My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, April 06, 2008

రామానాయుడుకి వెంకయ్య పురస్కారం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
శతాధిక చిత్రాలను నిర్మించిన డి.రామానాయుడుని 2006 సంవత్సరానికిగాను రఘుపతి వెంకయ్య పురస్కారం వరించింది. గుమ్మడి వెంకటేశ్వరరావు, పి.సాంబశివరావు, కె.సి.శేఖర్‌బాబులతో కూడిన త్రిసభ్య కమిటీ సోమవారం పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును ఏప్రిల్‌లో నిర్వహించే నంది అవార్డుల ప్రదానోత్సవంలో అందిస్తారు. 1936 జూన్‌ 6న ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జన్మించిన రామానాయుడు
'రాముడు-భీముడు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. నిర్మాతగా, స్టూడియో యజమానిగా, ల్యాబ్‌లకు అధిపతిగా, పంపిణీదారుగా పరిశ్రమలకు సేవలను అందించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడం, ఒరియా, మరాఠీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో చిత్రాలను నిర్మించినందుకుగానూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో ఆయన పేరు నమోదైంది.
(Eenadu, 01:04:2008)

=========================

Labels: ,

వహీదాకు ఎన్టీఆర్‌ అవార్డు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే:
ప్రముఖ హిందీ నటి వహీదా రెహమాన్‌.. 2006 సంవత్సరానికిగాను ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏప్రిల్‌లో నిర్వహించే నంది అవార్డు ప్రదానోత్సవంలోనే వహీదాకు ఈ పురస్కారాన్ని అందజేస్తామని చలనచిత్రాభివృద్ధి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకలోనే 2003, 04, 05లకుగానూ ఎన్టీఆర్‌ పురస్కారాన్ని అందుకున్న కృష్ణ, ఇళయరాజా, అంబరీష్‌లను సత్కరించనున్నారు. రూ.5లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. హైదరాబాద్‌కు చెందిన వహీదా తెలుగులో 'జయసింహ'లో ఎన్టీఆర్‌ సరసన నటించారు. 'రోజులు మారాయి'లో ఆమె నర్తించిన 'ఏరువాక సాగారో..' పాట ఇప్పటికీ ఆంధ్రులకు ఇష్టమైనదే! మన భాషలో 'బంగారు కలలు', 'సింహాసనం', 'చుక్కల్లో చంద్రుడు' చిత్రాల్లోనూ ఆమె నటించారు. 'ప్యాసా', 'కాగజ్‌ కె పూల్‌', 'రేష్మా అండ్‌ షెహర్‌', 'చౌదువీ కా చాంద్‌', 'గైడ్‌', 'నీల్‌కమల్‌', 'రంగ్‌ దె బసంతి'.. లాంటి పలు చిత్రాలు వహీదాకు ఎంతో గుర్తింపును తీసుకొచ్చాయి. తిలక్‌, జయసుధ, ఎ.సూర్యనారాయణలతో కూడిన కమిటీ వహీదాను ఎన్టీఆర్‌ పురస్కారానికి ఎంపికచేసింది.
(Eenadu, 01:03:2008)
=============================

Labels: ,

మానవత్వం పరిమళించిన వేళ...

తన దగ్గరున్నదంతా దానంచేసి, నిశ్చింతగా నిలబడ్డాడు రంతిదేవుడు. కొద్దిగా మంచినీరు తప్ప, తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆయన దగ్గరికి ఒక పరమ దీనుడు వచ్చి, చేయిచాచి అర్థించాడు. అప్పుడు రంతిదేవుడు అన్నాడు, ''అన్నము లేదు... కొన్ని మధురాంబువులున్నవి... త్రావుమన్న! రావన్న!... శరీరధారులకు ఆపద వచ్చిన, వారి ఆపదల్‌ క్రన్నన మాన్పి... వారికి సుఖంబులు సేయుటకన్న నొండు మేలున్నదె!... కష్టంలో ఉన్నవాడిని వెంటనే ఆదుకోవడం కన్నా ఈ లోకంలో గొప్ప మేలు మరొకటి లేదు. ఈ తీయని జలాలు తాగి, ప్రాణాలు నిలబెట్టుకో'' అంటూ మిగిలిన మంచినీళ్ళను కూడా యాచకుడికి ఇచ్చేశాడు. మానవత్వానికి పరమోదాహరణగా భాగవతంలో కీర్తిపొందాడు. మానవుడి అసలు తత్వం- మానవత్వం! మానవత్వాన్ని కోల్పోవడమంటే మనిషి తన సహజత్వాన్ని కోల్పోవడమని అర్థం. కలి ప్రభావం కారణంగా మనిషి స్వభావం మారుతుందని భాగవతం హెచ్చరించింది. స్నేహపూరంబుతో ప్రకాశించి, మించె... మానవులు నిల్పికొన్న సమాజదీపము... అది చెదరి... చింది... పంకిలమయినది... అని రాయప్రోలు భయపడినట్లే జరుగుతోంది. కుల, మత, ప్రాంతీయాది విభేదాలతో కొంతకాలంగా సమాజం మానవత్వాన్ని పూర్తిగా మరచిపోతోంది. 'మానవత్వం పరిమళించే మంచిమనిషికి స్వాగతం...' అంటూ కవులు మంచిమనిషి కోసం అన్వేషించవలసిన దుస్థితి దాపురించింది. ''అశ్రువులందే సుందర హాసమున్నదని తెలిపెను... తొలిప్రొద్దున మంచు బిందువులు రాల్చెడు మల్లెపువ్వు...' అంటూ కన్నీటిని తుడిచి, ఓదార్చే మంచితనపు పరిమళాలను ఈ జాతి ఆశిస్తూ వచ్చింది. ప్రార్థనలు చేసే పెదవులకన్నా సహాయపడే చేతులు మిన్న అంటూ సాయంచేసే చేతులకోసం ఎదురుచూస్తూ వచ్చింది.

... మతమే మానవ జీవితమ్ము... చివురింపంగా వసంతమ్ము... అంటాడు- మధునాపంతులవారు చిత్రించిన రాజరాజనరేంద్రుడు. మనిషి జీవితంలోకి మతం అనేది వసంతంలా ప్రవేశించాలన్నది సహృదయ భావన. ఉపబృంహణం అంటే విత్తునుంచి మొలకెత్తడం. మతం అనే విత్తనంలోంచి మానవత్వం ఉపబృంహణం కావాలని పెద్దలు ఆశించారు. ఆధ్యాత్మిక ప్రగతికి పునాదిగా నిలిచి వ్యక్తిగతంగానూ, సమాజ పురోగతికి తోడ్పడటం ద్వారా సామాజికంగానూ- మతం దోహదం చేయాలని ఆకాక్షించారు. సూది కలపడానికి పుట్టింది, జతచేయడమే దాని ధర్మం. కత్తెర విడదీయడానికి పుట్టింది, ఒకటిని రెండు చేస్తుంది. మతం విషయం వచ్చేసరికి అది సూదితో పోలికకు సరితూగుతుంది. మతం మనిషిని మనిషిని జతచేయడానికి పుట్టింది. మధ్యలో, కొంతమంది స్వార్థపరుల చేతుల్లో దుర్వినియోగం అయిన సందర్భాలు ఉన్నా- మొత్తమ్మీద మతం ఏదైనా మంచితనాన్నే ప్రబోధించింది. మానవత్వాన్నే ప్రశంసించింది. అలా కానినాడు మతం తన ప్రాధాన్యం కోల్పోతుందని సామాజిక శాస్త్రవేత్తలు ఏనాడో అంచనావేశారు. మతములన్నియు మాసిపోవును... మంచియన్నది నిలిచి వెలుగును... అని ఊహించారు. మఠములోన నున్న మతములన్నియుకోసి... ఘటములోన నున్న ఘనుని తెలిసి... ఘనత నిల్పువాడు ఘనతర యోగిరా... అంటూ స్వయంగా యోగి అయిన వేమన మతాతీతమైన యౌగిక స్థితిని నిర్వచించాడు. ఆధ్యాత్మికత అనేది మతంకన్నా ప్రయోజనకరమైందని పెద్దలు గ్రహించారు. మతాన్నుంచి ఛాందసాన్ని వేరుచేస్తే అది ఆధ్యాత్మికతకు దగ్గరవుతుందని భావించారు. సూర్యుడికేసి నడిస్తే నీడలు వాటంతటవే వెనక్కి మళ్లినట్లు, మతాలు బోధించే మంచివైపు నడిస్తే- మతమౌఢ్యాలు వెనకబడతాయని విశ్లేషించారు. అది సరికొత్త ఆధ్యాత్మిక మార్గమవుతుందని లోకంలో రాబోయే మార్పులను గుర్తించారు. అటువంటి జ్ఞానపథాన్ని మనసులో భావిస్తూ, తద్వారా మానవుడిలో కలిగే పరివర్తనను ఊహిస్తూ, ఆ తరహా మంచిమనుషులతో కూడిన సమాజాన్ని స్వాగతిస్తూ- మన కవులెందరో అభ్యుదయ గీతాలు ఆలపించారు.

ఇటీవలి ఒక సంఘటన వింటే ఆ ఆశలు ఫలించాయనిపిస్తున్నది. మతంకన్నా మానవత్వం చాలా విలువైనదని నిరూపించే ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. హరేకృష్ణ భాంజా అనే హిందువుకు, మహమ్మద్‌ సయ్యద్‌ అనే ముస్లిం సోదరుడికి మూత్రపిండాలు బాగా చెడిపోయాయి. వారి భార్యలు తమ అవయవాలను దానం చెయ్యడానికి ముందుకొచ్చినా, భార్యాభర్తల బ్లడ్‌ గ్రూపులు కలవకపోవడంతో వైద్యులు నిరాశచెందారు. మంజులాబెన్‌ కిడ్నీ ఆస్పత్రికి చెందిన దీపక్‌శంకర్‌రాయ్‌ అనే వైద్య నిపుణుడు ఒక విశేషాన్ని గుర్తించారు. హరేకృష్ణ భార్య కిడ్నీ మహమ్మద్‌ సయ్యద్‌కీ, సయ్యద్‌ భార్య మూత్రపిండం హరేకృష్ణకీ మార్పిడి చేయడానికి అనుకూలంగా ఉన్నాయని ఆయన గమనించారు. దీంతో డాక్టర్‌ దీపక్‌ రంగంలోకి దిగి ఆ రెండు కుటుంబాలను సమావేశపరచారు. ఒకరికొకరు సాయపడేలా ఒప్పించారు. త్యాగాజ్జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాః... త్యాగం అనే ఒక సుగుణం కారణంగా లోకంలో పశువులు, రాళ్లు, చెట్లు సైతం పూజలందుకుంటాయన్న ప్రాచీనసూక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్త్రీల త్యాగగుణం, మంచితనం ఇద్దరు పురుషులకు జీవదానం చేశాయి. విభిన్న మతాలకు చెందిన రెండు కుటుంబాల పరస్పర సదవగాహన, మానవతావిలువల పరిరక్షణ సంకల్పం- ఆ రెండు కుటుంబాల్లోనూ సంతోషాన్ని నింపాయి. సంకల్పం మంచిదైతే భగవంతుడు సహకరిస్తాడన్నట్లుగా ఈ మధ్యనే జరిగిన ఆ ఇద్దరి మూత్రపిండ మార్పిడి శస్త్ర చికిత్సలూ విజయవంతమయ్యాయి. కథ సుఖాంతమైంది. మొత్తం ప్రణాళికను దిగ్విజయంగా పూర్తిచేసిన డాక్టర్‌ దీపక్‌ శంకర్‌రాయ్‌- ఇదంతా దేవుడి దయ, వారి సమస్యలకు సరైన సమయంలో పరిష్కారం లభించిందని ముక్తాయించడం ఈ ఉదంతానికి కొసమెరుపు!
(Enadu, 02:03:2008)
===============================


Labels:

Thursday, April 03, 2008

Just joking


------------------------------------
Frantic call

A man speaks frantically into the phone, “My wife is pregnant, and her contractions are only two minutes apart!”

“Is this her first child?” the doctor queries.

“No, you idiot!” the man shouts.

“This is her husband!”

-----------------------------------

‘Leave me alone’

The surgeon told his patient that woke up after having been operated: “I’m afraid we’re going to have to operate you again. Because, you see, I forgot my rubber gloves inside you.”

“Well, if it’s just because of them, I’d rather pay for them if you just leave me alone.”

--------------------------------------
Diet dilemma

A blonde is overweight, so her doctor puts her on a diet.

“I want you to eat regularly for two days, then skip a day, and repeat the procedure for two weeks. The next time I see you, you’ll have lost at least five pounds.”

When the blonde returns, she’s lost nearly 20 pounds.

“Why, that’s amazing!” the doctor says. “Did you follow my instructions?”

The blonde nods. “I’ll tell you, though, I thought I was going to drop dead that third day.”

“From hunger, you mean?” said the doctor.

“No, from skipping,” replied the blonde.

-------------------------------------------

‘Fit’ staff

When an applicant asked if the company had a fitness programme, the human resources manager replied, “Oh, our employees don’t need one. They are routinely jumping to conclusions, flying off the handle, beating around the bush, running down the boss, going around in circles, dragging their feet, dodging responsibility, passing the buck, climbing the ladder, wading through paperwork, pulling strings, throwing their weight around, stretching the truth, bending the rules, stabbing others in their backs and pushing their luck!”

-------------------------------------------

Cure for cold

A man went to see his doctor because he was suffering from a miserable cold. His doctor prescribed some pills, but they didn’t help.

On his next visit, the doctor gave him a shot, but that didn’t do any good.

On his third visit, the doctor told the man, “Go home and take a hot bath. As soon as you finish bathing throw open all the windows and stand in the draft.”

“But doc,” protested the patient, “if I do that, I’ll get pneumonia.”

“I know,” said the doctor, “I can cure pneumonia.”

(SOURCE: INTERNET)
(The Hindu, 03:04:2008)
============================

Labels:

కబళించేముందే కళ్లు తెరవాలి..

వెలది.. పానంబు.. జూదంబు.. అంటూ తిక్కన సప్తవ్యసనాల జాబితాను ఓ పద్యంలో వెల్లడించాడు. స్త్రీ, పానం, జూదం, వేట, వాక్పారుష్యం, దండపారుష్యం, దుర్వ్యయం.... అంటూ వాటిని ఓ రచయిత వచనంలోకి దించారు. మద్యపానంకన్నా ధూమపానం మరీ ప్రమాదకరమైనదని శాస్త్రజ్ఞులు గట్టిగా తేల్చి చెబుతున్నారు. అందువల్ల మనం సప్తవ్యసనాల్లో పానాన్ని- ధూమపానానికి అన్వయించుకోవలసి ఉంది. ప్రాణాంతకమైన ధూమపాన వ్యసనం ప్రజల్లో బహుళవ్యాప్తికి నోచుకోవడం సామాజిక శాస్త్రవేత్తలను తీవ్రంగా కలవరపరుస్తోంది. యువతలో ఈ అలవాటు త్వరగా వ్యాపించడానికి సావాసదోషమే బలమైన కారణమంటున్నారు. సరదాగా మొదలై అలవాటుగా మారి, అది వ్యసనంగా స్థిరపడుతుంది. సురేంద్రనాథ్‌ బెనర్జీ అంతటివాణ్ని చేస్తానన్న గిరీశం అయ్యవారినుంచి తనకు అబ్బిందల్లా చుట్టకాల్చే అలవాటు ఒక్కటేనని- వెంకటేశం వాపోవడంలో వాస్తవముంది. సిగరెట్లు వెలిగించడమే తప్ప అగరొత్తులు వెలిగించడం రాని తండ్రినుంచి కొడుక్కి ఏం అలవాటు అవుతుందో మనం తేలిగ్గానే ఊహించవచ్చు. తెలుగు పద్యం ఒకటి చెప్పమని కరటకశాస్త్రి అడగ్గానే వెంకటేశం నోట అలవోకగా 'పొగచుట్టకు... సతిమోవికి' పద్యం వెలువడటం సావాసదోషఫలమనే అనుకోవాలి. ''చుట్టకాల్చబట్టే కదా దొరలు అంత గొప్పవాళ్ళయ్యారు! చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ని చూశావూ?'' అని ఊదరగొడుతుంటే వెంకటేశానికి చుట్టకాల్చడంతప్ప, మరి చదువెలా అబ్బుతుంది! చుట్ట పంపిణీ మీదనే స్టీము యంత్రం వగైరాలను ఇంగ్లీషువాడు కనిపెట్టగలిగాడన్నది గిరీశం సిద్ధాంతం. చుట్టకాల్చడానికి, దొరతనానికి ఏదో 'చుట్ట'రికం ఉండే ఉంటుందని మనకవులు కూడా భావించారు. సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరలు తాగు బల్‌ సిగరెట్టు.. అంటూ దాని మహిమను వర్ణించాడో సినీకవి. పొగతాగనివాడు తరవాత జన్మలో ఏమవుతాడో 'బృహన్నారదీయం' చెప్పింది- అని గిరీశం దబాయించాడు. ''...ఈ సిగరెట్టుతో ఆంజనేయుడు లంకాదహనం చేశాడు...'' అని సినీకవి బుకాయించాడు.

మొన్ననే క్యూబా అధ్యక్ష పదవిని త్యజించిన ఫిడెల్‌ క్యాస్ట్రోకి, అమెరికానే వణికించిన సద్దాం హుస్సేన్‌కీ -క్యూబా చుట్టలే ఒకానొక గంభీరమైన ఇమేజిని తెచ్చాయంటారు. ''స్వర్గంలో కనుక సిగార్‌పై నిషేధం విధించే పక్షంలో నేనసలు స్వర్గం వైపే పోను'' అన్నాడు మార్క్‌ట్వెయిన్‌. ''ఇంత చవగ్గా దొరికే ఆనందం ప్రపంచంలో మరొకటి ఏముంది?'' అని ప్రశ్నించాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. ''అందమైన స్త్రీ ఇచ్చే ఆనందంతో పోలిస్తే సిగార్‌ తక్కువేంకాదు'' అన్నాడు ప్రముఖ రచయిత రుడ్యార్డ్‌ కిప్లింగ్‌. మడొన్నా, డెమీమూర్‌, ఎవావన్నెస్సా, రెబెక్కా... వంటి ప్రపంచ ప్రసిద్ధ సుందరీమణులు సైతం సిగార్స్‌ను బాగా ఇష్టపడేవారే. ప్రసిద్ధ కథారచయిత చాసో నుంచి బ్రిటన్‌ మాజీ ప్రధాని చర్చిల్‌దాకా ప్రముఖులెందరో చుట్టలను ప్రేమించేవారు. నోట్లో చుట్టతో ఫొటోలు దిగేవారు. పొగతాగడం అలవాటైనవారు దాన్ని రకరకాలుగా సమర్థించడం కూడా సహజం. వేడివేడిగా కాఫీతాగాకా, సిగరెట్టు ముట్టించకపోతే కాలకృత్యాలు మొదలుకావని చాలామంది అనుభవం. సిగరెట్టు చేతిలో లేకపోతే, రెండో చేతిలో కలం కదలదని భావించే రచయితలూ ఉన్నారు. అలాంటి కవి ఒకరు తన అలవాటును త్రిమూర్తులకు సైతం అంటగట్టారు. త్రిమూర్తులు పొగతాగడం చూసి నారదమహర్షి ఆశ్చర్యపోయి ''మీరును పొగతాగుదురా! వారిజభవ.. ఆదిదేవ.. వైకుంఠపతీ..'' అని అడిగాడట. దానికి వారు బదులిస్తూ ''ఓరీ నారద.. వినరా.. ఈరేడు జగంబులందున ఇది ముఖ్యమురా!'' అన్నారని ఆయన అచ్చుగుద్ది మరీ చెప్పాడు. ఒకే సిగరెట్టును నలుగురైదుగురు మిత్రులు నిస్సంకోచంగా పీల్చేయడంలో తప్పులేదు, అది ఎంగిలి కాదన్నాడొక కవి. ''పొగక్రోవికి.. సతిమోవికి.. అగణితముగ సూరకవికి.. అమృతమ్మునకున్‌ తగ ఉచ్ఛిష్టము లేదు..'' పొమ్మన్నాడాయన. ఏ మాటకామాటే చెప్పుకోవాలి- నోట్లో ఎర్రగా వెలుగుతుంటే దర్జాకి కారణమయ్యే చుట్ట, ఆరిపోయి చెవి వెనుక చేరితే మాత్రం వెర్రిబాగులతనానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుంది.

ఎంతమంది ఎంతగట్టిగా వాదించినా, పొగతాగడాన్ని డాక్టర్లు ఎంతమాత్రమూ సమర్థించడం లేదు. చుట్ట, బీడీ, సిగరెట్టు... ఏదైనా యమపాశమేనని అధ్యయనాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. పొగతాగేవాళ్లలో స్త్రీలైతే దాదాపుగా ఎనిమిదేళ్లు, మగవారు పదేళ్లు ఆయుర్దాయాన్ని కోల్పోతున్నారని తేలింది. 2010 సంవత్సరం వచ్చేసరికి ప్రతిఏటా పదిలక్షల మందిని ధూమపానం ఖాయంగా బలిగొంటుందని స్పష్టమైంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సహకారంతో టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రపంచ ఆరోగ్య అధ్యయన కేంద్రం ఈ విషయమై విస్తృతమైన పరిశోధనలు నిర్వహించింది. విషాదకరమైన ఆ ఫలితాలను ప్రకటించిన ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా మనదేశంలో అవి మరింత దిగ్భ్రాంతిని కలిగించేవిగా వర్ణించారు. రెండేళ్ల తర్వాత భారతదేశంలో సంభవించే అకాలమరణాల్లో సగం సంఖ్యకు కేవలం ధూమపానం కారణమవుతుందని ఝా భావిస్తున్నారు. క్షయ, శ్వాసకోశవ్యాధులు, కేన్సర్‌తోపాటు పలురకాల గుండెజబ్బులకు సైతం పొగతాగడమే కారణమవుతుందని, ఆ కారణంగా మిగిలిన దేశాలకన్నా, మన దేశంలో మరణాల సంఖ్య అత్యధికమనీ ఆయన విశ్లేషించారు. సకాలంలో దాన్ని నివారించకపోతే తీవ్ర దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ విషయం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. 'కబళించేముందే కళ్లు తెరవండి' అనే నినాదంతో ఉద్యమస్ఫూర్తితో ప్రజలు స్వయంగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొంటే తప్ప- ముంచుకొస్తున్న మృత్యుపాశాన్ని తిప్పికొట్టడం సాధ్యంకాదు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించడంకన్నా ఎవరికివారే ఈ పెనుముప్పును అర్థం చేసుకుని, వ్యసనాన్ని అలవాటు స్థాయిలోనే అరికట్టే ప్రయత్నం చెయ్యడం మంచిదని సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
(Enadu, 24:02:2008)
============================

Labels: