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగమ్రోయు గజ్జెలును మెల్లని చూపులు... దగ్గరికి వచ్చేసరికి శిష్యుడు ఆగిపోయాడు. పద్యం మరిచిపోయాడనుకుని '...మందహాసమున్‌...' అంటూ గురువు అందించబోతే, శిష్యుడు పట్టించుకోలేదు. 'అయ్యా వినాయకుడిది ఏనుగు తల... ఆపైన ఏకదంతుడు! మందహాసం ఎలా సాధ్యం?' అని అడిగాడు. వినాయకుడి పేరుచెబితే చాలామందికి హాస్యం తోస్తుంది. పత్రికల తీరులోనూ ధోరణి కనపడుతుంది. వినాయక చవితి ప్రత్యేక సంచికలు రకరకాల బొమ్మలతోను ఆయనపై వ్యంగ్య చిత్రాలతోను కిక్కిరిసి ఉంటాయి. హాస్యకథల పోటీకి, ప్రత్యేక హాస్య సంచికలకు వినాయక చవితి సరైన అదను. చవితిరోజున పొట్ట పట్టనంతగా ఉండ్రాళ్లు సేవించిన లంబోదరుణ్ని చూసి చంద్రుడు నవ్వడం, దానికి పార్వతి కోపించి చంద్రుణ్ని శపించడం కథ అందరికీ తెలిసిందే! వినాయక చవితి పేరుచెప్పి చందాలు దండుకునేవారి ఆగడాలు భరించలేక 'చందమామను అదరగొట్టిన గణేశుడు 'చందా'మామలను ఏం చెయ్యలేకపోయాడు' అని ఒక హాస్యరచయిత చమత్కరించాడు. 'అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ...' అంటూ మొదలుపెట్టి అల్లసాని పెద్దన- వినాయకుడు పప్పులో కాలేసిన సంగతి చెప్పాడు. అమ్మ ఒళ్లోచేరి పాలుతాగుతూ బాల గణపతి రెండోవైపు తడిమాడు. శివుడు అర్ధనారీశ్వరుడు కదా! రెండోవైపు ల్లి స్తనానికి బదులు, తండ్రి మెడలో పాము చేతికి తగిలింది. అభం సుభం ఎరుగని పసివాడు అది అహివల్లభ హారమని తెలియక తామరతూడుగా పొరబడ్డాడని వర్ణించాడు పెద్దన. ఏనుగులకు తామారతూడులంటే పరమప్రీతి. అదీ అందులో చమత్కారం. మనుచరిత్రకు కేంద్రబిందువైన 'భ్రమ'ను స్ఫురింపజేసే ప్రయత్నమది. గంధర్వుణ్ని చూసి వరూధిని నిజమైన ప్రవరుడని భ్రమపడటం దాని ఇతివృత్తం. అందుకూ పెద్దనగారి ఎత్తుగడ.

'సకల జీవరాశులు సమస్త విశ్వం- ఆయన కుక్షిలోంచే ప్రభవించా'యని గణేశోపనిషత్తు స్పష్టంచేసింది. గణపతిని దేవగణాలకు అధిపతిగాను, వేదాలకు నాయకుడిగాను రుగ్వేదం వర్ణించింది. తంత్రశాస్త్రాలు 'త్రికోణ మధ్యగతుడు' అన్నాయి. ముత్తుస్వామి దీక్షితుల ప్రసిద్ధ కీర్తన 'వాతాపి గణపతిం' లోనూ దాని ప్రస్తావన ఉంది. మూలాధారక్షేత్ర స్థితుడిగానూ ఇదే కృతి నుతించింది. ఈ సృష్టిలో మొట్టమొదట ఆవిర్భవించింది- జలం! జలానికి అధిష్ఠాన దేవత వినాయకుడు. కనుక ముందుగా పూజందుకునే అర్హత ఆయనకు దక్కింది. 'తొలి పూజలందే ఇలవేలుపు' (ఇలువేలుపు అనేది సరైన పదం) అని కవుల వర్ణన. ప్రమథ గణాధిపత్యం కోరి కుమారస్వామితో పోటీపడి గెలిచి 'గణాధిపతి' అయ్యాడు. విఘ్నాలకు అధిపతిగా- మన పనులను నిర్విఘ్నంగా దీవించాలని విఘ్నేశ్వరుణ్ని ఆరాధిస్తాం. బాల గణపతి, తరుణ గణపతి, విజయ గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, క్షిప్ర గణపతి, ధ్వజ గణపతి, పింగళ గణపతి, ఉద్ధిష్ట గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, ఊర్ధ్వ గణపతి, విఘ్నరాజ గణపతి, భువనేక గణపతి, నృత్య గణపతి, మహా గణపతి- అనే పదహారూ గణేశుడి షోడశ తత్వాలు. ఒక్కో తత్వారాధనకు ఒక్కో రకం లక్ష్యం, ఒక్కో రకం ఫలితం అని శాస్త్రాలు చెబుతాయి.

యోగశాస్త్రరీత్యా గణపతి- మూలాధార చక్రానికి అధిపతి. మూలాధారం సృష్టితత్వానికి చెందినది. వినాయకుడి విగ్రహానికి ఊరి చెరువులోంచి తెచ్చిన మట్టిని ఉపయోగించడం సంప్రదాయం. చెరువులో మట్టిని వినాయకుడి ప్రతిమగా రూపొందించి, తొమ్మిది రోజులపాటు ఆరాధించి, మళ్లీ ఆ చెరువులోనే నిమజ్జనం చెయ్యడం ఆనవాయితీ. మట్టిలోంచి వచ్చిన మనిషి తిరిగి మట్టిలోనే కలవక తప్పదనే నిత్యసత్యానికి ఆధ్యాత్మిక ప్రతీక- ఆ ఆచారం. భక్తులు తమ అవసరాలనుబట్టి ఒక్కో రూపంలో ఉన్న వినాయక తత్వాలను ఆరాధిస్తారు. పంచభూత తత్వానికి ప్రతీకగా అయిదు తలలతో సింహవాహనంపై దర్శనమిచ్చే గణపతి- హేరంబ గణపతి. ఆయన అత్యంత శక్తిమంతుడని ప్రసిద్ధి. శరీరానికి, మనస్సుకు రక్షణ కల్పించి, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునే దైవంగా హేరంబ గణపతికి పేరు. కోపావేశాలను, మానసిక ఆందోళనలను దూరం చేసుకునేందుకు హేరంబ దేవతా రూపంలో గణపతిని పూజిస్తారు. లంబోదర గణపతి- ఉదర సంబంధిత వ్యాధుల నివారణ విషయంలో అపర ధన్వంతరి! ఆయన విద్యాధిదేవత. అక్షర సముదాయమంతా ఆయన కుక్షిలో దాచిపెట్టాడు. బొజ్జ విద్యల భోషాణం! 'పెద్దది పొట్ట విద్దియల పెట్టె యనంగ' అని ఒక సహస్రావధాని చమత్కారం! సిద్ధి, బుద్ధి అనే వినాయకుడి భార్యల పేర్లు సైతం ప్రతీకలే అన్నారు పెద్దలు. మనసుకు అధిదేవత అయిన చంద్రుడు- భాద్రపద శుద్ధ చవితి రోజున 'హస్తా' నక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు 'హస్త'గతుడయ్యాడంటే- మనసు స్వాధీనంలోకి వచ్చి 'సిద్ధి'ంచిందని అర్థం. హస్తానక్షత్రం బుధగ్రహానికి లేదా బుద్ధికి సంబంధించింది. కనుక బుద్ధి స్వాధీనం అయిందని లెక్క. మనసునూ బుద్ధినీ ఒకే మార్గంలో నడిపించమని కోరుతూ క్షిప్ర గణపతిని ఆరాధిస్తారు. తక్షణమే అనుగ్రహించే ఆయన స్వభావాన్నిబట్టి 'క్షిప్ర ప్రసాది' అనడం ఆనవాయితీ. తత్వాలను గ్రహించి ఆరాధించడం శ్రేష్ఠమైన పూజా విధానం.

(
ఈనాడు, సంపాదకీయం, ౨౩:౦౮:౨౦౦౯)
__________________________________

Labels: ,

ఇంటిపోరు

చెప్పులోని రాయి చెవిలోన జోరీగ... కంటిలోని నలుసు కాలి ముల్లు... ఇంటిలోని పోరు ఇంతింతకాదయా... అన్నాడు యోగి వేమన. గృహహింస అనేది స్త్రీలకే పరిమితం కాదని, లోకంలో భార్యాబాధితులూ ఎక్కువేనని గ్రహించిన విజ్ఞుడాయన. ఎటొచ్చీ పురుషులు అంతగా బయటపడరు. ఈ విషయంలో లోకం తీరూ చిత్రమైనదే! భర్త హింసిస్తున్నాడంటే 'అయ్యోపాపం' అంటూ సానుభూతి చూపిస్తుంది గాని, భార్య కొడుతోందంటే మాత్రం లోకానికి అది వినోదం. గజని చిత్రంలో అంధుణ్ని రోడ్డు దాటిస్తున్న అసిన్‌ దారిలో మొగుణ్ని కొట్టే భార్యను చూపిస్తూ పకపక నవ్వుతుంది. అదీ లోకం తీరు! వియ్యానికి వ్యతిరేక పదం కయ్యం. అయినదానికీ కానిదానికీ కయ్యానికి కాలుదువ్వే ఇల్లాలిని గయ్యాళి అంటారు. గయ్యాళి భార్యలు భర్తలకు నరకం చూపిస్తారు. నరకహింసల గురించి పురాణాల్లో చెప్పగా విని, నరకంలో ఉద్యోగాలకు భార్యలనే తీసుకుంటారు కాబోలు అనుకున్నాడొక భార్యాబాధితుడు. జైమినీ భారతంలో ఉద్దాలకుడి భార్య చండిక పరమగయ్యాళి. భర్త ఏం చెబితే దానికి సరిగ్గా వ్యతిరేకంగా చేయడం ఆమె నైజం. ఉద్దాలకుడు దానికో ఉపాయాన్ని ఆలోచించాడు. తండ్రి తద్దినంనాడు భార్యను స్నానం చేయకుండా అశుచివై వంట చేసి పెట్టమన్నాడు. దానికి విరుద్ధంగా ఆవిడ వేకువనే లేచి తలారా స్నానంచేసి మడిగా వండి వార్చింది. చివరికంటా తన పాచిక పారేసరికి ఉద్దాలకుడు ఉప్పొంగిపోయి, ఆ మైకంలో 'పారణం జాగ్రత్త' అన్నాడు. అంతే! చండిక వెంటనే దాన్ని పెంటమీద పారేసింది. ఉద్దాలకుడు కోపం తట్టుకోలేక 'వింధ్యాటవిలో రాయివై పడుండు' అని భార్యను శపించాడు.

శపించడం రాని భార్యాబాధితులు శాపనార్థాలతో సరిపెడతారు. రాముణ్ని అడవికి పంపిందని కైకను దశరథుడు ఎన్నో శాపనార్థాలు పెట్టాడు. అవీ తెలియని సోక్రటీస్‌ లాంటివాళ్లూ ఉంటారు. గయ్యాళి భార్యలు పెట్టే బాధలను పంటిబిగువన సహిస్తారు. దెబ్బలు తిన్నవాడు భోరున ఏడిస్తే కొట్టినవాడికి అదో తృప్తి. సోక్రటీస్‌ నిర్లిప్తత చూసి ఒళ్ళు మండిన ఇల్లాలు తిట్టితిట్టి చివరికి భర్తపై భళ్ళున నీళ్ళు గుమ్మరించింది. అప్పటికీ సోక్రటీస్‌కు కోపం రాలేదు సరికదా, 'అంతగా ఉరిమిన మేఘం ఆ మాత్రం వర్షించడం సహజమే కదా!' అన్నాడు. ఇదే సిద్ధాంతాన్ని జీవితాంతం పాటించిన ఒకాయన తన భార్య అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరుతూనే ఉరుములు మెరుపులతో హోరున వర్షం కురవడం చూసి 'అబ్బో మా ఆవిడ అప్పుడే అక్కడికి చేరుకుంది' అని గాఢంగా నిట్టూర్చాడు. గయ్యాళి గురుపత్ని పట్ల గురువు చూపించే మెతకవైఖరి నచ్చక శిష్యుడు 'విద్యలపై ఇంతటి గట్టి పట్టు సాధించారుగాని ఆవిడపై అదుపు సాధించలేకపోయారేమి?' అని ప్రశ్నించాడు. 'నీకూ పెళ్ళయి, అనుభవం వచ్చాక తెలుస్తుంది' అన్నాడు గురువు. ఖర్మకాలి శిష్యుడికీ మరో గయ్యాళే భార్యగా వచ్చింది. ఓరోజు తమ ఇంటికి గురువు భోజనానికి వస్తున్నాడని ముందే భార్య కాళ్ళపైపడి శిష్యుడు ఒక ఒప్పందం కుదిర్చాడు. ఆ ఒక్కరోజు తానెంత అధికారం చలాయించినా, నోటికొచ్చినట్లు తిట్టినా పట్టించుకోరాదని ప్రాధేయపడ్డాడు. ఏ కళనుందో ఆవిడ దానికి ఒప్పుకొంది. అయితే తిట్లు వందకు మించరాదని షరతు పెట్టింది. భార్యను బండతిట్లు తిట్టడంలో లభించే అలౌకిక అద్భుత ఆనందం తొలిసారిగా రుచి చూస్తున్నాడేమో- శిష్యుడు లెక్క మరిచిపోయాడు. తిట్లు వంద దాటేశాయి. మరుగుతున్న పులుసుకుండ అతని నెత్తిన ఫెళ్ళుమని పగిలింది. సంస్కృతంలో ఇది ప్రసిద్ధమైన చాటువు. అంతా చూశాక గురువు 'నా నెత్తినా ఇలా ఎన్నో కుండలు పగిలాయి కాని... పగలగొట్టిన కుండకు ఖరీదు కట్టి 'ఇస్తావా చస్తావా' అని ఎదురుపేచీకి దిగడం మాత్రం- నీ భార్యకే చెల్లిందిరా అబ్బాయ్‌' అనడం కొసమెరుపు.

మనిషి మెదడుపై గట్టిగా పరిశోధనలు చేసిన డాక్టర్‌ రోజర్‌స్పెర్రీ కుడి ఎడమ భాగాల గురించి వివరించాడు. ఎడమ భాగం- కార్యశీలి, కుడి మెదడు- స్వప్నశీలి. ఆ రెంటినీ 'కార్పస్‌ కెల్లోసమ్‌' అనే నరాల సముదాయం సమన్వయం చేస్తోందని ఆయన సిద్ధాంతీకరించాడు. ఆ రెండింటి ప్రవృత్తులు, ఆలోచనలు, ప్రేరణలు, స్వభావాలు వేరువేరని నిరూపించాడు. ఏది ఎక్కువ ప్రభావశీలమైందో- మనిషి ఆ రకంగా రూపొందుతాడన్నది దాని సారాంశం. 'యుకెన్‌ హీల్‌ యువర్‌ లైఫ్‌' రచయిత లూయీ హే 'నీ ఆలోచనల ప్రతిబింబమే నీవు' అన్న ప్రతిపాదనకు స్పెర్రీ సిద్ధాంతం ప్రేరణగా చెబుతారు. స్త్రీ పురుష ప్రకృతులనేవి మెదడులోని కుడి ఎడమ భాగాల్లాంటివి. వాటిలో వైరుధ్యం సహజం! మెదడులో భాగాలను కార్పస్‌ కెల్లోసమ్‌ సమన్వయం చేసినట్లు, ఆలుమగల మధ్య వైరుధ్యాన్ని మాంగల్యబంధం సమన్వయిస్తుంది. మెదడులో సమన్వయం కుదిరితే, వ్యక్తిత్వానికి పరిపూర్ణత దక్కుతుంది. మాంగల్యబంధానికి విలువ లభిస్తే, దాంపత్య జీవితానికి శోభ చేకూరుతుంది. భారతీయ వివాహ వ్యవస్థకు మాంగల్యబంధమే పునాది. మెదడులోని కుడి ఎడమ భాగాల్లో ఏదీ ఎక్కువకాదు, ఏదీ తక్కువకాదు. దేని పాత్ర దానిదే. ఆలుమగల విషయమూ అంతే! 'నేను అధికం' అనుకోవడం వల్లే పేచీ. ఆధిక్య భావనే ఘర్షణకు కారణమై గృహహింసకు నాంది అవుతుంది. దీన్ని అర్థం చేసుకున్న దంపతులు ధన్యులు. వారి కాపురం అనురాగ గోపురం అవుతుంది. లేదంటే, కలహాల స్థావరం అవుతుంది. 'ఇన్నాళ్ళూ స్త్రీల వాదనే విన్నారు, ఇప్పుడు మా గోడు వినండి' అని భార్యాబాధితుల సంఘ ప్రతినిధులు కోరుతున్నారు. దేశ స్వాతంత్య్రం రోజున సిమ్లాలో సమావేశమై వారంతా బాధిత భర్తల స్వేచ్ఛ గౌరవాల విషయం చర్చించబోతున్నారు. 'పురుషులపై క్రమంగా పెరిగిపోతున్న హింస విషయం లోకానికి ఎలుగెత్తి చాటాలన్నది మా లక్ష్యం' అంటున్నారు నిర్వాహకులు. సుమారు 30వేలమంది సమావేశమై సిమ్లాలో ఏం తీర్మానించబోతున్నారో చూద్దాం!
(ఈనాడు, సంపాదకీయం, 09:08:2009)
___________________________

Labels:

Monday, September 14, 2009

Mera Bharath Mahan

Speech by :Thomas Friedman of The New York Times....
"When we were young kids growing up in America, we were told to eat our vegetables at dinner and not leave them. Mothers said, 'think of the starving children in India and finish the dinner.'
And now I tell my children: 'Finish your maths homework. Think of the children in India who would make you starve, if you don't".
(An email forward)
_________________________________

Labels:

A hot dog on a leash

-
Illustration: Bhaskaran
WICKED WORD











By V.S. Jayaschandran


A tin trunk held everything Nripen Chakraborty owned. He lived in a single room and was chief minister for ten years. George Fernandes washed his own clothes in a bucket even when he was defence minister. A half-naked fakir washes a long piece of white cloth in a river in the film Gandhi. He lets the cloth slip from his fingers and float towards a woman in rags. He looks away so that she can take it without embarrassment. “Her lips almost part in a tiny smile of thanks,” reads the screenplay. Gandhi’s eyes narrow with pain.

S.M. Krishna lived for months in a Maurya Sheraton suite costing the earth. He took the trouble for his love of simplicity—sheraton is a furniture style noted for its simplicity. Pranab Mukherjee, who ejected him, hardly knows the root of austerity. The word austere, meaning dry, was originally used to describe brandy, not ‘Gandy’. Krishna said he would make “private arrangements” to continue living in luxury. He spoke like a stoic, a philosopher with the stiff upper lip. The word stoic comes from Stoa Poikile, the Painted Porch in Athens where stoics taught endurance.

The Painted Porch had frescos of the battle of Marathon. More than stoics, ascetics were associated with Marathon. Ascetics were Greek athletes who trained hard for gymnastic competitions. They followed rigorous self-discipline. The word ascetic later came to mean a monk who showed such rigour. Shashi Tharoor, who camped in the Taj Mahal hotel, declined to live in the Kerala House because it offered no privacy or gym. He no doubt knows that ancients who went to gyms trained naked, showing off their privates. Gymnos means naked in Greek.

Gymnosophists were naked philosophers the Greeks sighted in India after Alexander’s invasion. These were mainly Digambara (sky-clad) Jain monks. The invaders would have paid attention to gymnosophists’ danglers. The Greeks knew how to restrain their own privates. Their athletes tied a leather strap to the foreskin to stop the penis from dangling during competitions. The other end of the strap was tied round the base. Baring the glans, even by accident, was considered inelegant.

The foreskin restraint was called kynodesme, meaning dog on a leash. Kynikos means doglike. This word evolved into English cynic. Cynics were a school of philosophers noted for their sneering sarcasm. While sneering, they tended to bare their teeth like snarling dogs. Their gymnasium in Athens was known as the Grey Dog. The anti-Naxalite Greyhounds of Andhra Pradesh are all teeth and no leash.

The cynic Diogenes, who lived in a barrel and slighted Alexander, was an exhibitionist. He fondled himself in public, saying, “If only I could soothe my hunger by rubbing my belly.” The Japanese call male masturbation senzui—it means a hundred rubs. They call the female variety manzumi, meaning ten thousand rubs. The arithmetic could be faulty, but women take a longer time than men.

The book Tingo, by Adam Jacot de Boinod, has such words and expressions from different languages. In Japanese, Bakku-shan is a girl who looks good from behind but not so from the front. Zaftig in German is a buxom woman full of juice (zaf means sap). Don’t expect the frau to dote on die toten hosenthe dead trousers—meaning a boring place or an impotent man. She would rather chase Italians adept at carezza. Carezza is marathon sex, coitus prolongatus, avoiding emission.

Fijians call unfaithful husbands vori vori (ball ball). Large corn flour balls swim in this thick soup. Sops that German philanderers offer to pacify their suspicious wives are called dragon fodder. The dragon sniffing at the Arunachal border is itching for trouble. The best way to provoke Chinese brass hats is to send them green hats. If you tell a Chinese that he wears a green hat, you imply that his wife is cheating on him. A hard hat is a helmet. Helmet also means glans, the private red hat.
wickedword09@gmail.com

(The Week, 20:09:2009)
_____________________________

Labels:

Sunday, September 13, 2009

అందం చూడవయా...


ఇప్పుడంటే చంద్రుడి అసలు స్వరూపం తెలిసిపోయి కాస్త వెనక్కు తగ్గారుగాని, పూర్వకాలంలో అందం ప్రసక్తి వచ్చేసరికి కవులంతా చంద్రుడితో పోలిక తెచ్చేవారు. పసిపిల్లవాడైతే 'చందురుని మించు అందమొలికించు బుజ్జిపాపాయి'. అదే ప్రియురాలు అయితే 'చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా...' అన్న ధోరణిలో పొగడ్తలు, 'ఇందువదన కుందరదన...' అంటూ ప్రణయగీతాలు! అందమైన స్త్రీ ముఖానికి పోలిక విషయంలో చంద్రుడి తరవాతి స్థానం పద్మాలది. అలా వర్ణించిన కవుల్లో నన్నెచోడుడు అద్వితీయుడు. హేమంతరుతువులో దట్టమైన మంచు కారణంగా పద్మాలన్నీ అంతరించిపోయాయి. కొలను మధ్యలో ఒకేఒక్కటి కనిపిస్తోంది. అదైనా- పద్మాల జాతి అంతరించి పోకుండా నిలపడంకోసం సరోవరమే విత్తనంలా ఒక్కదాన్ని దాచిపెట్టి ఉంచిందేమో అన్నట్లుగా ఉంది- అన్నాడు కుమారసంభవంలో! ఇంతకీ అది పద్మంకాదు- శివుడికోసం చన్నీటి సరస్సులో పీకలోతు మునిగి తీవ్రంగా తపస్సు చేస్తున్న పార్వతీదేవి ముఖం! మెడవరకూ దేహమంతా నీటిలో మునిగి ఉండగా పైకి కనపడుతున్న పార్వతి మొహం పద్మంలా ఉందన్నది అసలు విషయం. ఉత్ప్రేక్ష అలంకారానికి ఇది ఉదాత్తమైన ఉదాహరణ. అందమైన కళ్ళనూ పద్మాలతో పోల్చే ఆనవాయితీ ఉండేది. శ్రీమహావిష్ణువును పుండరీకాక్షుడు అనడం పరిపాటి. పుండరీకమంటే ఎర్రకలువ. తెల్లకలువను ఉత్పలం అంటారు. ఎర్రకలువ రేకుల అంచుల్లో మెరుపులాంటి ఎర్రని ఛాయ ఉంటుంది. విష్ణువు కనుకొలకుల్లోనూ ఎర్రని జీరలుంటాయి. ఈ ఎరుపు పురుషుడికి భాగ్య చిహ్నం. లక్ష్మీదేవి కళ్ళు తేటగా స్వచ్ఛంగా ఉంటాయి కనుక అవి ఉత్పలాలు. శరదృతువులో యోగనిద్ర నుంచి ఆ పురాణ దంపతులు మేలుకొని కళ్ళు తెరవగానే కలువలూ తామరలూ ఒకేసారి వికసించాయని నన్నెచోడుడు చమత్కరించాడు. శరత్కాలంలో ఆ రెండూ పూస్తాయి కదా మరి...

అందమంటే నిజానికి స్త్రీదే! ప్రతి అవయవంలోనూ అందం తొంగిచూడటం, ప్రతి కదలికలోనూ సొగసు తొణికిసలాడటం స్త్రీలకు సహజం. అందువల్లనే మన కవులు స్త్రీల అంగాంగాలను నఖశిఖపర్యంతం వర్ణిస్తూ వచ్చారు. మగువలను ఆకట్టుకోవడానికి పురుషుడికి అదొక సాధనంగానూ చెప్పారు. సత్యభామ అలకను మాన్పడానికి నల్లత్రాచులా మెలికలు తిరిగిన ఆమె పొడవైన శిరోజాలను పొగడుతూ 'అరాళకుంతలా' అని కృష్ణుడు సంబోధించాడని నందితిమ్మన చెప్పాడు. నుదురును అయితే అర్ధచంద్రుడితో పోలుస్తారు. సుభద్ర 'నెన్నుదురును- అరచందమామను ఏలినదొరగా నెన్నుదురు(ఎంపికచేస్తారు)' అని చేమకూర కవి రెండర్థాల ప్రయోగాన్ని విసిరాడు. ఇక కనురెప్పలైతే తుమ్మెద రెక్కలు. (ఆ సోగకనుల రెప్పలలో తుమ్మెదలాడేనా... కృష్ణశాస్త్రి) నాసికకు నాగేటిచాలుతోను, సంపెంగ పూలతోనూ పోలిక. నాగలికి అడుగుభాగాన ఉబ్బెత్తుగా ఉండి మొనదేరిన ఇనుపకర్రును కోటేరు అంటారు. కోటేరులాంటి ముక్కుతో నాయిక యువకుల హృదయక్షేత్రాలను దున్ని వలపులు పండిస్తోందన్నాడు తెనాలి రామకృష్ణుడు. ముక్కుకొన కాసింత పైకి తొంగిచూస్తే- అది అచ్చం సంపెంగరేకే అంటారు కవులు. ఇక అధరాల విషయానికి వస్తే వాటిని బంధూక పుష్పాలతో పోల్చారు. వాటికే మంకెన పూలని మరోపేరు. ఎర్రగా మృదువుగా ఉండి, మకరందాన్ని చిప్పిల్లుతూ ఉంటాయి. మగువల పెదవులూ అంతేగా! కనుక మంకెనలతో పోలిక. కాస్త కిందకి దిగితేకంఠం. దానికి శంఖంతో పోలిక. మరికాస్త దిగువకు వస్తే పట్టపగ్గాలు లేని అందాలు. 'కడు హెచ్చుకొప్పు... దానిన్‌ గడవన్‌ చనుదోయి హెచ్చు... 'కటి' అన్నిటికిన్‌ కడుహెచ్చు...' అంటూ వాటి వాటి ఔన్నత్యాలను వర్ణించిన చేమకూర వేంకట కవి- 'నడుమే పసలేదుగాని నారీమణికిన్‌' అని తేల్చాడు చివరిలో. కొప్పు వక్షోజాలు పిరుదులు అంత ఘనంగా ఉండే పడతికి- ఉందాలేదా అన్నట్లుగా నడుము నాసిగా ఉండటమే నిజానికి గొప్ప అందం.

'కవులు చమత్కారులు... వారివి అతిశయోక్తులు... కవిత్వం అంటేనే అబద్ధ'మని తిరుపతి వేంకటకవులు ఏనాడో చెప్పారు. 'కవులు వర్ణించే అందాలు మాకెక్కడివి?' అని నేటి స్త్రీలు నిరాశపడవలసిన పనిలేదంటున్నారు- సామాజిక శాస్త్రవేత్తలు. ప్రబంధ గ్రంథాల అందాలు స్త్రీలలో కనుమరుగు కావడంలేదు సరికదా, రెట్టింపు అవుతున్నాయని రెట్టించి మరీ చెబుతున్నారు. మనిషి పరిణామక్రమంలో ఆధునిక మహిళ క్రమంగా అద్భుత సౌందర్యరాశిగా రూపొందుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. హెల్సింకీ విశ్వవిద్యాలయానికి చెందిన మార్కస్‌ జోకెలా బృందం నాలుగు దశాబ్దాలుగా వేలమంది స్త్రీ, పురుషులపై నిర్వహించిన అధ్యయనంలో- పడతుల్లో అందం క్రమేపీ పెరుగుతోందని రుజువైంది. అందగత్తెలకు ఎక్కువగా ఆడపిల్లలే పుట్టి, వారు మరింత అందంగా తయారవుతున్నారట. అందగత్తెల పోటీల్లో ఒక్కరినే తేల్చి చెప్పడం అందుకే పెద్ద సమస్యగా మారి- చిరునవ్వుల చెలి, బికినీల భామ, జఘనాల జాణ అంటూ వివిధ విభాగాలు మొదలయ్యాయి. ప్రాకృత గాథల్లో హాలుడు ఒక సొగసైన సంగతి చెబుతూ 'ఈ రమణి సోయగాలలో మొదట దేనిపై కన్నుపడితే దానిమీదే కన్నార్పనీయకుండా చూపు స్థిరపడిపోతోంది... అందాలన్నింటినీ మొత్తంగా పరామర్శించడం ఎప్పటికీ కుదిరేలా లేదు' అన్నాడు. అలా అన్నింటా అతిలోక సౌందర్యం ఉట్టిపడుతూ అతివలు కళ్ళకు అడ్డం పడుతుంటే ఒక్కరినే ఎంచుకోవడం కష్టమే మరి! అందుకే పోటీల్లో అన్ని విభాగాలు పుట్టుకొచ్చాయి అనుకోవాలి.
(ఈనాడు, సంపాదకీయం, ౦౨:౦౮:౨౦౦౯)
________________________

Labels: